బుల్లెట్ భాస్క‌ర్ ని కుక్క‌ని కొట్టిన‌ట్టు కొట్టారా?

బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొన్నేళ్లుగా అల‌రిస్తూ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఈ షోకు ఇంద్ర‌జ‌తో పాటు కొత్త‌గా లైలా కూడా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఈ షోకు యాంక‌ర్ గా ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఈ షోలో ఆటో రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌వ‌, చలాకీ చంటి, తాగుబోతు ర‌మేష్‌, రైజింగ్ రాజు, బుల్లెట్ భాస్క‌ర్‌, వ‌ర్ష‌, ఇమ్మానుయేల్, ఫైమా, రోహిణి త‌దితరులు టీమ్ లీడ‌ర్ లుగా వ్య‌వహ‌రిస్తున్నారు. ఈ నెల 24న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని మల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో ఆటో రాం ప్ర‌సాద్ డూప్లికేట్ హీరోల‌తో హంగామా చేయించాడు. ఆ త‌రువాత వ‌ర్ష అంద‌రి ముందే ఇమ్మానుయేల్ కు ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. అయితే వున్న‌ట్టుండి వ‌ర్ష ఇలా ప్ర‌పోజ్ చేయ‌డంతో ఇమ్మానుయేల్ షాక్ లో వుండిపోయాడు. ఇది క‌లా.. స్కిట్టా ఏదీ అర్థం కాని అయోమ‌యంలో వుండిపోయాడు. ఇదిలా వుంటే బుల్లెట్ భాస్క‌ర్ ని లేడీస్ స్టేజ్ పైనే విగ్గు పీకి మ‌రీ కుక్క‌ని కొట్టి న‌ట్టు కొట్టారు. `ఠాగూర్` లోని యాంటీ క‌రప్ష‌న్ ఫోర్స్ సీన్ ని బుల్లెట్ భాస్క‌ర్ యాంటీ భార్య ఫోర్స్ గా రీక్రియేట్ చేశాడు. ఇందు కోసం లేడీ టీమ్ లీడ‌ర్ల‌ని అంద‌రిని రాడ్ ల‌కు క‌ట్టేసి ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టాడు. రోహిణి ద‌గ్గ‌రి కి వ‌చ్చి మీ పేరు అని అడిగాడు.. గ‌జ‌ల‌క్ష్మి అని చెప్పింది. ఇంత‌కు ముందు నీ వెయిట్ ఎంత అంటే 35 అంది..ఇప్పుడెంత అంటే 95 అనేసింది. హైద‌రాబాద్ లో గ‌జం రేటు పెరుగుతున్నంత టైప్ లో పెంచేశావ్ అని పంచ్ వేశాడు. ఈ లోపు బుల్లెట్ భాస్క‌ర్ కు భార్య‌ని అంటూ ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్క‌డ న‌లుగురు అమ్మాయిల‌ని క‌ట్టేశావా? అంటూ బుల్లెట్ భాస్క‌ర్ చంక‌నెక్కేసి అత‌ని విగ్గు పీకేసి లెంప‌లు వాయించేసింది.. ఒక విధంగా చెప్పాలంటే అత‌న్ని కుక్క‌ని కొట్టిన‌ట్టు కొట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఇమ్మానుయేల్ .. బుల్లెట్ భాస్క‌ర్ త‌రుపున ఇంద్ర‌జ‌, లైలాల‌ను నిల‌దీయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఆర్యవ‌ర్ధ‌న్ ఆస్తి డాక్యుమెంట్స్ కొట్టేసిన రాగ‌సుధ!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా వ‌రుస ట్విస్ట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ చివ‌రి అంకానికి చేరుకుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా మొద‌లైన ఈ సీరియ‌ల్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఓ ఆత్మ ప‌గ‌, ప్ర‌తీకారం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. 'బొమ్మ‌రిల్లు' ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. వ‌ర్ష హెచ్.కె., జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, జ్యోతిరెడ్డి, బెంగుళూరు ప‌ద్మ‌, అనుషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. రాగ‌సుధ ప‌న్నిన కుట్ర‌కు త‌ను కూడా స‌హాయం చేశానంటూ ర‌ఘుప‌తి ప‌శ్చాతాప ప‌డ‌తాడు. ఆమె కుట్ర అంతా తెలుస‌ని, సాక్ష్యం చెప్పి త‌న‌ పాపానికి ప్రాయ‌శ్చితం చేసుకుంటాన‌ని ర‌ఘుప‌తి త‌న సైగ‌ల‌తో అను తండ్రి సుబ్బుకు చెబుతాడు. ఇదే విష‌యాన్ని సుబ్బు.. అనుకు ఫోన్ లో వివ‌రిస్తాడు. అయితే ఆ మాట‌లు విన్న ఆర్యవ‌ర్ధ‌న్ అత‌ని సాక్ష్యం చెల్ల‌ద‌ని, రాగ‌సుధ దాన్ని మ‌రింత అడ్వాంటేజీగా తీసుకుంటుంద‌ని చెబుతాడు. మ‌రి రాగ‌సుధ‌ను అడ్డుకోవడం ఎలా? అని అను, జెండేలు అన‌డంతో మ‌న ద‌గ్గ‌ర ఒరిజిన‌ల్ ఆస్తిప‌త్రాలు వున్నాయంటాడు. రాజనందిని గ‌దిలో వున్న ఆ ప‌త్రాల‌ని తీసుకుని మీరు కోర్టుకు ఏ కారులో వెళుతున్నారో రాగ‌సుధకు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌మ‌ని, ఆ బాధ్య‌త నీద‌ని జెండేకు చెప్ప‌డంతో ఆస్తి డాక్యుమెంట్స్ కోసం అను, జెండే ఇంటికి వ‌స్తారు. రాజ‌నందిని గ‌దిలోకి అను వెళ్లి వెతికితే ఆ  డాక్యుమెంట్స్ ని ఎప్పుడో రాగ‌సుధ కొట్టేసింద‌న్న విష‌యం అనుకు ఆల‌స్యంగా తెలుస్తుంది. ఆ షాక్ లో వున్న అనుని మాన్సీ, ఆమె త‌ల్లి నిందిస్తూ వుంటారు. త‌నే రాగ‌సుధ‌కు ఆస్తి ప‌త్రాలు ఇచ్చేసింద‌ని నిందిస్తుంటారు. క‌ట్ చేస్తే ఆస్తి ప‌త్రాల‌తో రాగ‌సుధ స్టైల్ గా కోర్టుకు బ‌య‌లు దేరుతుంది. ఆర్యవ‌ర్ధ‌న్ ఏం చేయ‌బోతున్నాడు?.. రాగ‌సుధ కుట్ర ముందు ఓడిపోతాడా? ఆస్తిని పోగొట్టుకుంటాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

