LATEST NEWS
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేంద్రంలో పార్లమెంటరీ బిల్లుల ఆమోదం కోసం, ముఖ్యంగా రాజ్యసభలో సంఖ్యాబలం ప్రాధాన్యత దృష్ట్యా వైసీపీ ఎంపీల మద్దతు అవసరమై కేంద్ర ప్రభుత్వమే జగన్ను ఢిల్లీకి ఆహ్వానించిందనే ప్రచారం ఒకవైపు నడుస్తోంది. అయితే, మరోవైపు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు కేసుల విచారణల భయాల నుంచి ఊరట పొందడానికి జగనే స్వయంగా ఢిల్లీ తలుపులు తడుతున్నారనే వాదన గట్టిగా వినబడుతోంది. ఈ అంశంపై టోన్ న్యూస్లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది.
క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యేక ఆహ్వానమూ లేదని, ఇది కేవలం వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సాగిస్తున్న వ్యూహాత్మక ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. వ్యూహాత్మక కోణం రాజకీయ పరిణామాలుఈ పరిణామాల వెనుక వైసీపీకి చెందిన స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ శ్రేణులలో నైతిక బలం, విశ్వాసం గణనీయంగా సన్నగిల్లాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో "తమకు కేంద్రంలో బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయని" చూపించడం ద్వారా పార్టీ నాయకులకు, కేడర్కు మానసిక భరోసా కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
అలాగే, రాష్ట్రంలో మారిన అధికార సమీకరణలు, చట్టపరమైన దర్యాప్తులు వేగవంతమయ్యే సూచనలు కనిపించడంతో, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతం ఇవ్వడం వైఎస్సార్సీపీకి ఒక రక్షణ కవచంగా అవసరమైంది.మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ జనసేనలు అత్యంత కీలకమైన, బలమైన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ మరియు పరిపాలనా స్థిరత్వంపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇటువంటి సమర్థవంతమైన కూటమి బంధం ఉన్న వేళ, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వైఎస్సార్సీపీ మద్దతుపై ఆధారపడాల్సిన రాజకీయ అవసరం ఎంతమాత్రం లేదు.
తమ నమ్మకమైన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల విశ్వాసానికి భంగం కలిగించేలా జగన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదా దగ్గరయ్యే ఆలోచన బీజేపీ అధిష్ఠానానికి లేదని రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి రాజకీయ ఊరట లేదా హామీ లభించకపోతే, వైసీపీ తన ప్రాధాన్యతను ఉనికిని నిలబెట్టుకోవడం మరింత సంక్లిష్టంగా మారుతుంది.
కేవలం ప్రచారాల ద్వారా కేడర్ను ఎంతో కాలం నిలబెట్టుకోవడం సాధ్యపడదు. అంతేకాకుండా, రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకోవడం వల్ల ప్రజల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది. ఢిల్లీ స్థాయిలో వ్యూహాత్మక ప్రయోజనం దక్కకపోతే, వైసీపీలో అంతర్గత అసంతృప్తి పెరిగి, నాయకుల వలసలు వేగవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీర్ఘకాలంలో రాజకీయంగా పుంజుకోవడం వైసీపీకి అత్యంత కష్టతరమైన సవాలుగా మారనుంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి.
YS Jagan Delhi Tour, Jagan Meets PM Modi, AP Political Analysis, YCP BJP Alliance Rumors,
YS Jagan PM Modi Appointment, AP NDA Government, CM Chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీది నిస్సందేహంగా విలక్షణ శైలి. ఆ పార్టీ రాజకీయం అంతా దూషణలు, ప్రతీకారాలతో నిండి ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం.. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నేతలంతా బేడ్ మౌతింగ్ చేసిన వాళ్లే కావడం గమనార్హం, గతంలో అసభ్య భాషలో దూషణలు, అనుచిత వ్యాఖ్యలూ చేసిన వాళ్లనే ఆ పార్టీ అధినేత జగన్ ప్రోత్సహించేవారు. అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
అయితే వైసీపీలోని పలువురు సీనియర్లు మాత్రం ఈ తరహా ధోరణి పట్ల, ఆ ధోరణిని ప్రోత్సహిస్తున్న జగన్ పట్ల ఒకింత అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారుర. గత కొంత కాలంగా, పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాకుండా మీడియాతో మాట్లాడే సందర్భంగా కూడా వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు పరోక్షంగానే అయినా చాలా స్పష్టంగా నోటి దురుసు కూడదని చెబుతున్నారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, సభ్యత మరచి మాట్లాడటం పార్టీకి నష్టమని అన్యాపదేశంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితి ఇలా ఉండగా, వైసీపీ కీలక నేత, జగన్ కు సన్నిహితుడు అయిన పెద్ది రెడ్డి అయితే.. దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు తన నోటి నుంచి రావనీ, హుందాతనంతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. అక్కడితో ఆకకుండా తమ పార్టీలోని కొందరు నేతల్లా బాధ్యతారహితంగా, మర్యాద తప్పి మాట్లాడటం తనకు చేతకాదని పరోక్షంగా అంబటి రాంబాబు వంటి నాయకుల తీరును తప్పుపపట్టారు. చూడాలి మరి పెద్దరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధినేత జగన్ ఎలా రియాక్టౌతారో?
