కచ్చా బాదంగా పేరు మార్చుకున్న ధనరాజ్

కామెడీ స్టార్స్ ధమాకా ప్రోగ్రాంకి ఇటీవల మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ప్రతీ వారం కామెడీ స్కిట్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు కమెడియన్స్. ఇక నాగబాబు, శేఖర్ మాస్టర్ నవ్వులతో ఈ షో ఇంకా ఎనర్జిటిక్ గా మారుతోంది. జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోయే ఎపిసోడ్ హైలైట్స్ ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో ధనరాజ్ కచ్చా బాదాంగా పేరు మార్చుకుని టాప్ టు బాటమ్ గ్రీన్ కలర్ డ్రెస్ తో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు.  "నా పేరు కచ్చాబాదం, పిక్కలు తక్కువేమో గాని మా ఇంట్లో మొక్కలు చాలా ఎక్కువండి. చెట్టు గురుంచి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా అంటే యాంకర్ ఏమన్నాడు అంటుంది ..చెట్టు అంటే ట్రీ అని అన్నాడు ఆ ఇంగ్లీష్ కవి " అనేసరికి అందరు పగలబడి నవ్వేస్తారు. చెట్లను ప్రేమించండి అన్నారు కానీ చెట్ల చాటుకెళ్ళి ప్రేమించుకోడానికి సిగ్గులేదు అనే డైలాగ్స్ తో మంచి ఫన్నీ స్కిట్ చేసాడు. స్టార్ హీరో అప్పారావుకి అసిస్టెంట్ గా ఆర్పీ చేసిన స్కిట్ కూడా కాస్త ట్రెండీగా ఉంది. ఆర్పీ ఒక పక్కన పెళ్లి చేసుకుంటూ కూడా అప్పారావు వచ్చేసరికి పంతులు గారు చెప్పే పెళ్లి మంత్రాలు చదువుతూ అప్పారావుకి  గొడుగు పట్టి టచ్ అప్ చేసే క్యారెక్టర్ లో బాగా కామెడీని పండించాడు. ఇంకా చమ్మక్ చంద్ర స్కిట్, ముక్కు అవినాష్ స్కిట్స్ కూడా ఈ ఎపిసోడ్ లో ప్రసారం కానున్నాయి.  

దేవి శ్రీప్రసాద్ నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడేమో!

  మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీప్రసాద్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సాంగ్స్ లో చాలా వరకు హిట్టే. ఐతే అసలు శ్రీప్రసాద్ కాస్త దేవి శ్రీప్రసాద్ గా ఎలా అయ్యాడో ఎంఎస్ రాజు ఆయన మాటల్లో చెప్పారు. అనుకోకుండా ఒక రోజు రైటర్ సత్యమూర్తి గారింటికి వెళ్లిన తనకు ఒక గదిలో ఒక 16 ఏళ్ళ కుర్రాడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని తెగ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడట. వెంటనే ఎంఎస్ రాజు  కూడా 'ఒక సాంగ్ సిట్యువేషన్ చెప్తాను చెయ్యి' అన్నారట. నిజంగానే శ్రీప్రసాద్ కూడా రెడీ చేసి ఉంచారట.  రెండు రోజుల తర్వాత పెద్ద వర్షం పడుతోంది. అప్పుడు శ్రీప్రసాద్ ఫోన్ చేసి 'ట్యూన్ రెడీ గా ఉంది రండి వినిపిస్తాను' అనడం, రాజు బయల్దేరడం జరిగింది. ఐతే వాళ్ళింటికి దగ్గరలో ఉండగా కారు ఆగిపోయింది. 'అతని దగ్గరకు వెళ్లే టైంలో ఏమిటి ఈ కారు ఇలా ఆగిపోయింది' అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారట. మళ్ళీ ఆలోచించుకుని 'చాలా చిన్న కుర్రోడు చెప్పగానే ఏదో ట్రై చేసాడు ఒక సారి వెళ్లి చూద్దాం' అని చివరికి అలా 'దేవి' మూవీకి మంచి ట్యూన్స్ అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. "దేవి శ్రీప్రసాద్ నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడేమో" అని చెప్పుకొచ్చారు అలీతో సరదాగా ప్రోగ్రాంలో. "ఐనా దేవి శ్రీకి కూడా చాలా తపన ఉంది. అంతేకాదు చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా. తాను ఏ ఔట్‌పుట్‌ ఇద్దామనుకుంటాడో దాని కోసం బాగా కష్టపడతాడు. అందులోనూ దేవి శ్రీతో బాలు గారు కూడా పని చేశారు. ఒక సందర్భంలో ఆయనకి కూడా కోపం వచ్చింది. కానీ సర్దిచెప్పాను" అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. రీసెంట్ గా జరిగిన ఆయన పుట్టిన రోజుకు దేవి ఒక మూవీ రికార్డింగ్ థియేటర్లో ఉండి, రాజు గారికి ఫోన్ చేసి ఆర్కెస్ట్రా టీంతో హ్యాపీ బర్త్ డే మ్యూజిక్ స్పాట్ లో ప్లే చేయించి, కేక్ కట్ విషెస్ చెప్పారట.. "నిజంగా ఈ ఇయర్ నాకు పెద్ద సర్ప్రైజ్" అని దేవి శ్రీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు ఎంఎస్ రాజు.

