హైడ్రా చర్యలను అభినందించిన ఇస్రో శాస్త్రవేత్తలు

Publish Date:Mar 13, 2026

Advertisement

 

నగర పరిసర ప్రాంతాల్లో చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్  బఫర్ జోన్‌లు వంటి కీలక సమాచారాన్ని నిర్ధారించడంలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ అందిస్తున్న డేటా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భూమి పరిశీలన సాంకేతికతల ప్రాముఖ్యతపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో చెరువుల స్థితిగతులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, ఇలాంటి సందర్భాల్లో ఉపగ్రహ డేటా ఖచ్చితమైన మార్గదర్శకంగా ఉపయోగపడుతోందని హైడ్రా కమిషనర్ చెప్పారు. 

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల వివరాలను గుర్తించడంలో ఈ సమాచారం సహాయపడుతోందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూ వినియోగ మార్పులను ప్రజలకు చూపిస్తూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో ఒక ప్రాంతంలో ఉన్న భూమి వినియోగం కాలక్రమేణా ఎలా మారిందో స్పష్టంగా చూపించడంతో అనేక సమస్యలు తక్షణమే పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.

చెరువుల పరిరక్షణకు కఠిన చర్యలు

ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు హైడ్రా తన కార్యక లాపాలను విస్తరించినట్లు కమిషనర్ తెలిపారు. ఉపగ్రహ సమాచారం ప్రకారం నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 61 శాతం చెరువులు గత కొన్నేళ్లలో కనుమరుగైనట్లు గుర్తించామని వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 15 సంవత్సరాల్లో మరిన్ని చెరువులు మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో చెరువుల గుర్తింపు, వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. హైడ్రా కఠిన చర్యలతో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేయడం లేదా నిర్మాణాలు చేపట్టడం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

2006 సంవత్సరానికి చెందిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ డేటాను ఆధారంగా తీసుకుని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారిస్తున్నామని తెలిపారు. అవసరమైతే 1970, 1990 దశకాల ఉపగ్రహ డేటాను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సుమారు 13,500 ఎకరాల ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించగలిగామని వెల్లడిం చారు. ఈ భూముల అంచనా విలువ దాదాపు 70 వేల కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

నీటి నాణ్యతపై ఉపగ్రహ అధ్యయనాలు

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువుల నీటి నాణ్యతను కూడా ఉపగ్రహ సాంకేతికత ద్వారా పరిశీలించేందుకు సహకరించాలని హైడ్రా కమిషనర్ ఎన్‌ఆర్‌ఎస్‌సీని కోరారు. కాలుష్య స్థాయిలను గుర్తించి శాస్త్రీయ ఆధారాలతో చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంతరిక్ష సాంకేతికతను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నీటి వనరుల సంరక్షణలో హైడ్రా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని వారు తెలిపారు. ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను వినియోగించి చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపా డేందుకు హైడ్రా చేస్తున్న కృషికి శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు.

“హైడ్రా-రక్ష” పౌర సేవా పోర్టల్ ప్రారంభం

 “హైడ్రా-రక్ష” పేరుతో కొత్త పౌర సేవా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, భూముల హద్దుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు కొనుగోలు చేయబోయే భూమి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్‌లో ఉందా అనే విషయాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. జిల్లా, మండలం, గ్రామం లేదా చెరువు పేరుతో పాటు భౌగోళిక కోఆర్డినేట్లను నమోదు చేస్తే సంబంధిత ప్రాంతం మ్యాప్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 

దీంతో ఫుల్ ట్యాంక్ లెవల్ సరిహద్దులు, బఫర్ జోన్‌ల వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రారంభ దశలో ఈ పోర్టల్‌ను కొద్ది వారాల పాటు హైడ్రా అంతర్గత వినియోగానికి మాత్రమే ఉపయోగించ నున్నారు. తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలను అరికట్టగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.