తెలంగాణా బీజేపీ సభలో వెంకయ్య మిస్సింగ్

Publish Date:Mar 11, 2014

Advertisement

 

బీజేపీ నిన్న హైదరాబాదులో నిర్వహించిన ‘తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలందరూ పాల్గొన్నారు. కానీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కనబడలేదు. ఆయన ఏదో చాలా అర్జెంట్ పనిమీద బెంగళూరు వెళ్ళవలసి రావడంతో సభకు హాజరు కాలేకపోయారని ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నట్లు సమాచారం. షరా మామూలుగానే బండారు దత్తత్రేయతో సహా చిన్నా పెద్ద నేతలందరి ఫోటోలతో బ్యానర్లు, భారీ కటవుట్లు కూడా సభా ప్రాంగణంలో పెట్టబడ్డాయి. కానీ వాటిలో కూడా వెంకయ్య నాయుడు ఫోటో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనబడలేదు. బహుశః ఆయన బెంగళూరు వెళుతూ వెళుతూ హైదరాబాదులో తన ఫోటోలేవీ ఉంచకుండా వెంటపట్టుకు పోయినందువల్లే బీజేపీ వాళ్ళు ఆయన ఫోటోలు అచ్చు వేయలేకపోయారేమో పాపం!

 

ఆ తరువాత సభలో ప్రసంగించిన వక్తలందరూ తమ పార్టీ తెలంగాణ కోసం ఫెవీకాల్ పూసుకొని ఒక ఇంచి కూడా పక్కకు జరగకుండా ఏవిధంగా మాట మీద నిలబడిందో, ఏవిధంగా తెలంగాణా ప్రజల కలలను సాకారం చేసిందో పూస గుచ్చినట్లు వివరించారు. తమ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఝాన్సీ లక్ష్మీ భాయిలా తెలంగాణా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా పోరాడి సాధించిందో కళ్ళకు కట్టినట్లు వివరించి, తెలంగాణా క్రెడిట్ మొత్తం ఆమె పద్దులోనే అంటే బీజేపీ పద్దులోనే వ్రాసేసుకొంటునట్లు ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా తెలియజేసారు. అయితే ఈ సందర్భంగా రాజ్యసభలో సీమాంధ్ర కోసం తాండ్ర పాపారాయుడిలా పోరాడేసి, చివరికి చేతులెత్తేసిన వెంకయ్య నాయుడిని తలుచుకోవడం అసందర్భంగా ఉంటుందని ఎవరూ కూడా తలుచుకోలేదు.

 

బహుశః త్వరలో సీమాంధ్రలో మోడీ నిర్వహించబోయే ఎన్నికల సభలో వెంకయ్య నాయుడి వీర పోరాటం గురించి ప్రజలకు కధలు కధలుగా వివరిస్తారేమో. అప్పటికి ఆయన కూడా ఆంధ్రాకు తిరిగి వచ్చేస్తారు గనుక ఆయన కూడా మోడీ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఆయన ఫోటోలు, బ్యానర్లు కూడా నిరభ్యంతరంగా పెట్టేసుకోవచ్చును. అయితే ఈ సారి తెలంగాణా-చిన్నమ్మ అండ్ కో ఆ సభకు రాకపోవచ్చును. అదేవిధంగా వారి ఫోటోలు బ్యానర్లు కూడా సభలో కనబడకపోవచ్చును. తెలంగాణాలో వెంకయ్య ఫోటోలు పెడితే జనాలు ఏవిధంగా రియాక్టవుతారో, సీమాంధ్రలో చిన్నమ్మ ఫొటోలకి, ప్రస్తావనకు అదేవిధంగా రియాక్టవడం ఖాయం గనుక ఏ ఎండకి ఆ గొడుగు లేదా ఏ ప్రాంతానికి ఆ మనుషులు, కటవుట్లు ఏర్పాటు చేసుకొని, సందర్భోచితమైన డైలాగులే పలకాల్సి ఉంటుంది. లేకుంటే అంతా రచ్చరచ్చయిపోద్ది మరి. ఆంధ్రాకి వెంకయ్య, తెలంగాణాకి చిన్నమ్మని బీజేపీ కేటాయించుకొంది గనుక వారు ఇకపై ఒకరి జోన్లో మరొకరు ఎంటరవరన్నమాట. బహుశః అందుకే నిన్న వెంకయ్య గారు అర్జెంటుగా బెంగుళూరు వెళ్ళిపోవలసి వచ్చిందేమో!పాపం!

 

ఇదంతా చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే చాలా మొండి దైర్యం ఉందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తంతుని దగ్గరుండి చకచకా పూర్తి చేసి చేతులు దులుపుకొన్న జైరామ్ రమేష్ నే రెండు ప్రాంతాలలో పర్యటనకు పంపించి కాంగ్రెస్ నెగ్గుకు వస్తోంది కదా! ఆయన ‘కాంగ్రెస్ చర్మం’ కొంచెం మందం గనుక, సీమాంధ్రలో ఎవరు ఎన్ని తిట్లు తిడుతున్నాఅవి చెవిన పడనీయకుండా తన చుట్టూ భజన బృందం ఏర్పాటు చేసుకొని తిరుపతి నుండి వైజాగ్ వరకు కాళ్ళరిగేలా తెగ తిరిగేస్తున్నారు.

 

ఈ ఎన్నికల తరువాత తమ పార్టీ అధికారంలోకి రాలేక పోవచ్చననే అనుమానం ఉన్నపటికీ, అదేమీ బయటకి కనబడనీయకుండా రాగల పదేళ్లలో సీమంద్రాను తాము ఏవిధంగా మార్చేయబోతున్నామో ఆయన 3డీలో పిక్చర్ వేసి చూపిస్తూ ప్రజలను పడేస్తున్నారు. సీమాంధ్రలో క్లైమేట్ మరికొంత కొంచెం చల్లబడగానే రాజమాతని, యువరాజవారిని స్వయంగా తోడ్కొని వచ్చి సీమాంధ్ర ప్రజలను అనుగ్రహింప జేస్తానని ఆయన హామీ కూడా ఇస్తున్నారు. మరి వెంకయ్య అండ్ కో పార్టీ మోడీ మహాశయుడిని ఎప్పుడు తోడ్కొని వస్తారో ఎప్పుడు సీమాంధ్ర ప్రజలను అనుగ్రహిస్తారో...అని ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏమయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకోసం ఇంతగా ఆరాటపడేవాళ్ళు దొరకడం వారి అదృష్టమే!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.