శ్రీచరణ్ చెప్పాడు...శ్రీముఖి చెక్ మీద సంతకం చేసింది!

వినాయక చవితిని పురస్కరించుకుని జీ తెలుగు "మన ఊరి రంగస్థలం" పేరుతో ఒక ఈవెంట్ చేసింది. ఆ ఎపిసోడ్ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎన్నో లవ్ ట్రాక్స్ ని చూపించారు. అలాగే గణపయ్య లడ్డూ వేలంపాట  కూడా జరిగింది. ఈ ఎపిసోడ్ లో 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' నుంచి కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. శ్రీముఖి, శ్రీచరణ్ ఇద్దరూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మనో, గీతామాధురి పాటలతో అదరగొట్టారు.  బుల్లి తెర మీద రోజూ మనం చూసే షోస్ లో నటీనటులంతా వచ్చి డాన్సులు చేశారు. ఇక ఈ షోలో శ్రీముఖి అల్లరి మాములుగా లేదు. "మీకెప్పుడైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి వెంట పడ్డారా?" అని మనోని శ్రీముఖి అడిగింది. "లేదు అది కలగానే మిగిలిపోయింది" అన్నారు మనో . "ఇప్పుడు దాన్ని నిజం చేసుకోండి" అనేసరికి వెంటనే రోహిణి లవర్ లా ఎంట్రీ ఇచ్చి మనో ముఖాన్ని తన ఓణీతో తుడుస్తూ "టచప్ గర్ల్ అనుకున్నారా?" అంది. "టచ్ ఇచ్చావుగా మరి" అని అన్నారు మనో గారాలు పోతూ. "పూలు తీసుకురమ్మంటే పూల చొక్కా వేసుకొచ్చావ్.. హే నాటీ" అంది రోహిణి.. "యు లూటీ "అంటూ నవ్వుతూ మనో అనేసరికి రోహిణి షాక్ ఐపోయింది.  ఫైనల్ గా వంద కేజీల లడ్డుకి వేలం పాట పెట్టారు. అందరూ పాడుకుంటారు. హరితేజ లక్ష, భానుశ్రీ రెండు లక్షలు అంటూ పాడుతుండగా "శ్రీముఖి గారి పాట ఐదు లక్షలు" అంటూ శ్రీచరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను అలా చెప్పగానే ఇలా చెక్ రాసిచ్చేసింది శ్రీముఖి. ఇది అంద‌రి దృష్టినీ విప‌రీతంగా ఆక‌ర్షించింది.

బిగ్ బాస్ 6 విన్న‌ర్‌ని నేనే!

మరికొన్ని గంటల్లోనే బుల్లితెర మీద సందడి చేయడానికి సిద్ధంగా ఉంది బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 . క్వారంటైన్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. హౌస్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. గత ఎపిసోడ్స్ లా కాకుండా ఈ సీజన్ ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ అందిస్తుందంటూ  నిర్వాహకులు చెప్పారు. ఇక ఈసారి హౌస్ లో రూల్స్‌ కూడా మారబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా టాస్కులు కూడా టఫ్‌ గా ఉంటాయని కూడా చెప్పారు.  అలాగే బీబీ కెఫె అనే ఒక స్పెషల్ ఎపిసోడ్ ని కూడా దీనికి రిలేటెడ్ గా స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఐపోయింది. ఐతే  ఈసారి హౌస్‌లోకి పాపుల‌ర్ సింగర్‌ రేవంత్‌ వెళ్తున్నాడు. ఈ విషయం తన ఇన్స్టా ద్వారా ఫాన్స్ కి చెప్పాడు. అసలు బొమ్మే పడలేదు, అప్పుడే  టైటిల్ గెలుచుకుని వస్తానంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసాడు.  “జీవితంలో కొన్నింటిని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నా కుటుంబాన్ని మిస్‌ అవుతున్నాను, ముఖ్యంగా నా భార్యను, నాకు ఇష్టమైన  మ్యూజిక్‌ని మిస్‌ అవుతున్నాను. కానీ, ఒక భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తాను. మీరు మీ ఆదరణను  ఓటింగ్స్‌ రూపంలో నాకు అందించండి. నా వైపు నుంచి వందశాతం ఎంటర్‌టైన్‌ అందిస్తాను. మీ అందరి దీవెనలతో నేను టైటిల్‌ తో తిరిగొస్తాను..” అంటూ రేవంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్ లో ఈ స్టోరీ  పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో  వైరల్‌ గా మారింది.  

శ్రీముఖి, శ్రీచరణ్ గురించి నిజాలు ఇవే!

