జగన్ ప్రతిష్ట మసకబారడానికి కారణాలెన్నో

Publish Date:Jan 16, 2014

Advertisement

 

ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సర్వేసంస్థ సీమాంధ్రలో నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధారణ (పాపులారిటీ) రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడున్న70 శాతం నుండి ఒకేసారి 22శాతానికి పడిపోయినట్లు బయటపెట్టింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఓదార్పుయాత్ర మొదలుపెట్టిన తరువాత ప్రజాధారణ కొంత నిలకడగా ఉన్నట్లు కనబడినప్పటికీ, ఆయన అరెస్టుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ జగన్మోహన్ రెడ్డి కేసుల పరిశోధనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకొనగా, క్రింద కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులు బెయిలు తిరస్కరిస్తున్నపుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పరువు పోగోట్టుకొన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకోగానే, వైకాపా వెంటనే తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణాలో బయటపడి సమన్యాయం అనడం, ఆ తరువాత సమైక్యాంధ్ర నినాదం అందుకోవడంతో, మొట్టమొదటిసారిగా ప్రజలకి ఆయన విస్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. నాటి నుండే ఆయనను తెలంగాణా ప్రజలు ద్వేషించడం కూడా మొదలుపెట్టారు. తెలంగాణాను వదులుకొని సమైక్య శంఖం పట్టుకొని సీమాంధ్రకు వచ్చిపడినప్పటికీ, సమైక్య ముసుగులో విభజనవాదనే ప్రచారం, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న రహస్య సంభందాల గురించి సీనియర్ కాంగ్రెస్ నేతలే చెపుతుండటంతో అయన చేస్తున్న ఉద్యామలపట్ల ప్రజలలో నమ్మకం కలగలేదు. నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితి గురించి వైకాపా సమావేశాలలో విజయమ్మ పదే పదే ప్రస్తావిస్తూ, అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరిస్తునప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వెలువడటంతో మళ్ళీ ఆయన పాపులారిటీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

 

ఆయన బయటకు వచ్చేసాడు గనుక ఇక పార్టీ దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ, ఆయన ఏపీయన్జీవోలతో వ్యవహరించిన తీరు, తన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆయన చేసిన ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష వంటివన్నీ ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చాయి. ఆ తరువాత ఆయన హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినా, దానివలన ఆయన కానీ, వైకాపాకు గానీ ఎటువంటి మైలేజీ పొందలేకపోయారు. ఆ తరువాత, రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ఉద్యమాలు పక్కనబెట్టి దేశాటన చేసి ప్రతిపక్ష నేతలను కలవడం వలన ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరిగాయే తప్ప ఆయన ఆశించినట్లు సమైక్య ఛాంపియన్ గా ఎదగలేకపోయారు.

 

శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చిన నాటి నుండి సమైక్య తీర్మానం కోరుతూ వైకాపా సభ్యులు బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకోవడం, అదేసమయంలో ఆయన మళ్ళీ ఏపీయన్జీవో సంఘాల ఎన్నికలలో వేలుపెట్టి భంగ పడటంవంటివి ఆయన ప్రతిష్టను మరింత దిగజార్చాయి. వీటికి తోడు పార్టీలో టికెట్స్ కోసం లుకలుకలు, లక్షలు ఖర్చు బెట్టేసి టికెట్స్ దొరకక బయటకి పోయేవారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్నమాటలు అన్నీకూడా ఆయన ప్రతిష్టను దిగజార్చుతూనే ఉన్నాయి. వెంటనే ఏదోకటి చేయకపోయినట్లయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆలోచనతోనే ఆయన చంద్రబాబు నియోజక వర్గం కుప్పం నుండి సమైక్యశంఖారవం చెప్పట్టారు. కానీ దానివలన అతని దుందుడుకు స్వభావమే బయటపడింది తప్ప ఆయనకు, పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు.

 

ఇప్పుడు తాజాగా మారెప్పపార్టీని వీడుతూ జగన్ గురించి అన్నమాటలు, ఆ వెనువెంటనే పొట్లూరి వరప్రసాద్ పార్టీలో చేరే ఆలోచన విరమించుకోవడం వగైరాలు పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. అందువలన త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక భారీ సభో, లేక మరో కార్యక్రమమో ప్రకటించవచ్చును.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.