ఇంకా ఆరని నిప్పు...కేసు ఫైల్ చేశానంటూ అనసూయ ట్వీట్

లైగర్ మూవీ రిలీజ్ అవడం అది ఫ్లాప్ ఐన విషయం ఏమో  కానీ సోషల్ మీడియా మొత్తం విజయ్ దేవరకొండ ఫాన్స్ కి అనసూయ కి మాత్రం ఒక రేంజ్ లో యుద్ధం జరిగింది. ‘అమ్మను తిట్టిన ఉసురు ఊరికే పోదు’ అందుకే సినిమా ఫెయిల్ అంటూ ఒక   శాపనార్ధాల ట్వీట్ పోస్ట్ చేసింది అనసూయ. ఇక కథ అక్కడ మొదలయ్యింది. ఆ నిప్పు అసలు ఆరనే లేదు. ఈ విషయం విజయ్ దేవరకొండ ఫాన్స్ కి ఫుల్ కోపం తెప్పించింది. వాళ్ళు "ఆంటీ" అంటూ ట్రోలింగ్ కి దిగారు.  విజయ్ దేవరకొండ అభిమానులకు అలాగే అనసూయ అంటే ఇష్టం లేని వారికి కోపం తెప్పించింది. దీంతో ‘ఆంటీ’ అంటూ ఆమె పై ఓ రేంజ్లో ట్రోలింగ్ కి దిగారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం అనసూయాది ఒక బెటర్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఐతే ఇలా ఎందుకు ట్వీట్ చేసిందో ఏంటో ఎవరికీ తెలీదు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా  అనసూయ మళ్ళీ ఒక  ట్వీట్ పోస్ట్ చేసింది. ఇందులో తన పై అసభ్యకరంగా ట్వీట్లు వేసిన వారిపై కేసు పెట్టినట్లు, ఆ కేసు నెంబర్ ఎక్నాలెడ్జిమెంట్ ని కూడా పోస్ట్ చేసింది. "నేను ఎవరిమీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకోలేదు, ఎవరి భవిష్యత్తు పాడవకూడదని అనుకున్నా. కానీ నా నిర్ణయం మార్చుకున్నా. ఏదైతే అది అయ్యింది. నేను కేసు పెట్టేసాను, ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది " అంటూ ట్వీట్ చేసింది.

ఎవరికీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదా ? జర్నలిస్ట్ పై గెటప్ శీను ఫైర్

జబర్దస్త్ షో ద్వారా.. ఆ స్టేజి మీదే ఓనమాలు దిద్దిన ఎంతో మంది ఇప్పుడు   సెలబ్రిటీలుగా ఎదిగారు.  వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్‌ ఈవెంట్స్‌, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు  వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో 3 రిలీజ్ అయ్యింది.  తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్‌ రోషన్‌ సందడి చేశారు.  ఈ షో లో రోషన్ జబర్దస్త్ కమెడియన్స్ ని ఇంటర్వ్యూ  చేశారు. కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా రోషన్ వాళ్ళను అడిగాడు వాళ్ళు కూడా అతన్ని ప్రశ్నించారు. "జబర్దస్త్ లో అసలు ఏం జరుగుతోంది అనేసరికి అది మాకంటే మీకే బాగా తెలుసు" అంటూ ఆది పంచ్ వేసాడు. "మీరు ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కావడానికి కారణం అని రోషన్ అడిగేసరికి నా పక్క ఆర్టిస్టులు సరిగా చేయక నాకు పేరొచ్చింది" అంటారు కృష్ణ భగవాన్. "మనిషిగా  ఎదగాలంటే దానికి మీరు చెప్పే సూత్రం ఏమిటి అని అడిగేసరికి ఎవడికి బడితే వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని" చెప్పేసరికి..ఇదంతా  సీరియస్ గా గమనిస్తున్న గెటప్ శీను వచ్చి " ఏజ్ పరంగా మీరు ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడతారు ? అనేసరికి రోషన్ ఫేస్ మాడిపోతుంది. మీడియాలో ఉన్న జర్నలిస్ట్ గా ఉన్నాను  కాబట్టి ప్రతీ సారి గారు, గారు అనలేం కదా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇది షో అని శీను అనేసరికి మీకు షో కావొచ్చు కానీ ఇది నా షో అని చెప్పారు" అంటాడు రోషన్ . ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ సీరియస్ గా తారాస్థాయికి చేరింది. ఇంతకు ఎవరు ఎలాంటి పంచ్ డైలాగ్స్ వేసుకున్నారు అనే విషయం తెలియాలంటే ఈ షో చూసేయాల్సిందే.

కామెడీ మాత్రమే కాదు ఏ రోల్ ఐనా చేస్తా !

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనే పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ "అదో తుత్తి" అనే డైలాగ్ వింటే చాలు ఏవీఎస్ అని చెప్పేస్తారు. ఆయన పూర్తి పేరు అది. కానీ ఏవీఎస్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈయన సైలెంట్ గా చేసే కామెడీకి ఆడియన్స్ పడీపడీ నవ్వాల్సిందే. ఆయన కమెడియన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. కాలేజీ టైంలో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత బాపు డైరెక్షన్ లో "మిస్టర్ పెళ్ళాం" మూవీ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆయన దాదాపు 500 పైగా చిత్రాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. ఇప్పుడు ఆయన తనయుడు ప్రదీప్ కూడా ఇండస్ట్రీ వైపు వచ్చేసాడు. ప్రదీప్ మల్టీ టాలెంటెడ్. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి యాడ్ ఏజెన్సీ పెట్టుకుని ఎన్నో పెద్ద కంపెనీస్ కి, కార్పొరేట్ , ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ కి యాడ్స్ తయారు చేస్తుంటాడు. ఇటీవల ఆయన వాళ్ళ నాన్న గురించి తన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళ నాన్నగారు చనిపోయే టైంకి పెద్దగా అప్పులేమి లేవన్నారు. లివర్ ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు ప్రదీప్ అక్క శ్రీప్రశాంతి తన లివర్ ని డొనేట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. "అక్క అంటే నాన్నకు చాలా ఇష్టం..నా కన్నతల్లి అంటూ ఉంటారు ఎప్పుడూ. అక్కకి, వాళ్ళ ఫామిలీకి డాక్టర్స్ బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అక్క హ్యాపీ, లివర్ డొనేట్ చేసాక అక్కకి పాప కూడా పుట్టింది" అని చెప్పాడు ప్రదీప్ . "కమెడియన్ బ్రహ్మానందం అంకుల్ కి ఫోన్ చేస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాబూమోహన్, సాయికుమార్ అంకుల్ వాళ్ళు కూడా బాగా మాట్లాడాతారు.  2012 నుంచి నాకు డైరెక్షన్ చేయాలనే ఇంటరెస్ట్ ఉండేది. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆడిషన్స్ ఇస్తున్నా. ఎవరైనా రోల్స్ ఇస్తుంటే చేస్తున్నా. అలాగే  ఇప్పుడు నాలుగు భాషల్లో "సాచి" అనే థ్రిల్లర్ ని మూవీ రిలీజ్ కావడానికి  రెడీగా ఉంది. నాన్నగారిలా కామెడీ మాత్రమే  కాదు ఏ రోల్ ఐనా చేస్తాను. మా ఆక్టివ్ స్టూడియోస్ బ్యానర్ నుంచి "కాంట్రాక్టు " అనే హారర్ మూవీ  కూడా రెడీ అయ్యింది. త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే సాచి మూవీ రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని దాని సీక్వెల్ కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆక్టివ్ స్టూడియోస్ అని నాన్నగారు పేరు పెట్టారు. ఆయన  ముందు నేనెప్పుడూ  ఆక్టివ్ గా ఉండేవాడిని కాదు గాని నాన్న వెనక మాత్రం ఫుల్ హైపర్ ఆక్టివ్ నేను. ఆయన ముందు అలా ఉండడం చూసి నేను ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో" అంటూ ప్రదీప్ నవ్వుతూ చెప్పాడు.  

రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేయకపోతే కొత్తది కొనుక్కోవచ్చుగా

ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించేసరికి ఎంతో మంది ఇండియన్స్ పండగ చేసుకున్నారు. యాంకర్ రవి కూడా ఫుల్ మస్తీ  చేసాడు. ఆయన తన ఇంట్లో తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ చూసి ఎంజాయ్ చేసాడు. ఒక్కసారిగా ఇండియా గెలిచేసరికి అందరూ కలిసి ఖుషి చేసుకున్నారు. ఇప్పుడు  ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేస్తూ ఆనందంతో ఎగిరారు రవి అతని ఫ్రెండ్స్. రవి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్నాడు అలాగే బిగ్ బాస్ నాన్-స్టాప్‌ ప్రోగ్రాం ని  కూడా హోస్ట్ చేశాడు. ఇకపోతే రవి ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టడం చూసిన కొంత మంది నెటిజన్స్ "అన్నా మీ ఇంట్లో కూడా రిమోట్  కోసం కొట్టుకుంటారా ..ఎవరెవరు ?" "ప్రతీ ఇంట్లో రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది మామ..అది సృష్టి ధర్మం" "రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేయకపోతే కొత్తది కొనుక్కోవచ్చుగా" అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ ఇంట్లో చూసుకున్నా ఎవరికీ కోపమొచ్చినా రిమోట్లు మిగిలిపోతాయి. తర్వాత దానికి రబ్బర్ బండ్లు కనిపిస్తాయి. ఇది ప్రతీ ఇంట్లో కామన్ గా కనిపించేదే. అంత స్టార్ యాంకర్ ఐన రవి ఇంట్లో కూడా రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ చూసేసరికి నెటిజన్స్ ప్రతీ ఒక్కదాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ప్రేమించి మోసం చేసినవాడిని తలుచుకుని బాధపడుతున్న రష్మీ!

జబర్దస్త్ అంటే కొంత కాలం క్రితం వరకు యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ చూపించేవారు. ఇక ఈ ట్రాక్ కూడా నిజమేనేమో అనే రీతిలో ఉండేది వీళ్ళ నటన కూడా. వీళ్ళు ఎన్నో  లవ్‌ సాంగ్స్ కి డాన్సులేస్తూ ఆడియన్స్ అదే ట్రాన్స్ లో ఉంచేసేవారు.   అయితే కొన్ని రోజులుగా రష్మికి దూరమయ్యాడు సుధీర్‌. వేరే షోస్‌, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు సుధీర్ ప్లేస్ లో హోస్ట్ గా చేస్తోంది   రష్మి. గతంలో ఒక  సందర్భంలో తన లవ్ ఫెయిల్  అంటూ చెప్పింది రష్మి.  ఇప్పుడు ఆమె ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంత బాధపడుతుందో అనే విషయాన్ని  కళ్లకి కట్టినట్టు చూపించింది.   ప్రాణంగా ప్రేమించి అబ్బాయి పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్‌ ఆఫీస్‌ కి రమ్మని చెప్పి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... చేతిలో పూలదండతో  ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కోసం పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ బాధను రష్మీ ఒక పాటలో చాలా ఎమోషనల్ గా చూపించింది. `అటు నువ్వే ఇటు నువ్వే.. `అంటూ సాంగ్ లో  రష్మి చేసిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ అందరినీ  కంట తడి పెట్టించింది. తర్వాత నాగినీడు చెప్పిన డైలాగ్‌ అందరి  హృదయాలని కలచి వేసింది. బాధలోంచి  వచ్చే ఎక్స్ ప్రెషన్స్ డెప్త్ వేరే లెవల్‌లో ఉంటాయన్నారు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి  నెటిజన్లు సుధీర్ దూరం కావడమే తన బాధకు కారణమా ? అని పోస్ట్ లు పెడుతున్నారు.  ఇక ఇదంతా  `మన ఊరి దేవుడు` అనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌లోని దృశ్యాలు . వినాయకచవితి సందర్భంగా ఈ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ రాబోతోంది. ఇందులో రష్మి లవ్ ఫెయిల్యూర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌ గా నిలవబోతోంది.  

నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే సుధీర్ ని పంపినట్టే నన్ను పంపించేస్తావ్!

జబర్దస్త్ షోలో  సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళను వదిలి  సుధీర్ పక్క ఛానల్ కి వెళ్ళిపోయాడు. శీను, రాంప్రసాద్ ఇద్దరూ జబర్దస్త్ లో ఉండిపోయారు. సుధీర్ బాండ్ టైం ఐపోయింది కాబట్టి వెళ్లిపోయాడని, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు కాబట్టి వెళ్లిపోయాడని అంటున్నారు. కారణం ఏదైనా సుధీర్ స్టార్ మాలో  మెరవడమే కాదు మూవీస్ లోనూ  నటిస్తున్నాడు. సుధీర్ వెళ్లిపోయిన విషయం పై చంటి ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  కప్పల పెళ్లి కాన్సెప్ట్ తో జరిగిన ఈ షోలోకి ఊరి జనం పేరుతో జబర్దస్త్ టీమ్ అంతా వచ్చేసింది. ఈ షోలో మొత్తం జబర్దస్త్ వాసన వస్తోందంటూ కౌంటర్లు వేస్తారు. ఊరి ప్రెసిడెంట్ గా తాగుబోతు రమేష్ చేసాడు. ఇక ఈ పెళ్ళికి చలాకి చంటి, రాఘవ వంటి వాళ్ళు వస్తున్నారని చెప్తాడు. ఈ మధ్య ఐశ్వర్య అంటూ ఒకాయన కలవరిస్తుంటాడు అంటూ రాఘవ పరువు తీసాడు ఆది. ఐతే అందరిలోకి ముందుగా బులెట్ భాస్కర్ మాట్లాడేసరికి "చూసావా అన్న..అందరికంటే సీనియర్ వి నువ్వు ఉన్నా కూడా మాట్లాడలేదు..వాడికి డైలాగ్స్ ఇవ్వకపోయినా మాట్లాడుతున్నాడు అంటూ బులెట్ భాస్కర్ గురించి చంటికి చెప్తాడు ఆది. కండలు పెంచు అన్నా అంటూ ఆది అనేసరికి రాంప్రసాద్ ఎంటరయ్యి అన్నా నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండు..నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటాడు.  కొన్ని సంవత్సరాలనుంచి ఫ్రెండ్ షిప్ చేసిన వాడినే  నువ్వేం చేసావో నాకు తెలుసు.. నేను కూడా నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే భాస్కర్ కంటే  భాస్కర్ చేసే దారుణాలకన్నా నీ దారుణాలే ఎక్కువగా ఉంటాయి.."అంటూ కౌంటర్లు వేసాడు చంటి.

