సీమాంధ్ర రాజకీయాలపై పవన్, కిరణ్ ఎఫెక్ట్

Publish Date:Mar 8, 2014

Advertisement

 

మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని తాజా సమాచారం. ఈ పేరుని శ్రీహరి రావు అనే వ్యక్తి కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరుని కిరణ్ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది.

 

అయితే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతున్న ఈ తరుణంలో కూడా కిరణ్ తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని పేరు ఎంచుకోవడం గమనిస్తే, ఆయన ప్రజలలో ఉన్న సమైక్య భావనలను, సెంటిమెంటుని వాడుకొనేందుకు సిద్దపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీగాక ఆయన శాశ్విత ప్రాతిపాదికన రాజకీయపార్టీ ఏర్పాటు చేయదలచుకొంటే వేరే మరేదయినా పేరుని ఎంచుకొని ఉండేవారు. కానీ, ఈ సమైక్యభావనలు ఎల్లకాలం ఉండబోవని, ప్రజలలో సమైక్యవేడి క్రమంగా చల్లారుతున్నదని తెలిసినప్పటికీ, ఆయన ఇటువంటి పేరుని ఎంచుకోవడం చూస్తే ఆయన తాత్కాలికంగానే ఈ పార్టీని నెలకొల్పుతున్నారని అర్ధమవుతోంది. అంటే ఎన్నికల తరువాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని భావించవచ్చును.

 

అయితే మరి కేవలం రెండు మూడు నెలల కోసం ఇంత భారీ ఖర్చు చేసి, ఇంత శ్రమపడి పార్టీని ఎందుకు స్థాపిస్తున్నారు అంటే ఎన్నికలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువయిన తెదేపాను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం, వీలయితే తన అధిష్టానం కోసం తన వంతుగా మరి కొన్ని యంపీ సీట్లు సాధించిపెట్టడానికేనని చెప్పుకోవచ్చును. అయితే ఆయన ప్రధానంగా తెదేపాకు నష్టం కలిగించాలని పార్టీ పెడుతున్నపటికీ, ఆయన వల్ల తెదేపా కంటే కాంగ్రెస్ అధిష్టానం తో రహస్య అవగాహన కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారిరువురూ కూడా తెలుగువారి ఆత్మగౌరవం, సమైక్యవాదం కోసం తామే పోరాడుతున్నామని చెప్పుకొంటూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు గనుక వారి మధ్య ప్రజల ఓట్లు చీలిపోవచ్చును. అదేవిధంగా ఇద్దరు కూడా రెడ్డి కులస్తులే గనుక ఆ కులస్థుల ఓట్లు కూడా వారిరువురి మధ్య చీలిపోయే అవకాశం ఉంది. కానీ, మిగిలిన పార్టీలలో టికెట్స్ దొరకని అసంతృప్తి నేతలందరూ చివరికి కిరణ్ కుమార్ గూటికే చేరుకొనే అవకాశం ఉంది గనుక ఈ రెండు నెలల సమయంలో కిరణ్ పార్టీ మరింత బలపడితే అప్పుడు ఆయన పార్టీ వల్ల తెదేపాకు కూడా నష్టం తప్పకపోవచ్చును.

 

ఇక కమ్మ, కాపు, యస్సీ యస్టీ, బీసీ మరియు ఇతర కులస్థులు, మైనార్టీ వర్గాల ఓట్లు ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే చీలవచ్చును. కానీ, రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారందరూ తెదేపా వైపే చూసే అవకాశం ఉంది. కానీ, ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, జగన్ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి మైనార్టీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నట్లయితే, పోటీ చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు వీరందరి నడుమ పవన్ కళ్యాణ్ కూడా పోటీలోకి ప్రవేశిస్తుండటంతో, అతని ప్రభావంతో ముందుగా కాంగ్రెస్, ఆ తరువాత వరుసగా తెదేపా, వైకాపా, కిరణ్ పార్టీలు కూడా కొంత మేర నష్టపోయే అవకాశం ఉండవచ్చును. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారే రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాల కారణంగా ఈ అంచనాలు కూడా మారిపోవచ్చును.

 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.