డాక్టర్ బాబు రీఎంట్రీ ఇక లేనట్లే ..క్లారిటీ ఇచ్చిన నిరుపమ్

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ తో హిట్ కొట్టి ప్రేక్షకుల హృదయాల్లో డాక్టర్ బాబుగా నిలిచిపోయిన నిరుపమ్ పరిటాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల, నిరుపమ్ ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఐతే డాక్టర్ బాబు రీఎంట్రీ లేదని తేల్చి చెప్పేసారు. ఈ సీరియల్ నుంచి బయటికి వచేసాక ఒక వెబ్ సిరీస్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడే దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని కానీ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను అన్నారు. ఒకటి రెండు నెలల్లో ఒక సీరియల్ రాబోతోందని దాన్ని తానే ప్రొడ్యూస్ చేసినట్లు చెప్పారు. ఆ సీరియల్ లో మంజుల యాక్ట్ చేస్తోందని చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు నిరుపమ్. అలాగే చాలామంది కూడా జాబ్స్ లేక ఇబ్బందిపడుతూ ఏదైనా జాబ్ ఇప్పించండి అంటూ రిపీటెడ్ గా అడుగుతున్న ప్రశ్నకు నిరుపమ్ కొంతమంది సక్సెస్ స్టోరీస్ చెప్పి వీళ్లంతా లైఫ్ లో సక్సెస్ సాధించారు కేవలం రీలెవెల్ అనే ప్లాట్ఫారం ద్వారా అంటూ దానికి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ కూడా ఈ వీడియొలో షేర్ చేసుకున్నారు. చదువు అవసరం లేదు కేవలం స్కిల్స్ ఉంటే చాలు జాబ్ గారెంటీ అంటూ నిరుద్యోగులకు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారు. ఇలా ఈ వీడియొలో చాలామందికి అవసరమైన సమాచారం అందించారు. నటులు అంటే కేవలం యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు తమని ఆదరిస్తున్న ప్రేక్షకులు అడిగే  ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వడం చాలా బాగుంది అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు  

హాట్ సాంగ్ తో హీట్ పుట్టించిన కావ్య, రవికృష్ణ డాన్స్ పెర్ఫార్మెన్స్

స్మాల్ స్క్రీన్ పై రవికృష్ణ అంటే  గుర్తుపట్టే అభిమానులు ఉన్నారు. ఎన్నో సీరియల్స్ లో, రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రవికృష్ణ అంటే నవ్యస్వామి ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది. చాలా షోస్ లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. కానీ ఇద్దరి మధ్య ఏముంది అంటే మాత్రం ఏం లేదు అంటారు తప్ప ఏ విషయం చెప్పారు. ఆమె కథ సీరియల్ లో వీళ్ళ పెయిర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో చాలా ఉంది. ఎప్పుడు నవ్యస్వామితో స్టెప్పులేసే రవికృష్ణ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నాడు. రూటు మార్చి గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్యతో కలిసి స్టెప్పులేశాడు. గోరింటాకు కావ్య కూడా అంతే ఆ సీరియల్ హీరోతోనే ఏ షోకైనా కలిసి వెళ్తుంది, స్టెప్పులేస్తోంది. బట్ ఈ షోలో మాత్రం వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ ని వదిలేసి డాన్స్ చేశారు రవికృష్ణ, కావ్య. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ గా మారాయి. జూన్ 12 th న ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ ప్రోమోలో వీళ్ళ హాట్ సాంగ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ సాంగ్ లో ఇద్దరూ చాలా రొమాంటిక్ గా పెర్ఫర్మ్ చేశారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక కావ్య బ్లాక్ అండ్ మెరూన్ శారీలో , రవికృష్ణ స్లీవ్ లెస్ షర్ట్ లో  డాన్స్ చేసి స్టేజిని హీటెక్కించారు. వీళ్ళ స్టెప్పులు చూసి పూర్ణ కూడా "హాటబ్బా" అంటూ కామెంట్ చేసింది. మరి ఈ షోకి నవ్యస్వామి ఎందుకు రాలేదు ? రవిక్రిష్ణను వదిలేసిందా లేదా ఇంకేదైనా షోలో ఎంగేజ్ అయ్యిందా ? అని ఆడియెన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

 చ‌లాకీ చంటితోనూ ర‌ష్మీకి ఎఫైరా?

`జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షో ద్వారా యాంక‌ర్ ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ జంట పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఎంత‌లా అంటే వారు వుంటేనే షో టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయేంత‌. వీరిద్ద‌రి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ, ఇద్ద‌రి మ‌ధ్య‌ సాగే ల‌వ్ ట్రాక్ వీరిని వైర‌ల్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో మ్యాజిక్ జ‌రుగుతోంద‌ని, ఇద్ద‌రూ ప్రేమ‌లో వున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. గ‌త కొంత కాలంగా ఈ వార్త‌లు వినిపిస్తూనే వున్నాయి. ఈ వార్త‌ల‌ని నిజం చేయాల‌ని రోజా రెండు మూడు సార్లు జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పైనే వీరికి ఉత్తుత్తి పెళ్లి చేసి త‌న‌ ముచ్చ‌ట తీర్చుకున్నారు కూడా. అయితే ల‌వ్ ఎఫైర్ వార్త‌ల‌పై తాజాగా ర‌ష్మీ గౌత‌మ్ స్పందించింది. ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌ష్మీ గౌత‌మ్ త‌న ల‌వ్ ఎఫైర్ ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్రస్తుతం ర‌ష్మీ వెల్ల‌డించిన విష‌యాలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ అన్నారు. ఆ తరువాత చ‌లాకీ చంటితోనూ త‌న‌కు లింకు పెట్టారని వాపోయింది. ఇక మిగిలిన టీమ్ మెంబ‌ర్స్ లో చాలా మందికి పెళ్లి అయింద‌ని ఆ కార‌ణంగానే వారితో త‌న‌కు ఎఫైర్ వుంద‌ని రూమ‌ర్ లు పుట్టించ‌లేద‌ని తెలిపింది. ల‌వ్ ఎఫైర్ రూమ‌ర్స్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పెళ్లి కాక‌పోవ‌డం, ఒకే ఏజ్ కి చెందిన వాళ్లు కావ‌డ‌మేన‌ని తెలిపింది. ఇలాంటి రూమ‌ర్స్ ని తాను సీరియ‌స్ గా తీసుకోన‌ని, స‌ర‌దాగానే తీసుకుంటాన‌ని తెలిపింది. జ‌బ‌ర్ద‌స్త్ లోకి వ‌చ్చాక త‌న‌లో చాలా మార్పు వ‌చ్చింద‌ని, ప్ర‌తి విష‌యాన్ని కామెడీగానే తీసుకుంటున్నాన‌ని.. అది అలా అల‌వాటైపోయింద‌ని తెలిపింది. ఎంత‌టి సీరియ‌స్ విష‌యం అయినా త‌న‌కు లైట్ గానే అనిపిస్తోంద‌ని, అందుకే త‌న‌పై వ‌చ్చే ఎఫైర్ న్యూస్ ల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసింది ర‌ష్మీ.

