సత్య నాదెళ్ళ మనోడే...ఆయనను పూర్తిగా వాడేసుకోక తప్పదు

Publish Date:Dec 27, 2014

Advertisement

 

దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం, దాని స్థానంలో సమర్దుడయిన నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశ అందరిలో చిగురించింది. అదే సమయంలో ప్రపంచ ప్రసిద్ద మైక్రోసాఫ్ట్ సంస్థకు భారతీయుడయిన సత్య నాదెళ్ళ సి.ఈ.ఓ.గా నియమితులవడం భారత్ కు మరో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చును.

 

ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరియు ఐ.టి.శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లతో నిన్న సమావేశమయిన ఆయన తమ మైక్రోసాఫ్ట్ సంస్థ తరపున దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో క్రమంగా పెరుగుతున్న పరిశ్రమల, వ్యాపార సంస్థల మరియు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిలువచేసేందుకు తమ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించేందుకు భారీ పెట్టుబడులతో డాటా సెంటర్లు నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ భారతీయ విభాగంలో ప్రధాని మోడీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటాల్ ఇండియా పధకాలను కూడా ఒక భాగంగా చేసుకొని తదనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. భారత్ లో వివిధ అవసరాలకు తగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు తమ సంస్థ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఐటీ రంగంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకొంది. కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంలో వెనుకబడే ఉంది. ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆ రెండు రంగాలను కూడా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్ కు సహాయం చేయాలని కోరారు. భారతీయుడయిన ఆయన తన సంస్థ ద్వారా భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ముందుకు రావడం చాలా అభినందనీయం.

 

 భారతీయుడయిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. కావడం అటు ఆ సంస్థకు ఇటు భారత్ కు రెంటికీ చాలా ప్రయోజనం చేకూర్చబోతోంది. ఆయన వలన భారత్ కు భారీ పెట్టుబడులు, ఆ సంస్థ సేవలు లభ్యమవుతాయి. భారత్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యాలయాలను మరిన్నిటిని తెరిచినట్లయితే, దానిని అనుసరించి అనేక చిన్నా పెద్ద సంస్థలు కూడా భారత్ కు తరలిరావడం తధ్యం. మైక్రోసాఫ్ట్ తో సహా ఆ సంస్థలన్నీ భారత్ లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే, దానివలన భారత ఆర్ధిక పరిస్థితి కూడా మరింత మెరుగుపడుతుంది.

 

సత్య నాదెళ్ళ భారతీయుడయిన కారణంగానే, మైక్రోసాఫ్ట్ సంస్థ 125 కోట్ల మంది జనాభా ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మార్కెట్ ద్వారా లబ్ది పొందగలుగుతుంది. భారతీయుల అవసరాల గురించి, వారి ఆలోచనా విధానం గురించి, వారి జీవన శైలి గురించి భారతీయుడయిన సత్య నాదెళ్ళకు తెలిసినంతగా మరే సంస్థకి తెలియక పోవచ్చును. అది ఆ సంస్థకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. భారతీయ అవసరాలకు అనుగుణంగా తన సంస్థ సేవలను, టెక్నాలజీని అందించగలిగితే, మైక్రోసాఫ్ట్ సంస్థ ఊహించనంతగా భారత్ నుండి లాభాలు ఆర్జించగలదు. దేశంలో నానాటికి పెరుగుతున్న కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇంటర్ నెట్, వైఫీ వినియోగం ద్వారా ఆ సంస్థ ఊహించనంత లాభాలు పొందే అవకాశం ఉంది.

 

అందువలన భారత ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండూ కూడా ఈ సువర్ణావకాశాన్ని ఓడిసిపట్టుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. సత్య నాదెళ్ళ తెలుగువాడయ్యి ఉండటం ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు మరింత కలిసివచ్చే అంశమని చెప్పవచ్చును. అందువలన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను గుర్తుంచుకొని ఆయన ఆ పదవిలో ఉండగానే ఆయన ద్వారా రెండు రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు, ఆ సంస్థ శాఖల ఏర్పాటుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. ఇటువంటి సువర్ణావకాశం మళ్ళీ వస్తుందని ఆశించలేము.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.