గాయ‌త్రీదేవి ఆత్మ న‌య‌నికి చెప్పిన అద్దం ర‌హ‌స్యం!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'త్రిన‌య‌ని'. త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యం తెలియ‌ని ఓ కొడుకు.. ఆ కొడుకు కోసం త‌పించే త‌ల్లి ఆత్మ‌.. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే ఓ యువ‌తి పాత్ర‌ల నేప‌థ్యంలో సాగే ఆస‌క్తిక‌ర‌మైన కథే ఈ సీరియ‌ల్. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. బెంగాలీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్ర‌ధాన జంట‌గా అషికా గోపాల్‌, చందూ గౌడ న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. తిలొత్త‌మ అనుభ‌విస్తున్న ఆస్తి విశాల్ కే ద‌క్కాలని గాయ‌త్రీ దేవి తండ్రి పుండ‌రీనాథం త‌ను రాసిన  వీలునామాలో ఓ ర‌హ‌స్య స‌మాచారాన్ని పొందుపరుస్తాడు. అందులోని ఓ కాగితంలో బాబుని ఎత్తుకుని వున్న ఓ యువ‌తి చంద‌మామ‌ను చూపిస్తూ వుంటుంది. అందులో వున్న ర‌హ‌స్యాన్ని న‌య‌ని కోసం వ‌చ్చిన గాయ‌త్రీ దేవి ఆత్మ వివ‌రిస్తుంది. పున్న‌మి రోజు రాత్రి ప్ర‌కాశించే చంద‌మామ వెలుగులో మా నాన్న‌గారు గీసిన చిత్రాన్ని పెట్టి అద్దంలో చూస్తే నీకు అస‌లు ర‌హ‌స్యం ఏంటో అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతుంది. ఆ మాట‌ల‌కు 'అద్దంలో చూడాలా?' అంటుంది న‌య‌ని. 'అవును' అని తిలోత్త‌మ ఇంట్లో వున్న పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి అందులో చూడాల‌ని గాయ‌త్రీదేవి ఆత్మ చెబుతుంది. ఆ ఇంట్లో త‌న వ‌ద్ద వున్న అద్దాన్ని తిలోత్త‌మ అత్త‌య్య ఇవ్వ‌దు.. ఇప్పుడు ఎలా అమ్మ‌గారు అని అమాయ‌కంగా అడుగుతుంది న‌య‌ని.. దీనికో మాస్ట‌ర్ ప్లాన్ చెబుతుంది. దీంతో మారువేషాల్లో అద్దం కోసం విశాల్ , న‌య‌ని రంగంలోకి దిగుతారు. తిలోత్త‌మ క‌ళ్లుగ‌ప్పి గాయ‌త్రీదేవి చెప్పిన అద్దాన్ని పెద్దింట్లోంచి సేఫ్ గా తీసుకురాగ‌లిగారా?.. దీనికి క‌సి, వ‌ల్ల‌భ ఎలాంటి అడ్డంకుల్ని సృష్టించార‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

వేద ప్రెగ్నెంట్ అన్న డాక్ట‌ర్‌.. షాక్ లో య‌ష్‌!

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్‌ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ ప్ల‌స్‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని, ప్ర‌ధానంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. గ‌తంలో టెండ‌ర్ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచి రూ. 60 కోట్లు న‌ష్ట‌పోకుండా చేసిన వేద‌ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టాన‌ని య‌ష్ ఫీల‌వుతుంటాడు. త‌న‌కు ఎలాగైనా సారీ చెప్పాల‌నుకుంటాడు. అది ఎలా చెప్పాలా అని ఆలోచించి బెడ్ పై పూల‌తో సారీ అని రాసి వేద‌ని ఏదో ప‌ని వుంద‌న్న‌ట్టుగా పిలుస్తాడు య‌ష్‌. కానీ గ‌దిలోకి వ‌చ్చిన వేద బెడ్ పై య‌ష్ రాసిన అక్ష‌రాలని చూడ‌కుండా వెళ్లిపోతుంది. మ‌రో సారి ఫైల్స్ క‌నిపించ‌డం లేద‌ని పిలుస్తాడు. అదే స‌మ‌యంలో వేద పెంచుకుంటున్న కుక్క పిల్ల బెడ్ పైకి చేరి య‌ష్ పూల‌తో రాసిన 'సారీ'ని చెరిపేస్తుంది. దీంతో ఇక్క‌డ పూలు ఎవ‌రు చ‌ల్లార‌ని, వాటిని వెంట‌నే క్లీన్ చేయ‌మ‌ని య‌ష్ కు చెబుతుంది. దీంతో య‌ష్  'ఇంత ప్ర‌య‌త్నించినా వేద గుర్తించ‌డం లేదేంటీ?' అని ఫీల‌వుతాడు. ఇదే స‌మ‌యంలో అంతా ఏదో ఫంక్ష‌న్ కి బ‌య‌టికి వెళ్లిపోతుంటారు. చివ‌ర్లో వేద‌, య‌ష్‌, ఖుషీ మాత్ర‌మే వుంటారు. వేద రెడీ అయితే వెళ‌దామ‌ని తొంద‌ర పెడ‌తాడు య‌ష్‌. తొంద‌ర పెడితే కుద‌ర‌ద‌ని చెబుతుంది వేద‌. దీంతో నిదానంగా రెడీ అయి ర‌మ్మ‌ని ఖుషీని తీసుకుని కింద వెయిట్ చేస్తుంటానని వెళ‌తాడు య‌ష్‌..  ఇదే స‌మ‌యంలో వేద బ‌ట్ట‌లు మార్చుకుని రెడీ అవుతుంటే త‌న‌పై క‌న్నేసిన‌ య‌ష్ బావ కైలాష్ చాటుగా వేద‌ని చూస్తూ వుంటాడు. అది వేద అద్దంలోంచి గ‌మ‌నించి షాక్ కు గుర‌వుతుంది. క‌ట్ చేస్తే.. అంతా ఫంక్ష‌న్ నుంచి ఇంటికి తిరిగి వ‌స్తారు. వేద క‌ళ్లు తిరిగి ప‌డిపోతుంది. ప‌రీక్షించిన డాక్ట‌ర్ వేద ప్రెగ్నెంట్ కావ‌చ్చ‌ని చెబుతుంది. దీంతో య‌ష్ షాక్ కు గుర‌వుతాడు. అస‌లు ఏం జ‌రిగింది? .. ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