బిగ్ బాస్ సీజ‌న్ 6 టైటిల్ ఫేవరేట్ ఎవ‌రు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్‌. టాప్ రేంజ్ లో పాపుల‌ర్ షోగా నిలిచిని ఈ షో సీజ‌న్ 6 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఆడియ‌న్స్ గ‌త కొన్ని నెల‌లుగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వీక్ష‌కుల‌కు బిగ్ బాస్ టీమ్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 'వెయిట్ ఈజ్ ఓవ‌ర్' అంటూ కింగ్ నాగార్జున పై చిత్రీక‌రించిన తాజా ప్రోమోని విడుద‌ల చేసింది. ఇందులో  బిగ్ బాస్ స్టేజ్‌.. హౌస్ లో కంటెస్టెంట్ లకు సంబంధించిన బెడ్ లు, ఇంటీరియ‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ లో హౌస్ లోకి వెళ్ల‌నున్న కంటెస్టెంట్ ల ఫైన‌ల్ లిస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల సామాన్యుల‌కు ఎంట్రీ అంటూ ఓ ప్రోమోని వ‌దిలిన మేక‌ర్స్ తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఎలా డెక‌రేట్ చేశారో.. ఏ రేంజ్ లో గ్రాండ్ గా సీజ‌న్ 6 లాంచ్ కాబోతోందో అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. తాజా ప్రోమోతో బిగ్ బాస్ ల‌వ‌ర్స్ లో మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ఈ సీజ‌న్ ఎలా వుండ‌తోంది? కంటెస్టెంట్స్ ఎవ‌రు? టైటిల్ ఫేవరేట్ గా ఎవ‌రు బ‌రిలోకి దిగ‌బోతున్నారు? అనే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా విడుద‌లైన గ్రాండ్ లాంచింగ్ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సీజ‌న్ లో హౌస్ లోకి వెళ్లే వాళ్లు వీళ్లే అంటూ ఓ పైన‌ల్ లిస్ట్ కూడా చ‌క్కర్లు కొడుతోంది. ఇందులో ప‌లువురి పేర్లు ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయ్యాయంటూ కూడా ప్ర‌చారం మొద‌లైంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న యాంక‌ర్ శివ‌, ఆర్జే చైతూ, మిత్రా శ‌ర్మ‌ల‌లో ఒక‌రు ఈ సీజ‌న్ లో సంద‌డి చేస్తార‌ని అంటున్నారు. 'న్యూలీ మ్యారీడ్' ఫేమ్ సంజ‌నా చౌద‌రి, హీరోయిన్ ఆశా శైనీ, యూట్యూబ‌ర్ కుషిత క‌ల్ల‌పు, యాంక‌ర్ మంజూష‌, సింగ‌ర్ మోహ‌న భోగ‌రాజు, జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌, సుమ‌న్ టీవి యాంక‌ర్లు మంజూష‌, రోష‌న్‌,  కొరియోగ్రాఫ‌ర్ పొప్పి మాస్ట‌ర్, సీరియ‌ల్ న‌టి క‌రుణ భూష‌ణ్‌, న‌టుడు ల‌క్ష్య్ చ‌ద‌ల‌వాడ‌, సీరియ‌ల్ న‌టుడు కౌశిక్‌, శ్రీ‌హాన్‌, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చైత‌న్య గ‌రిక‌పాటి త‌దిత‌రుల పేర్లు వైర‌ల్ అవుతున్నాయి.

ముక్కు అవినాష్ ఆ టైప్‌ అంటూ ఫైరైన షేకింగ్ శేషు!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ముక్కు అవినాష్ క‌మెడియ‌న్ గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ లో టాప్ క‌మెడియ‌న్ ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్న ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ సీజ‌న్ 4 లో అవ‌కాశం రావ‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు గుడ్ బై చెప్పేసి మ‌ల్లెమాల నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. అయితే టీమ్ లీడ‌ర్ గా వున్న వ్య‌క్తి బ‌య‌టికి వెళ్లిపోవాలంటే త‌మ‌కు రూ. 10 ల‌క్ష‌లు క‌ట్టాల్సిందేనంటూ మ‌ల్లెమాల టీమ్ కండీష‌న్ పెట్టింది. దీంతో విధిలేక ముక్కు అవినాష్ మ‌ల్లెమాల టీమ్ కు రూ. 10 ల‌క్ష‌లు క‌ట్టేసి `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు గుడ్ బై చెప్పేశాడు. దీన్నీ జీర్ణించుకోలేని ముక్కు అవినాష్ చాలా సంద‌ర్బాల్లో మల్లెమాల టీమ్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా షేకింగ్ శేషు... ముక్కు అవినాష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలాంటి వ్యక్తులు త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దే టైపు అంటూ ముక్కు అవినాష్ పై ఫైర‌య్యాడు. మ‌ల్లెమాలతో విభేధాలు వుంటే వ్య‌క్తిగ‌తంగా చూసుకోవాలి కానీ ఇలా ప‌బ్లిక్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదంటూ అవినాష్ కు చుర‌క‌లంటించారు. ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షేకింగ్ శేషు మాట్లాడుతూ మ‌నం ఎక్క‌డ వున్నా ఏ స్థాయిలో వున్నా ఎవ‌రి వల్ల ఎదిగాం అనే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని,  వాళ్లలో లోపాలు ఉంటే ఆఫీస్ కి వెళ్లి చెప్పాలి త‌ప్పితే ప‌బ్లిక్ కాకూడ‌దన్నారు. 'అలాంటి వాళ్ల‌ని త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దే ర‌కాల‌ని అంటారు. ఎందుకంటే నువ్వు ఎదిగింది అక్క‌డ‌, పెరిగింది అక్క‌డ‌... అలాంటి సంస్థ గురించి త‌ప్పుగా చెప్ప‌డం త‌ప్పు. నీకు నిజంగా అన్యాయం జ‌రిగితే న్యాయం చేయ‌మ‌ని అడ‌గాలి. సోకాల్డ్ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ లు అంద‌రూ ఇంతింత సంపాదించి ఇల్లు క‌ట్టుకున్నారంటే కేవ‌లం మ‌ల్లెమాల వ‌ల్లే. అలాంటి త‌ల్లి గురించి త‌ప్పుగా మాట్లాడ‌టం త‌ప్పు` అంటూ ఫైర‌య్యారు షేకింగ్ శేషు.

