మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి...అగ్రనేతల డిమాండ్
Publish Date:Mar 13, 2026
Advertisement
దేశంలో మావోయిస్టు ఉద్యమంపై మరోసారి చర్చకు దారితీసేలా మావోయిస్టు అగ్రనేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీపై అమలులో ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే తమ సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా లెజియన్ను రద్దు చేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే తమ డిమాండ్లు తెలియజేసినట్లు వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ మాట్లాడుతూ పార్టీపై నిషేధం కొనసాగుతున్నంతకాలం తమ కార్యకలా పాలు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. నిషేధం ఎత్తివేయబడితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే పార్టీపై నిషేధం ఎత్తివేయాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విషయమని ముఖ్యమంత్రి తమకు తెలియజేశారని చెప్పారు. కేంద్రంతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వివరిం చారు.ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని దేవ్జీ తెలిపారు. నిషేధం కొనసాగితే తమపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మావోయిస్టులకు మద్దతుగా ఉద్యమాలు చేసిన అర్బన్ నక్సలైట్లపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జైళ్లలో ఉన్న మావోయిస్టులపై కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని కోరారు. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి అంశంపై దేవ్జీ స్పందిస్తూ... ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదన్నారు. గణపతికి రక్షణ కల్పించే నిర్ణయం పార్టీ తీసుకుందని చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శికే తెలిసి ఉంటుందని, అందువల్ల గణపతిని లొంగిపోవాలని లేదా తమ వద్దకు రావాలని పిలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లడంలో పార్టీ విఫల మైందని ఆయన అంగీక రించారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో లోపా లు ఉండటంతో పార్టీకి ప్రజల మధ్య దూరం పెరి గిందని తెలిపారు. ఉద్యమం క్రమంగా అడవులకే పరిమి తమైపోయిందని, పట్టణ ప్రాంతాల్లో ప్రజల సమస్య లను పట్టించుకోవడంలో పార్టీ విఫలమైందని చెప్పారు. అలాగే పార్టీలో కొత్తగా చేరే సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపో యిందని పేర్కొన్నారు. ఒక ప్పుడు ఎంసీసీతో కలిసిన తర్వాత పార్టీ బలంగా ఎదిగిందని, అయితే తరువాత క్రమంగా బలహీనపడిందని వ్యాఖ్యా నించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సమయంలో ప్రభు త్వం మావోయిస్టుల మధ్య జరిగిన చర్చలు సరైన నిర్ణ యమే అయినప్పటికీ, ప్రభుత్వ చర్యల కారణంగా అవి విఫలమయ్యాయని అన్నారు. ఆ చర్చలపై పార్టీ తరచుగా సమీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. నల్లమల ప్రాంతం నుంచి పార్టీ కార్యకలాపాలు తగ్గిపో వడానికి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక కారణమైందని రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆధు నిక టెక్నాలజీ కారణంగా అడవుల్లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టతర మైందని ఆయన అభిప్రాయ పడ్డారు. మావోయిస్టు అగ్రనేతల తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. పార్టీపై నిషేధం ఎత్తివేత, చర్చల అవకాశాలు వంటి అంశా లపై ప్రభుత్వం ఎలా స్పంది స్తుందన్నదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది
http://www.teluguone.com/news/content/plgl-36-215449.html





