ఈ కటౌట్ చూడగానే నేను రనౌట్.. వర్షిణి హాట్ కామెంట్స్

స్టార్ మా అంటే చాలు అలుపులేని షోస్ కి అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ స్టార్ మాలో వినాయక చవితి స్పెషల్ సందడి మొదలైపోయింది. "మాతో పండగే పండగ" అంటూ ప్రతీ గడపలో నవ్వుల పూలు పూయించేందుకు స్పెషల్ షో వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా ఈ షోలో బుల్లి తెర నటుల ఆటాపాటా మాములుగా లేదు. ఈ షోకి హోస్ట్ గా రవి, వర్షిణి వచ్చేశారు. ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా "రంగరంగ వైభవంగా" మూవీ టీం వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ విచ్చేసి ఫుల్ ఎంటర్టైన్ చేసేసారు. "ఈ కటౌట్ చూడగానే నేను రనౌట్ ఐపోయాను" అంటూ వైష్ణవ్ తేజ్ కి వర్షిణి సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చేసింది.    ఇక భీమ్లా నాయక్ సాంగ్ కి వైష్ణవ్ , కేతిక డాన్స్ చేశారు. "నేను నిన్నే చూస్తాను..నీ గురించే కలలు కంటాను" అంటూ అవినాష్ కేతికతో ఫ్లర్ట్ చేస్తుంటాడు. "నీకు పెళ్లయిపోయింది" అంటూ ఎక్స్ప్రెస్  హరి అనేసరికి " నీకు పెళ్లయిందా అంటూ కేతికా అడుగుతుంది..కాదు వాళ్లంతా అబద్దాలు చెప్తున్నారు" అంటూ జోక్ చేస్తాడు.    సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఈవెంట్ లో అందరూ కలిసి కేక్ కోసి పవన్ కి విషెస్ చెప్తారు. ఇక మధ్యలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి షోకి మంచి జోష్ ని తెచ్చింది. ఇక తర్వాత వంటలక్క ఎంట్రీ అద్దిరిపోయింది. ఫైనల్ గా అమరదీప్, తేజుకి బుల్లితెర నటులంతా కలిసి ఉంగరాలు మార్పించి, దండాలు మార్పిస్తారు. తేజు వాళ్ళ నాన్న విగ్రహాన్ని తయారు చేసి ఈ ఈవెంట్ స్టేజి మీద పెట్టి తేజు వాళ్ళ అమ్మని పిలుస్తారు. ఆ సన్నివేశం అందరినీ కంటతడి పెట్టించింది.

నువ్వేమన్నా అందగత్తె అనుకుంటున్నావా?.. బుంగమూతి పెట్టుకున్న దీప్తి

దీప్తి సునైనా సోషల్ మీడియాలో మంచి ఫేమస్ పర్సన్. డబ్ మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకుంది. డాన్స్ వీడియోస్ చేస్తూ యూత్ లో  క్రేజ్ పెంచుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా దీప్తి సునైనాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చాకా తన క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఇక దీప్తి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్స్ ప్రశ్నలకు కొంటెగా జవాబులు ఇస్తూ ఉంటుంది.   ఇటీవల దీప్తి " ఆస్క్ మీ ఏ కొషెన్" అంటూ తన స్టేటస్ లో పోస్ట్ చేసేసరికి ఒక కొంటె నెటిజన్ " నువ్వేమన్నా అంత అందగత్తె అనుకుంటున్నావా.. జిమ్ లో ఫొటోస్ పెడుతూ షో చేస్తున్నావ్ రోజూ.. చూడలేకపోతున్నాం" అని అనేసరికి "అందగత్తెలే పోవాలా బ్రో...జిమ్ కి" అని బుంగమూతి పెట్టుకుని మరీ ఆన్సర్ ఇచ్చింది.   అలాగే ఇంకో నెటిజన్ "ఎందుకు అన్నిటికి తిక్క ఆన్సర్స్ ఇస్తావ్" అనేసరికి " నాలో సెన్సాఫ్ హ్యూమర్ ఎంతుందో తెలుసుకోవడానికి" అంటూ ఆన్సర్ ఇచ్చింది. "నీ వెయిట్ ఎంత అన్నదానికి... ఎవరూ మోయలేనంత..నీ ఏజ్ ఎంత అనేసరికి ఎవరూ లెక్కపెట్టలేనంత " అంటూ కొంటెగా ఆన్సర్స్ ఇచ్చింది దీప్తి.