YCP, YS Jagan Mohan Reddy, YSRCP Firebrand, Badmouth Leaders, AP Politics, Telugu One
ఏపీలో వైసీపీ రాజకీయం వింత పోకడలు పోతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి జోగి రమేష్ లపై ఇటీవల నమోదైన కేసులన్నీ వారి వారి సొంత విషయాలకు సంబంధించినవి. అయితే ఈ మూడు అంశాలనూ కూడా రాజకీయ వేధింపులంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కేసులకు కారణం ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలే కారణమని విస్పష్టంగా తెలుస్తున్నా.. అవన్నీ రాజకీయ వేధింపుల కారణంగా నమోదైన కేసులే అని కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందుగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు విషయానికి వస్తే.. ఆయన కుమారుడు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించడానికి బదులు.. సిదిరి అప్పలరాజు.. ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అరెస్టయ్యారు. అంతకు ముందు జగన్ సిదిరి అప్పలరాజుకు మద్దతుగా చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిష్ఠను సైతం మసకబార్చాయి.
ఆ తరువాత వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే.. ఆయన వైసీపీ హయాంలో తన పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు భూమిని బోగస్ డెత్ సర్టిఫికెట్, బోగస్ వారసులను సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ఆ భూమి యజమాని తను బతికి ఉండగానే.. తన డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన భూమిని అన్యాయంగా తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు. అజ్జాతం నుంచే హైకోర్టును ఆశ్రయించి రాజకీయ వేధింపులతోనే కేసు పెట్టారంటూ ముందస్తు బెయిలు కోరారు. కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. కాగా తమ్మినేని సీతారాం కుటుంబం భూ కబ్జా విషయంలో జగన్ మౌనం ఆయనకు మద్దతుగా నిలిచారన్న సంకేతాన్ని ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు
ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల 11 మందిపై స్వయానా ఆయన కోడలే వరకట్నం కోసంశారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపుల కేసు పెట్టారు. వీరి విషయంలో కూడా జగన్ ఇంత వరకూ స్పందించడం కానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయకుండా పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. ఈ తరహా సంఘటనలు జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం వైసీపీకి రివాజుగా మారింది. సొంత సమస్యలు, తప్పుల కారణంగా క్రిమినల్ కేసుల్లో బుక్కై వాటికి రాజకీయ రంగు పులమడానికి వైసీపీ చేసే ప్రయత్నాలు ప్రజలలో ఆ పార్టీ, ఆ పార్టీ నయకత్వంపై వ్యతిరేకత పెరగడానికే దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత తప్పులు, కుటుంబ కలహాలతో కేసుల్లో ఇరుక్కుని, వాటిని రాజకీయ వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు ఏ మాత్రం హర్షించరని చెబుతున్నారు.
YSRCP leaders cases, AP political news, Jogi Ramesh family dispute, Appalaraju case, Tammineni family issue
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)శ్రీరాముడు(Sriramudu)గా చేసిన పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్(adipurush). మూవీ హిట్ కాకపోయినా 'ఆదిపురుష్' ని మర్చిపోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉంది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు, అభిమానుల ఆరాధ్య దైవం ప్రభాస్. సుమారు 600 కోట్ల బిగ్ బడ్జెట్తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఎంతో ధీమా వ్యక్తం చేసింది. అయితే 2023 జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా చిత్రంలో శ్రీరాముడు, లంకేశ్వరుడు, ఆంజనేయుడి పాత్రల చిత్రీకరణ మరియు సంభాషణలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదానికి సరిగ్గా కేంద్ర బిందువుగా నిలిచారు బాలీవుడ్ ప్రముఖ రచయిత మనోజ్ ముంతాషిర్.