'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' రియాలిటీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంగీత ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది. సుధాన్షు, శృతిక ఫైనల్స్ వరకు వెళ్లారు. శృతిక సింగింగ్ సూపర్ స్టార్ అవార్డును అందుకుంది. సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు. స్టేజిపై శ్రీముఖి, శ్రీచరణ్ మధ్య లవ్ ట్రాక్ న‌డ‌వ‌డం మ‌నం చూశాం. శ్రీ‌ముఖి ఓ అడుగు ముందుకు వేసి, శ్రీచరణ్ వాళ్ళ నాన్నను "మావయ్యా" అని పిలవడం అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ షోలో మనం చూసిన లవ్ ట్రాక్ గురించి సుధాన్షు కొన్ని ఇంటరెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేసాడు.  తెలుగువ‌న్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "శ్రీముఖి, శ్రీచరణ్ మధ్య లవ్ ట్రాక్ అనేది ఏమీ లేదు. అదంతా అనుకోకుండా జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ లో మెగా ఆడిషన్స్ జరిగే టైంలో కంటెంట్ రాసే వాళ్ళు శ్రీచరణ్ ని చూసారు. మంచి హైట్ కూడా ఉన్నాడు అనుకున్నారు. అప్పటికే చరణ్ కూడా తనకు సాంగ్స్ తో పాటు డాన్స్ కూడా వచ్చని చెప్పేసరికి వాళ్ళు  శ్రీముఖి పక్కన సరిపోతాడని అనుకుని  సరదాగా "జల జల జలపాతం" సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే వీళ్ళు డాన్స్ చేసేలా కంటెంట్ లో రాశారు. అక్కడ స్టార్ట్ అయ్యింది అసలు విషయం." అని చెప్పాడు. ఐతే చరణ్ కదలకుండా సిగ్గు పడుతూ ఒక పక్కన నిలబడిపోయేసరికి  శ్రీముఖి తానే ముందుకొచ్చి చరణ్ కి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి  డాన్స్ చేయించిందంట‌. "ఇక ఆ తర్వాత జ‌రిగింది అందరికీ తెలిసిన స్టోరీనే. ప్రతీ ఎపిసోడ్ కి చరణ్ కంగారు పడుతుండేవాడు.. త‌న చేత ఏం చేయిస్తారో, ఏం చెప్తారో ఏంటో అని. వీళ్ళ విషయాన్ని అందరూ సరదాగా తీసుకున్నారు కాబట్టి లాస్ట్ వరకు అలా కంటిన్యూ అయ్యింది. ఐతే వీళ్ళు ఆన్ స్క్రీన్ లో ఇలా ఉంటారు కానీ, ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ ఇద్దరూ. శ్రీముఖిని అక్కా అని పిలుస్తాడు చరణ్. చరణ్ ని ఏడిపించడానికి మాకు ఒక అవకాశం ఇలా దొరికినందుకు మాకు హ్యాపీ" అంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని బయట పెట్టాడు సుధాన్షు.

షబీనా లవ్ స్టోరీ ఇదా..?

జబర్దస్త్ షోలో షబీనా నాటీ నరేష్ తో చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంది షబీనా. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కొద్ది రోజులు నటించింది. ఐతే కస్తూరి సీరియల్ షబీనాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యింది  షబీనా. ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆమె ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న లవర్ సలీంతో షోస్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూకి కూడా ఇద్దరూ కలిసే వచ్చారు. అక్కడ అసలు తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పుకొచ్చింది. "షబీనా మీ సేవలో జాబ్ చేసేటప్పుడు  అక్కడికి సలీం అలియాస్ మున్నా వచ్చేవాడట. అలా ఓ సారి నాతో మాట్లాడుతూ.. మీరు నాకు తెలుసు.. మీ నంబర్  నా దగ్గర ఉంది అంటూ మాటలు కలిపాడని చెప్పింది. ఐతే  ఇప్పటికీ ఆ నంబర్ మున్నాకు ఎలా  దొరికిందో తెలీదు అంది షబీనా. నెంబర్ ఎలా తెలుసుకున్నావ్ అంటూ సలీంని అడిగేసరికి   ఆమె మీ సేవలో బిజీగా ఉన్న టైములో  ఓ సారి ఆమె ఫోన్ తీసుకుని నా నంబర్‌కు డయల్ చేశా..  ఆమె ఫోన్‌లో మళ్లీ వెంటనే నా నంబర్ డిలీట్ చేశాను. అలా నెంబర్ సంపాదించా. ఇంకా ఈ ఫోన్ నెంబర్  విషయం మీద మూడు నెలలు మాట్లాడుకున్నాం..నేను కూడా  ఇదే జరిగి ఉంటుందని అనుకున్నా అంటూ షబినా కూడా చెప్పుకొచ్చింది. అలా మాట్లాడుకుంటున్న టైములో మేం ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నాం. తర్వాత ఇళ్లల్లో వాళ్లకు చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం" అని చెప్పారు.  

మోహన్ బాబుతో గొడవ..షోలో కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ!

నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ని చూస్తేనే భయపడతారు చాలా మంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ ఫేస్ తోనే కనిపిస్తారు. నవ్వడం అనేది చాలా అరుదు. ఇలాంటి సీరియస్ ఫేస్ వెనక కూడా కొన్ని బాధలు ఉన్నాయి. వాటిని ఆర్కే షోలో చెప్పి కంట తడి పెట్టారు బెనర్జీ. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని వచ్చాను కానీ నటుడిని అయ్యాను. "ఎలా అంటే ఒకసారి అమితాబ్ సినిమాకు పనిచేస్తున్న టైంలో  ఒక కన్నడ యాక్టర్ రాలేదు.  ఇక చేసేదేం లేక అమితాబ్ గారు నన్ను పిలిచి ఆ సీన్స్ చేయమని చెప్పారు. అలా నటుడిగా మారాను" అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ విషయానికి వస్తే మోహన్ బాబు సంగతేమిటి అని అడిగేసరికి.."కంటతడి పెట్టుకున్న బెనర్జీ చిరంజీవి గారు అసోసియేషన్ కోసం ఏదైనా చేద్దామనుకునే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కూడా అంతే.  ఐతే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో తనీష్ ని మోహన్ బాబు  తిట్టారు. ఆ టైములో నేను అక్కడికి వెళ్లి గొడవలొద్దు అని విష్ణుతో చెప్పాను. పక్కనుంచి మోహన్ బాబు వచ్చి పచ్చి బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారు. ఇక ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా" అని అన్నారు బెనర్జీ.  

'బీబీ 6 కెఫే' హోస్ట్స్‌.. అరియనా, శివ!

బిగ్ బాస్ బుల్లితెర మీదకు ఎంట్రీ ఇవ్వడానికి ఇంకెంతో సమయం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ షోకి సంబంధించి 'బీబీ కెఫే' అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. దీనికి హోస్ట్స్ గా అరియనా గ్లోరీ, బీబీ నాన్-స్టాప్ ఫేమ్ శివ ఉన్నారు. వీళ్లు ఈ షోకి సంబంధించిన హైలైట్స్ గురించి ఆడియన్స్ కి చెప్పడమే కాదు హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళు. అప్పటివరకు ఆ కంటెస్టెంట్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ని, ఎమోషన్స్‌ని, ఇంకెన్నో నిజాల్ని వాళ్ళ మాటల్లో చెప్పిస్తారు. ఈ బీబీ కెఫేకి సంబంధించిన టీజర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన అరియానా, బీబీ నాన్ స్టాప్ లో మళ్ళీ కంటెస్టెంట్ గా వచ్చింది. బిగ్ బాస్‌ సీజన్ 5లో హౌస్ లోంచి ఎలిమినేట్ ఐన కంటెస్టెంట్స్ ని 'బీబీ బజ్' పేరుతో  ఇంటర్వూస్ చేసింది. ఇక ఇప్పుడు బీబీ సీజన్ 6 కి కెఫె హోస్ట్ గా చేస్తోంది. ఏదైమైనా  బీబీ షో ద్వారా అరియనా మంచి ఫేమస్ ఐపోయింది. ఇక ఈ బీబీ కెఫెలో హౌస్ లోని లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ఆడియన్స్ షేర్ చేసుకునే వ్యూస్ కూడా  అందించబోతున్నారు అరియనా, శివ. హౌస్ లో ఉండే గాసిప్పులు, గ్రూపింగ్లు, చాటింగ్లు, చీటింగ్లు అన్నిటి గురుంచి వీళ్ళు చెప్తారు. ఈ షో 5 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌కి స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారం కాబోతోంది.  

త్వరలో ఫ్రెండ్‌ని పెళ్లాడ‌బోతున్న‌ భానుశ్రీ?

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చాలా మంది సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. యాంకర్ భానుశ్రీ కూడా బీబీ హౌస్ నుంచి వచ్చాకే స్టార్ ఐపోయింది. బుల్లి తెర మీద అల్లరి చేస్తూ తన గొంతుతో అందరిని ఆటపట్టించే భాను ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే భానుశ్రీ పెళ్లి చేసుకోబోతుందని ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఐతే భాను తన ఫ్రెండ్ నే ప్రేమిస్తోందని, అతన్నే వివాహం చేసుకుంటుందనే వార్త వినిపిస్తుంది. తాను లైఫ్ లో సెటిల్ అవడానికి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసాడని, తనని ఎప్పటికీ మర్చిపోను అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ని ఇప్పుడు ఈ వార్తకు లింక్ చేసి ఫ్రెండ్ నే మ్యారేజ్ చేసుకోబోతోంది అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకానొక టైంలో తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయక పోయినా అత‌ను తనకు సపోర్ట్ గా నిలబడ్డాడని చెప్పింది. అసలు భానుశ్రీ పెళ్లి వార్త నిజమేనా?, భాను నిజంగా పెళ్లి చేసుకోబోతోందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

బుగ్గలేసుకుని చాలా బాగున్నారంటూ రోహిణి పై మహేష్ కామెంట్స్

జీ తెలుగు ఎప్పటికప్పుడు సరికొత్తగా రియాలిటీ షోలు చేస్తూ దాని ద్వారా మూవీ ఇండస్ట్రీకి  కొత్త కొత్త సింగర్స్ ని, డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది జీ తెలుగు. ఇక  ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు షోతో  తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక  ఈ షో ప్రతీ ఆదివారం రాత్రి ప్రసారమౌతోంది. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు ఆయన కూతురు సితార ఇద్దరూ ఈ షోకి గెస్ట్స్ గా వచ్చారు. మహేష్ బాబు అంటే అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు. మహేష్ జనరల్ గా ఏ షోస్ కి కూడా హాజరుకారు. కానీ ఈ షోకి ఫస్ట్ టైం కూతురుతో కలిసి వచ్చారు. జబర్దస్త్ లో ఫేమస్ ఐన లేడీ కమెడియన్ రోహిణి ఈ షోకి అకుల్ బాలాజీతో కలిసి హోస్ట్ చేస్తోంది. స్టేజి మీద ఉన్న  మహేష్ బాబుని చూసేసరికి  రోహిణి సిగ్గులమొగ్గయింది. "పిలిచినా రానంటావా" అనే పాటకు డాన్స్ చేసింది. రోహిణి డాన్స్ చూస్తున్న   మహేష్ బాబుతో  "అలా చూడకండి మీ చూపులు నా వీపుకు గుచ్చుకుంటున్నాయి" అంటూ మూవీ డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగ్ కి సితార పడీ పడీ నవ్వుతుంది. ఇక తర్వాత "హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయమంటారు " అంటూ సిగ్గు పడుతూ అడిగేసరికి  "సినిమాలు చేయాలి" అంటూ మహేష్ ఆన్సర్ ఇచ్చారు. "నా బుగ్గలు సాగిపోతున్నాయి సర్..నేను మీలా అందంగా ఉండాలంటే ఏం చేయాలి" అన్ని అడిగేసరికి  "బాగున్నారండి..బుగ్గలేసుకుని" అని మహేష్ ఆన్సర్ ఇస్తాడు. అంతే గట్టిగా నవ్వుతూ  రోహిణి అకుల్ బాలాజీని ఒక్క తోపు తోసేస్తుంది. అతను స్టేజి మీద పడిపోతాడు. ఇలా  ఈ వారం  మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతోంది ఈ డాన్స్ ఇండియా డాన్స్.

మా ఇద్దరిదీ ఓడిందా ? డబుల్ మీనింగ్ లో ఆది, పూర్ణ డైలాగ్స్!

ఢీ- 14 డాన్సింగ్ ఐకాన్ షోలో పూర్ణ మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఆమె ఏ షోలో ఉన్నా అక్కడ నవ్వులే నవ్వులు. అన్ని షోస్ లో పూర్ణ కనిపిస్తూనే ఉంటుంది. పూర్ణ పెట్టే ముద్దులే కాదు, ఇచ్చే హగ్గులు, మాట్లాడే మాటలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పూర్ణతో పాటు హైపర్ ఆది చేసే రచ్చ కూడా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఢీ-14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇందులో ఈ మధ్య అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. అతని మీద ఆది, ఆది మీద అతను పీల్చుకునే పంచ్ డైలాగ్స్ కి ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో పూర్ణ మాటలు వింటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లా అనిపిస్తాయి. చెర్రీ, హేమాక్షి ఇద్దరూ కలిసి "అందర్లోనూ ఉంది సంథింగ్" అనే సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ అయ్యాక  ఆ పాటలో చేసినట్టు ఆది, అఖిల్ ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకోవాలనే టాస్క్ ఇచ్చింది పూర్ణ. దీంతో అఖిల్ షాక్ అయ్యి "మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయంటూ అడిగాడు.  నువ్ నా పక్కన ఆనుకుని కూర్చుకుని రుద్దుతూ ఉంటె అలాటి ఆలోచనలే వస్తాయి మరి" అని అన్నాడు ఆది. "మేం చేయం అంటూ అఖిల్ అనేసరికి మీది ఓడిపోయింది ఈ రౌండ్ లో అంటుంది. మాది గెలిచిందా అంటూ ఆది డబుల్ మీనింగ్ లో మాట్లాడతాడు.ఐతే మా ఇద్దరిదీ ఓడిపోయింది ఐతే" అన్నాడు ఆది. ఫైనల్ ఈ షోలో పూర్ణ డైలాగ్స్ ని అందరూ నవ్వేశారు.  

షో మధ్యలో గబ్బర్ సింగ్ కి కాల్ చేసిన ధన్ రాజ్!

ధన్ రాజ్ ఈ పేరు ఫుల్ స్క్రీన్ మీద స్మాల్ స్క్రీన్ మీద బాగా పరిచయమే. ఐతే జబర్దస్త్ కి ముందు చాలా సినిమాల్లో నటించాడు ధన్ రాజ్. ఐనా అనుకున్నంతగా పేరు రాలేదు. కానీ  జబర్దస్త్ షోలోకి వచ్చేసరికి మాత్రం  ఫుల్ ఫేమస్ అయ్యాడు. ధనాధన్ ధన్ రాజ్ గా మంచి పాపులారిటీ ఉన్న కమెడియన్ గా పేరు వచ్చేసింది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎంటర్టైన్ చేశారు.  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న రిలేషన్ ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన మూవీ కూడా హిట్ కావాలని ఆయన ట్విట్టర్ లో పెట్టిన మెసేజ్ ని ఈ షోలో చూపించారు. ఇంతలో ఆది మధ్యలో వచ్చి "అన్నా..మీరెప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా ? అని అడిగేసరికి ధన్ రాజ్ వెంటనే ఫోన్ తీసి ఆయనకి డయల్ చేశారు.  అటు నుంచి వెంటనే హలో  ధన్ రాజ్ గారు అంటూ పవన్ వాయిస్ వినిపించింది. ఐతే అటునుంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదంటే ఆయన వాయిస్ ని ఎవరైనా మిమిక్రీ చేశారా అనేది తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.  