చూద్దామని వెళ్ళా.. మిస్టర్ మెస్మరైజ్ అవార్డు వచ్చేసింది

గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర మీద దూసుకుపోతోంది. అందులో రిషి, వసుధారా పాత్రలు ఇప్పుడు హైలైట్. సీరియల్ ఐనా కూడా నిజమైన ప్రేమికులేమో అన్నంత బాగా ఆ పాత్రల్లో లీనమై నటించేశారు. ఇక ఇప్పుడు రిషి అలియాస్ ముకేష్ గౌడ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.   "మైసూర్ లో ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా  జరిగే అందాల పోటీల్లో ఫ్రెండ్స్ తో సరదాగా చూడడానికి వెళ్లి ఫ్రెండ్స్ ఫోర్స్ మీద పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది . ఐతే ఆ పోటీకి డ్రెస్ కోడ్ ఉంది. దానికి బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకోవాలి. ఐతే అప్పటికి నా దగ్గర ఆ కలర్ లేకపోయేసరికి నా ఫ్రెండ్ అప్పటికే బయటికి వచ్చిన ఒక కంటెస్టెంట్ దగ్గర నుంచి అడిగి తీసుకుని నా పేరు రిజిస్టర్ చేయించేశారు. అప్పుడు ఆ టీ షర్ట్ తీసుకుని  రెస్ట్ రూమ్ కి వెళ్ళాను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. నేను రెడీ అవుతున్న టైంకే నా పేరు పిలిచేసారు. ఒక్కసారిగా నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. వెంటనే రెస్ట్ రూమ్ నుంచి నా స్టైల్ లో నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్ గా టాప్ 10 లో నా పేరు వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్స్ లో నాకు మిస్టర్ మెస్మరైజ్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మరో కాంపిటీషన్ కి వెళ్తే బెస్ట్ స్మైల్ అవార్డు ఇచ్చారు.." అంటూ చెప్పాడు రిషి.   ఇంకా "నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అన్నిటిలోకి ఆవు అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే ఏ జంతువైనా సీరియస్ గా కనిపిస్తుంది ఒక్కసారైనా..కానీ ఆవులో ఆ సీరియస్ నెస్ అస్సలు కనిపించదు.. ఎప్పుడూ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే గోమాతను పూజిస్తే పుణ్యం అంటారు" అంటూ రిషి ఆవు గురించి తన మనసులో మాట చెప్పాడు.

ఒక పన్ను మిస్ అయ్యింది..అది సెట్ అయ్యాకే నా చెల్లి పెళ్లి..కామెడీ పోస్ట్ తో రవి కౌంటర్! 

ప్రియాంక సింగ్ బుల్లి తెర మీద మంచి  ఫేమస్ పర్సన్. బిగ్ బాస్ - 5 లో పాల్గొని ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇకపోతే కొద్దిరోజులుగా ప్రియాంకాసింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్  చేసిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్‌ లెహంగాలో పెళ్ళికూతురిలా ముస్తాబైన ఫొటోస్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది ప్రియాంక.  ఇవన్నీ చూసి  ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది అందరూ  కంగ్రాట్స్‌ ప్రియాంక అంటూ  విషెస్‌ పోస్ట్ చేస్తున్నారు. నిజంగానే పెళ్లా లేదంటే ఏదైనా షూటింగ్ కి సంబంధించిన ఫొటోసా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఐతే ఇప్పుడు యాంకర్ రవి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ఒకదాన్ని  తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి అందరిని షాక్ అయ్యేలా చేసాడు " నా చెల్లి పెళ్ళికి ఇంకా చాలా  టైం ఉంది..ఎందుకంటే ఈ ఎత్తు పళ్ళల్లోంచి ఒక పన్ను మిస్ అయ్యింది. అది సెట్ చేసాక పెళ్లి చేస్తాం" అంటూ పెట్టిన ఒక కాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ప్రియాంకాసింగ్ ఎత్తుపళ్లతో ఉన్న ఫిల్టర్ వాడి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఇక నెటిజన్స్ ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ప్రియాంకాసింగ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు, రూమర్స్ కి భలే చెక్ పెట్టారు అంటూ కామెంట్ చేసారు.  

నాన్న రోడ్డున పడేసిపోయాడు.. అమ్మ మమ్మల్ని పెంచింది!

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రాబోయే ఎపిసోడ్ లో గాజువాక డిపో లేడీ కండక్టర్ ఝాన్సీ చేసిన "పల్సర్ బైక్" సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. తన ఈ కష్టం వెనక ఎన్నో చెప్పుకోలేని బాధలున్నాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మూడు నెలలు గంజి అన్నం, ఆవకాయ్ తిని బతికానని చెప్పింది. "పోలీస్ కానిస్టేబుల్ గా చేసిన నాన్న మా కుటుంబాన్ని రోడ్డున పడేసి వెళ్ళిపోతే అమ్మ మమ్మల్ని వదిలిపెట్టకుండా పాన్ షాప్ పెట్టుకుని, ఉల్లిపాయలు  అమ్మి చదివించింది" అని చెప్పింది. ఇన్ని కష్టాల మధ్యలో తాను 8th క్లాస్ చదివేటప్పుడు డాన్స్ నేర్చుకోవడం అలాగే ఎన్నో షోస్ లో ప్రైజెస్ విన్ ఐనట్లు చెప్పింది. ఎంతో మంది "కూతురు రోడ్డు మీద డాన్స్ చేసి సంపాదిస్తుంటే తింటున్నారా?" అంటూ అమ్మని, తమ్ముడిని హేళ‌న చేశార‌ని కన్నీళ్లు పెట్టుకుంది.  ఐతే ఇప్పుడు తన తమ్ముడిని ఎంబీఏ చదివించానని.. ఇప్పుడు హెచ్.ఆర్. మేనేజర్ గా చేస్తున్నాడంటూ గర్వంగా చెప్పుకుంది ఝాన్సీ. తమ కుటుంబాన్ని తిట్టిన వాళ్లంతా వెనక ఉంటే తాను మాత్రం ముందున్నానని చెప్పింది. తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేస్తారని అత్తింటి వాళ్ళు కూడా ఎంతో మంచివాళ్ళని చెప్పింది ఝాన్సీ. "చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగాను కాబట్టి ఆయనలా కొంతైనా నేర్చుకోవాలని ఉంది" అంటూ చెప్పింది ఝాన్సీ. "కడుపు నింపుకోవాలంటే రెండు పనులు తప్పించి ఏ పనైనా చేసి సంపాదించుకోవచ్చు" అంటూ చాలా ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు ఝాన్సీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె డాన్స్ కి ఫిదా ఐన నెటిజన్స్ కూడా ఈమెకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.

నీకు దమ్ముందా అంటూ ఆదికి ఛాలెంజ్ విసిరిన నయనిపవని!