ముఖ్యంగా లంకా దహనం సమయంలో హనుమంతుడు చెప్పే "గుడ్డ నీ బాబుది, చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుదే" అనే మాస్ డైలాగ్ శ్రీరామ భక్తులని, ప్రభాస్ అభిమానులని తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది. ఒక పవిత్రమైన ఇతిహాసంలో దైవ సమానుడైన ఆంజనేయుడి నోటి వెంట ఇలాంటి దిగజారిన, పరుష పదజాలాన్ని ఉపయోగించడం పట్ల హిందూ సంఘాలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. వివాదం మొదలైన తొలి రెండు రోజులు, అంటే జూన్ 16 నుండి జూన్ 18 మధ్య కాలంలో, తన తప్పును ఒప్పుకోవడానికి మనోజ్ ముంతాషిర్ సుముఖంగా లేరు. జాతీయ టీవీ ఛానెళ్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, "హనుమంతుడు దేవుడు కాదు, కేవలం ఒక భక్తుడు మాత్రమే" అని, గ్రామాల్లో కథలు చెప్పే శైలినే తాము వాడామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
రచయిత మనోజ్ ముంతాషిర్ తీసుకున్న ఈ మొండి వైఖరి పరిస్థితులను మరింత దిగజార్చింది. అభిమానుల ఆగ్రహం హద్దులు దాటి చంపేస్తామంటూ లేఖల ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కవర్ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చివరికి ఈ సున్నితమైన అంశంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో చిత్రయూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు. దాంతో థియేటర్లలో ఉన్న ప్రింట్లలో ఆ వివాదాస్పద సంభాషణలను మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ ముంతాషిర్ రెండు చేతులు జోడించి ప్రజలకు, భక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు.
Also read: అల్లు అర్జున్ కి పోటీగా ధనుష్.. పక్కాగా విజయాన్ని అందుకుంటాడా!
వివాదం ముగిసినప్పటికీ, ఆ ఘటన తన జీవితంలో కలిగించిన తీవ్ర భావోద్వేగ ప్రభావాన్ని మనోజ్ ముంతాషిర్ తర్వాత ఇంటర్వ్యూలలో బహిరంగంగా పంచుకున్నారు. ఆదిపురుష్ సినిమాను డిఫెండ్ చేస్తూ మాట్లాడటం తన జీవితంలో చేసిన 100 శాతం అతిపెద్ద పొరపాటని, అది అహంకారంతో చేసిన తప్పిదమని ఆయన అంగీకరించారు. "ఆ రోజుల్లో నేను ఎంతో ఏడ్చాను, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిపురుష్ కి ఓం రౌత్ దర్శకుడు. కృతి సనన్ సీతమ్మ వారుగా కనిపించారు.
Prabhas, Adipurush, Manoj Muntashir
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),స్టార్ హీరో ధనుష్(Dhanush)..సినిమాల పరంగా ఈ ఇద్దరి మధ్య పోటీ గురించి చెప్పుకునే కన్నా, సినీ కళామ తల్లికి దొరికిన ముద్దు బిడ్డలు. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా తమదైన నటనతో మెస్మరైజ్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరకీ సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ధనుష్ తన 55 వ చిత్రం 'ఓం' (OM). ' అమరన్' చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న రాజ్కుమార్ పెరియసామి దర్శకుడు. దీంతో 'ఓం' పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ 'ఓం - ఫస్ట్ స్ట్రైక్' పేరుతో విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ సాధిస్తోంది. దాదాపు 50 మిలియన్లకు పైగా వ్యూస్ను అత్యంత వేగంగా సాధించి రికార్డు స్థాయి క్రేజ్ను సొంతం చేసుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యం, సాయుధ తిరుగుబాటు, ఆయుధాల విస్ఫోటనం మరియు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ను అందించడమే కాకుండా, ధనుష్ రఫ్ అండ్ ఇంటెన్స్ మాస్ లుక్తో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ కి హామీ ఇస్తోంది.
ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్లో భారతీయ చిత్రసీమలోని దిగ్గజ నటులు భాగం కావడం మరింత ఆకర్షణగా మారింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత (2013లో వచ్చిన 'ప్రొప్రైటర్స్: కమ్మత్ & కమ్మత్' తర్వాత) ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ మళ్లీ ఒకే తెరపై సాక్షాత్కరించనుండటంతో దక్షిణాది చిత్రసీమ అంతటా విశేష ఆసక్తి నెలకొంది. దీనికితోడు, అద్భుతమైన నటనతో అలరించే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మరియు ఎనర్జిటిక్ గ్లామర్ క్వీన్ శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండటంతో ఈ సినిమా స్టార్ కాస్ట్ మరింత గ్లామరస్గా, పవర్ఫుల్గా మారింది. రాజ్కుమార్ పెరియసామి అందించిన ఇంటెన్స్ నెరేటివ్ ఆధారంగా రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రతీ ఒక్కరి పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది.
Also read: RC 17 అప్ డేట్ ఇదేనా!. మెగా ఫ్యాన్స్ నిరుత్సాహం
సాయి అభ్యంగ్కర్ ఈ చిత్రానికి పవర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలను అందిస్తున్నారు. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ బాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రేమికులు పుష్ప ని మించి ఓం సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.
