పార్లమెంటులో వైఫల్యంపై మోడీ సీరియస్.. నష్టనివారణ చర్యలకు శ్రీకారం.!
Publish Date:Aug 14, 2026
Advertisement
పార్లమెంటు సమావేశాల నిర్వహణలో మోడీ సర్కార్ విఫలమైంది. చట్టాలను ఆమోదింపజేసుకోవడంలో ప్రతిబంధకాలు ఎదురుకావడంతో కేంద్రం చేతులెత్తేసింది. జన్ జీ ఉద్యమంతో తొలి ఎదురుదెబ్బ తిని కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్డీయే సర్కార్.. ఆ వెంటనే పార్లమెంటులో విపక్షాల ఐక్య ఆందోళనలు, ప్రతిఘటనతో కీలక బిల్లుల విషయంలో వెనక్కు తగ్గక తప్పలేదు. దీంతో సమావేశాలు వాయిదా పడిన వెంటనే కేంద్రం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పకడ్డందీగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పార్టీ సంస్థాగత మార్పులతో పాటు.. తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా తక్షణావసరంగా భావిస్తున్నారు. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు నరేంద్ర మోదీ త్వరలోనే.. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. అలాగే పార్టీలో కూడా సంస్థాగత మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి కీలకమైన, ప్రాధాన్యత కలిగిన బిల్లుల విషయంలో ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోయింది. ఎఫ్సీఆర్ఏ సవరణలపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అనివార్యంగా ఆ బిల్లును పక్కన పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది. అలాగే.. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న.. తరుణంలో తమిళనాడు అసెంబ్లీ ఈ విధానానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. దీంతో కేంద్రానికి పరోక్షంగానైనా మద్దతుఇస్తుందనుకున్న దనుకున్న డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కూడా వెనకడుగు వేశాయి. దీంతో ఈ బిల్లు విషయంలోనూ మోడీ సర్కార్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అలాగే పార్లమెంట్ ఉభయ సభలలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ తమతమ విభేదాలను పక్కన పెట్టి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి నిలబడటంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సభలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు సమైక్యంగా నిలదీస్తున్నా, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నా.. అతి కొద్ది మంది సీనియర్లు వినా.. బీజేపీ సభ్యులెవరూ విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇది బీజేపీ అధిష్ఠానాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీంతో ఇటు కేబినెట్, అటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు అనివార్యమని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెలాఖరు నాటికి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పార్టీ బాధ్యతల్లోనూ భారీ మార్పులూ, చేర్పులూ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి పార్లమెంట్ సమావేశాల్లో ఎదురైన ఆటంకాలను పరిగణనలోనికి తీసుకుని, పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Prime Minister Narendra Modi, Union Cabinet reshuffle, Parliament sessions, BJP organizational changes
http://www.teluguone.com/news/content/prime-minister-narendra-modi-45-228896.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.