వైజాగ్ లో రచ్చ చేసిన రౌడీ రోహిణి టీమ్

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫేమస్ కమెడియన్స్ ఐన రోహిణి, పవిత్ర, నరేష్, శాంతిస్వరూప్  అంతా కలిసి వైజాగ్ లో జరిగిన ఒక ఈవెంట్ కి వెళ్లి అటునుంచి అటు బీచ్ కి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. లంచ్ కి డికబాన రెస్టారెంట్ కి వెళ్లి అక్కడి వ్యూని బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నారు. ఈ రెస్టారెంట్ మొత్తాన్ని వీడియో తీసి రోహిణి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.  తర్వాత కైలాసగిరి రోప్ వేకి వెళ్లారంతా. ఐతే ఇక్కడ  అందరికీ ఫుల్ టికెట్ ఉంటుంది కానీ నరేష్ కి హాఫ్ టికెట్టే అంటూ రోహిణి పంచ్ వేసి అందరిని నవ్వించింది. తర్వాత రోప్ వే లో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసింది టీమ్. తర్వాత కౌబాయ్ క్యాప్స్ పెట్టుకుని సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో "మీరు రోహిణి గారు కదూ" అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగేసరికి అక్కడి నుంచి కైలాస్ హిల్ కి వచ్చేసింది టీమ్. రిటర్న్ లో  రోప్ వే బాక్స్ లో వస్తుండగా ఈ బాక్స్ లో  ఏసీ లేదా అంటూ పవిత్ర అడిగేసరికి అంతా ఒక్కసారిగా ఆమె వైపు ఒక ఫన్నీ లుక్ ఇస్తారు. తర్వాత అందరూ ఐస్ క్రీమ్స్ తినేసి బీచ్ కి వెళ్లిపోయారు రోహిణి అండ్ టీమ్.  

కిర్రాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్

ఆర్పీ జబర్దస్త్ స్టార్టింగ్ లో ఒక వెలుగు వెలిగిన కమెడియన్. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నాడు . ఐతే ఇప్పుడు ఆర్పీ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయి లక్ష్మి ప్రసన్నతోనే ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వివాహం కూడా త్వరలో జరగబోతోందంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ ఎంగేజ్మెంట్ కి జబర్దస్త్ కమెడియన్స్ అంతా రావడమే కాదు అక్కడ కూడా మంచి ఫన్ క్రియేట్ చేసి బాగా ఎంజాయ్ చేశారు.  ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు కంగ్రాట్స్ ఆర్పీ అన్న అంటూ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మొదట్లో జబర్దస్త్ తర్వాత అదిరింది షో లో మెరిసి మాయమయ్యాడు ఆర్పీ. ఇక తానూ చేసుకోబోయే అమ్మాయి  నెల్లూరు కి చెందిన లక్ష్మీప్రసన్న అని తాను ఈవెంట్ మానేజ్మెంట్స్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.  వజ్ర కవచధార గోవిందా, ఇదేం దెయ్యం వంటి చిత్రాల్లో కూడా ఆర్పీ నటించాడు.  

వీడియో బ‌య‌ట‌పెడ‌తానంటూ ఐశ్వ‌ర్య‌కు శ్యామా వార్నింగ్‌!

రత్తమ్మ నిర్దోషి అన్న విషయాన్ని నిరూపించాలని డిసైడ్ అవుతుంది శ్యామా. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి రత్తమ్మను పరామర్శిస్తుంది. "నీ నిజాయితీనే నిన్ను చావకుండా బతికించింది" అంటూ రత్తమ్మకు ధైర్యం చెప్తుంది. తర్వాత నెమ్మదిగా అసలేం జరిగిందో కూపీ లాగుతుంది. ఆ రోజు కొడుకుని స్కూల్ కి జాగ్రత్తగా వెళ్ళమని ఇంటి తాళం ఇచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్లినట్లు చెప్తుంది రత్తమ్మ. వెంటనే శ్యామా.. రత్తమ్మ కొడుకు చిన్నాను అడుగుతుంది 'కొత్త మనుషులు ఎవరైనా మీ ఇంటి చుట్టూ పక్కల  కనిపించారా' అని. చిన్నా చాలా సేపు ఆలోచించి ఒక కారు కనిపించిందని దాన్ని ఫోటో కూడా తీసుకున్నానని ఆ ఫోటో చూపిస్తాడు. అప్పుడు శ్యామాకి అసలు విషయం అర్థమైపోతుంది. వెంటనే ఫ్యాక్టరీకి వెళ్లి మేనేజర్ ని నిలదీస్తుంది. ఐశ్వర్యనే తన చేత ఇలా చేయించిందని అత‌ను మొత్తం నిజం చెప్పేస్తాడు. అతని మాటల్ని మొత్తం వీడియో రికార్డు చేస్తుంది శ్యామా. సరిగ్గా అదే సమయానికి  ఐశ్వర్య కూడా వస్తుంది. శ్యామాకి నిజం తెలిసిపోయేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది.  శ్యామా మాత్రం రత్తమ్మ చేసే పనులన్నీ తాను చేయాలని వచ్చిన కూలి డబ్బులన్నీ రత్తమ్మకు ఇస్తేనే న్యాయం జరుగుతుందని ఐశ్వర్యకు గట్టిగా చెప్తుంది. చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోని ఇంట్లో అందరికి చూపించి, అస‌లు ర‌హ‌స్యం బ‌య‌ట‌పెడ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది. ఇక తప్పక శ్యామా చెప్పినట్టు చేయడానికి సరే అంటుంది ఐశ్వ‌ర్య‌. మిగతా హైలైట్స్ అన్ని ఈరోజు మధ్యాహ్నం జీ తెలుగులో  ప్రసారమయ్యే 'కృష్ణతులసి' సీరియల్ లో చూడొచ్చు..