Dhanush, Allu Arjun, OM, Pushpa2
మస్సా మస్సా అంటూ ఆడుతూ పాడుతూ 'పెద్ది'(Peddi)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). అభిమానులు, ప్రేక్షకులకైతే స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లోపాలు ఉన్నా చరణ్ అనే కట్ అవుట్ చేసిన వన్ మాన్ షో, పెద్ది క్యారక్టర్ కోసం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దొరికిందని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి క్రమం క్రమంగా పెద్ది నుంచి సుకుమార్ తో చెయ్యబోయే చరణ్ నెక్స్ట్ మూవీపై పడింది.
‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అభిమానుల్లో ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ ప్రతి సీన్ని ఎంతో పర్ఫెక్ట్గా తెరకెక్కించేందుకు సమయం తీసుకుంటారనే పేరుంది. అల్లు అర్జున్తో చేసిన ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ ప్రాజెక్ట్లకు దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టడం, అది బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్లకు పైగా వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసినప్పటికీ, RC17కి అంత సమయం పడితే రిలీజ్ ఏకంగా 2027 లేదా 2028కి వెళ్తుందేమోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Also read: మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటిటిలో ట్రెండింగ్ అవుతుంది.. అసలు మిస్ అవ్వకండి
అయితే మైత్రీ మూవీ మేకర్స్ కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, అనవసరమైన ఊహాగానాలకు బ్రేక్ పడే సమయం వచ్చింది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ ఫైనల్ స్క్రిప్ట్ను పూర్తిస్థాయిలో లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి పీరియాడిక్ లేదా మాఫియా బ్యాక్డ్రాప్ లేకుండా, రెండు భాగాలుగా కాకుండా ఒకే ఒక్క పవర్ ప్యాక్డ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీనిని తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్లో గ్రాండ్గా లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; రంగస్థలంలో ‘చిట్టిబాబు’ పాత్రను మించిపోయే సరికొత్త అవతారంలో చరణ్ను చూపించేందుకు సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో సిద్ధమవుతున్నారు.
Ram Charan, Sukumar, RC 17
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అయ్యే హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్టే తాడిని తన్నే వాడుంటే తలని తన్నేవాడు ఉంటాడనే సామెతని నిరూపిస్తూ ఒక దాన్ని మించిన ఒక చిత్రం ఓటిటి లో తన సత్తా చాటుతున్నాయి.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిత్యం కొత్త చరిత్రని సృష్టిస్తుంటాయి. ఆ వరుసలోనే వచ్చిన అత్యంత ఆసక్తికరమైన హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కగా థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆధునిక కాలంలో కూడా కలర్ సినిమా కాకుండా, ఒక పీరియాడిక్ కథను మైండ్ బ్లాకింగ్ మోడ్లో కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో రూపొందించడం సినిమా మేకర్స్ చేసిన అతిపెద్ద సాహసంగా చెప్పవచ్చు. 139 నిమిషాల వ్యవధి కలిగిన ఈ సినిమా ప్రేక్షకులకు ప్రతి నిమిషం ఒక విభిన్నమైన, రోమాంచిత అనుభూతిని అందిస్తుంది.
థియేటర్లలో విశేష ఆదరణ పొందిన 'భ్రమయుగం' చిత్రం మార్చి 15 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో ప్రసారం అవుతూ ఓటీటీలో కూడా ట్రెండింగ్లో దూసుకుపోతోంది. క్రిస్టో జేవియర్ అందించిన గూస్బంప్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. మీరు కనుక సస్పెన్స్, హారర్, మైండ్ కేమ్, మిస్టరీ జానర్ సినిమాలనుష్టపడే వారైతే, సోనీ లివ్లో అందుబాటులో ఉన్న ఈ పీరియాడిక్ బ్లాక్ అండ్ వైట్ మాస్టర్పీస్ను ఖచ్చితంగా మిస్ కాకుండా వీక్షించాల్సిందే.
కథాంశం విషయానికి వస్తే, 17వ శతాబ్దపు మలబారు తీర ప్రాంత నేపథ్యంతో సాగుతుంది. ఒక రాజ్యంలో కులపాటలు పాడుకునే దేవన్ అనే గాయకుడు యాదృచ్ఛికంగా అడవిలో దారి తప్పి, కుడుమన్ పొట్టి అనే ఒక వింతైన, అహంకారియైన జమీందారు మనవడి మనాలోకి చేరుకుంటాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవన్కు అనుకోని వింత పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా, అతనికి ఆ ఇంట్లో విధి ఆడే వింత ఆట స్పష్టంగా కనిపిస్తుంది. అసలు కుడుమన్ పొట్టి ఎవరు, ఆ మనాతో ఉన్న రహస్యమేమిటి, దేవన్ అక్కడ నుంచి సురక్షితంగా బయటపడగలిగాడా అనేదే ఈ సినిమా యొక్క అసలు ఉత్కంఠభరిత కథనం.
