రైతుల విషయంలో కేసీఆర్ సంచలన నిర్ణయం...
posted on Apr 13, 2017 5:36PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసిన ఆయన.. రైతులకు మరో వరం ఇచ్చారు. అదేంటంటే... వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వందశాతం ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలని, మే 30 లోపు ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతుల ఎకౌంట్లో వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను రైతులు కలిశారు. ఈ సందర్బంగా ఆయన వారితో ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణాలను (రూ.లక్ష లోపు) పూర్తిగా మాఫీ చేసినందుకు రైతులు కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.