తులసిని విలన్ అంటూ దూషించిన కొడుకు అభి!

ఎట్టకేలకు లాస్య బుట్టలో పడిపోయింది గాయత్రి. లాస్య కుట్ర చేయడానికి ఇచ్చిన సలహా చాలా బ్రహ్మాండమని కౌగిలించుకుని థాంక్స్ చెప్తుంది. మరో పక్క గాయత్రి భర్త అంకిత పేరు మీద ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తుంటాడు. గాయత్రీ కాఫీ తీసుకొచ్చి భర్త మనసులో ఈ విషపు మాటను నాటేద్దామని వెళ్తుంది. భార్య కాఫీ తెచ్చేసరికి ఆశ్చర్యపోయిన భర్త అసలు విషయం తెలుసుకుంటాడు. 'అభి పేరు మీద ఆస్తి రాస్తే అంకిత నన్ను ప్రశ్నిస్తుంది. నేను సమాధానం చెప్పలేను. ఐనా నా కూతురు నా ఆస్తి వద్దనుకుని అత్తారింటికి వెళ్ళింది' అంటూ గర్వంగా చెప్తాడు. అంకితకు ఆస్తి వస్తే అత్తగారు తులసి పేరు మీద రాసేస్తుందని చెప్తుంది గాయత్రి. 'అలా ఏం జరగదు కంగారుపడకు' అంటాడు భర్త. ఐనా ఒప్పుకోకుండా సతాయించేసరికి సరే అని బయలుదేరుతాడు. మరో వైపు అభి నాన్న నందుకు ఫోన్ చేసి లాస్య తనని ఎంత నమ్మిందో ఆస్తి తన పేరు మీద రాయడానికి ఎంత తాపత్రయ‌పడిందో చాలా సంతోషపడుతూ చెప్తాడు. నందు లాస్యని ఇక అదేపనిగా పొగిడేస్తూ ఉంటాడు. ఆస్తి పత్రాలు అన్ని మార్పించి ఇంటికి తీసుకొస్తాడు గాయత్రీ భర్త. అది చూసి 'అంకిత పేరు మీదకే ఎందుకు మార్పించారు? అల్లుడు మంచోడే కదా.. నేను చెప్పినట్టు ఎందుకు చేయలేదు' అంటూ అరుస్తుంది గాయ‌త్రి. 'తులసి చెప్పింది అంకిత పేరు మీద ఆస్తిని రాయించమని' అని చెప్తాడు. ఈ విషయాలన్నీ విన్న అభి.. తులసి దగ్గరకు వెళ్లి 'నన్ను ఎదగకుండా చేసిన దోషివి నువ్వే' అంటూ తల్లిని నానా మాటలు అంటాడు. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

పంచదారలాంటి ప్రోగ్రాం పాడుతా తీయగా అన్న కీరవాణి

పాడుతా తీయగా షో గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ షోకి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్పీ చరణ్ హోస్టింగ్ కోసం ఈ షోని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. దేశవిదేశాల్లో కూడా ఈ షోని చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలేలోకి ఎంటరయ్యింది. ఈ ప్రోగ్రాం జూన్ 12 ఈటీవీలో ప్రసారం కానుంది.. ఈ షోకి కీరవాణి గారు వచ్చారు. ఆయన ఎంట్రీతో  ఈ గ్రాండ్ ఫినాలే స్టేజి ఒక్కసారిగా  మెరిసిపోయింది. కీరవాణి గారికి చిన్నప్పటినుంచి కూడా పాలల్లో పంచదార వేసి బూస్ట్ కానీ, హార్లిక్స్  కానీ వేసుకుని తాగడమంటే చాలా ఇష్టమట. ఐతే పాలన్నీ తాగేసాక ఆఖరిలో కాస్త చక్కర మిగిలిపోతుంది కదా.. దాన్ని స్పూన్ తో తీసుకుని తినడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే అనేది ఆ పంచదార లాంటిది అంటూ పోల్చారు కీరవాణి గారు. ఇక ఈ షోలో మరింత రుచిని అందరం చూడబోతున్నాం అని చెప్పారు. ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ లాస్ట్ సంచికలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలంటే 12 వరకు ఆగాల్సిందే.

డ్రైవింగ్ రాని హైపర్ ఆది యాక్సిడెంట్ చేశాడా?

టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ షోల నిర్వాహకులు రకరకాల డ్రామాలకు తెరదీస్తారు. తాజాగా అలాంటి డ్రామాకే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వేదికైంది. ప్రతి ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో 12వ తేదీకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆదిని రియల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు చూపించడం హాట్ టాపిక్ గా మారింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో ఇద్దరు పోలీసులు నానా హంగామా చేశారు. హైపర్ ఆది యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని ఆసుపత్రిపాలు చేశాడని, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు తమకి ఎదురు మాట్లాడిన వాళ్ళని కొట్టినంత పని చేశారు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చే ఆదివారం ఎపిసోడ్ కోసం కొందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రోమోలతో మమ్మల్ని నమ్మించలేరు, మా దగ్గర మీ పప్పులుడకవు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. 'యాక్సిడెంట్ చేసిన హైపర్ ఆది అరెస్ట్' అంటూ ప్రోమో బాగానే కట్ చేశారు గానీ అందులో పెద్ద లాజిక్ మర్చిపోయారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి ఆదికి డ్రైవింగ్ రాదు. ఈ విషయాన్ని ఆదినే పలు సందర్భాల్లో చెప్పాడు. మరి అసలు డ్రైవింగ్ రాని వ్యక్తి యాక్సిడెంట్ ఎలా చేస్తాడు? అంటూ నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. ఇంకా కొందరైతే "పోలీసు అన్నల యాక్టింగ్ బాగుంది.. మంచు ఫ్యూచర్ ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వన్ వీక్ హోస్ట్ గా వీజే సన్నీ

బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యుల‌కు అవకాశం ఇచ్చింది స్టార్ మా. ఐతే ఇప్పటికే ఈ హౌస్ లోకి వెళ్ళడానికి అప్లై చేసుకున్న వాళ్ళతో వన్ వీక్ గేమ్ ఆడించి అందులో విన్ ఐన వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. అనుకున్నట్టుగానే వీళ్ళతో ఒక వారం గేమ్ ఆడించారు. ఈ వన్ వీక్ ప్రోగ్రాం కి బిగ్ బాస్ సీజన్ 5  విన్నర్ వీజే సన్నీ హోస్ట్ గా చేశాడు. దీని షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.  ఇక ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ రాబోతున్నారట. వీళ్ళు వచ్చి సామాన్యుల‌తో హౌస్ లో  గేమ్స్ ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 షో అనేది సెలబ్రిటీస్  v/s  కామన్ మాన్ షోగా మారబోతోంది. ఐతే  కామన్‌మెన్‌ తో నిర్వహించే ఈ షోలో ఎలాంటి కొత్త గేమ్స్ ఆడించబోతున్నారు ? ఎలాంటి టాస్క్స్ ఇవ్వబోతున్నారు. ? అసలు కామ‌న్‌మెన్‌కు, సెలబ్రిటీస్ కి మధ్య ఎలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు జరగబోతున్నాయి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

బెడిసికొట్టిన శోభ ప్లాన్‌.. స్వ‌ప్న‌కు నిరుప‌మ్ షాక్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్న ఈ సీరియ‌ల్ తాజాగా కొంత వ‌ర‌కు ఆ క్రేజ్ ని కోల్పోయింద‌నే చెప్పాలి. అయినా స‌రికొత్త పాత్ర‌ల‌తో స‌రికొత్త ట్విస్ట్ ల‌తో ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతూ విజ‌య‌వంతంగా సాగుతోంది. జూన్ 7 మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌నుందో ఇప్ప‌డు తెలుసుకుందాం. హిమ కార‌ణంగా శోభ చేసిన ప‌ని తెలిసి నిరుప‌మ్ శోభ‌ని అస‌హ్యించుకుంటాడు. జ‌రిగిన త‌ప్పుకు జ్వాల‌కు సారీ చెబుతాడు. నాకు కోపం ఏమీ లేదు. మీరు ఏమ‌న్నా ప‌డ‌తాను అంటుంది జ్వాల‌. అదే స‌మ‌యంలో హిమ‌ని అభినందిస్తుంది. ఇదంతా గ‌మ‌నించిన స్వ‌ప్న నా ప‌రువు తీశావంటూ శోభ‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. హిమ‌ని అభినందిస్తుంది. ఇదిలా వుంటే నువ్వు శోభ‌ని పెళ్లి చేసుకోక త‌ప్ప‌దు అని నిరుప‌మ్ తో అంటుంది స్వ‌ప్న‌. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హించిన నిరుప‌మ్‌.. నా పెళ్లి నా ఇష్టం. కాపురం చేయాల్సింది నేను. ఈ విష‌యంలో మీకు ఎలాంటి హ‌క్కు లేదు అన్న‌ట్టుగా మాట్లాడ‌తాడు. అంతే కాకుండా నాకు కాబోయే భార్య‌ను నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అది త‌ప్పు క‌దా అని స్వ‌ప్న‌ని నిల‌దీస్తాడు. నేను చెప్పిన‌ట్టు విన‌క‌పోతే మీ అమ్మ బ్ర‌తికి వుండ‌దు అంటూ నిరుప‌మ్ కు వార్నింగ్ ఇస్తుంది స్వ‌ప్న‌. మ‌రో ప‌క్క హిమ త‌ను పంపిన వీడియో చూడ‌లేద‌ని ప్రేమ్‌ తెగ ఫీలైపోతుంటాడు. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్ ని స‌త్య వాళ్ల ఇంట్లో చూసిన జ్వాల షాక్ అవుతుంది. ఏంటీ నువ్వు ఇక్క‌డున్నావ్ అంటుంది. అప్పుడు నిరుప‌మ్ హిమ‌ని గుర్తు చేసుకుంటూ ఓ మాట అంటాడు. అది త‌న‌నే అని జ్వాల మురిసిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  జ్వాల విష‌యంలో స్వ‌ప్న ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