Also read: Triptii dimri: నా ప్రతిభ అందులో లేదంటున్న త్రిప్తి దిమ్రి..జెన్ జీ బ్యాచ్ వింటే ఏమవుతారో
మమ్ముట్టి అద్భుతమైన నటనను కనబరిచారు. కుడుమన్ పొట్టి క్యారక్టర్ లో ఆయన చూపించిన క్రూరత్వం, శారీరక భాష, నవ్వు, మాట్లాడే తీరు ప్రేక్షకులను ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని ప్రకటించింది. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ప్రధానంగా కేవలం మూడే మూడు ముఖ్య పాత్రలతో కథను నడిపించడం, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోకుండా కట్టిపడేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం 27.73 కోట్ల బడ్జెట్తో అత్యంత నాణ్యమైన సాంకేతిక విలువలతో రూపొందింది.
Mammotty, Bramayugam
యానిమల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించి జెన్ జీ బ్యాచ్ కి ఓవర్ నైట్ స్టార్ డమ్ అంటే ఎలా ఉంటుందో చాటి చెప్పిన భామ త్రిప్తి దిమ్రి(Triptii Dimri). ఎంతో మంది యువత కలల రాణి కూడా. ఇప్పుడు ఆ పోస్ట్ ని మరింత పెంచుకునేలా పాన్ ఇండియా రెబల్ స్టార్ తో స్పిరిట్ లో జత కడుతుంది.
రీసెంట్ గా త్రిప్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'యానిమల్' సాధించిన భారీ విజయం నా జీవితంలో మరియు కెరీర్లో ఒక పెద్ద మలుపు. ఆ బ్లాక్బస్టర్ విజయం ఇండస్ట్రీలో ఎంతో స్వేచ్ఛని ప్రసాదించింది. యానిమల్' విడుదలకి ముందు వరకు ఇండస్ట్రీలో నాలోని నటనని, అసలైన ప్రతిభని నిరూపించుకోవడానికి సరైన అవకాశాల కోసం నిరంతరం ఎదురుచూడాల్సి వచ్చేది.అయితే ఆ ఒక్క సినిమా విజయం తర్వాత చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతలకు నాపై నమ్మకం నూటికి నూరు శాతం పెరిగింది.ఎన్నో వైవిధ్యమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. కేవలం పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే భయం లేదా ఆందోళనతో కాకుండా, ఇప్పుడు తనకు మనస్ఫూర్తిగా నచ్చిన మంచి కథలను మాత్రమే ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ లభించింది.
రాత్రికి రాత్రే పెరిగిన ఈ స్టార్డమ్ను తట్టుకోవడం ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా, వింతగా అనిపించినప్పటికీ, కాలక్రమేణా అలవాటు పడ్డాను. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనూ తలబిరుసుతనం రాకుండా ఎప్పుడూ తన పనిపైనే 100% దృష్టి పెడతానని వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవడం ఎంతో మేలు చేసింది. ఎందుకంటే ఎల్లప్పుడూ వినయంగా, ఒదిగి ఉండేలా, భూమిపై కాలు మోపి నిలబడేలా చేస్తుందని అన్నారు.
Also read: నాకు కేవలం అదే ముఖ్యం... జయకృష్ణ వ్యాఖ్యలు వైరల్
ప్రీవియస్ మూవీ 'ఓ రోమియో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కమర్షియల్ విజయాన్ని సాధించలేకపోయింది. కానీ నా వ్యక్తిగత వైఫల్యంగా ఎప్పుడూ భావించను . ప్రతి నటుడూ లేదా నటి తమ క్యారక్టర్ కి 100 శాతం ప్రాణం పోసి, రక్తాన్ని ధారపోసి నటిస్తారు , . కానీ ప్రతిసారీ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవచ్చు.సినిమా విడుదల సమయం, అంచనాలు లేదా ఇతర పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఫలితాలు తేడా కొడతాయని వివరించారు.
Triptii Dimri, Prabhas, Spirit
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు. భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం. భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం, కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా, బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు. బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే..
మాజీ ప్రేమికుల గురించి..
భాగస్వామికి గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది. అందుకే ఒక కొత్త బంధం మొదలుపెట్టాక గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది. దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది.
సొంత వ్యక్తుల చెడుగుణం..
భాగస్వామి స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది. సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇతరుల రహస్యాలు..
ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే.. మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి స్నేహితుల గోప్యతను గౌరవించాలి. వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు.
