తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. శుక్రవారం (సెప్టెంబర్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్  4) శ్రీవారిని మొత్తం59 వేల834 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల628 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu