అణుబాంబులను సైతం త‌ట్టుకునే ఖ‌మేనీ కోట ఎలా నేల‌మ‌ట్ట‌ం?

Publish Date:Mar 1, 2026

Advertisement

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ లోని పాశ్చ‌ర్ స్ట్రీట్ లో  ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ నివాసంతో పాటు బైత్-ఎ-రహబారీ కార్యాల‌యం కూడా ఉంటుంది. ఇక్క‌డ మూడంచ‌ల భ‌ద్ర‌తా  వ్య‌వ‌స్థ ఖ‌మ‌నేని నిరంత‌రం  ప‌హ‌రా కాస్తుంది.  ఈ మూడంచ‌ల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థలో భాగంగా ఇది  నో ఫ్లై జోన్. ఇక్క‌డ అధునాత‌న యాంటీ  ఎయిర్ క్రాఫ్ట్ గ‌న్ లు, క్షి ప‌ణి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లు స‌దా  సిద్దంగా ఉంటాయి. అన్నిటికీ మించి.. ప్రపంచ  అమేయ సైనిక శ‌క్తికి ప‌రాకాష్ట‌గా భావించే ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ లోని.. వ‌లీ- ఏ- అక్రం అనే విభాగం సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీని ప‌ర్య‌వేక్షిస్తుంది. అంతకు మించ పాశ్చ‌ర్ స్ట్రీట్ లోని ఖ‌మేనీ నివాసం కింద అత్యంత లోతైన బంక‌ర్లుంటాయి. ఇవి అణు దాడుల‌ను కూడా త‌ట్టుకుని నిలిచేంత పటిష్టంగా  ఉంటాయి.  ఏదైనా ఎమ‌ర్జెన్సీ త‌లెత్తితే.. సుప్రీం లీడ‌ర్ ఇక్క‌డి  నుంచే యుద్ధ భూమిని శాసించ‌గ‌ల‌రు. 

మ‌రి అలాంటి కోట ఎలా బీట‌లు వారింది? ఇందులో అంత‌ర్గ‌త శ‌తృవులు ఎవ‌రు? ప‌ట్ట‌ప‌గ‌లే ప్ర‌త్య‌ర్ధి ద‌ళాలు చుక్క‌లు చూపించ‌డానికి  గ‌ల కార‌ణాలేంటి? ఈ స‌మాచారం అందించింది ఎవ‌రు? ఇందులో ఏఐ పాత్ర ఎంత‌? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇరాన్ తేరుకునే లోపే ఈ  ఆప‌రేష‌న్ ఎలా ముగిసిపోయింది అన్న‌ది  అంతు చిక్క‌కుండా ఉంది. ఇంత‌టి పిన్ పాయింట్ ఆప‌రేష‌న్ ఎలా సాధ్య‌మైంది అన్న‌దిప్పుడు బిగ్ డిబేట్ గానూ మారింది. ఇది ప్ర‌పంచం తొలిసారి చూసిన సూసైడ్ డ్రోన్ అటాక్. ఇరాన్ అత్యున్నత అధికార కేంద్రం ఉండే  పాశ్చ‌ర్ స్ట్రీట్ పై  క‌నీ వినీ ఎరుగ‌ని భీక‌ర దాడి. ఈ దాడి ఎలా జ‌రిగింద‌నేది ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో ర‌క్ష‌ణ  నిపుణుల‌కొక గుణ‌పాఠంలా మారింది.

ఇజ్రాయెల్, అమెరికా ద‌ళాలు ఎంపిక చేసుకున్న తొలి వ్యూహం, ప‌ట్ట‌ప‌గలు దాడుల‌తో విస్మయానికి గురి చేయ‌డం. సాధార‌ణంగా ఏ దేశ‌మైనా శ‌తృ దేశంపై అర్ధ‌రాత్రి పూట దాడులు చేస్తుంది. కార‌ణం ఆ స‌మ‌యంలో వారు ఆద‌మ‌ర‌చి ఉంటారు కాబ‌ట్టి. కానీ ఇక్క‌డ ఇజ్రాయెల్, అమెరికా వ్యూహ‌క‌ర్త‌లు ప‌గ‌టి దాడుల‌ను ఎంపిక చేశారు. దాడి జ‌రుగుతుంద‌ని ఎప్ప‌టి నుంచో ఇరాన్ అగ్ర నాయ‌క‌త్వానికి, సైనిక శ‌క్తికి తెలుసు. కానీ ఇలా  ఇంత పిన్ పాయింటెడ్ గా జ‌రుగుతుంద‌ని మాత్రం ఊహించలేదు. 

