ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
posted on Oct 10, 2025 6:02PM
.webp)
ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పిలిప్పైన్స్ లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం (అక్టోబర్ 10) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపతీవ్రత 7.6గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఫసిఫిక్ తీరంలో సునామీ సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. మనీలాకు ఆగ్నేయాన దావో ఓరియంటల్ లోని మనాయ్ పట్టణానికి 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.
ఈ భూకంప తీవ్రతకు ఫిలిప్పీన్స్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావంతో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తమౌతోంది. రెండు వారాల కిందట ఫిలిప్పైన్ లో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 72మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోజు వచ్చిన భూకంప తీవ్రత 7.6 కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని అంటున్నారు.