నగ్నంగా రైతుల నిరసన...

 

తమిళనాడు రైతులు రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ రుణాలను మాఫీ చేయాలని, కరవు ప్యాకేజీని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా పలు రకాల పద్దతులతో ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు మరో అడుగు ముందుకేసి ఢిల్లీలోని ప్రధాని మోదీ కార్యాలయం ఎదుట రైతులు నగ్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని కార్యాలయంతో పాటు పలు కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట ఆందోళన చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu