ఎల్ నినో ఎఫెక్ట్.. 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

Publish Date:Jun 6, 2026

Advertisement

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ సారి దెబ్బకొట్టనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఈ ఏడాది 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎమ్డి పేర్కొంది.  పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న  ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ  చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది.  ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో   90 శాతం కంటే తక్కువ   నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంటే సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి.  దశాబ్ద కాలంలోనే దేశంలోనే అత్యంత బలహీనమైన వర్ష సూచన ఇదే అవుతుందన్న మాట. 

సాధారణంగా జూన్ మొదటి తేదీకే దేశాన్ని పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి , ఈసారి జూన్ 4న అంటే నాలుగు రోజులు ఆలస్యంగా   కేరళ తీరాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తూ..  దేశ ఆహార భద్రతను శాసించే రైరుతి  రుతుపవన వ్యవస్థ  ప్రారంభంలోనే ఇలా బలహీనపడింది.  

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటాము.  ఎల్ నినో   వాతావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత కీలకం సముద్రంలో తుపానులు ఏర్పడడానికి అనువైన వాతావరణం ఏర్పడటం. అయితే ఎల్ నినో ప్రభావంతో తుపానులు ఏర్పడడానికి అనుకూలంగా వాతావరణం ఉండటం అటుంచి యాంటీ తుపాన్ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  ఈ కారణంగా భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవన గాలుల వేగం, తీవ్రత పూర్తిగా తగ్గిపోతాయి. ఈ జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశం 80 శాతం వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా..  నవంబర్ నాటికి ఈ ముప్పు ఏకంగా 90 శాతానికి పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ  పేర్కొంది. 

ఐఎండీ  అంచనాల ప్రకారం..  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేవలం వాయవ్య ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశంఉంది. ముఖ్యంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో  వర్షాలు కురిసే అవకాశం అత్యల్పం అని ఐఎండీ పేర్కొంది.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్‌ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
ఎలాన్ మాస్క్ స్పేస్‌ఎక్స్ (SpaceX) ఐపీఓ తర్వాత ఎస్‌అండ్పీ 500 (S&P 500) ఇండెక్స్‌లోకి ఎంట్రీ ఆలస్యం కానుంది. నిబంధనల సడలింపుకు నో చెప్పిన ఎస్‌అండ్పీ డౌ జోన్స్. స్పేస్‌ఎక్స్ నష్టాల లెక్కలు మరియు కఠిన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ మరియు వీసా నిలిపివేతపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూఎస్ ఫెడరల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 39 దేశాల వలసలపై విధించిన కఠిన ఆంక్షలను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయుల కోడింగ్ నైపుణ్యాలను మరియు ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందించారు. భారత్-రష్యా సహోదర బంధంపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇక్కడ చదవండి.
ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న పబ్లిక్ జీపీఎస్ (GPS) వ్యవస్థను అమెరికా మిలిటరీ రహస్యంగా ఒక గ్లోబల్ నంబర్స్ స్టేషన్‌లా మార్చేసిందనే షాకింగ్ నిజం శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. మన ఫోన్లలోకి వస్తున్న ఆ సీక్రెట్ కోడ్స్ కథేంటో ఇక్కడ చదవండి.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు ఊచకోత కోశారు. మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 33 వికెట్లు కూలడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ప్రతిరోజూ రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు! హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ₹150 కోట్ల స్కామ్, మరియు మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్ప్‌లైన్ 1930 ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని చెప్పిన 42 ఏళ్ల ముద్దునూరు మంజుల అనే మహిళపై, ఆమె కుమారుడిపై కొందరు యువకులు ఇల్లు చొరబడి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ కోసం మొదటి సరికొత్త రైలు సెట్ వచ్చేసింది. సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ మెట్రో లైన్ ట్రయల్ రన్స్, రూట్ వివరాలు, రియల్ ఎస్టేట్ మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 2024 ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా $60,000 మార్కు కిందకు చేరింది. క్రిప్టో పతనానికి గల ముఖ్య కారణాలు మరియు ఎథేరియం, సోలానా వంటి కాయిన్ల తాజా పరిస్థితి ఇక్కడ చదవండి.
భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల నుండి డబుల్ డిజిట్ (రెండంకెల) లాభాలను ఎలా సాధించగలదో ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ నిపుణులు అశ్విని షామీ వివరించారు. ముడి చమురు ధరల తగ్గింపు మరియు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన టాప్ 5 రంగాల గురించిన పూర్తి విశ్లేషణ మీకోసం.
భారత స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్ తాకుతున్నాయి. ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించారంటూ సెబి (SEBI) మోపిన సంచలన ఆరోపణలు, నిధుల మళ్లింపు వివాదం మరియు జెన్సాల్ ఇంజనీరింగ్ తో పోలికల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
జూన్ 6న దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 100 గ్రాములపై రూ. 30,000 వరకు తగ్గిన లేటెస్ట్ 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను ఇక్కడ క్లిక్ చేసి పూర్తిగా తెలుసుకోండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.