వినాయక చవితి అంటే చాలు అందరిలో మంచి జోష్ వచ్చేస్తుంది...మంచి ఎనర్జీ నిండిపోతుంది. వాతావరణం కూడా ఫుల్ కలర్ ఫుల్ గా మారిపోతుంది. ఇక ఈ పండగంటే టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ షోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు రేడియో వింటూ పండగ పనులు చేసుకునేవారు..కానీ ఇప్పుడు పండగల ట్రెండ్ బిందాస్ గా మారిపోయింది. షోస్ చూస్తూ పండగ పనులు చేసుకుంటున్నారు. అందుకే బుల్లి తెర మీద నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్  షోస్ అలా వస్తూనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో పెర్ఫార్మెన్స్ లు మాములుగా లేవు ఈసారి. ఆది ఈ షోలో వినాయక చవితి చందాలు అడిగే వ్యక్తిగా నటించాడు. "టీం లీడర్స్ నుంచి చందాలు అడగడం మొదలు పెట్టు అంటూ ప్రదీప్ చెప్పేసరికి నయనిపావని దగ్గరికి వెళ్లి చందా అంటూ డబ్బా పెట్టేసరికి నాకు మధ్యాహ్నం భోజనంలోకి వెజ్ బిర్యాని కావాలి అంటుంది ..ప్రొడక్షన్ బాయ్ ని నేను కాదు..వాడు అంటూ అఖిల్ ని చూపిస్తాడు" ఆది. ఇకపోతే  ఫస్ట్ రౌండ్ లో డాన్స్ పెర్ఫార్మెన్సులు అయ్యాక "సెకండ్ రౌండ్ కి ఆది, నయని పావని ఇద్దరూ ఎవరు గెలుస్తారంటూ పాట పెట్టుకుంటారు..రెండు లక్షలకు పైనే పాట సాగుతుంది... నీకు దమ్ముందా అని ఆదికి ఛాలెంజ్ విసిరేసరికి..ఆయన మెట్లెక్కి వస్తుంటేనే దమ్మొస్తది.. నువ్వేమో దమ్ముందా" అని మళ్ళీ అడుగుతావ్ ఏమిటి అంటూ పంచ్ డైలాగ్ వేస్తాడు అఖిల్.  తర్వాత "అమ్మా అమ్మా ..నే పసివాణ్ణమ్మా" అనే సాంగ్ కి జతిన్ చేసిన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ పాటలో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ అన్ని కూడా అందరికీ కన్నీళ్లు తెప్పించేశాయ్. ఇలా ఈవారం వినాయక చవితి స్పెషల్ గా ఈ ఢీ - 14 అలరించబోతోంది.  

నేను తెలుగు షోస్ చేస్తున్నాను..నాకూ తెలుగొచ్చు..పండగ చేస్కో అంటూ తెలుగులో రష్మీ కౌంటర్

బుల్లి తెర మీద రష్మీ చేసే కామెడీ మాములుగా ఉండదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ వారానికి మూడు రోజులు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది రష్మీ. రష్మీ యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు..భూతదయ కలిగిన అమ్మాయి కూడా. ఏ మూగ జీవి ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కావాల్సిన సాయం అందేలా చేస్తుంది. కొన్ని మూవీస్ లో నటించింది రష్మీ. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఒక నెటిజన్ రష్మీ మీద కావాలని సెటైర్ వేశాడో లేదా మనసులో నిజంగా పాజిటివ్ థాట్ తో కామెంట్ పెట్టాడో తెలీదు కానీ రష్మీ కూడా అలాగే స్పందించింది. రష్మీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే గనక సంజు కపూర్ అనే వ్యక్తి  " నీతో అసలు గొడవే లేదు. ఎవరు ఏమన్నా పట్టించుకోవు. అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు. అసలు నీకు తెలుగే అర్ధం కాదు" అంటూ ఒక సెటైర్ కామెంట్ పోస్ట్ చేసాడు. దీనికి రష్మీ వెంటనే స్పందించింది. నేను తెలుగు షోస్ చేస్తున్నాను..నాకూ  తెలుగొచ్చు అన్న రీతిలో "పండగ చేస్కో" అంటూ రిప్లై ఇచ్చిపడేసింది. ఇప్పుడు ఈమె ఇచ్చిన కౌంటర్ ఎటాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ ఎప్పుడూ నవ్వుతూ వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. కానీ జంతువులను హింసించే వారిపై చాలా సీరియస్ ఐపోతుంది.

లోకులు కాకులు ఆంటీ గెటప్ తో శీను...ఎవడ్రా వాడు అనేసరికి షాక్!