తొలి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత‌ జూనియ‌ర్ పూజా హెగ్డే

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`.. సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా వినూత్న‌మైన షోల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. తెలుగు సింగ‌ర్స్‌ని, న్యూ టాలెంట్ ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశ్యంతో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో నూత‌న సింగర్స్ కోసం ప్ర‌త్యేక షోని ప్రారంభించింది. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, హీరోయిన్ నిత్యా మీన‌న్‌, సింగ‌ర్ కార్తీక్ ఈ షోకు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త 15 వారాలుగా సాగిన స‌మ‌రం ముగిసింది. ఈ సింగింగ్ పోటీలో విజేత‌గా ఎవ‌రు నిలుస్తారా? అనే ఉత్కంఠ‌కు ఈ శుక్ర‌వారం జ‌రిగిన మెగా ఫైన‌ల్ లో తెర‌ప‌డింది. ఈ పోటీల్లో మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ ముద్దుగా జూనియ‌ర్ పూజా హెగ్డే అంటూ పిలిచిన వాగ్దేవి తొలి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత‌గా నిలిచి ట్రోఫీని ద‌క్కించుకుంది. ఈ మెగా ఫైన‌ల్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై విజేత‌కు తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ట్రోఫీని అందించారు. ఇదే కార్య‌క్ర‌మంలో రానా, సాయి ప‌ల్ల‌వి కూడా పాల్గొని ఈ మెగా ఫైన‌ల్స్ ని మ‌రింత స్పెష‌ల్ గా మార్చేశారు. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ గా నిలిచిన వాగ్దేవికి ట్రోఫీతో పాటు రూ. 10 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ల‌భించ‌డ‌మే కాకుండా గీతాఆర్ట్స్ లో రూపొందే సినిమాలో పాడే అవ‌కాశం కూడా ద‌క్కింది. ఈ పోటీలో మొద‌టి ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన శ్రీ‌నివాస్‌కు రూ. 3 ల‌క్ష‌లు, రెండో ర‌న్న‌ర‌ప్ వైష్ణ‌వికి రూ. 2 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ల‌భించాయి. విన్న‌ర్ వాగ్దేవి గాత్రానికి ముగ్ధులైన మెగాస్టార్ చిరంజీవి త‌న‌కు `గాడ్ ఫాద‌ర్‌` మూవీలో ఓ పాట పాడే అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం. ఇదే వేదిక‌పై ఆమెకు తెనాలి డ‌బుల్ హార్స్ వారు రూ. 3 ల‌క్ష‌లు, శ్రీ‌నివాస్ కు రూ. 2 ల‌క్ష‌లు, వైష్ణ‌వికి చంద‌నా బ్ర‌ద‌ర్స్ వారు రూ. 1 ల‌క్ష‌ బ‌హుమ‌తిగా అంద‌జేశారు.

'ఇమ్మూ మీ మమ్మీకి చెప్పు కోడలొస్తుందని'.. వైర‌ల్ అయిన వ‌ర్ష కామెంట్స్‌!

ఎక్స్ట్రా జబర్దస్త్ లో మంచి టైమింగ్ ఉన్న కామెడీతో పర్లేదనిపిస్తూ ముందుకు నడుస్తోంది వర్ష. ఐతే నెక్స్ట్ వీక్ ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. "వర్షా .. లవ్ చేస్తున్న వాళ్ళ మధ్య అనుమానం రావడం సహజమే. ఎప్పుడైనా ఇమ్ము నీ మీద అనుమానం పడడం కానీ ఏదైనా జరిగిందా?" అంటూ ఇంద్రజ వర్షని అడుగుతుంది. "నా లైఫ్ లో ఇంకా అదృష్టం, లక్  ఉంది అంటే అది నా ఇమ్ము మాత్రమే.. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లెమ్, వాడేంటి, ఈమేంటి అనే కామెంట్స్ వచ్చినా అవన్నీ పట్టించుకోను.. నాకు నా ఇమ్ము అంటే ఇష్టం" అంటూ ప్రేమగా ఇమ్ము వైపు చూస్తుంది వర్ష. "ఇమ్ము మీ మమ్మీకి చెప్పు కోడలొస్తుందని" అని చెప్తూ వర్ష నవ్వుతో స్టేజి మీద నుంచి వెళ్ళిపోతుంది. ఐతే ఇమ్ముని, వర్షాను ఒకానొక సందర్భంలో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ చేశారు. రంగుని, జెండర్ ని ప్రత్యేకంగా చూపిస్తూ కామెంట్స్ కూడా చేశారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఇక స్టేజి మీద వర్ష చెప్పకుండానే లవ్ అండ్ మేరేజ్ ప్రొపోజల్ చెప్పేసరికి ఇమ్ము కూడా షాక్ అయ్యాడు.. బులెట్ భాస్కర్ ఇమ్మూకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. రష్మీ కూడా వీళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది.  ఇటీవల ఈ షోలో ఏదైనా ఒక  జంట ఆడియెన్స్ మెప్పు పొందితే చాలు ఇక ప్రతీ షోలో వాళ్లే జంటగా పెర్ఫార్మ్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటి కోవలోకి వస్తారు సుధీర్, రష్మీ. ఈ  జంట ఇలాగే పాపులర్ అయ్యింది. తర్వాత ఇద్దరికీ పెళ్ళెప్పుడు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. తర్వాత వర్ష, ఇమ్ము, సీరియల్స్ లోకి వచ్చేసరికి రవి కృష్ణ, నవ్య స్వామి. వీళ్లంతా స్క్రీన్ పెయిర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

సుడిగాలి సుధీర్ గుండెల్లో ర‌ష్మీ!

