రాష్ట్ర విభజనపై పార్టీల వికృత రాజకీయ క్రీడలు-2

Publish Date:Nov 12, 2013

Advertisement

 

ఇక సీమాంధ్రలో పరిస్థితి దీనికి భిన్నంగాలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్దీ క్రమంగా కిరణ్ మేలి ముసుగులు తొలగిపోతుంటే, ఆయన సమైక్యవాదం ఎటువంటిదో ప్రజలకీ అర్ధం అవుతోంది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించబడుతున్న జగన్మోహన్ రెడ్డి, మొదట సమైక్యవాదం బలంగా వినిపించి, ఇప్పుడు కీలకమయిన తరుణంలో కాడి పక్కన పడేసి ఓదార్పు యాత్రలు, దేశాటనలు అనడం కూడా ఈ రాజకీయ క్రీడలో భాగమే.

 

వచ్చే ఎన్నికలలో యుపీయే కూటమి మెజార్టీ సాధిస్తే, కేంద్రంలో తమకు అతను మద్దతు ఇస్తాడని కాంగ్రెస్ భావిస్తే, అతను దేశాటన చేసి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాలను కూడగట్టే పనిలో ఉన్నాడు. అయితే అది విభజన సజావుగా సాగేందుకు ఎంచుకొన్న మార్గమో లేక తనపై వస్తున్న ఆరోపణలను తప్పించుకొనేందుకు ఉపాయమో ఆయనకే తెలియాలి.

 

ఇక తెదేపా రాష్ట్ర విభజన ప్రక్రియలో నిత్యం మారుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ తదనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకొంటూ ముందుకు సాగుతోంది తప్ప నేటికీ రాష్ట్ర విభజనపై నిర్దిష్టంగా మాట్లాడటం లేదు.

 

చివరికి మజ్లిస్ వంటి చిన్న పార్టీ కూడా రాష్ట్ర విభజనతో తన వోటు బ్యాంక్ చీలిపోతుందనే ఆలోచనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతూ వచ్చి, విభజన అనివార్యమని భావించి తన సమైక్యవాదం వలన తనకే నష్టమని గ్రహించగానే ఈరోజు అఖిలపక్ష సమావేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని చెప్పి, వీలయితే రాయల తెలంగాణా ఏర్పాటు చేయమని ఒక ఉచిత సలహా కూడా పడేసింది.

 

ఈవిషయంలో మొదటి నుండి ఖరాఖండిగా ఉన్నవి ఒక్క లెఫ్ట్ పార్టీలేనని చెప్పక తప్పదు. సీపీఎం నేటికీ రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూనే ఉంది. సీపీఐ తెలంగాణా ఏర్పాటుని అంతే ఖచ్చితంగా సమర్దిస్తూ వచ్చింది.

 

అయితే ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో గానీ తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పరిచే స్థితిలో లేవు గనుకనే అంత నిక్కచ్చిగా ఉండగలిగాయని చెప్పవచ్చును. అంతే కాక వాటి వైఖరి వలన ఆ రెండు పార్టీలకి కొత్తగా వచ్చేలాభం కానీ నష్టం గానీ ఏమీ ఉండదు కూడా. లేకుంటే అవీ ఇతర పార్టీలలాగే వ్యవహరించేవేమో!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.