పవన్ కళ్యాణ్ తో డేటింగ్ ఇష్టం అంటున్న సురేఖావాణి!

ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ సురేఖా వాణి. తెలుగులో అమ్మ, వదిన రోల్స్ చేస్తూ హోమ్లీగా కనిపించే బ్యూటీ సురేఖ. ఏజ్ 50కి దగ్గరవుతున్నా కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటుంది. భర్త చనిపోయాక చాలా రోజులపాటు సురేఖవాణి బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఈ మధ్య సుప్రీత తనను మొత్తం మార్చేసిందని సురేఖావాణి చెప్పుకొచ్చింది. ఇటీవల 'నిఖిల్ తో నాటకాలు' షోకి వచ్చిన సురేఖవాణి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎలాంటి క్వాలిటీస్ అతనిలో ఉండాలో కూడా చెప్పి ఫన్ చేసింది.  సుప్రీత కూడా "అమ్మకి పెళ్లి చేసేస్తేనే బెటర్, లేదంటే నా బుర్ర తింటూ ఉంటది" అంటూ కామెడీ చేసింది. ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. తర్వాత  సుప్రీతకు మందు తాగిస్తూ సురేఖ చేసిన హడావిడి కూడా మస్త్ వైరల్ అయ్యింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పింది సుప్రీత. వాళ్ళ నాన్న విషయంలో చాలా బాధపడిందని చెప్పింది.  అలాగే అమ్మకు వోడ్కా అంటే ఇష్టమని, డ్రెస్సింగ్ స్టయిల్లో శారీస్, మోడరన్ డ్రెస్సెస్ ఎక్కువగా ఇష్టం అని చెప్పింది. అలాగే డేటింగ్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరితో చేస్తుంది అని అడిగేసరికి "పవన్ కళ్యాణ్" అని చెప్పింది సుప్రీత.

పనికిమాలినోడ అంటూ రాంప్రసాద్ పరువు తీసేసిన అన్నపూర్ణ

వినాయక చవితి పండగ రోజున అన్నీ ఫన్ ఓరియెంటెడ్ కార్యక్రమాలతో బుల్లి తెర మెరిసిపోయింది. ఈటీవీలో "మన ఊరి దేవుడు" పేరుతో వచ్చిన ప్రోగ్రాం చాలా బాగా హైలైట్ అయ్యింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఒక టీమ్ తరపున వస్తుంది. "పండగకు ఏం స్పెషల్స్ చేస్తున్నారేమిటి" అంటూ ప్రదీప్ అన్నపూర్ణను అడుగుతాడు. "నేను మాత్రం  పాయసం చేస్తాను అంటుంది. ఇంతలో మరో టీమ్ నుంచి ఆటో రాంప్రసాద్ వచ్చి ఆయాసం వచ్చే వయసులో పాయసం చేయడమెందుకు రెస్ట్ తీసుకోక" అంటాడు. "ఒరేయ్ పనికిమాలినోడా ఇంతా ఆయాసంతోనే ఐదారు స్కిట్లు చేయించుకున్నాడు ఒక సిగ్గులేనోడు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది.  "ఇక ఏమీ తెలియనట్టు ఎవడు అని రాంప్రసాద్ అనేసరికి ఎవడో" అంటుంది అన్నపూర్ణ. "నేనైతే కుడుములు చేస్తా" అని మలక్ పేట శైలజ అనేసరికి "ఈ ఉడుము మొహమేసుకుని కుడుములు చేస్తే మా టీమ్ లో గణపతి మాస్టారు కూడా తినడు" అని ఆది పంచ్ వేసేసరికి పళ్ళు నూరుతుంది శైలజ. ఇక తర్వాత నాటి నరేష్ వచ్చి ఖుష్బూను పొగుడుతాడు. "ప్రపంచంలో అందమైన రెండు ఒకటి మీరు రెండు నేను" అని బుగ్గ గిల్లేసరికి గట్టిగా నరేష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. "వాడు వేసుకున్న షర్ట్ కలర్ మొత్తం పోయే వరకు మీ అన్నయ్యలతో బాగా ఉతింకించమ్మా" అంటూ అన్నపూర్ణమ్మ అంటుంది. ఆ డైలాగ్ కి  అందరూ నవ్వేశారు.

