Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
posted on: Dec 15, 2025 9:22AM

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం (డసెంబర్ 14) ఆవిష్కరించారు. ఇదే పుస్తకాన్ని 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను తెలుగులోని విలీనం- విభజన పేరిట అనువదించిన అనూరాధను అభినందించారు.






