వినాశకాలే విపరీత బుద్ధి

Publish Date:Jan 26, 2014

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా సుదీర్గమయిన వాదన చేసిన తరువాత లోపభూయిష్టమయిన ఆ బిల్లుని వెనక్కి త్రిప్పి పంపమని కోరుతూ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. అంతేగాక బిల్లుని వ్యతిరేఖిస్తూ తీర్మానం నోటీసు కూడా ఇచ్చారు. దీనిపై తెలంగాణావాదులందరూ మండిపడుతున్నారు. కానీ, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి కొత్తగా చెప్పిందేముందంటూ ఆయన వాదనలను చాలా తెలికగా కొట్టిపడేశారు.

 

శాసనసభ అభిప్రాయలు తెలుసుకోవడానికి మాత్రమే బిల్లును పంపాము, గనుక అందరూ తమ అభిప్రాయలు చెప్పవచ్చని, ఇంతవరకు 87మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని, వారందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెపుతున్నట్లుగా బిల్లులో లోపాలు ఉన్నట్లయితే వాటికి పరిష్కారాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.

 

ముఖ్యమంత్రి నిన్న సభలో మాట్లాడుతూ, జస్టిస్ జీవన్ రెడ్డి తీర్పుని పేర్కొంటూ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై శాసనసభకు సర్వ హక్కులు ఉంటాయని, చేతిలో అధికారం ఉంది కదా అని కేంద్రం రాష్ట్ర శాసనసభ యొక్క హక్కులను కబళించలేదని గట్టిగా వాదించారు. ఆ హక్కులున్నందునే కేంద్రం బిల్లుని రాష్ట్ర శాసనసభకు పంపిందని, అందువల్ల బిల్లుని ఆమోదించే, వ్యతిరేఖించే హక్కు రాష్ట్ర శాసనసభకు ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రంబిల్లుకి వ్యతిరేఖంగా రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయలు వ్యక్తం చేసినా చివరికి తిరస్కరించినా దానిని పట్టించుకొనవసరం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. అంతేగాక యావత్ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల అభిప్రాయానికి అసలు విలువేలేదనట్లు మాట్లాడటం చూస్తే ఆయనకు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి రాజ్యాంగ విధానాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోంది. రాష్ట్ర శాసనసభకు, ముఖ్యమంత్రి మాటలకు విలువే లేదని కాంగ్రెస్ భావిస్తున్నపుడు వారిని అపహాస్యం చేయడానికే పంపినట్లవుతుంది.

 

బిల్లులో లోపాలు ఉంటే వాటికి రాజ్యాంగంలో పరిష్కారాలు కూడా ఉన్నాయని ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ, కాంగ్రెస్ అధిష్టానం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లుని ఎన్ని మెలికలు తిప్పినా, ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను, వ్యతిరేఖంగా వచ్చిన వాదనలను, ఇరుప్రాంతాలవారు కోరుతున్న సవరణలను పరిగణనలోకి తీసుకొన్నట్లయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సంజాయిషీలు, వివరణలు చెప్పుకోవలసివస్తే తల దించుకోక తప్పదు.

 

ఒకవేళ ఆయన అభ్యంతరం చెప్పకపోయినా, రేపు బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయినప్పుడు, బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా రూపొందించబడిందని కోర్టు భావిస్తే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లుగానే వాటికి రాజ్యాంగ ప్రకారం పరిష్కారాలు చూపమని కేంద్రాన్ని ఆదేశిస్తే పోయేది కాంగ్రెస్ పరువే తప్ప రాష్ట్ర శాసనసభ పరువు కాదు.

 

బిల్లు తిరిగి వచ్చిన తరువాత దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని  ఒక్క ముక్కతో దిగ్విజయ సింగ్ సరిపెట్టి ఉందవచ్చును. కానీ, శాసనసభ బిల్లుపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా మాకు నష్టం లేదనడం అహంకారమే. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కట్టబెట్టిన తెలుగు ప్రజల పట్ల దిగ్విజయ్ సింగ్ ఇంత చులకన భావం ఎందుకు ప్రదర్శిస్తున్నారో, ఇంత అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన మాటల వలన సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖత పెరగడం తధ్యం.

 

కాంగ్రెస్ వ్యూహం ప్రకారం సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో తన రహస్య మిత్రులకు రాజకీయ లబ్ది చేకూర్చి వారి నుండి మద్దతు పొందాలని భావిస్తోంది గనుకనే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ప్రజలలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖతను పెంచే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ది అని దీనినే అంటారేమో!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.