వినాయక చవితి రోజున మటన్, చికెన్ జోకులేంటమ్మా

క్యాష్ ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న ఒక గేమ్ షో. ఇందులో ప్రశ్నలు అడుగుతారు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే డబ్బులిస్తారు కూడా. ఇక ఈ వారం షోకి "స్వాతిముత్యం" మూవీ టీం వచ్చేసింది. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, పమ్మి సాయి, దివ్య శ్రీపాద, లక్ష్మణ్ కే.కృష్ణ వచ్చేసారు. ఇక ఈ షోలో టీమ్ తో  కొన్ని గేమ్స్ ఆడించేశాక సుమ కండక్టర్ వేషం వేస్తుంది. ఒక పాసెంజర్ కుర్రాడికి వాంతులయ్యేసరికి "ఎన్నో నెలమ్మా" అని అడిగి ఫన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఒక హాస్పిటల్ పెట్టి పేషెంట్స్ ని పిలవమంటూ వర్ష కి సుమ పని చెప్తుంది. "వర్ష రండి , రండి అని పిలిచేసరికి రండి, రండి ఈగలు తోలుకుందాం అని పిలుస్తున్నావేంటి" అని అడుగుతూ కౌంటర్ వేస్తుంది సుమ.  తర్వాత వినాయక లడ్డు వేలం పాట పెడుతుంది సుమ. తక్కువ చందాలు ఇచ్చిన వాళ్ళను తిడుతూ సరదాగా జోక్స్ వేస్తుంది.  అదయ్యాక మాకు ఒక కాస్ట్లీ స్టాండప్ కమెడియన్ వర్ష వచ్చారు అంటూ సుమ చప్పట్లు కొడుతూ ఇన్వైట్ చేస్తుంది. " అప్పుడే చప్పట్లు కొడుతున్నారేంటి " అని గణేష్ అడిగేసరికి "తర్వాత జోక్ పేలుతుందో లేదో ముందే చప్పట్లు కొట్టడం బెటర్ కదా" అని అంటుంది సుమ. ఇంతలో వర్ష "కోడికి ఒక ఫాదర్ ఉంటారు అతన్ని ఏమని పిలుస్తారు" అంటూ ఒక జోక్ ని ప్రశ్నగా అడుగుతుంది. "నేను ఇన్ని రోజులు తెలియకుండానే తినేశానే" అంటూ ఫీల్ అవుతుంది సుమ. "మటన్ చికెన్ కి ఏమని చెప్పింది" అంటూ ఇంకో జోక్ చెప్పేసరికి" "అన్ని ఇలాంటి జోకులేనా ఈ వినాయక చవితి రోజున అవసరమా" అంటుంది సుమ. ఆ డైలాగ్ కి వర్ష నోరు మూసేసుకుంటుంది.

చమ్మక్ చంద్ర కాళ్లపై పడిన రచ్చ రవి!

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆ షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు. ఒకప్పుడు జబర్దస్త్ మాత్రమే ఉండేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్, ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది. ఇలా ఎన్నో షోస్ అలరిస్తూ ఉన్నాయి. ఛానల్ ఏదైనా కావొచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ కి లేదు ఎండ్ అన్నట్టు ఉంటున్నాయి కొత్త కొత్త షోస్. ఇక ఇప్పుడు జీ తెలుగులో "మన ఊరి రంగస్థలం" పేరుతో ఒక కొత్త ఈవెంట్ రాబోతోంది. ఈ షోకి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ ఐపోయింది.  ఇప్పుడు మరో ప్రోమో సందడి చేస్తోంది. అదే చమ్మక్ చంద్ర ఎమోషనల్ ప్రోమో. ఇందులో చూస్తే చమ్మక్ చంద్ర లేడీ గెటప్ తో నటుడు సుధీర్ బాబుతో కలిసి డాన్స్ చేస్తాడు. తర్వాత రచ్చ రవి వచ్చి చంద్ర కాళ్ళ మీద పడతాడు.  "చంద్రన్న ఒక్క అవకాశం ఇయ్యందే నేను లేను కదా" అంటూ చెప్పేసరికి చంద్ర హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత చంద్ర, తాను ఇండస్ట్రీకి వద్దామనుకున్నప్పుడు 1500 రూపాయ‌లు ఇచ్చి పంపించారని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఈ చంద్ర ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'జబర్దస్త్‌'కి బంగారం పాప!

ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో ఏది అంటే చాలు "బంగారం.. చెప్పనా" అనేది. ఆ వీడియోకి రీమిక్స్ చేసి ఎవరికీ వారు ఆ డైలాగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ‘బంగారం.. చాలా మంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. ఛీ పోరా".. ఈ డైలాగ్ వింటే చాలు ఎవరి గురించో అర్దమైపోయే ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ బంగారం పాప శాంతి ఓ సూపర్ ఛాన్స్ కొట్టేసింది.  సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవాళ్ళను జబర్దస్త్ టీమ్ తీసుకొచ్చి వాళ్లకు కూడా ఛాన్సెస్ ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బంగారాన్ని ఈ షోలోకి తీసుకొచ్చారు. ఆమె జబర్దస్త్ స్టేజిపై ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది, ఇంద్రజ, వెంకీతో తీసుకున్న ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో, యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంది. జబర్దస్త్ లో ఈమెకు సంబందించిన ప్రాక్టీస్ వీడియోస్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.  

