మేమెంతో మాకంత అయ్యే పనేనా?

తెలంగాణలో కులం కుంపట్లు రాజుకుంటున్నాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలుగా మారి పోతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మేమెంతో మాకంత (జనాభా ప్రాతిపదికన పదవుల పంపకం) నినాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో కానీ, రాష్ట్రంలో రెంటికి చెడిన రేవడి చేస్తుందా అనే మీమాంస కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.  ముఖ్యంగా.. ఇటీవల చేపట్టిన మంత్రివర  విస్తరణలో  రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం.. అలాగే, పీసీసీ కార్యవర్గంలో ముందెన్నడూ లేని విధంగా సింహా భాగం (68) శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి హక్కుదారులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి  మొదలైందని అంటున్నారు.  కేవలం పదవులు ఆశించి భంగ పడిన నాయకుల్లోనే కాదు..  ఇప్పటికే పదవుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం  నాయకుల్లోనూ రేపటి గురించిన గుబులు, తమ రాజకీయ భవిష్యత్ గురించిన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.   సామాజిక న్యాయం మంచిదే  కానీ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం, మరీ పూచిక పుల్లలా తీసి పారేశారన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళడం పార్టీకి మంచిద కాదని అంటున్నారు. నిజానికి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాదు.. కాంగ్రెస్ అభిమానులు, విశ్లేషకులలోనూ అదే మాట విన వస్తోంది.    అయితే..  ఇప్పటికిప్పుడు తొందర పడితే ప్రయోజనం ఉండదని, స్థానిక  ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో  మిగిలిన మూడు ఖాళీల భర్తీతో పాటుగా, మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో ఆ క్రతువు కూడ పూర్తయ్యే వరకు ఆగుదామని, రెడ్డి  నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  మరో వంక, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న కులగణన, బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు, పీసీసీలో బడుగులకు పెద్ద పీట..వంటి నిర్ణయాలను అమలు చేసిన రాష్ట్ర నాయకత్వం, చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనక పడిందని అంటున్నారు. నిజానికి.. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మనార్ధం అన్నట్లుగా..  అధిష్టానం ఆదేశాలను పాటించిన  రాష్ట్ర నాయకత్వం బడుగులకు జరిగిన మేలును జనంలోకి తీసుకెళ్ళే విషయంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఫలితంగా, ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏ మేరకు దక్కుతుందనే విషయంలో అనుమానాలు  ఆందోళనలు  వ్యక్తమవుతునాయి.  మరో వంక.. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తున్నదనే ఆందోళన పురుడు పోసుకుంది. ఈ నేపధ్యంలోనే..  ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ ఏర్పాటుతో పాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే..  బడుగుల్లోనూ మున్నూరు కాపు, లంబాడ సహా ఇంకా మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవులు దక్కని  కులాలు చాలానే ఉన్నాయి. దీంతో.. ఆ వర్గాల వారు  మామాటేంటని అడుగుతున్నారు.  అలాగే..  ముస్లిం మైనారిటీలు.. ఇతర మైనార్టీ వర్గాలు కూడా.  దీంతో.. మేమెంతో మాకంత  నినాదం  ఆచరణ  సాధ్యమేనా? అనే అనుమనాలు వ్యక్తంవుతున్నాయి. అనుమానాలు కాదు, సాధ్యం కాదని కూడా అంటున్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే, దీర్ఘ కాలంలో పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఒక విధంగా..  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది  అన్నట్లు అవుతుందా అనే అనుమానాలు, అపశ్రుతులు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మేమెంతో మాకంత  అయ్యే పనేనా? Publish Date: Jun 18, 2025 7:04AM

కుప్పం బాధితురాలికి చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం

  చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఇలాంటి ఘటనలను సహించబోమని ఆమెతో ముఖ్యమంత్రి తెలిపారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో శిరీషా అనే మహిళను చెట్టుకు కట్టేసి సంగతి తెలిసిందే  
కుప్పం బాధితురాలికి  చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం Publish Date: Jun 17, 2025 10:25PM

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి  దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని  కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు.స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప, ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన  ప్రాపగాండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు Publish Date: Jun 17, 2025 9:28PM

ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి

  ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు  అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. వీడియో తీస్తున్న నటి రమ్యశ్రీ సోదరుడు పై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై  కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డారు.  శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన  సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై  హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని  సినీ నటి రమ్యశ్రీ వాపోయారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి Publish Date: Jun 17, 2025 9:11PM

ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు వారి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది నేతల ఫోన్ల ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆయన బీజేపీ నేతల రాజకీయ ప్రణాళికలు, ఆర్థిక సహాయం అందించే వ్యక్తుల గురించి సమాచారం సేకరించి, ఈ వివరాలను అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు చేరవేశారని, భుజంగరావు ఈ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి, రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉపయోగించారని సిట్ విచారణలో తేలింది.ఈ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు
ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు Publish Date: Jun 17, 2025 8:59PM

బనకచర్ల వివాదంలో..ఏపీ, తెలంగాణ వాదనలేంటి?

  బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రత్యేక ఆహ్వానం పలకడం మాత్రమే కాదు వారి వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు తెలంగాణ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దిశగా ఆయన ఇప్పటికే కేంద్రానికి ఎన్నో లేఖలు కూడా రాశారు. ఏపీ ప్రభుత్వ బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వరాదంటూ కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఏపీ సైతం ఒక ప్రెజంటేషన్ ఇచ్చింది. అసలు బనకచర్లకూ తెలంగాణకు సంబంధమేంటి? మేమేమైనా మీ ప్రాజెక్టులు ఆపామా? అయినా ఎగువ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులకే అభ్యంతరాలు తెలపాలి. దిగువన ఉన్న రాష్ట్రం విషయంలో నష్టపోయేవారెవరని? ఏటా  3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయ్. మరి ఆ నీటినే మేం వాడుకోదలుచుకున్నాం. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందించే యత్నం చేస్తున్నామంటోంది ఏపీ. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైన అనంతపురానికి.. నీరందించడం తప్పెలా అవుతుందన్నది- ఏపీ నీటి మంత్రి నిమ్మల సంధిస్తోన్న ప్రశ్నాస్త్రం. ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టును 80 వేల కోట్ల రూపాయలతో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది ఏపీ. పోలవరం లింక్ ప్రాజెక్ట్ అయిన దీనికోసం ఇప్పటికే కేంద్రానికి అనుమతుల కోసం అప్లై చేసుకుంది. గతంలో ఇదే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సైతం సమ్మతించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానంటూ ఆయన అన్న మాటలను తన ప్రెజంటేషన్లో పొందు పరిచారు నిమ్మల. అంతే కాదు కేసీఆర్ ఉదారత గురించి జగన్ చేసిన కామెంట్లను కూడా తన ప్రెజంటేషన్ ద్వారా ప్రస్తావించారు మంత్రి. రాయలసీమ బిడ్డగా చెప్పుకు తిరిగే జగన్.. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది మంత్రి సూటిగా వేస్తోన్న ప్రశ్న. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు విషయంలో అంటున్న మాటేంటో చూస్తే.. కృష్ణాజలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాంటిదో.. గోదావరి జలాల విషయంలో బనకచర్ల అలాంటిదని అంటారు మాజీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలి. మధ్యలో మా ప్రమేయం ఏముంటుందని అంటారాయన. ఈ విషయంలో నిపుణులు అంటోన్న మాటలేంటని చూస్తే.. ఇప్పటికే గోదావరి పై తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులకు చెందిన డీపీఆర్లు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసలు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇది నాడు కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానానికి చెందిన ప్రాజెక్ట్. ప్రధాని మోడీ సైతం నదుల అనుసంధానం చేయాలంటారు. ఇక 1980 నాటి ట్రిబ్యునల్ తీర్పులుగానీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 గానీ ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే ఆ తీర్పులన్నీ నికర జలాలపైన వచ్చినవి. తామేమీ వాటి జోలికి పోవడం లేదే.. వరద నీరు వృధాగా పోకుండా సద్వినియోగం చేస్తున్నాం. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీటి కారణంగా కోటి మందికి పైగా ముంపునకు గురయ్యారు. దీన్ని నివారించడానికే ఇదంతా అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇపుడీ బనకచర్ల గొడవ ఎటు పోయేట్టు? రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగిసేను? తేలాల్సి ఉంది.
 బనకచర్ల వివాదంలో..ఏపీ, తెలంగాణ వాదనలేంటి? Publish Date: Jun 17, 2025 8:38PM

అంతరిక్షంలో.. మరో అద్భుతం !

    అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జూన్ 18న తమ మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్, నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్) ను చెన్నై శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నాయి. ఇది, భూఉపరితలంపై జరిగే చిన్న పెద్ద మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి అత్యాధునిక, సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయబడిన అసాధరణ ఉపగ్రహ ప్రయోగం, నిసార్  ఉపగ్రహ ప్రయోగం.  నిసార్’ ఉపగ్రహం వాతావరణ మార్పుల అవగాహన, పరిష్కారానికి అత్యవసరమైన, భూ ఉపరితల పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టం ఎదుగుదల, భూగర్భజలాలు, హిమానీనదాలకు (గ్లోసరీస్)కు సంబందించిన,సంక్లిష్ట సమాచారాన్ని, అత్యంత ఖచ్చితత్వంతో సేకరించడమే, ఈ  మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ రాడార్ నాసా అత్యాధునిక ఎల్ – బ్యాండ్ సింథటిక్ అపెట్రూర్ ఎపర్చర్’ రాడార్’( ఎస్ఎఆర్), ఇస్రో ఎస్- బ్యాండ్ రాడార్’ల సంయుక్త కృషి ఫలితం. అందుకే, దీన్ని, ‘నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్’ గా వ్యవాహరిస్తున్నారు.  ఈ రాడార్ వ్యవస్థలోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం, శాస్త్ర వేత్తలు భూమి ఉపరితలం పై ప్రతి సెంటీ మీటర్ పరిమాణం వరకు జరిగే  మార్పులను గుర్తించేందుకు తద్వారా, భూకంపాలు, అగ్ని కీలల విస్పొటనాలు, మంచు చరియలు విరిగే పడే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఉపకరిస్తుంది. కాగ,ఇస్రో సీనియర్ అధికారి ఒకరు, ‘ఇది రెండు ప్రపంచ ప్రసిద్ద అంతరిక్ష సంస్థల మధ్య కుదిరిన ఒక చారిత్రిక భాగస్వామ్యం’గా పేర్కొన్నారు.అలాగే, ‘భూమండలం ఎదుర్కుంటున్న, అత్యంత ప్రధాన సవాళ్ళను అర్థం చేసుకోవడంతో పాటుగా, పరిష్కార స్పందనలో మార్పులకు నిసార్ ఉపగ్రహం సహాయ పడుతుందని, అన్నారు. ఈ ఉపగ్రహాన్ని, ఇస్రో – జీఎస్ఎల్వీ ఎంకే 2 రాకెట్  ద్వారా ప్రయోగిస్తారు.  ఉపగ్రహం కక్షలో ప్రవేశించిన తర్వాత, ప్రతి 12 రోజులకు ఒక సారి భూమిని చుట్టి వస్తుంది. శాస్త్ర వేత్తలు మొదలు విధాన నిర్ణేతలు, విపత్తు నిర్వహణ సంస్థలు, వరకు అనేక మందికి,  అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.,  నిసార్’ కేవలం ఒక శాస్త్రీయ అద్భుతం, సాకేతిక మైలు రాయి మాత్రమే కాదు, భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న అంతరిక్ష , సాంకేతిక సహకారానికి ఓ చిహ్నం. ఈ మిషన్, భూ పర్యవేక్షణ, విపత్తు నివారణలో ప్రపంచ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.  ఈ దశాబ్దపు అత్యంత ప్రధానమైన, ఎర్త్ సైన్సు మిషన్’ గా భావిస్తున్న నిసార్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపధ్యంలో, ఉభయ దేశాల్లో అంచానాలు ఎగసి పడుతున్నాయి.  
అంతరిక్షంలో.. మరో అద్భుతం ! Publish Date: Jun 17, 2025 7:52PM

యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రెండేళ్ల కాలనికి సంబంధించి  నియోజకర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు 60,000 వరకు జీతం చెల్లిస్తారు. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు  
యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ Publish Date: Jun 17, 2025 7:45PM

తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!