అద్దిరిపోయిన న్యూ బిగ్ బాస్ హౌస్ లుక్

బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6కి రెడీ అయ్యింది. ఐతే ఇంతకుముందు సీజన్స్ లో కనిపించిన బిగ్ బాస్ హౌస్ కి, కొత్త హౌస్ కి చాలా డిఫరెన్స్ కనిపించబోతోంది. లివింగ్ రూమ్, గ్లాస్ డైనింగ్ టేబుల్, ఫర్నిచర్ అద్దిరిపోయాయి. అందమైన రంగురంగుల కళ్ళు ఉన్న ఫొటోస్ ని గోడలకు తగిలించారు. మంచి పోష్ ఫర్నిచర్ ని ఈ సీజన్ లో యూజ్ చేస్తున్న‌ట్లు కనిపిస్తోంది. "బీ స్పెషల్" అనే కాప్షన్ ఉన్న ఇంగ్లీష్ లెటర్స్ బాగా హైలైట్ అయ్యేలా సెట్ చేశారు. ఇంకా గార్డెన్, కిచెన్, బీబీ కేఫ్ మొత్తం అందమైన సెట్టింగ్ తో గ్రాండ్ లుక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. వాష్ రూమ్ డోర్స్ మంచి కలర్ తో, మంచి కొటేషన్స్ తో తీర్చిదిద్దారు. ఓవరాల్ గా బిగ్ బాస్ న్యూ హౌస్ లుక్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పొచ్చు. కామన్ మాన్ కి ఎంట్రీ వచ్చింది కాబట్టి ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరు ఈ ఇంట్లోకి వెళ్ళబోతున్నారో, ఎంత మస్తీ చేస్తారో అనే విషయం వేచి చూడాలి. ఐతే.. లేటెస్ట్ సీజన్ ని ఓటిటిలో కాకుండా ఇదివరకు సీజన్స్ లా టీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది.. అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మంచి ఫర్నిచర్ కూడా వాడి హౌస్ కి సూపర్బ్ లుక్ ఇచ్చారని కూడా అంటున్నారు.

బాల పూజాలో వేద‌ని అవ‌మానించిన మాళ‌విక

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్నసీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. త‌ల్లి పురిట్లోనే వ‌దిలేసిన ఓ పాప‌కు, పిల్ల‌లే పుట్ట‌ర‌ని తెలిసిన ఓ డాక్ట‌ర్ కు మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించారు. హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్ బీఎస్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.   ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, బేబీ మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర‌, వ‌ర‌ద‌రాజులు న‌టించారు. గ‌త కొన్ని రోజులుగా బాల పూజ చేయాల‌ని భావించిన య‌ష్ త‌ల్లి మ‌ల‌బార్ మాలిని పరిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డ‌టం, య‌ష్ కు భార్య‌గా వేద రావ‌డం..ఖుషీకి మంచి త‌ల్లి ల‌భించ‌డంతో మాలిని `బాల పూజా`కు ఏర్పాటు చేస్తుంది. య‌స్‌, వేద పీట‌ల‌పై కూర్చుని ఖుషీ కోసం బాల పూజా చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఇంత‌లో `ఆపండి` అంటూ య‌ష్ మాజీ భార్య మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. క‌న్న‌త‌ల్లిని నేను బ్ర‌తికి వుండ‌గా పిల్ల‌లే పుట్ట‌ని వేద‌తో బాల పూజ ఎలా చేయిస్తారంటూ మాలిని కుటుంబ స‌భ్యులని నిల‌దీస్తుంది. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హంతో ఊగిపోయిన య‌ష్ త‌ల్లి మాలిని `అది చెప్ప‌డానికి నువ్వు ఎవ‌రే మ‌ర్యాద‌గా బ‌య‌టికి పో` అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. నేను అన్ని ఏర్పాట్ల‌తోనే వ‌చ్చాన‌ని, ఎవ‌రూ అర‌వ‌కుండా నోరు మూసుకుని నేను చెప్పింది విన‌మ‌ని హెచ్చ‌రిస్తుంది మాళ‌విక. య‌ష్ ప‌క్క‌న పీట‌ల‌పై కూర్చున్న వేద‌ని పైకి లేవే అంటూ అవ‌మానిస్తుంది. య‌ష్ ఆగ్ర‌హంతో ఊగిపోతున్నా వేద అత‌న్ని కంట్రోల్ చేస్తూ ఆపుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  మాళ‌విక ప్లాన్ వ‌ర్క‌వుట్ అయిందా? .. ఇంత‌కి బాల పూజని య‌ష్ ఎవ‌రితో క‌లిసి చేశాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

12న బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్ హంగామా

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో పాపుల‌ర్ గా మారిందో అంద‌రికి తెలిసిందే. బిగ్గెస్ట్ క్రేజీ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఇప్ప‌టికీ సెల‌బ్రిటీలు, టీవీ స్టార్ లు, యూట్యూబ‌ర్స్, సామాన్యులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌లే ఓటీటీ మొట్ట మొద‌టి వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజ‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. తొలి సారి మ‌హిళా కంటెస్టెంట్ బిందు మాధ‌వి టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో నిర్వాహ‌కులు సీజ‌న్ 6 కు సంబంధించిన స‌న్నాహాలు మొద‌లు పెట్టేశారు.   దీనికి సంబంధించిన ప్రోమోని కూడా తాజాగా హోస్ట్‌ నాగార్జున పై చిత్రీక‌రించి రిలీజ్ చేశారు. సీజ‌న్ 6 లో అనూహ్యంగా సామాన్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. దీంతో చాలా మంది ఈ షోలోకి ప్ర‌వేశించే గోల్డెన్ ఛాన్స్ కోసం ఆస‌క్తిని చూపిస్తూ త‌మ‌లోని టాలెంట్ ని ప్ర‌ద‌ర్శించ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఇదిలా వుంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్స్ కు చెందిన 16 న‌టీన‌టుల్ని టీమ్ లుగా మార్చి బిగ్ బాస్ హౌస్ లో 24 గంట‌ల పాటు ర‌చ్చ‌కు ప్లాన్ చేసింది స్టార్ మా. `బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్‌` పేరుతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసింది. ఇప్ప‌టికే స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్స్ లోని న‌టీన‌టుల్ని ఈ కార్య‌క్ర‌మం కోసం ఎంపిక చేసి ఒక్క రోజులో వీరంతా చేసిన హంగామాని చూపించ‌బోతోంది. దీనికి యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ని ఈ ఆదివారం జూన్ 12న మ‌ధ్యాహ్నం 3:00 గంట‌ల‌కు ప్ర‌సారం చేయ‌బోతోంది. ఈ షోలో స్టేజ్ పై యాంక‌ర్ ర‌ష్మీ, శేఖ‌ర్ మాస్ట‌ర్  చేయ‌బోతున్న హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా వీరికి సంబంధించిన ప్రోమోని కూడా విడుద‌ల చేశారు. `మందులోడా ఓరి మాయ‌లోడా` అంటూ ర‌ష్మీ ఓ రేంజ్ లో స్టేజ్ ని అద‌ర‌గొట్టేసింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ `మమ్మ మ్మా మ‌మ్మా మ‌హేష్ ... ` అనే పాట‌కు డ్యాన్స్ ఫ్లోర్ ని ఇర‌గ‌దీసేశాడు.