బుల్లితెర‌పై ర‌ష్మీ గౌత‌మ్ - సుడిగాలి సుధీర్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌. వీళ్ల‌ద్ద‌రు షోలో వుంటే ఆ షో బ్లాక్ బ‌స్ట‌రే. టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ కి వెళ్లి షోని టాప్ లో నిల‌బెడుతుంది. అంత‌గా వీళ్ల జంట పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే స్థాయిలోనూ వీరికి భారీ ఫ్యాన్ బేస్ కూడా ఏర్ప‌డింది. ర‌ష్మీ - సుడిగాలి సుధీర్ మ‌ధ్య క‌నిపించే కెమిస్ట్రీ.. ఇద్ద‌రి మ‌ధ్య పుట్టే రొమాన్స్.. వీళ్లు ల‌వ‌ర్స్ అని, బ‌య‌ట‌ప‌డ‌కుండా ప్రేమాయ‌ణం సాగిస్తున్నారంటూ ఇప్ప‌టికే చాలా వార్త‌లు పుట్టుకొచ్చాయి.   ర‌ష్మీ - సుధీర్ క‌లిసి డాన్స్ రియాలిటీ షో 'ఢీ'కు వెళ్లాక ఆ ప్ర‌చారం మ‌రింత‌గా పెరిగింది. షోలో డాన్స్ చేసేవాళ్ల కంటే వీరిద్ద‌రి కోస‌మే ఈ షోని చూసిన వాళ్లున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు ఇద్ద‌రికున్న క్రేజ్ ఎలాంటిదో! షో లోనూ ఇద్ద‌రూ ల‌వ‌ర్స్ గా ఒక‌రిని ఒక‌రు టీజ్ చేసుకుంటూ క‌నిపించిన తీరు మ‌రింత మందిని వారికి అభిమానులుగా మార్చింది. అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్ `ఢీ` షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కు కూడా సుధీర్ గుడ్ బై చెప్పేశాడు. ప్ర‌స్తుతం జీటీవి, స్టార్ మాల‌లో ప్ర‌త్యేక షోల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజాగా జీ తెలుగులో ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్ర‌త్యేక ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. దీనికి శ్రీ‌ముఖితో క‌లిసి సుడిగాలి సుధీర్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ షోలో `విరాట‌ప‌ర్వం` టీమ్ రానా, సాయి ప‌ల్ల‌వి, డి. సురేష్ బాబు తో పాటు `ప‌క్కా క‌మ‌ర్ష‌యిల్‌` టీమ్ గోపీచంద్‌, రాశిఖ‌న్నా, మారుతి పాల్గొన్నారు. వీరితో పాటు రాజీవ్ క‌న‌కాల‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, శైల‌జ ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఇదే కార్య‌క్ర‌మంలో టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులు, సుడిగాలి సుధీర్ అభిమానులు పాల్గొన్నారు. వాళ్ల‌లో కొంత మంది స్టేజ్ పైకి వ‌చ్చారు.  ఓ ఏడేళ్ల పిల్లాడు సుధీర్ ని 'బాబాయ్' అని పిల‌వ‌డ‌మే కాకుండా 'ర‌ష్మీ పిన్ని ఏది?' అంటూ అమాయ‌కంగా అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు సుడిగాలి సుధీర్ ఎమోష‌నల్ అయ్యాడు. 'ర‌ష్మీ గుండెల్లో వుంటుంది.. బ‌య‌టికి రాదు'.. అన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మం ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం కానుంది. 

సాయికిర‌ణ్‌ను దేవుడ‌నుకున్న తాగుబోతు!

టాలీవుడ్ లో సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ చేస్తూ మంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిన సాయి కిరణ్ మనందరికీ తెలుసు. 2000లో విడుదలైన మూవీ 'నువ్వే కావాలి'లో  "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో మంచి పాపులర్ అయ్యాడు సాయికిరణ్. ప్రకాష్ పాత్రలో సెకండ్ హీరోగా చేసినా గుర్తుండిపోయే రోల్ లో నటించాడు. ఈ సాయికిరణ్ గాయ‌కుడు రామ‌కృష్ణ కుమారుడు అన్న విషయం కూడా అందరికి తెలుసు. ఐతే ఆయన 'నువ్వే కావాలి' సక్సెస్ ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. తర్వాత చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యేసరికి తెరమరుగయ్యాడు.  'నువ్వే కావాలి' తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు' వంటి  మూవీస్ లో యాక్ట్ చేశాడు సాయికిరణ్. ఆ   తర్వాత మంచి ఆఫర్స్ రాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. జగపతి, షిర్డీసాయి, నక్షత్రం, గోపి గోడ మీద పిల్లి మూవీస్ లో నటించాడు. బిగ్ స్క్రీన్ మీద అనుకున్న స్థాయిలో క్లిక్ అవకపోయేసరికి స్మాల్ స్క్రీన్ మీద దృష్టి పెట్టి 'కోయిలమ్మ' సీరియల్ లో నటించి పర్వాలేదనిపించాడు. 'కోయిలమ్మ' సీరియల్ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో మహేంద్ర రోల్ లో నటిస్తున్న సాయికిరణ్ మనందరికీ తెలుసు. అలాంటి సాయికిరణ్ కి ఇటీవల నరసింహ స్వామి ఆలయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. తాను ఆలయానికి వెళ్ళినప్పుడు మద్యం మైకంలో ఉన్న ఒక వ్యక్తి సాయికిరణ్ ని చూసి, అతనే నిజమైన దేవుడిగా భావించి ప్రపంచంలోని సమస్యలు పరిష్కరించాలంటూ "రా దిగిరా" అంటూ డిమాండ్ చేసాడు. సాయికిరణ్ కూడా అతన్ని ఏమీ అనలేక సైలెంట్గా అతన్ని దీవించేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.  బుల్లితెర సెలబ్రిటీస్ చాలామంది ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ఐతే నెటిజన్స్ మాత్రం మీరు నిజంగా నరసింహస్వామి లానే కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఆ ఆధ్యాత్మిక భావన అనేది కనిపిస్తుంది కాబట్టే అతనికి మీరు దేవుడిలా కనిపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐ లవ్ మిర్రర్స్ అంటున్న రిషి సర్

ముకేష్ గౌడ పేరంటే ఎవరికీ తెలీదు కానీ రిషి సర్ అంటే చాలు చాలామందికి ఇట్టే అర్థమైపోతుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో కాలేజీ లెక్చరర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సాయంత్రం స్టార్ మాలో 7 గంటలకు వచ్చే క్యూట్ లవ్ స్టోరీ ఇది. వసుధారా , రిషి సర్, మహేంద్ర, జగతి ఈ కేరక్టర్స్ తో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇందులో రిషి సర్ గా ముకేష్ గౌడ్, వసుధారగా రక్షా గౌడ్ నటిస్తున్నారు. వీళ్లిద్దరు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ తమ అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిషి తన మూడ్స్ ని రకరకాల యాంగిల్స్ లో సెల్ఫీస్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. "నాకు అద్దాలంటే ఇష్టం ఎందుకంటే అవి నన్ను ప్రేమిస్తాయి" అనే కాప్షన్ తో రిషి తన పిక్స్ ని పోస్ట్ చేసాడు.