  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతిస్తూ జూన్16న కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్టాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగం లోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది.  విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి. జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది. ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా: జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది.  
తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!! Publish Date: Jun 17, 2025 7:07PM

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరు

  చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం ముగిసింది. తిరుమలకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమల్లోకి రాబోతోందని, త్వరలోనే టీటీడీకి ఆ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో CSIR పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనుందని.. ఈ ల్యాబ్ లో నెయ్యి, నీరు, పప్పు ధాన్యాల నాణ్యతను పరిశీలించవచ్చని వెల్లడించారు.  టీటీడీకి చెందిన 7 స్కూళ్లలో 1600 మంది విద్యార్థులకు హ్యూమానిటీ, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. అదే విధంగా బెంగుళూరులో మరో పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని ఆ రాష్ట్రం కోరిందని, వారి వినతి మేరకు మరో విశాలమైన ఆలయం నిర్మిస్తామని తెలిపారు.  సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.  
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరు Publish Date: Jun 17, 2025 6:19PM

డీకే శివకుమార్ సోదరుడుకి ఈడీ నోటీసులు

  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా జూన్ 19వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నాది. పీఎంఎల్‌ఏ కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం.ఏప్రిల్ నెలలో, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.  తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని ఐశ్వర్య గౌడ చెప్పుకుందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె పలువురిని చీటింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య గౌడ దుర్వినియోగం చేసిందని, తాను ఆయన సోదరినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డీకే సురేశ్ గతంలోనే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కులకర్ణి అనే వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
డీకే శివకుమార్ సోదరుడుకి ఈడీ నోటీసులు Publish Date: Jun 17, 2025 5:15PM

బెంబేలెత్తిస్తున్న ఎయిర్‌ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఫ్లైట్లు

బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి. ఎయిరిండియాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు దానికి కారణమవుతున్నాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే   కుప్పకూలిన ఘటన  మరవకముందే.. మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడటం కలవరపెడుతోంది. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. టేకాఫ్‌కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు. ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్‌ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్‌ విమానం ఇదే కావడం గమనార్హం.  జూన్‌ 12న అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ 171 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకేఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక విమానం నివాస సముదాయంపై పడటంతో మరో 33 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత  ఏఐ 171 ఫ్లైట్‌ నంబర్‌ను ఎయిరిండియా పక్కనబెట్టింది. దాని స్థానంలో ఏఐ 159 నంబరును వినియోగించింది. ఇప్పుడదే సిరీస్‌ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది.  మరోవైపు, ఈ ఘటన తర్వాత పలు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వెళ్తున్న ఏఐ 180 విమానంలో సమస్య రావడంతో దాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు.
బెంబేలెత్తిస్తున్న ఎయిర్‌ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఫ్లైట్లు Publish Date: Jun 17, 2025 5:00PM

జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి పరిహారం అందజేత

  ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లిన మంత్రి.. వీర జవాన్ మురళీ నాయక్ సమాధి వద్ద  అంజలి ఘటించి నివాళులర్పించారు.  అనంతరం రూ.50 లక్షలచెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన  తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో రూ.14 లక్షలతో మురళీ నాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు రూ.16లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కల్పించారు.  కల్లితండా పేరు కుడా మార్చే ప్రతిపాదను రెవెన్యూ అధికారులు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  
జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి పరిహారం అందజేత Publish Date: Jun 17, 2025 4:55PM

ఇన్నాళ్లూ లేనిది.. కవిత ఇంటిపేరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?

కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా,  పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తండ్రి కేసీఆర్ వాగ్ధాటిని పుణికి పుచ్చుకున్న నేత. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పటి నుంచీ కవిత పార్టీలో మమేకమై పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ విజయంలో కవిత పాత్ర కూడా గణనీయంగా ఉంది. వరుసగా రెండో సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంత వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే సాగింది. ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందో.. అప్పటి నుంచీ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయి. కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత. పార్టీ పరాజయం తరువాత కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపించడం మొదలైంది.  ఎప్పుడైతే  కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైందో.. అప్పటి నుంచే ఇరువురి మధ్యా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవిత తన సొంత దారి చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులూ పడ్డాయి.  తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారానే రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే యువతనుజాగృతిలోకి ఆహ్వానించారు. ఆమె పిలుపు మేరకు ఇటీవల పెద్ద  ఎత్తున యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి కవిత సంస్థ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక మీడియా సంస్థ మాత్రం కవిత ఇంటిపేరును కల్వకుంట్ల అని కాకుండా దేవనపల్లి అని పేర్కొంది. దేవనపల్లి కవిత భర్త అనీల్ ఇంటి పేరు. ఇంత కాలంగా కవితను కల్వకుంట్ల కవితగానే అంతా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అదీ ఓ మీడియా సంస్థకు కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు అంటూ ప్రచురించాలనీ. ప్రచారం చేయాలనీ అనిపించింది. అంటే కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచీ ఆమెను వేరు చేసే ప్రయత్నమే ఇదని పరిశీలకులు విశ్లేషించారు.  సరిగ్గా సోదరుడితో విభేదించిన తరువాత వైఎస్ షర్మిల పేరుకు ముందు ఆమె భర్త ఇంటిపేరు ఎలా అయితే చేర్చి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా ప్రచురించాయో, ప్రచారం చేశాయో.. సరిగ్గా అలాగే ఇప్పుడు కవిత విషయంలో జరగడం యాధృచ్చికం ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.  
ఇన్నాళ్లూ లేనిది.. కవిత ఇంటిపేరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? Publish Date: Jun 17, 2025 4:54PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. షర్మిల ఫోన్ ట్యాప్!

  ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్ర‌భాక‌ర్ రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్ ఉప‌యోగించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ప్ర‌స్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నింధితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు విచార‌ణ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలంగా విదేశాల్లో ఉన్న ఆయ‌న ఇప్పుడు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు నివేధిక సిద్ధం చేశారు. నివేధిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.రేపు విశాక యిర్‌పోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల స్పందిచనున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. షర్మిల ఫోన్ ట్యాప్! Publish Date: Jun 17, 2025 4:11PM

బాధితురాలితో మాట్లాడిన హోంమంత్రి..బాధ్యులపై కఠిన చర్యలు

  చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం లో అప్పు తీర్చలేదు అని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ లో మాట్లాడారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, బాధితురాలికి హామీ ఇచ్చారు.  బాధితురాలితో తాను మాట్లాడిన వీడియోను కూడా హోం మంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు . ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి  అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.   
బాధితురాలితో మాట్లాడిన హోంమంత్రి..బాధ్యులపై కఠిన చర్యలు Publish Date: Jun 17, 2025 3:33PM

2018లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణం : టీపీసీసీ చీఫ్

  తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాపింగ్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ సాక్షిగా సిట్‌ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్‌ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని ఆయన పలుమార్లు చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ , గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత హాజరయ్యారు. సిట్ ఎదుట టీపీసీసీ చీఫ్ తన స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత మీడియా మందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా 600 మందిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని పీసీసీ చీఫ్ తెలిపారు. దీనిపై తాము ఆనాడే ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని దీనిపై మాజీ సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని అన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని, కేసీఆర్ సిగ్గుతో తలవంచుకునే ఘటన అని. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.  
2018లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణం : టీపీసీసీ చీఫ్ Publish Date: Jun 17, 2025 3:06PM

అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య.. టేకాఫ్ కు ముందే గుర్తించడంతో తప్పిన ముప్పు

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.  ఈనెల 12న అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానం ఆ రోట్లో నడపడానికి సిద్ధమైన తొలి ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది.  మొత్తంగా గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల విమాన సర్వీసులలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. 
అహ్మదాబాద్-లండన్  ఫ్లైట్ లో సాంకేతిక సమస్య.. టేకాఫ్ కు ముందే గుర్తించడంతో తప్పిన ముప్పు Publish Date: Jun 17, 2025 1:56PM

చెవిరెడ్డి అరెస్టు?

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.  వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.  చెవిరెడ్డి బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నారన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో   చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ విఫ్ గా కూడా పని చేశారు. అంతే కాకుండా తుడా చైర్మన్ గా కూడా ఉన్న ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని పలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  ఏ వన్ గా   రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసిన  బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో  మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని అన్నారు.  అటువంటి ఆయన అడ్డుకుంటారని తెలిసీ శ్రీలంకకు అంటూ బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీ కావడానికి ప్రయత్నించారా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.  
చెవిరెడ్డి అరెస్టు? Publish Date: Jun 17, 2025 1:39PM

జై జగన్ అన్న అంకారావుకి సలహాదారు పదవా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు. నల్లమల అడవులను కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు ఒకరు అనే గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆయన చాలా ఏళ్లుగా పర్యావరణ కోసం పోరాటం చేస్తున్నారు.  ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై కొందరు కూటమి నేతలు మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంకారావు వైసీపీ నేత అని.. ఆ పార్టీకే సపోర్ట్ చేశారంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు నాడు జై జగన్ అనలేదని వైసీపీ నేతలు తోట చంద్రయ్య గొంతుకోశారని.. కానీ నేడు నేడు జై జగన్ అన్న అంకారావుకి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిందంటూ పెదవి విరుస్తున్నారు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు.  పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ.. పక్క పార్టీ వారికి  కీలక సలహాదారుడు పదవి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఇటీవల జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా అంకారావు కేక్‌ కట్ చేశారనీ,  ఈ విషయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అంకారావు నరసరావుపేట పార్లమెంట్  వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడుగా  2018లో నియమితులయ్యారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని.. అతని చేతుల మీదుగానే ఆయన నియామక పత్రాలు పొందారంటున్నారు. అంకారావు ఇప్పుడు కూడా వైసీపీలోనే ఉన్నారని.. కనీసం రాజీనామా కూడా చేయలేదని చెబతున్నారు.  అంకారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి నేతలు తెలిసీ తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాకైనా.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.
 జై జగన్ అన్న అంకారావుకి సలహాదారు పదవా? Publish Date: Jun 17, 2025 1:12PM

ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా ఆగ‌లేదా?

యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి. ఎవ‌రి ఇష్ట దైవాన్ని వారు త‌లుచుకోవడం మొద‌లు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బ‌తుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్ర‌తినిథి చెప్పిందేంటంటే.. వారి ప్ర‌యాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అంద‌రు ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన మెసేజ్ రీఫండ్ చేయ‌మ‌ని.  యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తా వెళ్లే ఫ్ల‌యిట్ సిట్యువేష‌న్ ఇంకో ర‌కం. గంట సేపు సాంకేతిక లోపం కార‌ణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబ‌ర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగ‌బ‌ట్టి అలాగే కాలం గ‌డిపారంటే వారి ప‌రిస్థితేమిటో ఊహించుకోవ‌చ్చు. మ‌రో భ‌యంక‌ర‌మైన ప్ర‌యాణ అనుభ‌వం విష‌యానికి వ‌స్తే.. ఆరోజు స‌రిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మ‌దాబాద్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావ‌ల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బ‌య‌లు దేరాల్సింది మ‌రునాటి వేకువ జాము 12. 44కి బ‌య‌లు దేరింది. అంటే ఏకంగా ఐదు గంట‌లు.  ఈ ఐదుగంట‌లూ ఆ ఫ్లైట్ లో న‌ర‌కం చూశారు ప్ర‌యాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వ‌లేదు. పిల్ల‌లుంటే వారు ఆ ఉక్క‌పోత‌లో ఆక‌లిద‌ప్పుల‌తో అల‌మ‌టించినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌క్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండ‌య్యింది. ఆ స‌మ‌యంలో  ఈ ఎయిరిండియా ప్ర‌యాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హ‌మ్మ‌య్యా మ‌నం  కూడా కాలి బూడిద‌వకుండానే నేల‌పై అడుగు పెట్టాం. గంటో అర‌గంట‌లో ప్రాణాల‌తో ఇంటికెళ్తాం. బాప్ రే బ‌చ్ గ‌యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.  కాళ‌రాత్రులంటారే స‌రిగ్గా అలాంటి ప్ర‌యాణ అనుభ‌వాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్ర‌యాణికుల టైం స‌రిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి చ‌స్తున్నారొక్క‌క్క‌రూ. ఇండిగో త‌ర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైన‌ర్ ఎయిర్ ఇండియా.  మొత్తం 102 దేశ విదేశీ తీరాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర్చే ఎయిర్ ఇండియా చ‌రిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆప‌రేష‌న‌ల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ఇక హ‌ర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్ర‌స్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాల‌ది కాగా మిగిలిన ఇర‌వై ఐదు శాతం సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ ది.  ఎయిరిండియా మ‌ధ్య‌లో చేతులు మారినా ఇటీవ‌లే తిరిగి  టాటాల ప‌ర‌మైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాల‌ను అర్జించింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్- 24 కంటే, 25లో మెరుగైన‌ ట‌ర్నోవ‌ర్ర సాధించింది. ప్ర‌స్తుతం కూడా 11 శాతం  పెరుగుద‌ల‌తో 7 బిలియ‌న్ డాల‌ర్ల మేర ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. అంతా బాగుంద‌నుకునే లోపు ఇదిగో ఈ వ‌రుస న‌ష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్ప‌ద ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగిందో అప్ప‌టి నుంచీ ఈ ఎయిర్ లైన‌ర్ టైం పూర్తిగా తిర‌బ‌డిన‌ట్టుంది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన ప్ర‌యాణ  సౌక‌ర్యం అందిస్తామంటోన్న  ఎయిర్ ఇండియా.. వారి పాలిటి య‌మ‌పాశ‌మై.. దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇప్పుడెంత‌టి న‌ష్ట‌మంటే కేవ‌లం అహ్మ‌దాబాద్ డ్రీమ్ లైన‌ర్ కుప్ప‌కూల‌డంతో దాని విలువ 120 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్య‌వ‌స‌ర నిధి కింద పాతిక‌ల‌క్ష‌ల మేర ఈ ప్ర‌యాణ బాధితుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్ర‌మాదం జ‌రిగిన రోజు బోయింగ్ తో స‌హా ఇండిగో త‌దిత‌ర విమాన యాన షేర్ల‌న్నీ కుప్ప‌కూల‌డంతో ఈ మొత్తం న‌ష్టం విలువ సుమారు 6 ల‌క్ష‌ల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డ‌ర్ల‌ను కూడా ఎయిరిండియా ప్ర‌భావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది.  మ‌రి ఈ న‌ష్టాల నుంచి ఎయిరిండియాను గ‌ట్టెక్కించేవారేరీ. ఈ విష‌యాలు తెలిసిన ప్ర‌యాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి పోతున్నారు. కార‌ణం టేకాఫ్ అయిన 45 సెక‌న్ల‌కే కుప్ప‌కూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ స‌రిగా లేద‌న్న పేరు రావ‌డంతో వారంతా ఈ ఫ్ల‌యిట్ బుకింగ్స్ కి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నారు. ఫ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న అన్ని ర‌కాల  విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒక‌సారి  థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్ల‌లో వాటిని పోస్ట్ చేస్తే త‌ప్ప‌.. ప్ర‌యాణికుల్లో న‌మ్మ‌కం రాద‌న్న మాట వినిపిస్తోంది విమాన‌యాన రంగ నిపుణుల నుంచి.  తాజా వార్త ఏంటంటే మంగ‌ళ‌వారం ఉద‌యం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్ల‌యిట్ నెంబ‌ర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం క‌నిపించ‌డంతో ప్ర‌యాణికుల‌ను కోల్ క‌త‌లో దింపేసింది. దీన్నిబ‌ట్టీ ఎయిర్ ఇండియాకేదో దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇది ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.
ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా  ఆగ‌లేదా? Publish Date: Jun 17, 2025 1:04PM