సెట్లో హైప‌ర్ ఆది అరెస్ట్.. కాల‌ర్ ప‌ట్టి పోలీసుల వీరంగం!

జ‌బ‌ర్ద‌స్త్, శ్రీ‌దేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో త‌న‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటున్న క‌మెడియ‌న్ హైప‌ర్‌ ఆది ఆ మ‌ధ్య వ‌రుస వివాదాల్లో చిక్కుకుని వార్త‌ల్లో నిలిచాడు. ఇదిలా వుంటే హైప‌ర్ ఆది `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` కామెడీ షో షూటింగ్ జ‌రుగుతుండ‌గానే పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేయ‌డం ఇప్పుడు షాక్ కు గురిచేస్తోంది. ఇంద్ర‌జ ప్లేస్ లో జ‌డ్జిగా పూర్ణ‌, సుడిగాలి సుధీర్ ప్లేస్ లో యాంక‌ర్ గా ర‌ష్మీ గౌత‌మ్ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ షో కొత్త క‌ళ‌ని సంత‌రించుకుంది. సుడిగాలి సుధీర్ షోలో లేక‌పోవ‌డంతో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తూ హైప‌ర్ ఆది, ఆటో రామ్ ప్ర‌సాద్ క‌లిసి స్కిట్ లు చేస్తూ న‌వ్విస్తున్నారు.   తాజాగా వ‌చ్చే ఆదివారం జూన్ 12న మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ప్రోమో స్టార్టింగ్ లోనే ఆటో రామ్ ప్ర‌సాద్.. హైప‌ర్ ఆదికి స‌న్మానం ఏర్పాటు చేశాడు. "అంటే స‌న్మానం చేసి న‌న్ను కూడా పంపించేద్దామ‌నుకుంటున్నావా?" అంటూ హైప‌ర్ ఆది పంచ్ వేశాడు. ఆదికి స‌న్మానం జ‌రుగుతుండ‌గానే ఓ అమ్మాయి ముఖం క‌నిపించ‌కుండా చున్నీ క‌ట్టుకుని వ‌చ్చేసి.. "ఇక్క‌డొక ఆడ‌పిల్ల‌కి అన్యాయం జ‌రుగుతుంటే మీరంతా క‌లిసి సంతోషంగా సన్మానం చేసుకుంటున్నారా?" అంటూ షాకిచ్చింది. క‌ట్ చేస్తే.. షోలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుండ‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు "కెమెరాలు ఆపండీ" అంటూ షాకిచ్చారు. "ఆది ఎక్క‌డండీ.. ఆది ఎక్క‌డ?" అంటూ హంగామా చేశారు. ఇది చూసిన పూర్ణతో స‌హా అంతా షాక్ అయ్యారు. షోలో వున్న వాళ్ల‌కి, టెక్నిక‌ల్ టీమ్ కి ఏం జ‌రుగుతోందో అర్థం కాలేదు. స్టేజ్ పైకి వెళ్లిన పోలీసులు "ఉద‌యం ఏం జ‌రిగిందో తెలుసా? కార్ లో వ‌స్తూ ఓ వ్య‌క్తికి యాక్సిడెంట్ చేశారు. అత‌ను ఇప్ప‌డు చావు బ్ర‌తుకుల్లో వున్నాడు." అని చెప్పారు. వెంట‌నే ఓ వ్య‌క్తి స్టేజ్ పైకి వ‌చ్చి "షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఇలా కాదు ఒక‌సారి ప‌క్క‌కు రండి" అన్నాడు. "అత‌ను వ‌స్తానంటుంటే నువ్వు ఎవ‌రయ్యా ప‌క్కకుపో ఫ‌స్టు" అంటూ పోలీసులు వీరంగం వేశారు. ఇంత‌లో ఆటో రామ్ ప్ర‌సాద్ తో పాటు క‌మెడియ‌న్స్ అంతా స్టేజ్ పైకి వెళ్లి పోలీసులతో చ‌ర్చించారు. అయినా పోలీసుల్లో ఓ వ్య‌క్తి విన‌కుండా త‌న‌ని ఆప‌డానికి ట్రై చేసిన వారిపై సీరియ‌స్ అయ్యాడు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కాలేదు. వెంట‌నే మొద‌టి నుంచి వీరంగం వేస్తున్న పోలీస్ 'ఫ‌స్ట్ కెమెరాలు ఆపుచేయండి' అంటూ క‌ర్ర చూపించి సెట్ లో వున్న వాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంత‌కీ ఆది నిజంగానే యాక్సిడెంట్ చేశాడా?.. షోని హైలైట్ చేయ‌డంలో భాగంగానే ఈ స్టంట్ ని టీమ్ ఏర్పాటు చేసిందా? అన్న‌ది తెలియాలంటే జూన్ 12న ప్ర‌సారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే. ప్ర‌స్తుతం `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతోంది.