సింగరేణిలో బొగ్గు కుంభకోణం?!

Publish Date:Jun 5, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో మరో కుంభకోణం కలకలం రేపుతోంది. రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్ లో  1,600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిన  సంచలన ఆరోపణలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. సింగరేణికి చెందిన వివిధ స్టాక్‌యార్డులలో నిల్వ ఉంచిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోవడం వెనుక ఒక వ్యవస్థీకృత దోపిడీ దాగి ఉందని ఆయన ఆరోపించారు. రికార్డుల్లో చూపించిన బొగ్గు నిల్వలకు, క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న నిల్వలకు మధ్య హస్తిమసికాంతరం  వ్యత్యాసం ఉందన్నారు.

 రికార్డుల ప్రకారం మాయమైన ఈ బొగ్గు నిల్వలపై సెస్,  ఆదాయపు పన్ను కూడా చెల్లించినట్లు చూపిస్తున్నారనీ, కానీ  గ్రౌండ్ లెవెల్‌లో తనిఖీలో  అక్కడ బొగ్గు కనిపించకపోవడం వెనుక ఒక పెద్ద  మాఫియా హస్తం ఉందనీ ఆయన ఆరోపించారు.   40 లక్షల టన్నుల బొగ్గును రాత్రికి రాత్రే అక్రమంగా తరలించి, బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక  రహస్యం ఏమిటని ప్రశ్నించారు.  

ఈ భారీ బొగ్గు స్కామ్ వెనుక   రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపణ.  ఒకవేళ నేరుగా ప్రమేయం లేకపోయినా..  ఈ దోపిడీకి పాల్పడిన అసలు సూత్రధారులను, పెద్ద తలకాయలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందన్నారు.  అంతేకాకుండా, ఈ  వ్యవహారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య లోపాయికారీ ఒప్పందాలు, రహస్య సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ బొగ్గు దోపిడీపై తక్షణమే  సిట్టింగ్ జడ్జితో నిష్పక్షిక న్యాయ విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.ఈ మేరకు కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డికి   లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని   కోరారు. 

By
en-us Political News

  
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు ఊచకోత కోశారు. మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 33 వికెట్లు కూలడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ప్రతిరోజూ రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు! హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ₹150 కోట్ల స్కామ్, మరియు మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్ప్‌లైన్ 1930 ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని చెప్పిన 42 ఏళ్ల ముద్దునూరు మంజుల అనే మహిళపై, ఆమె కుమారుడిపై కొందరు యువకులు ఇల్లు చొరబడి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ కోసం మొదటి సరికొత్త రైలు సెట్ వచ్చేసింది. సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ మెట్రో లైన్ ట్రయల్ రన్స్, రూట్ వివరాలు, రియల్ ఎస్టేట్ మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 2024 ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా $60,000 మార్కు కిందకు చేరింది. క్రిప్టో పతనానికి గల ముఖ్య కారణాలు మరియు ఎథేరియం, సోలానా వంటి కాయిన్ల తాజా పరిస్థితి ఇక్కడ చదవండి.
భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల నుండి డబుల్ డిజిట్ (రెండంకెల) లాభాలను ఎలా సాధించగలదో ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ నిపుణులు అశ్విని షామీ వివరించారు. ముడి చమురు ధరల తగ్గింపు మరియు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన టాప్ 5 రంగాల గురించిన పూర్తి విశ్లేషణ మీకోసం.
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది. ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
భారత స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్ తాకుతున్నాయి. ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించారంటూ సెబి (SEBI) మోపిన సంచలన ఆరోపణలు, నిధుల మళ్లింపు వివాదం మరియు జెన్సాల్ ఇంజనీరింగ్ తో పోలికల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
జూన్ 6న దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 100 గ్రాములపై రూ. 30,000 వరకు తగ్గిన లేటెస్ట్ 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను ఇక్కడ క్లిక్ చేసి పూర్తిగా తెలుసుకోండి!
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో 60 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు ఇంగ్లాండ్ జట్టు సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది. కోచ్ థామస్ టుచెల్ సంచలన నిర్ణయాలు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ వివరాలు ఇక్కడ చదవండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి నేటి వ్యాపారవేత్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బిజినెస్ మొదలుపెడితే ఎందుకు నష్టపోతారో, మార్కెట్లోని నకిలీ ఆర్థిక సలహాదారుల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 50 పతనం తర్వాత తిరిగి డబుల్ డిజిట్ లాభాలు ఎలా రాబోతున్నాయి? ప్రముఖ మార్కెట్ నిపుణుడు అశ్విని షామీ షేర్ చేసిన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ మరియు టాప్ 5 రంగాలు ఇవే
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించి, 18 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డు కెక్కాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.