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. సందిగ్ధంలో భారత్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది. రెండు దేశాలూ డ్రోన్లు, క్షిపణులతో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతోపాటు మిగతా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ వైరానికి 1979లోనే బీజం పడింది. ఆ ఏడాది ఇరాన్‌లో మతశక్తుల నాయకత్వంలో విప్లవం సంభవించింది. అయతుల్లా ఖొమైనీ సారథ్యంలోని ఇరాన్‌ మత పాలకులు ఇజ్రాయెల్‌ను జియోనిస్టు శత్రువుగా ప్రకటించారు. ఆ తర్వాత లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్‌కు ఇరాన్‌ మద్దతునిచ్చి ఇజ్రాయెల్‌పై పోరుకు ఉసిగొల్పింది. ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో కూటమి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అధికారులు హతమయ్యారు. ఇరాన్‌ అక్టోబరులో ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని నగరాలపై దాడి చేసినా, ప్రాణనష్టం తక్కువే. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్‌ యోచిస్తోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది.ఇరాన్‌ తీరంలోని హోర్ముజ్‌ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తోంది. ఈ జలసంధి బందయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుంది. అది రాజకీయ అస్థిరతకు దారితీయకమానదు.  తాజాగా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన అణు చర్చలు గాడి తప్పాయి. చర్చల నుంచి వైదొలగుతామనీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)తో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. దారికి రాకపోతే ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు. ఇజ్రాయెల్‌ దాడులను విమర్శించిన రష్యా, చైనాలు ఇరాన్‌కు ఆయుధ, సాంకేతిక, దౌత్య సహాయాల్ని అందించి, ప్రత్యామ్నాయ సైనిక కూటములలో చేరాల్సిందిగా ప్రతిపాదించవచ్చు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరులో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ముదరవచ్చు. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమచేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్‌కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇండియాకు ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతికపరంగా పొత్తు ఉంది. ఇరాన్‌లో చాబహార్‌ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పరచుకోవడానికి భారత్‌ కృషిచేస్తోంది. అందుకని ఇరాన్, ఇజ్రాయెల్‌లలో ఎటువైపూ మొగ్గలేని పరిస్థితి నెలకొంది.  ప్రస్తుతం నడుస్తున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యే సాగుతుందా, ఇతర శక్తులూ జోక్యం చేసుకుంటాయా అన్నది త్వరలో తేలిపోతుంది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇరాన్‌ బాగా బలహీనపడింది. భారత్‌కు ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించగల స్థితిలో ఉంది. మరి చూడాలి ఈ యుద్ద వాతావరణం ఏ మలుపులు తిరుగుతుందో?
ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. సందిగ్ధంలో భారత్ Publish Date: Jun 17, 2025 12:32PM

మంత్రి పొంగులేటికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్

రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ టు అనుకుంటారు.. అన్ని శాఖలు తనవే అనుకుంటారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు  గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు.  కాని ఆయన సఖల శాఖలపై ప్రకటనలు చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ లపై ఒంటికాలిపై లేస్తారు.. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్ధం అయిఉంటుంది ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి . సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలు మీడియాకు   చెప్పాల్సి వస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన విషయాలైతే పీసీసీ ప్రెసిడెంట్ వివరిస్తారు. కాని ఇక్కడ మాత్రం అన్నీ శీనన్నే అదేనండీ పొంగులేటి శ్రీనివాసరెడ్డే చూసుకుంటున్నారు.  గతంలో మూసీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం అంటూ  మీడియాను వెంటబెట్టుకుని సియోల్ పర్యటనకు వెళ్లారు.. అక్కడికి వెళ్లిన విషయం వదిలేసి మా బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చేలోగా రాజకీయంగా పెద్ద బాంబు పేలుతుందని సంచలన ప్రకటన చేశారు. అంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేస్తామనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు.  కాని ఇప్పటి వరకు అటువంటిది ఏమీ జరగలేదు.  ఇలా అనేక విషయాల్లో తనకు తోచిన రీతిలో ప్రకటనలు చేస్తారు.. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తానే వెల్లడిస్తారు.. స్థానిక సంస్థల ఎన్నికలపై విధానపరమైన నిర్ణయం క్యాబినెట్ లో తీసుకున్నాకే ప్రకటించాల్సి ఉంది.. ఇంత ముఖ్యమైన విషయంపై తాజాగా మీడియాకు వెల్లడించారు.  దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.  ఒక క్యాబినెట్ మంత్రికి పీసీసీ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇవ్వడం బహుశా ఇటీవల కాలంలో జరిగిన దాఖలాలు లేవు.  ఇప్పటికైనా పొంగులేటి తన వైఖరిని మార్చుకుంటారో లేదో వేచిచూడాల్సిందే…
మంత్రి పొంగులేటికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్ Publish Date: Jun 17, 2025 12:18PM