 శ‌నివారం (మార్చి 28)ఉద‌య స‌మ‌యాన్ని ఎంపిక చేసుకోవ‌డం   యాధృచ్చికం కాదు. ప‌క్కా ఇంటెలిజెన్స్ స‌మాచారం. ఇక్క‌డ ఇజ్రాయెలీ మొసాద్ కి చెందిన మెరిక‌ల్లాంటి ఇన్ఫార్మ‌ర్లు ఇరాన్ లో ఇరాన్ అగ్ర‌నాయ‌క‌త్వం క‌ళ్లు క‌ప్పి తిరుగుతుంటారు. అస‌లు ఇరాన్ చూపంతా వీరిపైనే. వీరు ఎక్క‌డ  క‌నిపిస్తే అక్క‌డ కాల్చి వేసే రూల్ ఉంది.  అయినా స‌రే ఒక‌రు పోతే మ‌రొక‌రుగా ఇక్క‌డ కాపు కాచి ఉంటారు. ఈ ఇన్ఫార్మ‌ర్ల ఇన్ఫ‌ర్మేష‌నే ఇరాన్ ఖ‌మేనీ కోట‌ను డీకోడ్ చేయ‌డానికి ప‌నికొచ్చింది. ఇరాన్ అగ్ర నాయ‌క‌త్వం ఒకే చోట స‌మావేశ‌మైంద‌ని ఇంటెలిజెన్స్ స‌మాచారం అంద‌డంటో  ఇజ్రాయెలీ-యూఎస్ సంయుక్తంగా టార్గెట్ ఫిక్స్ చేశాయి. ఈ టైంలో అటాక్ చేస్తే హై- వాల్యూ- టార్గెట్ల‌ను ఒకేసారి చేధించే అవ‌కాశ‌ముంద‌ని  ప‌సిగ‌ట్టింది ఇజ్రాయెల్- యూఎస్ ఆర్మీ. ఆ స‌మ‌యంలో ఇరాన్ డిఫెన్స్ సిస్ట‌మ్ కూడా ఏమంత అప్ర‌మ‌త్తంగా  ఉండ‌దు.  

నిజానికి ఖ‌మేనీ ఈ స‌మావేశం  శ‌నివారం సాయంత్రం నిర్వ‌హిస్తార‌ని టెహ్రాన్ నుంచి అమెరికా ద‌ళాల‌కు ఉన్న స‌మాచారం. అయితే ఇజ్రాయెల్ నిఘా వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. శ‌నివారం ఉద‌యం ఒక అత్యున్న‌త స్థాయి స‌మావేశం జ‌రుగుతుంద‌ని గుర్తించార‌ట‌.  ఈ స‌మాచారంతో అమెరికా ద‌ళాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది ఇజ్రాయెల్. అలా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఒకేసారి  దాడికి తెగ‌బ‌డ్డాయట‌. ఇరాన్ ఉన్న‌తాధికారులంతా.. స‌మావేశ‌మై  ఉండగా, వారి ఊహకు అందని రీతిలో అటాక్ చేసి  సింగిల్ అటెంప్ట్ లో మ‌ట్టు పెట్టేశాయి ఇజ్రాయెలీ అమెరికా సేన‌లు.

భూమ్యాకాశాల‌తో పాటు స‌ముద్రం నుంచి కూడా ముప్పేట దాడి ఇజ్రాయెల్, అమెరికాల రెండో వ్యూహం.  టెహ్రాన్ న‌గ‌రాన్ని మూడు వైపుల నుంచి  చుట్టుముట్టేలా ఆప‌రేష‌న్ ప్లాన్ చేశారు. ప‌ర్ష‌ియన్ గ‌ల్ఫ్ లో ఉన్న అమెరికా యుద్ధ నౌక‌లు, జ‌లాంత‌ర్గాముల నుంచి వేలాది కిలోమీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాల‌ను చేధించ‌గ‌ల టోమాహాక్ క్రూయిజ్ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించారు. అమెరికాకు చెందిన ఎఫ్- 35 స్టీల్త్ ఫైట‌ర్లు, బీ-2 బాంబ‌ర్లు.. రాడార్ల‌కు చిక్కకుండా  ఇరాన్ గ‌గ‌న త‌లంలోకి ప్ర‌వేశించాయి. పిన్ పాయింట్ బాంబ్ అటాక్స్ చేశాయి. స‌రిహ‌ద్దు దేశాల నుంచి హైమార్స్ రాకెట్ సిస్ట‌మ్స్ ద్వారా ఖ‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌పై దాడులు జ‌రిగాయి.

 లుకాస్ డ్రోన్ల వినియోగం మూడో వ్యూహం. ఈ ఆప‌రేష‌న్లో అతి  పెద్ద హైలెట్  ఇదే.  లో కాస్ట్- అన్ మ్యాన్డ్ కాంబాట్ అటాక్ సిస్ట‌మ్ పేరే.. లూకాస్ డ్రోన్ సిస్ట‌మ్. అమెరికా తొలిసారి  ఈ క‌మికేజ్ అంటే  సూసైడ్ డ్రోన్ సిస్ట‌మ్ ని ప్ర‌యోగించింది. ఇరాన్ సొంతంగా త‌యారు చేసిన షాహెద్ డ్రోన్ల త‌ర‌హాలో ఉండే.. ఈ డ్రోన్ల గుంపు ఒక్కాసారిగా వ‌చ్చి ఎస్- 300 క్షిప‌ణుల క‌న్ను క‌ప్పి.. ఖ‌మేనీ నివాసాన్ని నేల‌మ‌ట్టం చేశాయి.

శాటిలైట్ చిత్రాల‌ను అనుస‌రించి చూస్తే..   నిమిషాల వ్య‌వ‌ధిల‌నే ఈ ప్రాంత‌మంతా  శిథిలావ‌స్థకు చేరుకుంది. ఇరాన్ గ‌గ‌న త‌ల వ్య‌వ‌స్థ‌ల‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి మ‌రీ.. ఈ దాడులు జ‌ర‌గ‌టం విశేషం.  ఇందులో అత్యంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది ఏఐ టెక్నాల‌జీ. ఇక్క‌డి ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క క‌ట్టి.. ఇజ్రాయెల్, అమెరికా  సైన్యాన్ని అప్ర‌మ‌త్తం  చేసింది ఈ కృత్రిమ‌ సాంకేతిక ప‌రిజ్ఞాన‌మే  అణుబాంబుల‌కు కూడా వెర‌వ‌ని ఖ‌మేనీ కోట ఒక్క‌సారిగా కుప్ప కూల్చేసింది. 

By
en-us Political News

  
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.