సుధీర్ ని హౌలే అంటూ గాలి తీసేసిన సాయి ప‌ల్ల‌వి

ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ జీ తెలుగులో ఫాద‌ర్స్ డే, మ్యూజిక్ డే సంద‌ర్భంగా  `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్ర‌త్యేక‌ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జూన్ 19న‌ ఈ ఆదివారం ఈ షో ప్ర‌సారం కానుంది. సుడిగాలి సుధీర్‌, శ్రీ‌ముఖి ఈ షోకు యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో టీవీ స్టార్లు, క‌మెడియ‌న్ లు, సింగ‌ర్స్‌, టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులు పాల్గొని సంద‌డి చేశారు. ఈ షోలో గెస్ట్ లుగా రానా, సాయి ప‌ల్ల‌వి, సురేష్ బాబు,  హీరో గోపీ చంద్‌, రాశీఖ‌న్నా, ద‌ర్శ‌కుడు మారుతి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ షోలో జూలై 1న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`  మూవీ హీరో గోపీచంద్‌, హీరోయిన్ రాశీ, ద‌ర్శ‌కుడు మారుతి పాల్గొన్నారు. ఆ త‌రువాత ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `విరాట‌ప‌ర్వం`లో న‌టించిన రానా, సాయి ప‌ల్ల‌వి, ఈ మూవీ స‌మ‌ర్ప‌కులు డి. సురేష్ బాబు పాల్గొన్నారు. ముందు గోపీచంద్‌, రాశిఖ‌న్నా పాల్గొన్న ఈ షోలో ఈ ఇద్ద‌రు క‌లిసి సుడిగాలి సుధీర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చివ‌ర్లో రాశిఖ‌న్నా, సుడిగాలి సుధీర్ క‌లిసి డాన్స్ చేశారు. ఇదే త‌ర‌హాలో గోపీచంద్‌, శ్రీ‌ముఖి కూడా స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. ఆ త‌రువాత ఎంట్రీ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి, రానా, సురేష్ బాబు నానా హంగామా చేశారు. ప్రోమో షాట్ కోసం రానా ఏసిన పంచ్ లు,,సాయి ప‌ల్ల‌వి డాన్స్ తో అద‌ర‌గొట్టింది. ఆ త‌రువాత సుధీర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సాయి స‌ల్ల‌వి దిమ్మ‌దిరిగే పంచ్ ఇచ్చింది.. హౌలేగా అంటాన‌ని చెప్ప‌డంతో సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. త‌రువాత నిర్మాత డి. సురేష్ బాబు .. త‌న‌యుడు రానా నాటి కాద‌ని, అంత‌కు మించి అని చెప్ప‌డం.. రానా గాళ్ ఫ్రెండ్స్ గురించి అడిగితే ఒక్క‌రో ఇద్ద‌రో కాద‌ని చాలా మందే వుండి వుంటార‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న వాళ్లంతా న‌వ్వుల్లో మునిగిపోయారు. `థాంక్యూ దిల్ సే` పేరుతో రూపొందిన ఈ షో జూన్ 19 ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం కానుంది.

న‌య‌ని కోసం వ‌చ్చిన గాయ‌త్రీదేవి ఆత్మ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'త్రిన‌య‌ని'. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. క‌న్న‌డ తార‌లు అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హర్షు, ప్రియాంక చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, చ‌ల్లా చందు, అనిల్ చౌద‌రి, సురేష్ చంద్ర న‌టించారు. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసి మూడో కంటితో క‌నిపెట్టే వ‌రం వున్న న‌య‌ని క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. సైకిల్ రేస్ లో పాల్గొని వ‌చ్చిన రూ. 10 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని ఓ పాప గుండె ఆప‌రేష‌న్ కోసం దానం చేస్తుంది న‌య‌ని. ఆమె చేసిన ప‌నికి విశాల్ అభినందిస్తాడు. కానీ క‌సి, వ‌ల్ల‌భ మాత్రం చాలా ఓవ‌ర్ గా వుంద‌ని అంటారు. ఈ విష‌యం తెలిసిస్తే తిలోత్త‌మ ఆంటీ ఎలా రియాక్ట్ అవుతుందోన‌ని క‌సి అంటుంది. అక్క‌డి నుంచి విశాల్‌, న‌య‌ని క‌లిసి ఇంటికి వెళ్లిపోతారు. సైకిల్ పోటీలో గాయ‌ప‌డిన న‌య‌ని నొప్పుల‌తో బాధ‌ప‌డుతుంటే విశాల్ ఆ గాయాల‌కు కాప‌డం పెడ‌తాడు. క‌ట్ చేస్తే... చ‌నిపోయిన గాయ‌త్రీ దేవీ ఆత్మ మ‌ళ్లీ న‌య‌ని కోసం వ‌స్తుంది. ఆమెకు మాత్ర‌మే క‌నిపిస్తూ త‌న త‌న‌యుడు విశాల్ ని చూస్తూ వుంటుంది. ఇదే క్ర‌మంలో ఆత్మ రూపంలో వున్న గాయ‌త్రీదేవి.. న‌య‌ని స‌హాయంతో త‌న‌యుడు విశాల్ కోసం వంట చేస్తుంది. వండిన వంట‌ని త‌న‌యుడు విశాల్ కు తినిపిస్తుంది. అయితే ఆ విష‌యం విశాల్ కు తెలియ‌కుండా తానే తినిపిస్తున్నాన‌ని, క‌ళ్లు మూసుకుని తిన‌మ‌ని విశాల్ తో న‌య‌ని చెబుతుంది. త‌ను చెప్పిన‌ట్టే చేస్తూ తింటుంటాడు విశాల్‌. అయితే చిన్న‌ప్పుడు మా అమ్మ వండి తినిపించిన గోరుముద్ద‌ల రుచి నాకు ఇంకా గుర్తుంది అంటాడు. ఆ మాట‌ల‌తో గాయ‌త్రీ దేవి ఆత్మ భావోద్వేగానికి లోన‌వుతుంది. ఇంత‌కీ గాయ‌త్రీదేవి ఆత్మ మ‌ళ్లీ ఎందుకొచ్చింది? .. ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

హిమ‌తో పెళ్లికి రెడీ.. ఏర్పాట్ల‌లో నిరుప‌మ్‌!

`కార్తీక దీపం` ఈ శుక్ర‌వారం 1380వ ఎపిసోడ్ లోకి ఎంట‌రైంది. ఈ రోజు విశేషాలేంటో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో...  `ఈ ఇంట్లో పెళ్లి ప‌నులు మొద‌లు కావాలి. హిమ‌ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ముందు మీరు వెళ్లి షాపింగ్ చేయండి..  ఆ త‌రువాత అమ్మ‌మ్మ వాళ్ల ఇంటికి వెళ్లి హిమ లేని స‌మ‌యంలో వాళ్ల‌కి విష‌యం చెప్పండి` అని స్వ‌ప్న‌, స‌త్య‌ల‌కు ఆర్డర్స్ వేస్తాడు నిరుప‌మ్‌. త‌ను చెప్పిన‌ట్లే స్వ‌ప్న‌, స‌త్య‌లు ప‌నులు ప్రారంభిస్తారు. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య ఉద‌యాన్నే లేచి.. దీప, కార్తీక్ ల ఫొటో ముందు నిల‌బ‌డి `పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు పెద్దోడా.. దీపా.. ఈ రోజు ఏంటో చాలా రోజుల త‌రువాత ప్ర‌శాంతంగా నిద్ర‌ప‌ట్టింది` అంటుంది. ఇదే స‌మ‌యంలో స్వ‌ప్న‌, స‌త్య‌లు వ‌చ్చి నిరుప‌మ్ అన్న మాట‌ల్ని చెవిన వేస్తారు. `ఇంట్లో పెళ్లి ప‌నులు మొద‌లు పెట్టాల‌ని.. ప‌సుపు కొట్ట‌మ‌ని చెప్పాడ‌ని, హిమ‌ని నిరుప‌మ్‌ పెళ్లి చేసుకుంటాన‌న్నాడ‌ని, త‌న‌ని తీసుకుని మీరు అక్క‌డికే వ‌చ్చేయండ‌ని చెప్పి స్వ‌ప్న‌, స‌త్య‌లు వెళ్లిపోతారు. విష‌యం విని సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు ఆనంద‌ప‌డ‌తారు. క‌ట్ చేస్తే.. జ్వాల‌కు నిరుప‌మ్ ఫోన్ చేస్తాడు. నువ్వు మా ఇంటికి రావాలంటాడు. మీరు పిల‌వాలే గానీ రాకుండా వుంటానా డాక్ట‌ర్ సాబ్ అంటుంది జ్వాల‌. అయితే ఓ అర‌గంట ఆగి ర‌మ్మ‌ని చెబుతాడు అలాగే అంటుంది జ్వాల‌. జ్వాల రాగానే హిమ‌కు క్యాన్స‌ర్ అని, హిమ‌ని త‌ప్ప నేను మ‌రెవ‌రిని పెళ్లి చేసుకోలేన‌ని , ఈ జ‌న్మ‌కు త‌నే నా భార్య అని చెప్పేస్తాన‌ని ప్రిపేర్ అవుతుంటాడు నిరుప‌మ్‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. నిరుప‌మ్ చేస్తున్న హ‌డావిడి హిమ‌, జ్వాల‌ల‌కు తెలిసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

హుస్సేన్ సాగర్ మధ్యలో ఏముంటుంది?.. అన‌సూయ ప్ర‌శ్న‌

సుధీర్ లేకపోయినా, నాగబాబు, రోజా లేకపోయినా జబర్దస్త్ తన స్థాయిలో ఎలాంటి మార్పు లేకుండా ప్రతీ వారం ఎంతో కొంత కొత్తదనాన్ని తెలుగు ఆడియన్స్ కి అందిస్తూ ముందుకెళుతోంది.  ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ కి 'చోర్ బజార్' టీం వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోలో అనసూయ "జబర్దస్త్ స్కూల్" అనే ఒక స్కిట్ లో స్టూడెంట్స్ ని కొన్ని ప్రశ్నలు వేస్తుంది. వాటిలో ఒక‌టి.. "అశోకుడు రోడ్లకిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు?".. 'చెల్లెలి కాపురం' సీరియల్ లో నటించిన భూమి అలియాస్ శిరీష ఈ స్కిట్ లో స్కూల్ స్టూడెంట్ గా కనిపిస్తుంది.. 'చెట్లు నాటకపోతే అవి పడిపోతాయి కదా అందుకే నాటాడు' అని చిలిపి జవాబు చెప్తుంది. "హుస్సేన్ సాగర్ మధ్యలో ఏముంటుంది అంటూ మళ్ళీ అడిగింది అన‌సూయ‌. 'కార్తీక దీపం' సీరియల్ లో హిమ కేరక్టర్ చేసిన సహృద ఆన్సర్ ఇస్తుంది. 'హుస్సేన్ సాగర్ మధ్యలో లోతుంటుంది' అని.  ఇక ఈ షో లో "మా దగ్గర అన్ని దొరుకుతాయి" అనే స్కిట్ లో  నూకరాజు, చలాకీ చంటి పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. మంచి ఎంటర్టైన్ కూడా చేసింది. నూకరాజుని తన పేరేమిటని  అడిగాడు చంటి. 'భూమి ఇడ్లీ' అంటాడు నూకరాజు. 'అదేం ఇడ్లీ?' అంటాడు చంటి ఆశ్చ‌ర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ. 'ఆయన ఆకాష్ పూరి అని పెట్టుకుంటే తప్పులేదు కానీ నేను భూమి ఇడ్లీ పెట్టుకుంటే తప్పా' అంటూ మంచి టైమింగ్ వున్న రైమింగ్ తో ఫన్ క్రియేట్ చేశాడు నూకరాజు. ఇక ఈ స్కిట్స్ అన్ని వచ్చే వారం ప్రసారం కాబోతున్నాయి.

సొంత అక్కే మోసం చేసిందన్న షకీలా

షకీలా అనే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. శృంగార తారగా పేరుతెచ్చుకుంది. సౌత్ ఇండియా మొత్తానికి ఆమె పేరు సుపరిచితమే. 1990 s లో మలయాళ ఇండస్ట్రీని ఏలింది షకీలా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఈమె తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పింది. తన ఆస్తి పోవడానికి కారణం కూడా చెప్పింది.  మా అమ్మ అక్కను బాగా నమ్మేది నాకంటే ఎక్కువగా. నేను కూడా అక్కని ఎక్కువ నమ్మాను. కానీ నమ్మినందుకు అక్కే నన్ను మోసం చేసింది. మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నాను అక్కను. ఐతే నా దగ్గర సుమారు రెండు కోట్లకు పైనే డబ్బు తీసుకుంది. ఇంట్లో పెడితే ఐటీ సమస్య వస్తుందని అమ్మకు చెప్పి నా డబ్బు తాను జాగ్రత్త చేస్తానని చెప్పి చివరికి మొత్తం తీసేసుకుంది. నేను వెళ్లి నా డబ్బు అడిగితే ఎవరికో ఇచ్చానని అతను మోసం చేసి పోయాడని చెప్పింది నాకు. ఏం చేయాలో నాకు అర్ధం కాలేదు. కష్టపడిందంతా అలా అక్క పాలయ్యింది. ఏ పని చేసినా  అక్కకు చెప్పకుండా చేసే అలవాటు నాకు లేదు. బయటి వాళ్ళు మోసం చేస్తే కేసులు పెడతాం ఏమైనా చేస్తాం కానీ సొంత అక్క కదా ఏం చేయగలం అంటూ అలీతో సరదాగా షోలో కన్నీళ్లు పెట్టుకుంది షకీలా. ఇక ఇప్పుడు చెప్పుకోలేని విషయం ఏమిటంటే ఐదేళ్లుగా మా అక్క నాతో మాట్లాడ్డం మానేసింది. ఎందుకు మాట్లాడం లేదని అడిగాను. నువ్ సినీ ఆక్టర్ వి కదా. మా పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి..వాళ్ళ ఇళ్లల్లో నీతో మాట్లాడ్డానికి ఒప్పుకోవడం లేదని చెప్పింది. మనం గుడ్డిగా ఎవరిని నమ్ముతామో వాళ్ళు కూడా మనల్ని అలాగే మోసం చేస్తారు అని తెలిసొచ్చింది అంటూ  షకీలా తన మనసులో బాధల్ని పంచుకుంది.

'భార్య అంటే ఎవ‌రు?' అంటూ నందూని ఇరికించిన యాంక‌ర్‌

నందు ఫ్యామిలీ, తులసి ఫామిలీ ఒక కాంటెస్ట్ కి వెళ్తారు. అక్కడ నందు, తులసి, అభి, దివ్య వీళ్లంతా ఆ పోటీలో విన్ అవుతారు. లాస్య ఈ హ్యాపీ మూమెంట్ ని చూసి కుళ్లిపోతూ ఉంటుంది. తర్వాత నందుకి యాంకర్ ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తుంది, 'అసలు భార్య అంటే ఎవరు?' అని. నందు నీళ్లు నములుతూ ఉంటాడు. ఇంతలో నందు వాళ్ళ నాన్న మధ్యలో ఎంటరై 'గడ్డ కట్టే చలిలో కూడా చెమటలు పట్టించేదే భార్య' అంటూ ఫన్ క్రియేట్ చేస్తాడు. 'విన్నర్స్ అందరికి కశ్మీర్ వెళ్ళడానికి ఫ్లయిట్ టికెట్స్ ఫోన్ చేసి ఇస్తాం' అని చెప్తుంది యాంకర్. తులసిని వదిలేసి వెళ్లిన నందుని ఈ కాంటెస్ట్ తర్వాత లాస్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. మరో వైపు నందు బిజినెస్ కోసం డబ్బు అవసరం అని చెప్పకుండా అభి.. భార్య‌ను డబ్బు కావాలి అని అడుగుతాడు. అంకిత మిస్ అండ‌ర్‌స్టాండ్‌ చేసుకుంటుంది. ప్రేమ్ చేసే ఆల్బం కోసం డబ్బు అడుగుతున్నాడనుకుని ఐదు లక్షల చెక్ ఇస్తుంది. అది చూసి అభి కోపంతో రంకెలేస్తాడు, 'మా నాన్నకు మాటిచ్చాను బిజినెస్ చేసుకోవడానికి డబ్బు తెస్తాను' అని. 'అది నాకు సంబంధం లేదు' అంటుంది అంకిత.  ఇక తులసి చెప్పే సంగీతం క్లాసెస్ కి  ఆ కాలనీ కన్వీనర్ చాలా మంది పిల్లల్ని తెచ్చి చేర్పిస్తుంది. అప్పుడు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అంకిత పెట్టె సర్దుకుని పుట్టింటి నుంచి అత్తింటికి  వచ్చేస్తుంది. తులసి రావద్దని చెప్పినా అంకిత ఎందుకు మళ్ళీ అత్తగారింటికి వచ్చిందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం స్టార్ మాలో  ప్రసారం అయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

జానీ మాస్టర్ కి కోపం తెప్పించిందెవరు?

ఢీ డ్యాన్సింగ్ షో.. అటు అదరగొట్టే డ్యాన్సులతో, ఆది-ప్రదీప్ కామెడీతో, అందమైన జడ్జెస్ నవ్వులతో దూసుకుపోతోంది. ఈ షో ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇటీవల ఈ షో లేటెస్ట్ ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో జానీ మాస్టర్ చాలా సీరియస్ గా సీట్ లోంచి లేచి వెళ్లిపోవడం చూపించారు. ఇక ఈ ప్రోమోలో ఒక రష్యన్ భామతో ఆది చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పిస్తుంది. 'పుష్ప' మూవీ నుంచి "ఊ అంటావా" సాంగ్ కి రష్యన్ బ్యూటీ చేసిన డాన్స్ అద్దిరిపోయింది. "వందేమాతరం...మనదే ఈ తరం" అనే సాంగ్ కి కొంతమంది డాన్సర్స్ అదరగొట్టేసారు. ఈ సాంగ్ కి జడ్జెస్ లేచి సెల్యూట్ చేశారు కూడా. అప్పటివరకు అంతా బానే నడిచింది. అంతలోనే  జానీ మాస్టర్ సీరియస్ ఇపోయారు. "ఢీ షో చాలా పవర్ ఫుల్, సీరియస్ గానే చెబుతున్నా, పెర్ఫార్మెన్స్ ఏమీ బాలేదు, కొరియోగ్రఫీ కూడా బాగా లేదు. అసలు ఏం బాలేదు" అంటూ జడ్జి సీటులోంచి లేచి వెళ్లిపోయారు జానీ మాస్టర్. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఇంతకు జానీ మాస్టర్ కోపానికి కారణం ఏమిటి? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వారం ఎపిసోడ్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.

నాన్న లేని లోటు ఎవరూ తీర్చలేనిది

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఒక మంచి వేదిక. ఐతే ఇప్పుడు ఫాదర్స్ డే రాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ నాన్న నా హీరో అనే పేరుతో వచ్చే వారం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో ఫాదర్స్ v / s సన్స్ స్కిట్స్ మంచి రసవత్తరంగా , పంచ్ డైలాగ్స్ తో నిండిపోయింది. బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న, నూకరాజు వాళ్ళ నాన్న, గలాటా గీతూ వాళ్ళ నాన్న, ఆడపిల్లన్నమ్మ అనే పాటతో సెన్సేషన్ సృష్టించిన మాధప్రియ వాళ్ళ నాన్న ఇలా చాలామంది ఆర్టిస్ట్స్ వాళ్ళ ఫాదర్స్ తో వచ్చి స్టేజి మీద పెర్ఫార్మ్ చేశారు. అలాగే ఒకరికి ఒకరు సేమ్యా తినిపించుకుని విషెస్ చెప్పుకున్నారు. గుడ్ పేరెంట్స్, బాడ్ పేరెంట్స్ ఉంటారో లేదు తెలీదు, కానీ నేను నాన్న దగ్గర నుంచి ఎలాంటి ఎఫెక్షన్ ని చూడలేదు అంటూ యాంకర్ రష్మీ కంటి తడి పెట్టేసరికి అక్కడున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. మిగతా ఆర్టిస్ట్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ నాన్నల పాత్ర గురించి చెప్పుకుని కాసేపు బాధపడ్డారు. నాటీ నరేష్ గుమ్మాడి గుమ్మాడి అంటూ డాడీలో సాంగ్ పాడి అందరికి బోర్ కొట్టించి మరీ ఎంటర్టైన్ చేసాడు. శ్రీవాణి హస్బెండ్  విక్రమ్ చేసిన స్కిట్ తో పూర్ణ చాలా ఎమోషన్ అయ్యింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి మనసులో జూనియర్ పూజా హెగ్డే!

ఆహా ఓటిటి పై తెలుగు ఇండియన్ ఐడల్ షో మంచి స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఎవరు అనే విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ రాబోతున్నారు. ఆయన చేతులమీదుగా ఇండియన్ ఐడల్ టైటిల్ ని విన్నర్ కి అందించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టైంలో చిరంజీవి వాగ్దేవి మీద ఒక కవితను చెప్పారు. "డియర్ వాగ్దేవి, నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి, నా రూములో పెట్టుకున్న ఫోటో నీది..." అంటూ గుటకలు మింగుతూ "ఇది నేను రాయలేదు ప్రామిస్" అంటూ చిరంజీవి వాగ్దేవి గురించి చదివిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్  ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీపడబోతున్నారు. ఈ ఐదుగురిలో వాగ్దేవి ఒకరు. 17 న జరగబోయే తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కాస్త మెగాస్టార్ రాకతో మెగా ఫినాలేగా మారబోతోంది.  ఇక వాగ్దేవి తన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది. బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ కూడా వాగ్దేవిని పూజా హెగ్డేతో పోల్చడం, తను సంతోషపడడం స్టేజి మీద చూసాం. బాలయ్య కూడా ఈ షోకి వచ్చి  ఒక బిరుదు ఇచ్చేసారు. వాగ్దేవి కాదు వావ్ దేవి అని. ఈ మెగా ఫినాలే ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.  మరి ఈ మెగా ఫినాలేలో వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.

సెల్ఫీలంటే ఇష్టం ఉండదు అన్న సుమ

సుమ గురుంచి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన మాటల చాతుర్యంతో ఎలాంటి షోనైనా అలవోకగా చేసేస్తుంది. అలాంటి సుమకి సెల్ఫీలు దిగడమంటే అస్సలు ఇష్టం ఉండదట. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు దాన్ని ముగించుకుని వచ్చేయడమే అలవాటు. ఈ సెల్ఫీలు ఇవన్నీ అనుకోకుండా అప్పటికప్పుడు జరిగే పనులు. వీటి వల్ల టైం వేస్ట్ అవుతుంది. అదే టైం లో ఇంకో చోట ఏదైనా షూటింగ్ ఉండొచ్చు, ఏదైనా కార్యక్రామినికి టైం ఐపొతూ ఉండొచ్చు , లేదంటే స్కూల్నుంచి పిల్లలనైనా తీసుకు రావాల్సిన అవసరం రావొచ్చు. ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే తర్వాత జరగాల్సిన పనులకు బ్రేక్ పడుతుంది. అనుకున్న టైంకి చేయలేకపోతాం అందుకే నాకు సెల్ఫీలంటే పెద్దగా ఇష్టం ఉండదు అంటూ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పుకొచ్చింది సుమ. ఇన్ కంటాక్స్ కట్టలేదని, రాజీవ్ తో విడాకులు తీసుకుంటున్నానని ఇలాంటి చాలా రూమర్స్ వస్తాయ్ కదా అప్పుడు మీరెలా ఫీలవుతారు అని యాంకర్  అడిగిన ప్రశ్నకు వాటిని అస్సలు పట్టించుకోను అని చెప్పుకొచ్చింది.