అసలు తప్పు ఎక్కడ జరిగింది?, వైఫ్యలం ఎవరిది?...బందరు పోర్టుపై ఎక్స్ క్లూజివ్ స్టోరీ

Publish Date:Sep 23, 2015

Advertisement

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాలకు పైగా భూములు సమీకరించిన(ల్యాండ్ ఫూలింగ్) ప్రభుత్వానికి బందరు పోర్టు విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది, ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం సమీకరించగలిగిన ప్రభుత్వం, మచిలీపట్నం పోర్టు విషయంలో విఫలమైంది, అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రభుత్వ యంత్రాంగం లోపమా? లేక ప్రజలను ఒప్పించడంలో మంత్రులు, మచిలీపట్నం ఎంపీ విఫలమయ్యారా?, ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలు, పైగా భూసేకరణ కాదు, సమీకరణే అనడంలో అర్థమేమిటి? ప్రభుత్వం గందరగోళంలో ఉందా? ఎలాంటి కసరత్తు లేకుండానే గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందా?... చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ

 

పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, వేలాది మందికి పని దొరుకుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ప్రజల జీవనశైలి మెరుగవుతుంది, అయితే ఇవన్నీ జరగాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే వాటికి అనువైన చోట భూములు ఇవ్వాలి(ఎక్కడో అడవుల్లో ఇస్తానంటే పారిశ్రామికవేత్తలు ముందుకురారు), భూములు ఇవ్వాలంటే...రైతులు ఒప్పుకోవాలి, ఇక్కడే బ్రేకులు పడుతున్నాయి, భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు, భూములనే నమ్మకుని బతుకుతున్నాం, భూములు ఇచ్చేస్తే తామెలా బతకాలంటూ బోరుమంటున్నారు, సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ వైఫల్యమూ కనిపిస్తుంది, భూములిచ్చే రైతులకు నమ్మకం కలిగించడంలో విఫలమవుతోంది, మేమున్నామంటూ భరోసా ఇవ్వడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. మచిలీపట్నం పోర్టు భూసేకరణ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించడానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు తిరుగుబాటు చేశారంటే, దానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే, రైతులకు భరోసా కల్పించకపోవడంలో అమాత్యులు ఘోరంగా విఫలమయ్యారు, పోర్టు అనుబంధ పరిశ్రమలతో ఎలాంటి మేళ్లు జరుగుతాయో వివరించలేకపోవడం, ఆ ప్రాంతం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పలేకపోవడం, ముఖ్యంగా భూములు కోల్పోయే రైతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నమ్మకం కలిగించలేకపోవడం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యంగానే చెప్పుకోవాలి. పోర్టు అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టులు, టాన్స్ పోర్టేషన్...ఇలా అనుబంధ పనులన్నీ రైతులు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చంటున్నారు.

రైతుల ఆవేదనలోనూ అర్థముంది,భూములిస్తే తామెలా బతకాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం పరిష్కారం చూపగలిగితే సమస్య తీరినట్లే, పైగా అక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తాయనే దాని మీద క్లారిటీ లేదు, పోర్టు నుంచి ఎక్కువగా ఎగుమతులు జరిగితే స్థానికులకు ఉద్యోగాలు,ఉపాధి దొరుకుతాయి, మరి బందరు పోర్టు నుంచి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఆ ప్రాంతంలో ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బందరు పోర్టు నుంచి పెద్దఎత్తున ఎగుమతులు జరిగే పరిస్థితి లేకపోతే, అనుబంధ పరిశ్రమలు వచ్చేదీ అనుమానమేని అంటున్నారు, ఈ అనుమానాలన్నింటినీ నివత్తి చేస్తేనే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తారు.అయితే ‘తెలుగువన్‘ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బందరు పోర్టుకు అనుబంధంగా ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలు రానున్నాయని తెలుస్తోంది, నాగాయలంక పరిసర ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు ఓఎన్జీసీ సెర్చింగ్ లో తేలినట్లు తెలుస్తోంది, అందుకే ఓఎన్జీసీ ఇండియా సౌత్ హెడ్ ఆఫీస్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట, అదే నిజమైతే కనుక బందరు పోర్టు నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతికి అవకాశముందని అంటున్నారు. అయితే రైతుల నుంచి తీసుకునే భూమికి తగినట్లుగా ఆయా పరిశ్రమల్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, అనుబంధ పనులు మొదలైనవాటిని అప్పగిస్తామనే నమ్మకం కలిగించాలని, అవసరమైతే చట్టం తేవాలని, అప్పుడే భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇండియాలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం కలిగిన ఆంధప్రదేశ్ లో ఇప్పటికే అనేక పోర్టులు ఉండగా కార్యకలాపాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాన పోర్టులైన విశాఖ, కాకినాడ నుంచి మోస్తరు స్థాయిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నా, మిగతా పోర్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆపరేషన్స్ జరగడం లేదని అంటున్నారు. గతంలో ఏపీ నుంచి ఐరన్ ఓర్ అధికంగా ఎగుమతి అయ్యేదని, కానీ ఇఫ్పుడా పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.వైఎస్ హయాంలోనే ఐరన్ ఓర్ మొత్తం ఊడ్చేశారని, ప్రస్తుతం గ్రానైట్ మాత్రమే ఎగుమతి అవుతోందని చెబుతున్నారు, కాకినాడ పోర్ట్ నుంచి ఎరువులు, కళింగపట్నం నుంచి గ్రానైట్ ఎగుమతి అవుతుండగా, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు పోర్టుల్లో పెద్దగా కార్యకలాపాలు లేవంటున్నారు, ఇవే ఇలాగుంటే కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపూర్, నిజాంపట్నం, వాడరేవు, ముత్యాలమ్మపాలెం, నక్కపల్లి, మేఘవరం పోర్టులు ఎలా మనుగడ సాగిస్తాయని అంటున్నారు.పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరగకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

ఇదంతా పక్కనబెడితే బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం 30వేల ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత నాలుక్కరుచుకుంది, రైతుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోబోతోంది, మొదట్లో చెప్పినట్లుగా 30వేల ఎకరాలు కాకుండా 14వేల ఎకరాలను మాత్రమే భూసమీకరణ కింద తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు, ఇదే విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా ప్రకటించారు, అయితే ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలనడం...అదీ భూసమీకరణ చేస్తామనడం చూస్తుంటే...ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందోమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.