అదిరిపోతున్న బిగ్ బాస్ హౌస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 న  సాయంత్రం 6 గంటలకు మొదలుకావడానికి సిద్దమయ్యింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో బిగ్ బాస్ హౌస్ ని లోపల లొకేషన్ ని చూపించారు. ఈ హౌస్ లోకి  మెరీనా-రోహిత్ సాహ్ని జోడి, జబర్దస్త్ ఫేమ్ ఫైమా, తన్మయ్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెరీనా-రోహిత్ సాహ్ని జోడి పై ప్రోమో షూట్ జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే హోస్ట్ నాగార్జున శుక్ర, శని వారాల్లో షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక ఈ సీజన్లో సామాన్యులని కూడా హౌస్ లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. మొదటి ఫైవ్ సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ అదిరిపోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అ అంటే  అమలాపురం అనే  ఐటం సాంగ్‌తో పాపులరైన అభినయ శ్రీ ఈసారి హౌస్‌లో స్పెష‌ల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తర్వాత జబర్దస్త్‌  నుంచి  చలాకీ చంటి, నటుడు శ్రీహాన్‌, సింగర్‌ రేవంత్‌, నటుడు బాలాదిత్య,  గలాటా గీతూ వంటి వాళ్ళు ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్, వారి పెర్ఫార్మెన్సెస్ తో కొన్ని విజువల్స్ ని ప్రోమోలో చూపించారు. ఆదివారం చాలా గ్రాండ్ గా ఈ షో స్టార్ట్ కాబోతోంది.

పేషెంట్ కి దిష్టి తీసి పంపించిన డాక్టర్! 

జబర్దస్త్ షో  ఆడియన్స్ ని తెగ అలరిస్తోంది. మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినా అన్ని సర్దుకుని ఇప్పుడు మళ్ళీ పాత అందం సంతరించుకుంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా రాబోయే వారం స్కిట్స్ అన్నీ కూడా చక్కగా అలరించబోతున్నాయి. ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఖుష్బూ, ఇంద్రజ, రష్మీ కలిసి గణేశుడి  విగ్రహాన్ని స్టేజి మీదకు తెచ్చి పూజ చేసి ప్రసాదాలు పంచేశారు. ఇక తరువాత స్కిట్ లోకి రాఘవ టీం ఎంట్రీ ఇచ్చేసాడు. రాఘవ ఒక చిన్న క్లినిక్ పెట్టి నడుకుంటున్నాడు. "కడుపు నొప్పి వస్తే రండి తీసి పంపించేస్తాను, తలనొప్పి వస్తే రండి తీసి పంపిస్తాను అంటూ అనౌన్స్ చేస్తాడు. ఇంతలో మోకాళ్ళ నొప్పులతో ఒక పేషెంట్ వస్తాడు. గబగబా వెళ్లి ఎండుమిరపకాయలు ఉప్పు తెచ్చి ఆ పేషెంట్ కి దిష్టి తీస్తాడు. ఇంతలో లోపలి నుంచి రాఘవ భార్య వస్తుంది. ట్రీట్మెంట్ టైంలో ఇక్కడికి రావద్దు అన్నా కదా అని భార్య మీద అరుస్తారు.  ఇంట్లో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇక్కడ క్లినిక్ లో పెట్టుకుంటే ఇంట్లో వంటెలా చేసేదంటూ అరుస్తుంది.  ఇంతలో ఆ తిట్లను కవర్ చేసుకోవడానికి జడ్జెస్ ఏంటి అంత డల్ గా ఐపోయారని అనేసరికి దృష్టి అంటూ ఖుష్బూ అంటారు . వెంటనే రాఘవ సాంబ్రాణి పట్టుకెళ్లి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి ఎక్స్ట్రా దిష్టి పోవాలి" అంటూ మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు.  

2023 ఫిబ్రవరిలో రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత పెళ్లి

బుల్లితెర వచ్చాక కామెడీ షోస్ చాలా వచ్చాయి. అందులో ఇటీవల చూస్తే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఈ షోస్ ద్వారా ఎంతోమంది రియల్ లైఫ్ లో జంటలు అయ్యారు. కొంత మంది మాత్రం రీల్ జోడీస్ గా మాత్రమే ఉండిపోయారు. అలాంటి జోడీస్ లో  రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఉన్నారు. వీళ్ళ ప్రేమ జబర్దస్త్ స్టేజి మీదనే పుట్టింది. అలాగే ఇక్కడున్నవాళ్లందరి చేతుల మీదుగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నట్టు గెటప్ శీనుతో చెప్పించాడు రాకేష్. సుజాత శీను వాళ్ళ తరపున అమ్మాయి కాబట్టి ఆయన చెప్తే బాగుంటుందని పెళ్లి ఫిక్స్ అనే విషయాన్ని మన ఊరి దేవుడు ఈవెంట్ స్టేజి మీద చెప్పించాడు. అలాగే తన తమ్ముడి పెళ్లి కూడా ఈ జబర్దస్త్ స్టేజి మీద చేసిన విషయం తెలిసినదే. ఇక ఇప్పుడు వాళ్లకు పాప పుట్టేసరికి ఆ పాపకు కూడా ఈ స్టేజి మీదనే పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. నక్షత్ర అనే పేరు ఫిక్స్ చేసి కుష్బూ, ఇంద్రజ, నాగినీడు ముగ్గురూ కలిసి పాప చెవిలో పేరును అనౌన్స్ చేశారు. సుధీర్, రష్మీ , ఇమ్ము, వర్ష జోడీల్లా రాకేష్వీ, సుజాత వాళ్ళ  జోడీ కూడా అనుకున్నారంతా మొదట్లో. ఐతే వీళ్ళ ప్రేమ చాలా రియల్ అంటూ ఏ షో చేసినా అక్కడ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్ళికి సిద్ధమైపోయారు.  సుజాత ఇటీవల రాకేష్ ఇంటికి వరలక్ష్మి వ్రతం కూడా చేసి వచ్చిన విషయం తెలిసిందే.