ఇష్టాలు, అయిష్టాలు..
భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే.. ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి, చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు.
సోషల్ మీడియా పాస్వర్డ్ లు..
నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్వర్డ్లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్ అవసరం. ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్వర్డ్లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు.
సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.
*రూపశ్రీ
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు.. కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా? అని. అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు. దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు. ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే..
సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన..
కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు. దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కొంటున్నట్లయితే కోడలు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం.
ఆరోగ్య సంబంధ విషయాలు..
అత్తల తరానికి, ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి. వారి జీవనశైలి, ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు. ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు. మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం, పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి.
విద్య, ఉద్యోగం..
నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది. కుటుంబ అంచనాలకు, వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు.
వ్యక్తిగత హద్దులు..
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా, హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది. కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు. కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.
ప్రొటెక్షన్, లీగల్ రైట్స్..
ఆడపిల్ల భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.
*రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించి, విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి. కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు. ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
సోమరితనం..
కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది. కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది. అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా, దాన్ని వదిలిపెట్టడం మంచిది.
పట్టుదల..
పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి, పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు. దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది.
ప్రవర్తన..
మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు, వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.
*రూపశ్రీ.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేంద్రంలో పార్లమెంటరీ బిల్లుల ఆమోదం కోసం, ముఖ్యంగా రాజ్యసభలో సంఖ్యాబలం ప్రాధాన్యత దృష్ట్యా వైసీపీ ఎంపీల మద్దతు అవసరమై కేంద్ర ప్రభుత్వమే జగన్ను ఢిల్లీకి ఆహ్వానించిందనే ప్రచారం ఒకవైపు నడుస్తోంది. అయితే, మరోవైపు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు కేసుల విచారణల భయాల నుంచి ఊరట పొందడానికి జగనే స్వయంగా ఢిల్లీ తలుపులు తడుతున్నారనే వాదన గట్టిగా వినబడుతోంది. ఈ అంశంపై టోన్ న్యూస్లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది.
క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యేక ఆహ్వానమూ లేదని, ఇది కేవలం వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సాగిస్తున్న వ్యూహాత్మక ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. వ్యూహాత్మక కోణం రాజకీయ పరిణామాలుఈ పరిణామాల వెనుక వైసీపీకి చెందిన స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ శ్రేణులలో నైతిక బలం, విశ్వాసం గణనీయంగా సన్నగిల్లాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో "తమకు కేంద్రంలో బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయని" చూపించడం ద్వారా పార్టీ నాయకులకు, కేడర్కు మానసిక భరోసా కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
అలాగే, రాష్ట్రంలో మారిన అధికార సమీకరణలు, చట్టపరమైన దర్యాప్తులు వేగవంతమయ్యే సూచనలు కనిపించడంతో, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతం ఇవ్వడం వైఎస్సార్సీపీకి ఒక రక్షణ కవచంగా అవసరమైంది.మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ జనసేనలు అత్యంత కీలకమైన, బలమైన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ మరియు పరిపాలనా స్థిరత్వంపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇటువంటి సమర్థవంతమైన కూటమి బంధం ఉన్న వేళ, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వైఎస్సార్సీపీ మద్దతుపై ఆధారపడాల్సిన రాజకీయ అవసరం ఎంతమాత్రం లేదు.
తమ నమ్మకమైన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల విశ్వాసానికి భంగం కలిగించేలా జగన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదా దగ్గరయ్యే ఆలోచన బీజేపీ అధిష్ఠానానికి లేదని రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి రాజకీయ ఊరట లేదా హామీ లభించకపోతే, వైసీపీ తన ప్రాధాన్యతను ఉనికిని నిలబెట్టుకోవడం మరింత సంక్లిష్టంగా మారుతుంది.
కేవలం ప్రచారాల ద్వారా కేడర్ను ఎంతో కాలం నిలబెట్టుకోవడం సాధ్యపడదు. అంతేకాకుండా, రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకోవడం వల్ల ప్రజల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది. ఢిల్లీ స్థాయిలో వ్యూహాత్మక ప్రయోజనం దక్కకపోతే, వైసీపీలో అంతర్గత అసంతృప్తి పెరిగి, నాయకుల వలసలు వేగవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీర్ఘకాలంలో రాజకీయంగా పుంజుకోవడం వైసీపీకి అత్యంత కష్టతరమైన సవాలుగా మారనుంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి.
