హైదరాబాద్‌లో వైద్యురాలు ఆత్మహత్య

హైదరాబాద్ మాదాపూర్‌లో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నానికి చెందిన మూగి అనూష నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఫిజియోథెరిపిస్టుగా పనిచేస్తూ అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే మాదాపూర్ హైటెక్ థియేటర్ సమీపంలో ఉన్న హాస్టల్‌లో చేరారు. నిన్న సాయంత్రం ఎంతసేపటికి అనూష బయటకు రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu