సాధార‌ణ మ‌త‌గురువు కుమారుడు ఇరాన్ నియంత ఎలా అయ్యారు?

Publish Date:Mar 2, 2026

Advertisement

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ మ‌ర‌ణం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఆయన హతం కావడం ప్రపంచ రాజ‌కీయాల్లో  పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.  ఈ నేపథ్యంలో ఒక సామాన్య మ‌త గురువు కొడుకుగా మొద‌లై... ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన నియంతల్లో  ఒక‌రిగా ఎదిగిన ఖమేనీ ప్రస్థానం ఎలా సాగిందని చూస్తే.. 
1939 ఏప్రిల్ 19న ఇరాన్ లోని ప‌విత్ర న‌గ‌రం మ‌ష‌ద్ లో జ‌న్మించారు ఖ‌మేనీ. ఆయ‌న తండ్రి ఒక సాధార‌ణ మ‌త గురువు. చిన్న‌త‌నంలోనూ అంటే, నాలుగేళ్ల వ‌య‌సులోనే  ఖురాన్ ప‌ఠ‌నం మొద‌లు పెట్టారు ఖ‌మేనీ. మ‌ష‌ద్, క్వామ్ వంటి న‌గ‌రాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దివారు. ఆయ‌న‌కు అర‌బిక్, ప‌ర్షియన్ భాష‌ల్లో  మంచి పట్టు  ఉంది.

ఖమేనీ చేసిన విప్ల‌వ పోరాటాలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి.  1960ల కాలంలో షా  చ‌క్ర‌వ‌ర్తి  పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడారు ఖ‌మేనీ. అనేక  సార్లు జైలు శిక్ష‌  అనుభ‌వించారు కూడా. 1979లో ఇస్లామిక్ విప్ల‌వం త‌ర్వాత అయ‌తుల్లా  ఖొమేనీకి రైట్ హ్యాండ్ గా మారారు. చాలా మంది అనుకుంటారు ఖొమేనీ, ఖ‌మేనీ ఒక‌రేన‌ని. ఇద్ద‌రూ వేరు వేరు. ఖ‌మేనీ  గురువు ఖొమేనీ. గురువు ఖొమేనీ తాత‌లు భార‌త్ లోని ఉత్త‌ర  ప్రదేశ్ కి చెందిన బారాబంకీ  కి చెందిన వారు. 

గురువు లాంటి పేరు క‌లిగి ఉన్న ఖ‌మేనీ.. ద‌శ తిరిగి 1981 నుంచి 1989 వ‌ర‌కూ ఇరాన్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. స‌రిగ్గా  1989లో ఆయ‌న గురువు ఖొమేనీ మ‌ర‌ణించారు.. దీంతో ఇరాన్ అత్యున్న‌త మండ‌లి ఖ‌మేనీని సుప్రీం లీడ‌ర్ గా ఎంపిక చేసింది. అక్క‌డి నుంచి ఆయ‌న తిరుగులేని విధంగా సుమారు 37 ఏళ్ల అప్ర‌తిహ‌తంగా ఇరాన్ కి అగ్ర నాయ‌క‌త్వం వ‌హించారు. ఒక  ర‌కంగా  చెబితే ఇరాన్ ని త‌న గుప్పెట్లో పెట్టుకున్నారు.

ఖ‌మేనీ పాల‌న‌లో ఇరాన్ ఎలాంటి అభివృద్ధి చ‌వి చూసింది. ఆ వివ‌రాలేంట‌ని చూస్తే.. ఇరాన్  సైనిక శ‌క్తిని ఒక రిజిన‌ల్ సూప‌ర్ ప‌వ‌ర్ గా తీర్చి దిద్దిన ఘ‌న‌త ఖ‌మేనీది.  స్వ‌దేశీ సాంకేతికత‌తో మిస్సైళ్ల త‌యారీ, డ్రోన్ అటాకింగ్, ఆపై అణు కార్య‌క్ర‌మాల‌ను అభివృద్ధి చేశారు. ఖ‌మేనీ నాయ‌క‌త్వంలోని ఇరాన్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన ద‌ళంగా త‌యారైంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, విద్యారంగంలో పురోగ‌తి.. ఖ‌మేనీ నాయ‌క‌త్వంలోనే సాధ్య‌మ‌య్యాయి. మ‌ధ్య ప్రాచ్యంలో లెబ‌నాన్, సిరియా, యెమ‌న్ ల‌లో ఇరాన్ ప్ర‌భావాన్ని మ‌రింత పెంచింది  కూడా ఆయ‌నే. అయితే ఇదంతా ఎలా త‌యారైందంటే.. ఇస్లామిక్ రివ‌ల్యూష‌న్లో భాగంగా.. కేవ‌లం సైనిక శ‌క్తి పెరుగుద‌ల కోస‌మే జ‌రిగింది త‌ప్ప‌.. సామాన్యుడ్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయ‌డంకోసం  కాదు. ఇదే ఆయ‌న ప‌ట్ల తీవ్ర‌  వ్య‌తిరేక‌త  పెరిగేలా  చేసింది.

ఇరాన్ చ‌మురు సంప‌ద‌ను ప్ర‌జ‌ల కోసం వాడ‌కుండా..  విదేశాల్లోని హిజ్బుల్లా, హ‌మాస్ వంటి ఉగ్ర సంస్థ‌ల కోసం ఖ‌ర్చు చేయ‌డం.. చేటు తెచ్చింది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల‌తో శ‌తృత్వం కొని తెచ్చుకోవ‌డంతో పాటు.. అటు ప్ర‌జా వ్య‌తిరేక‌తా పెల్లుబికేలా చేసింది. దీంతో అంత‌ర్జాతీయ ఆంక్ష‌లు పెరిగి ద్ర‌వ్యోల్బ‌ణం 50 శాతానికి పైగా చేరింది. స్వేచ్ఛ‌ను కోరుకునే యువ‌త‌, మ‌హిళ‌ల‌ను మ‌రింత క్రూరంగా అణ‌గ‌దొక్కే య‌త్నం చేశారు. 2022లో మ‌హ్సా అమిని మ‌ర‌ణం త‌ర్వాత మొద‌లైన నిర‌స‌న‌లు.. ఖ‌మేనీపై అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న గౌర‌వం, భ‌యాన్ని తుడిచిపెట్టేశాయి.

ఇక  ఐఆర్జీసీ నేత‌లు, మ‌త పెద్ద‌ల చేతుల్లోనే దేశ సంప‌ద మొత్తం కేంద్రీ కృతం కావ‌డం కూడా ప్ర‌మాద‌కరంగా మారింది. మ‌త‌ప‌ర‌మైన క‌ట్టుబాట్ల‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌డం కూడా విద్యావంతులైన యువ‌త దేశం వ‌దిలి వెళ్లేలా చేసింది. ప్ర‌స్తుతానికైతే ఇరాన్ ఒక చారిత్రక మ‌లుపులో ఉంది. ఒక ర‌కంగా  చెబితే ఇదొక సంధి కాలం. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన సంయుక్త వైమానిక దాడుల్లో..  ఖమేనీ నివాసం, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు రెండూ ధ్వంసమయ్యాయి. ఇక ఖ‌మేనీ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న రెండో కుమారుడు మ‌జ్త‌బా ఖ‌మేనీని గ‌ద్దెనెక్కించాల‌ని చాంద‌స వాద గ్రూపులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. సామాన్యులు మాత్రం మాకు రాజ‌రిక పాల‌న , మ‌త పాల‌న వ‌ద్దంటూ రోడ్డెక్కుతున్నారు. దీంతో ప్ర‌స్తుత ఇరాన్ పాల‌న అలీరెజా అరాఫీ నాయ‌క‌త్వంలోని తాత్కాలిక మండ‌లికి అప్ప‌గించారు. ఖ‌మేనీ మ‌ర‌ణం త‌ర్వాత ఇరాన్   ముల్లా రాజ్ అంటే..  మత‌గురువుల పాల‌న‌కు స్వ‌స్తి  ప‌లికేలా క‌నిపిస్తోంది. పాశ్చాత్య దేశాలు ఇక్క‌డ కూడా ప్ర‌జ్వామ్య పాల‌న తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. 

 ఆయ‌నింత‌టి సైనిక శ‌క్తి త‌యారు చేయ‌డం  వెన‌క దాగిన అస‌లు నిజం ఏ పాశ్చాత్య శ‌క్తికీ ఇరాన్ లొంగి  ఉండాల‌నుకోవ‌డం లేద‌ని  చాటి  చెప్ప‌డానికే నంటూ ఖమేనీ చివరి సందేశంలో పేర్కొన్నారు.  అయ‌తుల్లా అలీ స‌య‌ద్ ఖ‌మేనీ.. ఒక్క దేవుడికి త‌ప్ప ఎవ‌రికీ విధేయ‌త ప్ర‌క‌టించ‌డన్నదే ఆయని చివ‌రి ప్ర‌సంగ  పాఠం.  ఇదే ఆయ‌న్ను ఇవాళ్టి దుస్థితికి తీసుకొచ్చి పెట్టింది. మారుతున్న ప‌రిణామ క్ర‌మాల‌కు అనుగుణంగా మార‌క పోవ‌డం ఖ‌మేనీ దుర్మ‌ర‌ణానికి  కార‌ణంగా  నిలిచింది. దేశ సంప‌ద‌నంతా ఆయ‌న ఖ‌ర్చు చేసింది.. ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తే  ఎదుర్కుందామ‌నే. కానీ ఆ సైనిక అణు శ‌క్తి.. ఇజ్రాయెల్, అమెరికా సేన‌ల ముందు తేలిపోవ‌డంతో ఇరాన్ సుప్రీం  లీడ‌ర ఖ‌మేనీ ప్రాణం అనంత వాయువుల్లో క‌లిసింది. ఇది ఒక నియంత చివ‌రి అంకం.   

By
en-us Political News

  
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
ప్రపంచ అణు విధానాలు, సాంకేతిక పురోగతులు, మరియు భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంచనా వేయడానికి, యురేనియం సుసంపన్నం మరియు ప్లూటోనియం ఉత్పత్తి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అత్యవసరం.
ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది.
గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది.
ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థినితో తనకు ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమించానంటూ ఆమెను వేధించసాగాడు. అయితే ఆమె నిరాకరిచడంతో వెంకటేష్ ఉన్నాదిగా మారిపోయాడు. శనివారం కీర్తనపై కత్తితో దాడి చేశాడు.
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న కేరళ అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీ పదవికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను సూచించింది. వీరిలో వినాయక్ ప్రభాకర్ ఆట్టే, సౌమ్య మిశ్రా తో పాటు సీవీ ఆనంద్ పేరు కూడా ఉంది.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.