లోకులు కాకులు అనే డైలాగ్ తో నోరు తెరిస్తే బూతులతో ఫుల్ ఫేమస్ ఐన ఆంటీ గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఈవిడ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఎంత టాలెంట్ ఉన్నా ఫేమస్ అవలేరు. కానీ కొందరు మాత్రం ఎలాంటి టాలెంట్ లేకపోయినా మోతమోగే పేరు వచ్చి పడిపోతుంది. సినిమా రివ్యూస్ చెప్తూ ఈవిడ మస్త్ ఫేమస్ ఐపోయింది. ఇక యూట్యూబ్ లో ఈవిడ వీడియోస్ చూస్తే కొన్ని అర్థమవుతాయి... సగం మాటలు మింగేస్తుంది అసలు అర్ధమేకావు. అలాంటి ఆంటీని గెటప్ శీను ఇమిటేట్ చేసి ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ వేసాడు.  ఈ స్కిట్ లో హౌస్ ఫుల్ అనే మూవీ గురించి రాంప్రసాద్, సన్నీ వచ్చి రివ్యూ అడుగుతారు. అప్పుడే  ఒరిజినల్ లోకులు కాకులు ఆంటీ కూడా ఈ స్టేజి మీదకు వస్తుంది. ఇక ఎవరు డూప్ ఎవరు ఒరిజినల్ అన్న కాన్సెప్ట్ తో ఈ  స్కిట్ చేశారు..తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచిగా నవ్వు తెప్పించింది. "జబర్దస్త్ చాలా బాగుంటుంది బాగా నవ్విస్తుంది" అని చెప్తుంది ఆంటీ. వెంటనే రాంప్రసాద్ " గెటప్ శీను బాగా చేస్తున్నాడా" అని అడిగేసరికి "వాడెవడ్రా" అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు విరుస్తాయి.  తర్వాత "ఇమ్మునూయేలు వర్ష లవ్వు " అని ఇమ్ము అడిగేసరికి " థు..నీ" అని తిడుతుంది. "ఆ అమ్మాయిని చాలా బాగుంటుంది" అని ఇమ్ము చెప్పేసరికి " ఆ అమ్మాయి బాగుంటుంది..కానీ నువ్ బాగుండవ్" అని చెప్తుంది. ఆ మాటకు  అందరూ పడీపడీ నవ్వేస్తారు. ఇలా లోకులు కాకులు ఆంటీ, గెటప్ శీను ఈ వారం స్కిట్ అదరగొట్టేసారు. ఇక ఈ స్కిట్ లో గెటప్ శీను యాక్షన్ కి ఫ్యాన్ ఐపోయినట్లు విజిల్ వేసి మరీ చెప్తుంది ఖుష్బూ. అలాగే "లోకులు కాకులు ఆంటీకి మా టీమ్ తరపున హెల్ప్ చేస్తాం" అని చెప్పాడు శీను.  

30 ఇయర్స్ ఇండస్ట్రీలో నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ?

సుమ ఈ పేరుకు ముందు వెనక ఏ తోక తగిలించిపోయినా యాంకర్ సుమ అని ఇట్టే గుర్తుపట్టేస్తారెవరైనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ అంటే తెలియనవారు గుర్తు పట్టని వారెవ్వరూ ఉండరు. కానీ అలాంటి సుమకే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. వినాయక చవితి రాబోతున్న సందర్భంగా షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యి సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి కనిపించిన వాళ్లందరికీ షాక్ హ్యాండ్ ఇచ్చి పలకరించింది.  తర్వాత  ఆమె ఒక ఫేమస్  స్వీట్ షాపుకు వెళ్లింది. అక్కడ పని చేసే వాళ్లంతా హిందీ వాళ్ళు కాబట్టి ఆమెను  ఎవరూ గుర్తు పట్టలేదు. అంతే సుమ ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. "30 ఏళ్ళు ఇండస్ట్రీలో చేస్తే ఈరోజు వీళ్లకు నేనెవరో తెలీదు అందరూ తెల్లమొహాలేసుకుని నిలబడ్డారంటూ" బాధపడింది. సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త పెయిడ్ ప్రొమోషన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల ఆమె ఒక స్వీట్ షాప్ కి వెళ్లి ప్రమోట్ చేసింది. షాపులో అన్ని రకాల స్వీట్స్ తిని టేస్ట్ చూసి నిజాయితీకి మారుపేరు ఈ స్వీట్స్ అంటూ పబ్లిసిటీ చేసింది. అక్కడి వాళ్ళెవరూ గుర్తుపట్టకపోయేసరికి హిందీ నేర్చుకుని మరీ వీళ్ళతో నేను మాట్లాడతాను అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో అక్కడి వాళ్ళను కాస్త ఎంటర్టైన్ చేసింది.  

క్యారవాన్ అనేది ఒక పెద్ద జోక్.. రెండు అవసరాలకు మాత్రమే అది పనికొస్తుంది!

మాధవి ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ మిర్చి మాధవి అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'క్యారవాన్ అనేది ఒక పెద్ద జోక్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఒక ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్స్ కి మాత్రమే క్యారవాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకైతే ఇద్దరుముగ్గురికి కలిపి ఒక క్యారవాన్ ఇస్తారట..అది నిజమేనా ?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "మాధవి నవ్వుతూ క్యారవాన్ అనేది ఒక పెద్ద జోక్. క్యారవాన్ అనేది రెండు కారణాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. వాష్ రూమ్స్ లేని చోట ఒకసారి, డ్రెస్ చేంజ్ చేసుకోడానికి మరో సారి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సెట్ లోకి షూటింగ్స్ కి వెళ్ళిపోతారు. ఐతే పొరపాటున ఎవరి క్యారవాన్ లోకైనా వెళ్తే నా క్యారవాన్ లోకి వచ్చావేంటి అంటూ పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. ఐతే నా క్యారవాన్ లోకి ఎవరైనా వస్తే మాత్రం నాకు నచ్చదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటే పర్లేదు కానీ గంటలు గంటలు ఫోన్స్ మాట్లాడుతూ అక్కడ వున్న ప్రశాంతతని చెడగొడుతూ ఉంటారు. అది నాకు నచ్చదు. నాకు మనస్శాంతి చాలా ఇంపార్టెంట్. అందుకే నాకు ఎలాంటి క్యారవాన్ వద్దు బాబోయ్ అని ఒక కుర్చీ వేసుకుని ఏదో ఒక చెట్టు కింద కూర్చుండిపోతాను.  నాకు మనస్శాంతి, ఆనందం ఈ రెండు  ఆక్సిజన్ లాంటివి ..అవి లేనప్పుడే కోపం, చిరాకు అన్నీ వస్తాయి. ఐతే ఇదివరకు క్యారవాన్ అనేది లేదు ఇప్పుడే ఇచ్చారు. క్యారవాన్ లోకి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల కొంత మంది కొరకొరా కోపంగా చూస్తూ ఉంటారు. అందుకే నాకు క్యారవాన్ అంటే ఇష్టం ఉండదు. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది" అంటూ దణ్ణం పెట్టింది మిర్చి మాధవి.

సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి..మీతో మీరు మాట్లాడండి!

మిర్చి మాధవి అందరికీ తెలిసిన ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో చేసి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి పెద్దమ్మగా నటిస్తోంది. ఇక ఇప్పుడు "బోళా శంకర్" మూవీలో చిరంజీవితో కలిసి మొదటిసారిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువన్న విషయం పక్కన పెడితే అందరినీ ఆత్మీయంగా పిలుస్తారు. అది చాలా నచ్చుతుంది. నన్ను కూడా పేరు మర్చిపోకుండా ఆప్యాయంగా పిలుస్తారు. ఇక చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన ఈ వయసులో  కూడా ఎంతో గ్రేస్ తో యాక్ట్ చేశారు దానికి నేను ఫిదా ఐపోయాను అంటూ చెప్పింది మాధవి. అలాగే తన లైఫ్ జర్నీలో ఎన్నో అవాంతరాలను, అపార్థాలను  దాటుకుని వచ్చానని, అందరూ తనని సెల్ ఫిష్ అని, పొగరని అనుకున్నా తానెప్పుడూ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లు చెప్పింది.  ఇక తనకు తమ ఫామిలీ అంటే వీక్నెస్ అని ఫామిలీతో స్పెండ్ చేయకుండా అస్సలు ఉండలేనని చెప్పింది. అలాగే చాలామందికి  చాలా వీక్నెస్ లు ఉంటాయి. వాటిని అధిగమించాలి. అలా చేయలేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. అలాంటి వాళ్లకు ఒక సజెషన్ కూడా ఇచ్చింది మాధవి. సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా మనకు మనం మాట్లాడుకోకపోతే మన మెదడు మన ఆలోచనలని డైవర్ట్ చేసేస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా మనతో మనం మనలో మనం మాట్లాడుకోవాలి ముందు అని చెప్పింది. మనకై మనం ఈ భూమ్మీదకు రాలేదు కాబట్టి మనకై మనం మన జీవితం ముగించుకోకూడదు ఎందుకంటే ఆ రైట్ మనకు లేదని చెప్పింది. ఇక తన కెరీర్ లో పెద్దగా సంపాదించి దాచింది ఏమీ లేదని వచ్చినవన్నీ ఖర్చులకే ఐపోయేవి అని వివరించింది.  అంతా సాఫీగా వెళ్తుంది అనుకునే టైంలో రీసెంట్ గా ఐదు లక్షలు నష్ట పోవాల్సి వచ్చిందని అది కూడా తెలిసిన వాళ్ళ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెడతానని అడిగితే ఇచ్చానని... కానీ నమ్మిన వాళ్ళే మోసం చేసారని ఫీలయ్యింది మాధవి.  

నాకు మళ్ళీ మాటొచ్చిందోచ్!?

నటి శ్రీవాణి గురించి స్పెషల్ గా ఏమీ చెప్పక్కర్లేదు. బుల్లి తెర ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ ఐన శ్రీవాణి యూట్యూబ్ పెట్టి అందులో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెల క్రితం శ్రీవాణి తాను ఇక మాట్లాడలేనంటూ డాక్టర్స్ చెప్పారని ఒక బాడ్ న్యూస్ చెప్పింది. రెస్ట్ తీసుకుని ఫుల్ గా హెల్తీగా అయ్యాక ఇప్పుడు మళ్ళీ మాట్లాడింది శ్రీవాణి.  ఐతే ఇటీవల ఆగష్టు 19 న మళ్ళీ డాక్టర్స్ దగ్గరకి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ఇక ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారని చెప్పింది శ్రీవాణి. థ్రోట్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయిందని మాములుగా మాట్లాడొచ్చని చెప్పారు.ఇక ఆ గుడ్ న్యూస్ ని శ్రీవాణి  "మేడం అంతే" యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫాన్స్ కి చెప్పారు.  మళ్లీ తిరిగి మాట్లాడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. “ ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.  నేను మాట్లాడలేకపోయినా సరే  మీరు పెట్టే మెసేజ్‌లు చదువుతూ ఉన్నాను. నాకోసం. నా ఆరోగ్యం కోసం దేవుడికి ప్రార్దించిన అందరికీ థాంక్స్.   2002 నుంచి ఇప్పటివరకు 20 ఏళ్లుగా  ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఇంత మంది ఫాన్స్ నాకు  ఉన్నారని ఇప్పటిదాకా తెలియదు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ శ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు.   

భువనేష్ కి హగ్ ఇచ్చిన సోగ్గాడు చిన్నినాయన!

సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి  సంబంధించి ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ పోటీలో ఐదుగురు చిన్నారుల్లో ఎవరు టైటిల్ విన్ అవుతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ షోకి బ్రహ్మానందం, నాగార్జున వచ్చి పెర్ఫార్మెన్సులు చూసి కామెంట్స్ కూడా చేశారు. సుధీర్ మధ్యమధ్యలో కామెడీ పండించాడు..  "అడిగా అడిగా" అంటూ పాట పడేసరికి "అలా ఏడుస్తూ పాడతావేంటి.. నువ్ వేసుకున్న డ్రెస్ మీద పెట్టిన ఇంపార్టెన్స్ రాగం మీద, తాళం మీద పెడితే బాగుపడతావ్" అంటూ సీరియస్ గా అనేశారు బ్రహ్మి. తర్వాత " నువ్ పాడమ్మా అని అనసూయని అనేసరికి ఏటో చూస్తూ ఉంటుంది. అంతలో బ్రహ్మి ఆ చాలు..అలా ఉండాలి పాటంటే.. జలపాతంలో అలా అలా వెళ్ళిపోవాలి"  అంటారు సుధీర్ తో .."అసలు ఆమె పాటే పాడలేదు..మరి ఆ పాటలో జలపాతాలు ఎలా కనిపించాయని" అడుగుతాడు సుధీర్. ఇక తర్వాత సుధీర్ హేమచంద్రతో కలిసి సూపర్ సాంగ్ పాడతాడు. "సింగారాల పైరుల్లోన, బంగారాలే పండేనంట" పాటను ఇరగదీసి పాడి అందరినీ మెస్మోరైజ్ చేశారు. ఫైనల్ గా భువనేష్ వచ్చి "థిల్లానా" సాంగ్ పాడాడు. "ఈ సాంగ్ జై చిరంజీవలోది కదా .. నీకు చిరంజీవి అంటే ఇష్టమా" అనే భువనేష్ ని అడిగేసరికి అవునంటాడు. తర్వాత "నాకు మిమ్మల్ని హగ్ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది" అని అడిగేసరికి స్టేజి దిగి వచ్చి చాలా ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు నాగ్.  

చిన్నప్పటి నుంచి నాకు సీనియర్స్ అంటేనే క్రష్..ఎందుకో తెలీదు!

ఫస్ట్ మూవీ ఉప్పెనతో బాక్సాఫీస్  బద్దలు కొట్టాడు హీరో వైష్ణవ్ తేజ్. ఇక రెండో సినిమా కొండపొలం మూవీకి  పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా హిట్ కాలేదు. ఈ మూవీస్ కి ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు  వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటించిన రంగరంగ వైభంగా మూవీ సెప్టెంబర్ 2 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.   ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఆలీతో సరదాగా షోకు వచ్చారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ టైంలో చిరు గారు కోప్పడారట" అని ఆలీ అడిగేసరికి "ఒక సీన్ లో బాగా నవ్వేశానని అప్పుడు పెదమామయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని"   చెప్పుకొచ్చారు. ఉప్పెనలో ఒక  సీన్ గురించి అడిగిన ప్రశ్నకు " ఆ మూవీలో  ఒక సీన్ చేస్తున్నప్పుడు అస్సలు ఎమోషన్స్ రావడం లేదు.  దానికోసం  20 టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. నా కోసం అంతమందిని ఇబ్బంది పెడుతున్నా అనుకునేసరికి నాలో బాధ, కన్నీరు వచ్చేసాయి..ఫైనల్ గా ఆ ఎమోషన్ తో ఆ సీన్ పూర్తి చేశానని" చెప్పాడు.  "ఎవరికైనా జూనియర్స్ మీద క్రష్ ఉంటుంది మరి నీకు అనేసరికి.."  " నాకెప్పుడూ సీనియర్స్ అంటేనే క్రష్ అదేంటో నాకు తెలీదు..చిన్నప్పటినుంచి అంతే " అని నవ్వేసాడు వైష్ణవ్ తేజ్. ఎవరైనా సినిమాలు పది సార్లో ఇరవై సార్లో చూస్తారు మరి నువ్వెంటి అని ఆలీ అడిగేసరికి " పవన్ మామయ్య సినిమాలంటే చాలా ఇష్టం.  తమ్ముడు సినిమాను 120సార్లు బద్రి సినిమాను 130సార్లు చూసాను..వాటిల్లో ఏ డైలాగ్ అడిగిన చెప్పేస్తా" అంటూ చెప్పాడు  వైష్ణవ్ తేజ్.  

సక్సెస్ అయ్యాక ప్రేమించిన అమ్మాయి నుంచి ఫోనొచ్చింది!