ఇజ్రాయెల్ దాడుల భయం... ఖాళీ అవుతున్న టెహ్రాన్

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. మరిన్ని వైమానిక దాడులు జరుగుతాయన్న భయంతో జనం టెహ్రాన్ వీడి   వెడుతున్నారు.  కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంవైపు జనం తండోపతండాలుగా వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా బయటకు వచ్చి నగరం వీడి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో టెహ్రాన్ దారులన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  టెహ్రాన్ లోని సైనిక స్థావరాలే తమ లక్ష్యమని జనావాసాలు కాదనీ ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ జనంలో భయం పోవడం లేదు. ఇక టెహ్రాన్ లో ఇంధనంపై, ఏటీఎమ్ ల నుంచి డబ్బులు విత్రాపై ఆంక్షలు విధించడంతో  జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. నగరం విడిచి పోవడానికి వాహనాలలో ఇంధనం నింపుకునేందుకు పరిమితులు ఉండటంతో వారు నిస్సహాయులుగా మిగిలిపోయారు. అలాగే  ఎటీఎమ్ ల నుంచి సొమ్ములు విత్ డ్రాపై కూడా పరిమితులు విధించడంతో నగదు చెలామణిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతేనే బతికి బట్టకడతామన్న ఉద్దేశంతో జనం నగరం దాటి గ్రామీణ ప్రాంతాలుకు తరలి వెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే టెహ్రాన్ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు. 
ఇజ్రాయెల్ దాడుల భయం... ఖాళీ అవుతున్న టెహ్రాన్ Publish Date: Jun 17, 2025 11:09AM

అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశారు.. కుప్పంలో దారుణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం కుప్పం పరిధిలోని నారాయణపురంలో  జరగింది. బాధిత మహిళ శిరీష భర్త తిమ్మరాయప్ప మునికన్నప్ప అనే వడ్డీ వ్యాపారి వద్ద వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు. అయితే తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక  భార్య, బిడ్డలను వదిలేసి పరారయ్యడు. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి.  కూలీ పని చేస్తూ కొద్ది కొద్దిగా అప్పు కడుతున్న శిరీష సమయానికి డబ్బులు చెల్లించడంలేదంటూ ఆమెను చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వడ్డా వ్యాపారి మునికన్నప్పను అరెస్టు చేశారు.  కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.   జిల్లా ఎస్పీతో మాట్లాడిన చంద్రబాబు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.  
అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశారు.. కుప్పంలో దారుణం Publish Date: Jun 17, 2025 10:46AM

ప్ర‌భాక‌ర్ రావు విచారణలో సిట్ కొత్త టెక్నిక్

బాధితుల ముందు నిందితుడి విచార‌ణ‌  ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ బాధితుల ముందు ప్ర‌ధాన నిందితుడు ప్రభాకరరావును విచారించనున్నారు.   ఇంత‌కీ ప్ర‌భాక‌ర్ రావు అధ్వ‌ర్యంలో ఎంద‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌ని చూస్తే..  బాధితులు చెప్పే లెక్క‌ల్ని బట్టి  4వేల నుంచి ఆరు వేల వ‌ర‌కూ ఉన్నారు. ఆఖ‌రున డీఎస్పీగా యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోట్ అయిన ప్ర‌ణీత్ ఫోన్లోనూ ఎంద‌రో రాజ‌కీయ  నాయ‌కుల ఫోన్ రికార్డింగులున్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ప్ర‌భాక‌ర్ రావు చెప్ప‌డం వ‌ల్లే తామిలా చేశామ‌ని ప్ర‌ణీత్ త‌దిత‌రులు చెబితే.. నేను మాత్రం నాటి డీజీపీ  మ‌హేంద‌ర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ చెప్పిన‌ట్టు చేశాన‌ని అంటున్నారు ప్ర‌భాక‌ర్ రావు. ప్ర‌ణీత్ ద్వారా కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ద్వారా ప్ర‌భాక‌ర్ రావును క్రాస్ క్వ‌శ్చిన్ చేసిన అధికారులు మంగళవారం (జూన్ 17) ఆయనను కొత్త టెక్నిక్ తో  విచారించ‌బోతున్నారు. ట్యాపింగ్ బాధితుల్లో సుమారు 600 మంది డేటా సేక‌రించి వారంద‌రినీ పిలిపించి విష‌యం చెప్పారు అధికారులు. మీరు ఈ ఇన్వెస్టిగేష‌న్లో కోప‌రేట్ చేయాల‌ని వారిని కోరారు. వారు కూడా స‌రే అన్నారు.  ఇక బాధితుల ఆవేద‌న బ‌ట్టి చూస్తే..  భార్యాభ‌ర్త‌ల ఫోన్ కాల్స్ సైతం విన‌డం అన్యాయ‌మ‌ని వాపోయారు. అంతే కాదు త‌మ బంధుమిత్రులంద‌రి ఫోన్ కాల్స్ విన్నార‌నీ.. మేము ఎవ‌రికీ చెప్ప‌కుండా దాచుకున్న నెంబ‌ర్ల‌ను కూడా రికార్డింగ్ లో పెట్టార‌నీ. మా ప్ర‌తి క‌ద‌లిక కాపు కాచార‌నీ.. మా ప్ర‌తి కాల్ విన్నార‌న్న‌ది వీరి ఆవేద‌న‌. అయితే ఒక రిటైర్డ్ ఐజీ అయిన ప్ర‌భాక‌ర్ రావును, ఆనాటి సీఎస్ సోమేశ్ తిరిగి  ఒక ప‌ద‌విలో  కూర్చోబెట్టి ఇంత‌టి ఘ‌న‌కార్యం చేయ‌డం కూడా క‌రెక్టు కాద‌న్న కోణంలో కొంద‌రు మాట్లాడారు. ఇందులో సోమేశ్ ని సైతం శిక్షించాల్సి ఉంద‌ని డిమాండ్ చేసిన వారున్నారు. వ‌చ్చే రోజుల్లో మ‌రే పాల‌కుడూ కూడా ఇలా చేయ‌కుండా నిందితుల‌కు శిక్ష‌లు ప‌డాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే హోం మంత్రిత్వ శాఖ‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి.. మావోయిస్టుల మ‌ద్ద‌తు దారుల‌న్న ముద్ర వేసి ప్ర‌స్తుత మంత్రి ,  ఉద్యోగుల ఫోన్ నెంబ‌ర్లు మొత్తం ట్యాప్ చేశారు నాటి ఎస్ఓటీ అధికారులు.  మ‌రీ ముఖ్యంగా ప్ర‌ణీత్ రావుకు మునుగోడు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు ప్ర‌భాక‌ర్ రావు. న‌ల్గొండ జిల్లాకు తాను ఎస్పీగా ఉండ‌గా బీబీన‌గ‌ర్ లో ఎస్సైగా ప‌ని చేసేవారు ప్ర‌ణీత్.. ఆ స‌మ‌యంలో సామాజిక వ‌ర్గ సంబంధ బాంధ‌వ్యాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌భాక‌ర్ రావుతో బాగా ద‌గ్గ‌రైన ప్ర‌ణీత్. ఆయ‌న ఇంటెలిజెన్స్ ఎస్ఐబీకి వెళ్ల‌గానే తాను కూడా ఒక ఇన్ స్పెక్ట‌ర్ గా అందులో జాయిన్ అయ్యారు. ఐదేళ్లు తిరిగే స‌రిక‌ల్లా డీఎస్పీగా ప్ర‌మోట‌య్యారాయ‌న‌.  2007 లో ప్ర‌ణీత్ తో పాటు సుమారు 450 మంది ఎస్సైలు డిపార్ట్ మెంట్లో జాయిన్ అయితే.. వారంద‌రిలోకీ ఒక్క ప్ర‌ణీత్ మాత్ర‌మే డీఎస్పీ ర్యాంక్ లో ఉన్నారు. ఇది అసాధార‌ణంగా చెబ‌తారు.  ప్ర‌ణీత్ పొందిన యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోష‌న్ అన్న‌ది యాంటీ మావోయిస్టు కార్య‌క‌లాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసే వారికిస్తారు. అలాంటిది అక్ర‌మ ట్యాపింగ్ కి పాల్ప‌డ్డ ఒక అధికారికి ఇవ్వ‌డం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక‌.. అప్ప‌టి వ‌ర‌కూ తాము సేక‌రించిన ప్రొఫైల్స్ డేటా మొత్తం 1200 పేజీలు. ఈమొత్తాన్ని ధ్వంసం చేశారు ప్ర‌ణీత్ రావు. అంతే కాదు.. హార్డ్ డిస్క్ ల‌ను ముక్క‌లు చేసి వాటిని మూసీలో ప‌డేశారు. వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తే వీరెంత‌టి చేయ‌రాని ప‌ని చేశారో అర్ధం చేసుకోవ‌చ్చంటారు నిపుణులు. ప్ర‌ణీత్- ప్ర‌భాక‌ర్ ని కూడా ఎదురెదురుగా పెట్టి.. విచారించ‌నున్నారు అధికారులు. ఆపై బాధితుల ఎదుట  కూడా ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నున్నారు. ఆయ‌న‌కు ఈ కేసు తీవ్ర‌త  ఎంతటిదో అర్ధ‌మ‌య్యేలా చేయ‌నున్న‌ట్టు ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు.  బాధితుల్లో కొంద‌రు ఇప్ప‌టికే మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ పై వాళ్లు చెప్పినా.. వీరికంటూ ఒక విచ‌క్ష‌ణ ఉండాలి  క‌దా?  మేము వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుకున్న ప్ర‌తి మాట విన‌డ‌మేంటి? ఇది  ముమ్మాటికీ త‌ప్పు. రాజ్యాంగం  క‌ల్పించిన గోప్య‌తా హ‌క్కును హ‌రించే అధికారం వీరికి ఎవ‌రిచ్చారంటూ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతున్నారు వీరు.. మ‌రి చూడాలి ఈ విచార‌ణ ద్వారా ప్ర‌భాక‌ర్ రావు నుంచి మ‌రెన్ని నిజాలు రాబ‌డుతారో అధికారులు.
ప్ర‌భాక‌ర్ రావు విచారణలో సిట్ కొత్త టెక్నిక్ Publish Date: Jun 17, 2025 10:16AM

