కొత్త పార్టీలు తెదేపాతో సహకరించాలి: బాబు

Publish Date:Mar 10, 2014

Advertisement

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్, కిరణ్ కొత్త పార్టీల గురించి నిన్న ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలుకుతూ, అంతా అయిపోయిన తరువాత చేతులెత్తేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను ఉద్దరిస్తానంటూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఏమీ చేయలేనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఏమి చేయగలరు ఓట్లను చీల్చడం తప్ప? మహా అయితే ఆయనకు ఒక నాలుగయిదు సీట్లు వస్తాయేమో? కొత్తగా వస్తున్న పార్టీలకు ఓట్లు వేయడం వలన విలువయిన ప్రజల ఓట్లు వృధా అయిపోవచ్చును. కొత్త పార్టీలు పెట్టి ప్రజలలో సదిగ్ధం సృష్టించడం కంటే, వారు తేదేపాకు సహకరించినట్లయితే అందరూ కలిసి రాష్ట్ర పునర్మిర్మాణం చేసుకోవచ్చును,” అని అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, తమతో చేతులు కలిపి సహకరించితే బాగుటుందని సూచిస్తున్నట్లే భావించవచ్చును.

 

పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో చేతులు కలిపేందుకు సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తనకు కనీసం 15 యం.ఎల్యే. మరియు 3-4 యంపీ టికెట్స్ కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లయితే తెదేపాలో చేరడమో లేక ఆపార్టీకి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే, తెదేపా నేటికీ బీజేపీతో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తోంది. కనుక, కొన్ని టికెట్స్ పవన్ కళ్యాణ్ కి, మరికొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్ నుండి తరలి వస్తున్న నేతలకీ పంచుకొంటూ పోతే ఇక తెదేపాలో ఉన్నవారికెవరికీ టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల మహా అయితే 4-5 సీట్లు కేటాయించేందుకు మాత్రం చంద్రబాబు అంగీకరించగలరు. కానీ, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏర్పాటుకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నందున, ఆయనకు విజయవాడ టికెట్ ఇవ్వాలని పవన్ పట్టుబడితే, తెదేపా ఇవ్వలేదు. కనుక పవన్ తెదేపాతో జత కట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చును.

 

ఏమయినప్పటికీ, కిరణ్, పవన్ కళ్యాణ్ ల రంగప్రవేశంతో సీమాంధ్రలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఈ పాత, కొత్త పార్టీల ప్రభావంతో ప్రజల ఓట్లు చీలడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడటం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే పరితపించిపోతున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, తమవల్లనే ఓట్లు చీలి, ఎవరికీ మెజార్టీ రాకుండా చేసుకొని, రాజకీయ అస్థిరతను సృష్టించడానికి సిద్దపడుతుండటం చాలా శోచనీయం. ఇప్పటికే చాల దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, ఈ రాజకీయ నేతల, పార్టీల స్వార్ధం, అధికార కాంక్ష కారణంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఒక సుస్థిరమయిన ప్రభుత్వం ఏర్పడలేకపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయం. ఈ సంగతి గ్రహించిన చంద్రబాబు అందుకే ఇటువంటి సూచన చేసారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడదని ఆయనకీ తెలుసు.

 

రాజకీయ పార్టీలు వాటిని నడిపే నేతల మధ్య సత్సంబంధాలు, సరయిన అవగాహన, రాష్ట్ర ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం ఇంత సాహసించగలిగేదే కాదు. రాష్ట్రానికి నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. అందువల్ల ఇప్పుడు వారి నుండి కొత్తగా ఏమీ ఆశించలేము.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.