ఢీ - 14 లో ఒక్కొక్కరు తమ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియెన్సులు చెప్పి ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంత ఫేమస్ అనే విషయం అందరికీ తెలుసు. ఐతే ఆదికి ఒక ఫస్ట్ లవ్ ఉంది. ఆ విషయం గురించి తన మాటల్లో అందరితో షేర్ చేసుకున్నాడు. "8th క్లాస్ వరకు మా ఒళ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 9th కి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 10th క్లాస్ కి వెళ్ళాక అప్పుడొచ్చిందయ్యా ఆ అమ్మాయి. నాకంటే చాలా బాగుంటుంది..నాకంటే చాలా బాగా చదువుతుంది. 10th క్లాస్ మొత్తం కూడా అమ్మాయిని నేను, నన్ను ఆ అమ్మాయి ఒకరికొకరం చూసుకోవడమే సరిపోయింది. ఎప్పుడూ హాయ్ చెప్పుకోలేదు చిన్న మాట కూడా మాట్లాడుకోలేదు. స్టడీ అవర్స్ లో ఆ అమ్మాయికి ఎదురుగా కూర్చునేవాడిని.  తను నన్ను చుసేదో కాదో అనే డౌట్ ఉండేది. ఆ విషయంలో క్రాస్ చెక్ కూడా చేసుకున్న. ఒకసారి ప్లేస్ మారి లాస్ట్ లో కూర్చున్నా. అప్పుడు ఆ అమ్మాయి నన్ను వెతికి మరీ చూసింది. అప్పుడు అర్ధమయ్యింది. అంతలో 10th ఐపోయింది. ఇంటర్ కి నేను బాయ్స్ కాలేజీ, ఆ అమ్మాయి లేడీస్ కాలేజీ. అప్పుడనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడినా బాగుండేదని. ఇంటర్ రెండేళ్లు ఆ అమ్మాయి గురించే ఆలోచన. తర్వాత బీటెక్ కి వచ్చాను. బీటెక్ చదవాలంటే  కంప్యూటర్స్ నేర్చుకోవాలని చెప్పేసరికి కంప్యూటర్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజు క్లాస్ ఐపోయి కిందకి వస్తున్నప్పుడు చూసా రెండేళ్ల తర్వాత ఆ అమ్మాయి నడుచుకుంటూ అలా వచ్చింది. ఆ ఫస్ట్ ఫీలింగ్ సూపర్ . చిన్న స్మైల్స్ ఇచ్చుకున్నాం. తర్వాత తను కూర్చునే ప్లేస్ లో నా ఫోన్ నెంబర్ రాసిన కాయితాన్ని పెట్టాను తను అది తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఫీలింగ్ ఇంకా గ్రేట్. ఆ అమ్మాయి ఇంటి ల్యాండ్ లైన్ ఇప్పటికీ నాకు గుర్తుంది.  ఫైనల్ గా కలిసినప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన ఫోటో ఇప్పటికీ నా సర్టిఫికెట్స్ మధ్యలో దాచుకున్నా. నేను తను ఇష్టపడే టైంకి  ఆ అమ్మాయిని చూసుకునేంత పొజిషన్ లో నేను లేను కాబట్టి అలా బ్రేకప్ అయ్యింది. నేను సక్సెస్ అయ్యాక ఆ అమ్మాయి కాల్ చేసింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది." అంటూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు ఆది.  

బ్రేకప్ లవ్ స్టోరీ ని బయటపెట్టిన అఖిల్!

ఢీ-14 ప్రతీ వారం ఏదో ఒక స్పెషల్ థీమ్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ వారం కూడా అలానే జోష్ తెప్పించే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అలరించింది. ఈ వారం లవ్ థీమ్ తో డాన్సులు చేశారు  కంటెస్టెంట్స్. ఇక ఈ షోలో అఖిల్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. 10th చదువుకునేటప్పుడు 8th క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు. అలా కొన్నాళ్ల తర్వాత తాను ఇండస్ట్రీకి వెళ్లి తనను తాను ప్రూవ్ చేసుకుంటానని తర్వాత ప్రేమ, పెళ్లి అనేసరికి ఆ అమ్మాయికి మాత్రం ఆ విషయం నచ్చలేదు. ఇండస్ట్రీలోకి వెళ్లడం తనకు, తన ఫామిలీ కూడా ఇష్టం లేదని చెప్పాడు. ఐనా తన ప్యాషన్ ని వదులుకోలేక ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు అఖిల్.  ఎన్నోసార్లు ఆ అమ్మాయి కోసం ట్రై చేస్తూనే ఉన్నట్లు చెప్పాడు  అఖిల్. ఒకానొక సమయంలో బ్రేకప్ కూడా చెప్పేసింది. ఆ మాటకు చాలా బాధపడినట్లు చెప్పాడు. చివరికి మాట్లాడ్డం మానేసిందట. అలాంటి టైములో ఒక రోజు ఒక ఫంక్షన్ లో కలవమని చెప్పి అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు తనను అవమానించిందని చెప్పాడు అఖిల్. ఆ బాధ భరించలేక అక్కడినుంచి వచ్చేసాడట.  తర్వాత ఫోన్ చేసి "నువ్ సూసైడ్ గాని చేసుకున్నవేమో అని ఫోన్ చేశా" అంటూ ఇంకా ఏడిపించింది చెప్పాడు. అలా ఆ పెయిన్ తో ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లు చెప్పాడు. కానీ ఫస్ట్ లవ్ అనే దాన్ని ఎప్పుడూ మరచిపోలేము కదా  అంటూ  తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు.  

అతని పాటకు సిగ్గుపడి దాక్కున్న రష్మీ!