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య

ఎయిర్ ఇండియా విమానాలలో తరచుగా  కేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం (జూన్ 17) తెల్లవారుజామున  శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.  బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం  శాన్ ఫ్రాన్సిస్కోనుంచి బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత   12.45 కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం తెల్లవారు జామున రెండు గంటలకు  ముంబైకి  బయలుదేరాల్సి ఉంది. అయితే..   విమానం ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో  విమానం టేకాఫ్ లో విపరీతమైన జాప్యం జరిగింది. లోపం సవరిం చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయా ణీకులందరినీ విమానం నుంచి దించివేశారు. 
 మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య Publish Date: Jun 17, 2025 9:58AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుటకు సాక్షిగా టీపీసీసీ చీఫ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో  కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.దర్యాప్తు అధికారులు కోరడంతో మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా అధికారులకు వాంగ్మూలం ఇస్తారు.   2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో.. ఆయన ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో ముఖేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉణ్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి, వారి నుంచి కూడా వివరాలు సేకరించిన విషయం విదితమే. అది పక్కన పెడితే...పోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మంగళవారం (జూన్ 17) కీలకంగా మారనుంది.  విచారణలో భాగంగా ఎస్ఐబీ మాజీ  చీఫ్ ప్రభాకర్ రావు  తో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగ రావులను ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రశ్నించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్‌లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో   400 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.  
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుటకు సాక్షిగా టీపీసీసీ చీఫ్ Publish Date: Jun 17, 2025 9:36AM

ఏసీ వేసిన తర్వాత కూడా గది చల్లగా ఉండటం లేదా? ఇదే మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్..!

  వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.  పట్టణాలలో ఎండ తీవ్రతలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంటాయి. వేసవి ముగింపుకు వచ్చినా సూర్యుడి ప్రతాపం తగ్గడం లేదు. అయితే చాలామంది ఇళ్లలో లేదా కార్యాలయాలలో ఏసీ వేసిన తరువాత కూడా గది చల్లబడకపోవడం జరుగుతూ ఉంటుంది.  ముఖ్యంగా పై అంతస్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.  దీని వెనుక కారణం చాలామంది తమకు  తెలియకుండానే చేసిన చిన్న తప్పు కావచ్చు.  దీని వెనుక కారణం ఏమిటి? ఇలా ఏసీ చల్లబడకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి?  తెలుసుకుంటే.. పై అంతస్తులో ఏసీ వేసినా గది చల్లబడకపోవడానికి కారణం ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడటమే. ఒక వైపు ఏసీ  చల్లగాలిని ఇస్తుంటే.. మరొకవైపు   ఫ్యాన్ వేడి గాలిని   వదులుతూ ఉంటుంది. దీనివల్ల నేల,  పైకప్పు మధ్య 5 నుండి 6 డిగ్రీల తేడా ఉంటుంది. తలను పైకప్పు వైపుకు కదిలిస్తే, ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసాన్ని అనుభూతి చెందవచ్చు.  అయితే థర్మోకోల్ సీలింగ్‌తో పైకప్పును తీసుకుంటే  అది గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏం చేయాలి? ఏసీతో పాటు ఫ్యాన్ కూడా నడపాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలి. వేసవిలో ఏసీ వేసిన తర్వాత కొంతకాలం ఓపిక పట్టాలి. క్రమంగా ఇల్లు చల్లబడటం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇంకా గది చల్లబడలేదు అనిపిస్తే గది కొంచెం చల్లబడిన తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేయాలి. ఇది గాలిని కలుపుతుంది. కావాలంటే ఫ్యాన్ ఆన్ చేయకుండా కూడా  హాయిగా ఉండవచ్చు. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకోండి.. AC  పని ఏమిటంటే గది గాలి నుండి వేడి,  తేమను తీసుకోవడం ద్వారా దానిని చల్లబరుస్తుంది. AC గాలిని చల్లబరుస్తుంది,  దానిని క్రిందికి పంపుతుంది.  ఎందుకంటే చల్లని గాలి భారీగా ఉంటుంది,  అది దిగువగా ఉంటుంది.  కానీ ఫ్యాన్‌ను ACతో పాటు నడిపినప్పుడు, ఫ్యాన్ గదిలోని గాలిని వేగంగా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల  చల్లని గాలి గదిలో సరిగ్గా 'స్థిరపడటానికి' అనుమతించదు. ఈ నష్టం తెలుసుకోవాలి.. ఫ్యాన్ చల్లని గాలిని సరిగ్గా సెట్ చేయడానికి అనుమతించనప్పుడు, సెట్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి AC మళ్లీ మళ్లీ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది AC శీతలీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది,  గది అంతగా చల్లబడదు. అదే సమయంలో AC తన పనిని సరిగ్గా చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది. ఫ్యాన్‌ను నడపడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇవి గుర్తుంచుకోండి.. గదిని చల్లబరచడానికి ఏసీకి తగినంత సమయం ఇవ్వాలి. ఫ్యాన్‌ను ఆన్ చేయడం ద్వారా ఏసీ పనిని పెంచవద్దు. చల్లని గాలి బయటకు వెళ్ళకుండా,  వేడి గాలి లోపలికి రాకుండా తలుపులు,  కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. పగటిపూట మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్లను వాడాలి. తద్వారా సూర్యుడి నుండి నేరుగా వేడి గదిలోకి ప్రవేశించదు.                         *రూపశ్రీ.
ఏసీ వేసిన తర్వాత కూడా గది చల్లగా ఉండటం లేదా? ఇదే మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్..! Publish Date: Jun 17, 2025 9:30AM

వెన్నునొప్పి రిపీటెడ్ గా వస్తోందా? దీన్ని సహజంగా తగ్గించడం ఎలాగంటే..!

  వెన్నునొప్పి చాలామంది కంప్లైంట్ చేసే సమస్య. వెన్నునొప్పిని బిజీగా ఉండే రోజులో పెద్దగా పట్టించుకోరు.   ముఖ్యంగా గంటల తరబడి డెస్క్ వద్ద పనిచేసిన తర్వాత లేదా  ఏదైనా బరువులు  ఎత్తిన తర్వాత వెన్నునొప్పి వస్తుంటుంది.  చాలామంది ఈ నొప్పి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు.  ఓ పది నిముషాలు పడుకుంటే అంతా సర్థుకుంటుంది అని అంటుంటారు.  ఈ వెన్ను నొప్పి పదే పదే వస్తున్నప్పుడు అది కేవలం తాత్కాలిక నొప్పి  అనుకోవడం పొరపాటు అని వైద్యులు అంటున్నారు. పదే పదే వచ్చే వెన్నునొప్పి అసౌకర్యాన్ని కలిగించడం కంటే ఎక్కువ హాని చేస్తుంది.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వెన్ను నొప్పి అనేది చాలా మంది సాధారణ సమస్యే అనుకుంటూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి  వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గడంలో మార్పు కనిపించకపోతే అది ప్రమాదం. ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెన్ను బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటే అది నిర్లక్ష్యం చేయాల్సిన సమస్య కాదని అంటున్నారు వైద్యులు. కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, జలధరింపు లేదా దృఢత్వం గురించి జాగ్రత్త వహించాలని అంటున్నారు.  ఇవి నరాల సమస్యలను,  లేదా వెన్నెముక సమస్యలను సూచిస్తాయని అంటున్నారు. అయితే వెన్నెముక సమస్యలు రాకూడదన్నా,  వెన్నెముక సేఫ్ గా ఉండాలన్నా,  వెన్నెముక సమస్యలను సులువుగా తగ్గించాలని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. బరువు తగ్గడం.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది,  బరువు తగ్గడం వల్ల వెన్నెముక సమస్యనే కాదు.. మరిన్ని సమస్యలను నివారించవచ్చు . పొజిషన్.. వంగి ఉండటం ప్రమాదకరం కాదు. కూర్చున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు  వీపును సమతలంగా ఉంచాలి. వీపుకు మద్దతు ఇచ్చే కుర్చీలను ఉపయోగించాలి. ఎదురుగా ఉన్న పరికరాలపై వంగి ఉండకూడదు. వ్యాయామం.. "నిశ్చల జీవనశైలి వెన్నెముకను బలహీనపరుస్తుంది.  రోజువారీ దినచర్యలో కోర్ బలపరిచేటటువంటి వ్యాయామాలను చేర్చాలి. తేలికపాటి కదలిక కూడా సహాయపడుతుంది. ఎర్గోనామిక్ ఫర్నిచర్ .. అన్నింటి కంటే ముఖ్యంగా చేయాల్సిన పని కుర్చీని వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా ఉన్నది ఎంచుకోవడం.  అవసరమైతే ఫుట్‌రెస్ట్‌ను జోడించి, స్క్రీన్‌ను కంటి స్థాయికి పెంచుకోవాలి. లిఫ్టింగ్ టెక్నిక్‌..   ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుమును కాదు మోకాళ్లను వంచాలి. సడన్ గా  జెర్కీ కదలికలను నివారించాలి.  బరువైన వస్తువును ఎత్తేటప్పుడు ఎప్పుడూ మెలితిప్పకూడదు.  బరువును.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. నీరు.. హైడ్రేషన్ వెన్నెముక డిస్క్‌ల స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా వ్యాయామం తర్వాత నీరు తాగాలి.  రోజుకు 6–8 గ్లాసులు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవద్దు..   ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ప్రతి 30–45 నిమిషాలకు నిలబడుతూ ఉండాలి.  శరీరాన్ని కాస్త సాగదీయడం,  నడవడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. నొప్పిని విస్మరించకూడదు.. నొప్పి అనేది శరీరం ఇబ్బందిలో ఉంది అనడానికి ఒక సిగ్నల్. పైన చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నా అది మళ్లీ మళ్లీ వస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఈరోజు నొప్పిని విస్మరించడం వల్ల రేపు  వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.                             *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వెన్నునొప్పి రిపీటెడ్ గా వస్తోందా? దీన్ని సహజంగా తగ్గించడం ఎలాగంటే..! Publish Date: Jun 17, 2025 9:30AM