YS Jagan Delhi Tour, Jagan Meets PM Modi, AP Political Analysis, YCP BJP Alliance Rumors,
YS Jagan PM Modi Appointment, AP NDA Government, CM Chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీది నిస్సందేహంగా విలక్షణ శైలి. ఆ పార్టీ రాజకీయం అంతా దూషణలు, ప్రతీకారాలతో నిండి ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం.. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నేతలంతా బేడ్ మౌతింగ్ చేసిన వాళ్లే కావడం గమనార్హం, గతంలో అసభ్య భాషలో దూషణలు, అనుచిత వ్యాఖ్యలూ చేసిన వాళ్లనే ఆ పార్టీ అధినేత జగన్ ప్రోత్సహించేవారు. అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
అయితే వైసీపీలోని పలువురు సీనియర్లు మాత్రం ఈ తరహా ధోరణి పట్ల, ఆ ధోరణిని ప్రోత్సహిస్తున్న జగన్ పట్ల ఒకింత అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారుర. గత కొంత కాలంగా, పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాకుండా మీడియాతో మాట్లాడే సందర్భంగా కూడా వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు పరోక్షంగానే అయినా చాలా స్పష్టంగా నోటి దురుసు కూడదని చెబుతున్నారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, సభ్యత మరచి మాట్లాడటం పార్టీకి నష్టమని అన్యాపదేశంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితి ఇలా ఉండగా, వైసీపీ కీలక నేత, జగన్ కు సన్నిహితుడు అయిన పెద్ది రెడ్డి అయితే.. దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు తన నోటి నుంచి రావనీ, హుందాతనంతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. అక్కడితో ఆకకుండా తమ పార్టీలోని కొందరు నేతల్లా బాధ్యతారహితంగా, మర్యాద తప్పి మాట్లాడటం తనకు చేతకాదని పరోక్షంగా అంబటి రాంబాబు వంటి నాయకుల తీరును తప్పుపపట్టారు. చూడాలి మరి పెద్దరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధినేత జగన్ ఎలా రియాక్టౌతారో?
YCP, YS Jagan Mohan Reddy, YSRCP Firebrand, Badmouth Leaders, AP Politics, Telugu One
ఏపీలో వైసీపీ రాజకీయం వింత పోకడలు పోతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి జోగి రమేష్ లపై ఇటీవల నమోదైన కేసులన్నీ వారి వారి సొంత విషయాలకు సంబంధించినవి. అయితే ఈ మూడు అంశాలనూ కూడా రాజకీయ వేధింపులంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కేసులకు కారణం ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలే కారణమని విస్పష్టంగా తెలుస్తున్నా.. అవన్నీ రాజకీయ వేధింపుల కారణంగా నమోదైన కేసులే అని కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందుగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు విషయానికి వస్తే.. ఆయన కుమారుడు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించడానికి బదులు.. సిదిరి అప్పలరాజు.. ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అరెస్టయ్యారు. అంతకు ముందు జగన్ సిదిరి అప్పలరాజుకు మద్దతుగా చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిష్ఠను సైతం మసకబార్చాయి.
ఆ తరువాత వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే.. ఆయన వైసీపీ హయాంలో తన పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు భూమిని బోగస్ డెత్ సర్టిఫికెట్, బోగస్ వారసులను సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ఆ భూమి యజమాని తను బతికి ఉండగానే.. తన డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన భూమిని అన్యాయంగా తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు. అజ్జాతం నుంచే హైకోర్టును ఆశ్రయించి రాజకీయ వేధింపులతోనే కేసు పెట్టారంటూ ముందస్తు బెయిలు కోరారు. కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. కాగా తమ్మినేని సీతారాం కుటుంబం భూ కబ్జా విషయంలో జగన్ మౌనం ఆయనకు మద్దతుగా నిలిచారన్న సంకేతాన్ని ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు
ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల 11 మందిపై స్వయానా ఆయన కోడలే వరకట్నం కోసంశారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపుల కేసు పెట్టారు. వీరి విషయంలో కూడా జగన్ ఇంత వరకూ స్పందించడం కానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయకుండా పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. ఈ తరహా సంఘటనలు జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం వైసీపీకి రివాజుగా మారింది. సొంత సమస్యలు, తప్పుల కారణంగా క్రిమినల్ కేసుల్లో బుక్కై వాటికి రాజకీయ రంగు పులమడానికి వైసీపీ చేసే ప్రయత్నాలు ప్రజలలో ఆ పార్టీ, ఆ పార్టీ నయకత్వంపై వ్యతిరేకత పెరగడానికే దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత తప్పులు, కుటుంబ కలహాలతో కేసుల్లో ఇరుక్కుని, వాటిని రాజకీయ వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు ఏ మాత్రం హర్షించరని చెబుతున్నారు.
YSRCP leaders cases, AP political news, Jogi Ramesh family dispute, Appalaraju case, Tammineni family issue
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..!