తనని మర్చిపోలేక సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదా ?

సుమంత్ సత్యం మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. చేసినవి కొన్ని సినిమాలే ఐనా ఒక మోస్తరు పేరు సంపాదించుకున్నాడు. గోదావరి మూవీలో సుమంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత  గోల్కొండ హై స్కూల్ మూవీ చేసి ఆ పేరును డబుల్ చేసుకున్నాడు. ఐతే హిట్ మూవీస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి సుమంత్ హిస్టరీలో. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ తన పెళ్ళికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. మూవీ ఫీల్డ్ లో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన విడిపోరని గారెంటీ లేదు. చాలా మంది సినిమా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇలా కలుసుకున్నారు అలా విడిపోయారు. పెళ్లి అనేది కొంతమందికి అవసరం కానీ అందరికీ కాదు అని అన్నారు. అలాగే తనని వదిలేసి వెళ్ళిపోయినా అమ్మాయిని  మర్చిపోలేకపోతున్నా అనే మాట అబద్దం. నేను చాలా హ్యాపీ గా ఉన్నా. నా లైఫ్ లో మళ్ళీ తనని కలవాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు అని చెప్పారు. నేను మంచి సినిమాలు చేసాను, బాగా డబ్బు సంపాదించాను, మంచి వాటిల్లో ఇన్వెస్ట్ చేసాను కాబట్టి డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో నా క్యారెక్టర్స్ వేరు నేను వేరు. భార్యాభర్తలు ఎవరైనా సరే తన సలహాలు అస్సలు తీసుకోవద్దని చెప్పారు. భార్యా బాధితుల విషయం గురించి తనకు పెద్దగా తెలీదన్నారు. ఎందుకంటే లైఫ్ లో అన్ని కష్టాలు కానీ, అంత గుడ్ రేలషన్ షిప్ అనేది లేదు అని చెప్పారు సుమంత్. గడిచిన కాలం మళ్ళీ ఒక అవకాశం ఇస్తే అనే థాట్ మనసులో లేదు. ప్రొఫెషన్ పరంగా ఫెయిల్యూర్ ఐన మూవీస్ కూడా ఎన్నో నేర్పిస్తాయి. లైఫ్ లో హ్యాపీగా లేనివాళ్లే  పాత విషయాల గురించి ఆలోచిస్తారు. కానీ తాను తన ఫామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సినిమాలు ఫ్లాప్ ఐనప్పుడు నెగటివ్ థాట్స్ వస్తాయి కానీ ఫామిలీ సపోర్ట్ గా ఉంది కాబట్టి తనకు పెద్దగా సమస్య లేదన్నారు. ఫెయిల్యూర్స్ వస్తాయి అలాగే టైం వస్తే హిట్స్ కూడా వస్తాయి. కొంచెం ఓపిక పట్టాలి అంతే అంటూ తన లైఫ్ విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నారు సుమంత్.

ఈరోజు నుంచి నా లైఫ్ లో వర్ష లేదు.. కేతిక వుంది!

ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఎక్స్ట్రా ఫన్ తో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక ఈ వారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో 'రంగ రంగ వైభవంగా' మూవీ నుంచి వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ వచ్చారు. ఇక ఈ షోలో సుడిగాలి సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు పడ్డాయి. ఫైమా, బులెట్ భాస్కర్ కలిసి ఒక స్కిట్ వేశారు. ఒక రాజ్యానికి రాజు, రాణిలా నటించారు. "పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు బయటికి వెళ్లిపోవడానికి  ఒక సొరంగం తవ్వండి" అంటూ భాస్కర్ తో అంటుంది ఫైమా. "సొరంగం సొరంగం అని చెప్పి ఒకడ్ని ఎంకరేజ్ చేశారు వాడేం చేసాడు... ఆ సొరంగంలోంచి పక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాడు"  అంటూ సుధీర్ మీద పంచ్ డైలాగ్స్ వేసాడు భాస్కర్. తర్వాత ఇమ్ము, వర్ష కలిసి స్కిట్ వేస్తారు. "ఈరోజు నుంచి నా లైఫ్ లో వర్ష లేదు, కేతిక వుంది" అంటాడు ఇమ్ము. "మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజు కూడా గడపను. ఎందుకంటే మీరంటే నాకు అంత ఇష్టం.. ఐ లవ్ యూ సో మచ్" అంటూ చెప్తాడు. "థ్యాంక్యూ సో మచ్ భాస్కర్ గారు" అంటూ ఇమ్ముని పిలిచేసరికి కెవ్వుమని అరుస్తాడు. వైష్ణవ్ తేజ్ "ఐ లవ్ వర్ష" అంటూ చెప్పాడు. ఇక గెటప్ శీను తమ్ముడు వేషంలో వచ్చి తన స్కిట్ లో అలరించాడు. ఫైనల్ గా షబీనా వచ్చి తన కాబోయే భర్తను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది. అతన్ని చూసేసరికి షబీనాని ప్రేమించిన‌ నాటీ నరేష్ ఏడుస్తాడు. రష్మీ, కెవ్వు కార్తీక్ వచ్చి ఓదార్చి "షబీనా పొతే పోయింది, మన సెట్ కి కేతిక వచ్చింది" అంటూ చిరంజీవి డైలాగ్ చెప్పి ఫన్ క్రియేట్ చేశారు.

'అంకుల్' అని పిలుస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారా!?

నిన్నటి వరకు ట్విట్టర్ లో 'ఆంటీ' వివాదం రచ్చ చేసింది. ఇప్పుడు కొత్తగా 'అంకుల్' వివాదం తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు బ్రహ్మాజీ. ఆయన ఇటీవల ఒక వెరైటీ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "వాట్స్ హాపెనింగ్ " అంటూ ఒక క్వశ్చన్ కూడా రిలేటెడ్ గా పెట్టారు. దీంతో ఒక నెటిజన్ "ఏం లేదు అంకుల్" అంటూ రిప్లై ఇచ్చాడు. అసలే బ్రహ్మాజీకి కోపం చాలా తక్కువ. కానీ ఈ రిప్లైకి కొంచెం కోపం వచ్చినట్టే ఉంది.  "అంకుల్ ఏంట్రా అంకుల్... కేసు వేస్తా.. నా ఏజ్ ని, నన్ను చూసి బాడీ షేమింగ్ చేస్తున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. అలాగే ఆ కామెంట్ పక్కన ఒక స్మైల్‌ ఎమోజి పెట్టేసరికి ఇది సరదాగా పెట్టిన పోస్ట్ అని అర్థమౌతోంది. ఇటీవల అనసూయని ఆంటీ అన్నందుకు కేసు పెట్టింది. ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఐతే ఆమెను ఆంటీ అన్నందుకు మాత్రమే కేసు వేయలేదు అన్నా!! ఆంటీ అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేస్తానని అన్నారు..! తోటి కళాకారులకు సహకారం ఇవ్వకుండా కామెడీ చేయడం ఏంటి బ్రహ్మాజీ అన్నా మీరు!!? అంటూ మిగతా నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద "అలాగే మా తాతగారు బ్రహ్మాజీ" గారు అన్న డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఆంటీ వివాదమే ఇంకా చల్లారలేదు, ఇప్పుడు కొత్త‌గా అంకుల్ అన్నందుకు బ్రహ్మాజీ ఫైర్ అవుతున్నారు. ఈ అంకుల్ మాట ఎంతో దూరం వెళ్తుందో వేచి చూడాలి.

సోనాక్షితో డేటింగ్ చేయాల‌ని వైష్ణ‌వ్ అనుకుంటున్నాడా?

'ఉప్పెన' మూవీతో స్టార్ డం అందుకున్న మెగా ఫామిలీ హీరో వైష్ణవ తేజ్. 'ఉప్పెన', 'కొండపొలం' తర్వాత కేతికశర్మ హీరోయిన్ గా "రంగ రంగ వైభవంగా" మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ టీమ్ బుల్లితెర షోస్ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కేతిక, వైష్ణవ్ ఇద్దరూ 'నిఖిల్ తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. "వైష్ణవ్ తేజ్ పెళ్లి చేసుకుంటే గనక ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి ఐతే బాగుంటుంది. ఎందుకంటే అతని ఫామిలీ కూడా అలాంటిదే కదా" అంది కేతిక. ఇక వైష్ణవ్ హీరో కాకపోయి ఉంటే సైంటిస్ట్ అయ్యేవాడని, చాలా సార్లు ఈ విషయం తనతో చెప్పాడంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే బిర్యానీ అంటే ఇష్టమని చెప్పింది. హీరోయిన్స్ లో డేటింగ్ చేయాల్సి వస్తే సోనాక్షి సిన్హాతో చేస్తాడని వైష్ణవ్ గురించి ఎన్నో విషయాలు చెప్పింది. కేతిక శర్మ గురించి వైష్ణవ్ తేజ్ చెప్తూ 'పుష్ప' మూవీ అంటే ఆమెకు చాలా ఇష్టమని అలాగే బిర్యానీ, చేపల పులుసు అంటే బాగా ఇష్టపడుతుందని చెప్పాడు.  తర్వాత డైరెక్టర్ గిరీశాయను ఫోన్ లో యాంకర్ అడిగాడు, "ఇద్దరూ షూట్ లో బాగా అల్లరి చేసేవాళ్ళా" అని .. ఇద్దరితో పెద్ద సమస్య లేదు, బాగా కో- ఆపరేట్ చేసేవారని గిరీశాయ చెప్పాడు.