బుల్లితెర మీద యాంకర్ రష్మీ గాలి బాగా వీస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లోనూ కనిపిస్తూ  క్వీన్ ఆఫ్ షోస్ అన్నట్టుగా అలరిస్తోంది. ప్రస్తుతానికి రష్మీ మూడు షోలను బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ ఈమధ్య పంచులు కూడా బాగా పిలుస్తోంది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో జానపద పాటలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాయి. ఈ షోకి పల్సర్ బైక్ జానపద పాటతో పాపులర్ ఐన జానపద గాయకుడు ఎల్లింటి రమణను తీసుకొచ్చారు. "పోటిదాయె కాదమ్మో, గట్టిదాయమ్మో, పావుసేరు ముక్కుపుడక ఎక్కువాయమ్మో" అంటూ మంచి జోష్ తో ఒక పాట పాడాడు. ఇక ఇందులో   కాకినాడ, శ్రీకాకుళం, మధురవాడ ప్రాంతాలను కలుపుతూ పాట పడేసరికి రష్మీ తెగ సిగ్గుపడిపోయింది. ఆ పాట వచ్చినంత సేపు వెళ్లి ఒక సోఫా వెనక దాక్కుంది రష్మీ. ఈ జానపద పాటను "అమోఘం, అద్భుతం" అంటూ తాగుబోతు రమేష్ కితాబిచ్చాడు. తర్వాత మనుషుల పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారో వర్షాల కోసం బులెట్ భాస్కర్, ఆది, రాంప్రసాద్, రాఘవ అందరూ కలిసి పెళ్లి పెద్దలుగా కప్పల పెళ్లి చేస్తారు. ఇక ఈ స్కిట్ లో స్కెటింగ్  షూస్ వేసుకుని టీం మొత్తం స్టేజి మీద జారి పడుతూ ఒకరి మీద ఒకరు పడుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఈ పవర్ ప్యాక్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కడ చేపలు పట్టావ్, ఇక్కడ మేకలు పట్టావ్.. ఇప్పుడెవ‌రిని పట్టావ్?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' మూవీతో ఓవర్ నైట్ క్రేజీ మీరో ఐపోయాడు తేజ్. తర్వాత 'కొండపొలం'లో చేసి పర్లేదనిపించుకున్నాడు. సైలెంట్ గా వచ్చి స్టార్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఇక ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా' అని మూవీలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎంటర్టైన్ చేసాడు. "ఉప్పెన మూవీలో చేపలు పట్టావ్, 'కొండపొలం' సినిమాలో మేకలు పట్టావ్, మరి ఈ సినిమాలో ఎవరిని ' పట్టావ్?" అంటూ ఆలీ అడిగిన ఫన్నీ క్వశ్చన్ కి "అమ్మాయిని పట్టాను" అంటూ అదే రేంజ్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు తేజ్. "నువ్ చేసిన రెండు సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయ్ కదా.. ఈ సినిమాలో కూడా అలాంటి సాంగ్ ఉంటేనే సినిమా చేస్తాను అన్నావట?" అని అడిగేసరికి తేజ్ నవ్వేసాడు ఆన్సర్ చెప్పకుండా.. "రొమాంటిక్ మూవీలో ఆల్రెడీ రొమాంటిక్ గా చేసింది కాబట్టి కేతిక శర్మతో ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సాంగ్ చేయించావ్" అని ఆలీనే ఆన్సర్ ఇచ్చేసి నవ్వేశారు. "నాచురల్ గా కాటుక కళ్ళు అని అమ్మాయిలను అంటారు.. కానీ నీ కళ్ళు కాటుక పెట్టినట్లు ఉంటాయి" అని అనేసరికి "నన్ను చాలా మంది అడిగారు కూడా.. 'కాజల్ పెట్టుకుని వస్తావా?' అని." అన్నాడు వైష్ణ‌వ్‌. అందుకే "నీ కళ్ళు చూసే రాసారేమో ఉప్పెన మూవీలో 'నీ కళ్ళు నీలి సముద్రం' అనే పాట" అని ఆలీ అడిగేసరికి "ఏమో అంకుల్.. రైటర్ ని అడగాలి" అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. 

కౌశల్ మందా ఆర్మీ ఎటాక్‌తో ఫుల్లుగా తాగేశాను!

'ఐస్ క్రీమ్‌' మూవీ హీరోయిన్ తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసి పేరు తెచ్చుకుంది. చేసేది చిన్న రోల్ ఐనా స్పెషల్ ఫోకస్ అంత తేజస్వి మీదే ఉంటుంది ఆడియన్స్ కి. లేటెస్ట్ గా "కమిట్‌మెంట్‌" అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన ఎక్స్పీరిఎన్సెస్ ని షేర్ చేసుకుంది.  "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చాక చాలా నెగటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నారా?" అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు, ‘‘ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే నాకు దిమ్మతిరిగిపోయింది. సినిమాలన్నీ  ఒక ఎత్తైతే .. బిగ్‌బాస్‌, కౌశల్‌ మందా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎటాక్ అని నేను ఫీలయ్యాను. చెప్పాలంటే నేనొక అమ్మాయిని, నా దగ్గర ఏముందని నన్ను అంతలా అటాక్‌ చేస్తున్నారు. మీమ్స్‌ చేసి, డర్టీ థింగ్స్ చేశారు. ఐతే  దాని వల్ల ఉపయోగం ఎవరికీ లేదు. వాడొకడు లైఫ్‌లో ముందుకెళ్లడానికి ఇవన్నీ చేయించాడు కానీ చూడండి.. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా.. ఇలా కౌశల్ మందా ఎటాక్  తర్వాత నేను చాలా డిప్రెస్‌ అయ్యాను. సినిమాలు చేయకూడదనుకున్నా. రెండున్నర ఏళ్ళు  ఇండియాలో లేకుండా.. బయటి దేశాల్లో ఒంటరిగా తిరిగాను. మెంటల్ గా చాలా స్ట్రెస్ అయ్యా.. బిగ్ బాస్ హౌస్ నుంచి హ్యాపీగా బయటికి వచ్చేసరికి నా  ఫ్రెండ్స్‌ అందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. ఏంటా అని చూస్తే.. మీమ్స్‌, బూతులు.. ఇంటి పేరు మురికివాడ  అంటూ ఇష్టమొచ్చినట్లు చేసేసారు అని బాధపడ్డారు. ఇవన్నీ చూసేసరికి నాకు చాలా బాధేసింది" అని చెప్పింది తేజస్వి.  "అలా డిప్రెస్డ్ గా ఉన్న టైంలో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. ఈ మూవీతో రీఎంట్రీలా మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాను" అని తెలిపింది తేజస్వి. "ఐతే అప్పటికి నేను ఫుల్లుగా తాగేసి సరైన స్థితిలో లేను. కానీ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. ఎవడో  ఏదో అంటే నేనెందుకు భయపడాలి" అంటూ తనకు జరిగిన ఇన్సిడెంట్స్ ని చెప్పుకొచ్చింది తేజస్వి.