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు.
ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు:
✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి?
✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది?
✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి?
✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి?
✅ ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి?
✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు?
✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి?
✅ యాంటీబయాటిక్స్ను ఎలా వాడాలి?
✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు
మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..
ఉప్పు డేంజర్ ఇందుకే..
ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి. గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది. దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు.
బ్రెడ్, బన్.. బేకరీ..
రోజూ బ్రెడ్ లేదా బన్ వంటివి తినేవారు చాలామంది ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు. కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం, సుగర్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా, బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది.
వీటిలో చాలా ఎక్కువ..
టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్విచ్ స్ప్రెడ్లు, ప్యాక్ చేసిన చట్నీలు, ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు.. వీటి షెల్ఫ్ లైఫ్ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్లు, క్రాకర్లు, బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్లో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు.
చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్లు, ఫ్లేవర్డ్ బటర్ లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది. అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం, టెక్చర్ కోసం కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరంలో కొవ్వు కరిగించే ఆయుర్వేదం సూప్.. రోజులో ఒక్కసారి తాగినా చాలు..!
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు. కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి పొట్ట భాగం, మరికొందరికి పిరుదుల భాగం, ఇంకొదరికి తొడలు, మరికొందరికి తొడలకు ఇరుప్రక్కలా.. ఇలా చాలా ప్రదేశాలలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది. నేటికాలంలో దీన్ని ఫ్యాట్ అని కూడా అంటారు. అయితే కారణాలు ఏవైనా.. శరీరంలో పెరిగిన కొవ్వును కరిగించడం అంత సులభమేమీ కాదు.. చాలామంది జిమ్ కు వెళ్తారు, వాకింగ్ చేస్తారు, కడుపు కూడా కాల్చుకుంటారు. కానీ ఫలితం పెద్దగా ఉండదు. అయితే శరీరంలో కొవ్వు కరిగించడానికి ఆయుర్వేదం చాలా చక్కని మార్గాన్ని సూచించింది. అదే ఆయుర్వేదం సూప్ . ఈ సూప్ ను రోజులో కనీసం ఒక్క పూట అయినా తీసుకుంటే శరీరంలో కొవ్వు మెల్లిగా తగ్గుతుందట. ఆ సూప్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా తాగాలో తెలుసుకుంటే..
శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి, బరువు తగ్గడానికి చాలామంది సలాడ్ ను తింటారు. క్యారెట్, కీర దోస, బీట్రూట్, టమోటా, ఉల్లిపాయ వంటివి సలాడ్ లో భాగంగా పచ్చివి తింటుంటారు. అయితే.. ఆయుర్వేదం సూప్ ఇంకా చక్కని ఫలితాలు ఇస్తుంది.
ఆయుర్వేదం సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..
పొట్లకాయ,
బీరకాయ,
సొరకాయ,
దోసకాయ,
టమోటా,
గుమ్మడికాయ,
క్యారెట్,
బీట్రూట్,
పై చెప్పుకున్న కూరగాయలు అన్నీ ఒక కప్పు వచ్చేలా తీసుకోవాలి.
తయారు చేసే విధానం..
కూరగాయలను ముక్కలుగా తీసుకున్నాక.. ఆ ముక్కలను పాత్రలోవేసి తగినన్ని నీరుకలిపి చిన్నమంట పైన మరిగించాలి.
ముక్కలు మరుగుతూవుండగా అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరియాలపొడి, సైంధవలవణం, తగినంత కలుపుకోవాలి.
ముక్కలు బాగా ఉడికినతరువాత దించి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
ఎలా తీసుకోవాలి?
ఉడికించిన ముక్కలు గోరు వెచ్చగా అయిన తరువాత మొదట కూర ముక్కలను తినాలి, ఆ తర్వాత కూర ముక్కలు ఉడికించిన నీటిని సూపులా తాగాలి.
ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో అదనంగా ఒకగ్రాము కూడా కొవ్వు పెరగదు.. పైగా ఇందులో వాడిన కూరగాయలలో నీటి శాతం, ఫైబర్ శాతం మెరుగ్గా ఉన్నవే.. ఈ కారణంగా ఈ సూప్ తీసుకోవడం వల్ల పొట్ట కూడా కరుగుతుంది.
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు, రక్తం శుద్దిగా లేకుండా పదే పదే మొటిమలు, గుల్లలు, పొక్కులు కడుతున్నవారు.. ఈ సూపును తీసుకుంటే మంచిరక్తం ఏర్పడుతుంది, రక్తం శుద్ది అవుతుంది, చర్మం కూడా చాలా మెరుగ్గా మారుతుంది.
*రూపశ్రీ.
