తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-2

Publish Date:Jan 21, 2014

Advertisement

 

                                         బీజేపీ  వ్యూహం

ఇక, బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడమంటే కాంగ్రెస్ గెలుపుకి తోడ్పడటమే అవుతుంది. గనుకనే, మొదటి నుండి సమన్యాయం రాగం ఆలపిస్తూ తన జాగ్రత్తఃలో తాను ఉంది. ఆ ప్రయత్నంలోనే మొన్న డిల్లీలో తన సీమాంధ్ర నేతలతో ర్యాలీ చేయించి దానికి వెంకయ్యనాయుడిని పంపించి తన మనసులో మాట బయటపెట్టింది. తాము తెలంగాణా ఏర్పాటు కోరుకోతున్నామని చెపుతూనే, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా బిల్లులో కొన్ని సవరణలు పెడతామని వెంకయ్యనాయుడు ద్వారా సూచింది.

 

రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా చేసే ప్రతిపాదనలను తిరస్కరించలేదు. అలాగని వాటిని ఆమోదించి తెలంగాణా ప్రజలకు ఆగ్రహం కలిగించలేదు. గనుక, ముందుగానే ఈవిధంగా హెచ్చరించి కాంగ్రెస్ పార్టీని వెనక్కి తగ్గేలా చేయగలిగితే దానిపై నెపం వేసి తప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ఇరుప్రాంత ప్రజలకి పూర్తి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు రాజ నాథ్ సింగ్ తో సహా బీజేపీ అగ్రనేతలందరూ కొత్త పల్లవి అందుకొన్నారు. అచ్చ తెలంగాణావాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు గతంలో మాదిరిగా తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం కూడా అదే.

 

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలంటే, మరింత బలంగా తెలంగాణా వాదం వినిపించాల్సి ఉంటుంది. అలా జరగాలంటే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకూడదు గనుక బిల్లుకి బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును. అదేవిధంగా, సీమాంధ్రలో తెదేపాతో జత కట్టాలని భావిస్తున్న బీజేపీ అక్కడ కూడా లాభాపడాలంటే, కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టినా, పెట్టకపోయినా వెంకయ్య నాయుడు వంటి వారు గట్టిగా సీమాంధ్ర హక్కుల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ లెక్కలు సరిచూసుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, ముందే చెప్పినట్లుగా బీజేపీ బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా కొన్ని సవరణలు సూచించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి తను క్షేమంగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఏ కారణంగానయినా బిల్లుని ప్రవేశపెట్టకపోయినా అంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేసి, తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం ఖాయం. అందువల్ల, ఈ రెండు ప్రత్యర్ధ పార్టీలు ప్రజలకిచ్చిన మాట కోసం ఒకదానికొకటి సహకరించుకొని వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తాయని నమ్మడం కష్టం.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.