ఇది కదరా ‘మన ఊరి రంగస్థలం’ అంటే

వినాయక చవితి పండగకు బుల్లి తెర మీద షోస్ మీద షోస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ప్రోమోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. ఇప్పుడు జీ తెలుగులో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని "మన  ఊరి రంగస్థలం" అనే స్పెషల్ ఈవెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ షో ప్రోమో చూస్తే చాలు ఎంత ఫన్ ఉండబోతోంది అనేది తెలిసిపోతుంది. "నాకిష్టమైన దేవుడు గణపతి...ఈ ఈవెంట్ తో పోతుంది మీ మతి" అంటూ  లంగాఓణిలో క్లాస్ గా కనిపిస్తూనే మాస్ డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేసింది రాములమ్మ శ్రీముఖి. ఇక ఈ షోలో  హేమ, మనో, గీతామాధురి, లేడీ గెటప్ లో చమ్మక్ చంద్ర, త్రినయని హీరో చందు గౌడ, కొరియోగ్రాఫర్ యశ్వంత్, భాను, రోహిణి, సింగర్ యశస్వి, ఇటీవల సరిగమప సూపర్ సింగర్ టైటిల్ గెలుచుకున్న శృతిక, హీరో సుధీర్ , డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి వాళ్లంతా వచ్చి డాన్సులతో, సాంగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ జీ తెలుగులో సెప్టెంబర్ 4 ఆదివారం నాడు ప్రసారం కాబోతోంది.

కృతికి ప్రపోజ్ చేయడానికి సుధీర్ విశ్వ ప్రయత్నం!?

బుల్లి తెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సుడిగాలి సుధీర్ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. అతని ఫ్రెండ్స్ రాంప్రసాద్, గెటప్ శీను పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. ఐతే ఈ మధ్య కాలంలో సుధీర్ కి కూడా పెళ్లిపై ధ్యాస మళ్లినట్లుంది. ఏ షోలో అమ్మాయి కనిపించినా లైన్లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు. వాళ్లేమో "అన్నయ్యా" అంటూ వెళ్లిపోతున్నారు. ఇక ఇప్పుడు కృతిశెట్టి వెనక పడ్డాడు సుధీర్. సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలేకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం వచ్చింది. ఫినాలే ఈవెంట్ స్టేజి మీద హోస్ట్స్ అనసూయ, సుడిగాలి సుధీర్, హీరో సుధీర్‌బాబు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వున్నారు.  సుధీర్ ఇక్కడ కూడా పెళ్లిగోల మొదలెట్టేసాడు. "ఈ స్టేజి మీద  పెళ్లికాని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు కృతి శెట్టి, మరొకరు నేను" అంటూ స్టార్ట్ చేశాడు. కృతిశెట్టికి అత‌ను లైన్ వేస్తున్నాడన్న విషయం గమనించిన అనసూయ ముందు కృతి శెట్టికి ఎలాంటి భర్త కావాలో తెలిస్తే ఈజీ అవుతుందని హింట్ ఇచ్చింది. తనకు సపోర్టివ్ గా, పాజిటివ్ యాటిట్యూడ్ తో మంచి మనసున్నవాడు కావాల‌నీ, అన్నింటికీ మించి తనను బాగా చూసుకోవాలనీ చెప్పింది కృతి. ఈ లక్షణాలన్నీ తనలో ఉన్నాయని నిరూపించడానికి సుధీర్ ఆమెను తెగ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. "అన్ని క్వాలిటీస్ తో పాటు కాస్త చబ్బీగా కూడా ఉండాలి" అని కృతి అనేసరికి, "నేను చబ్బీనే కావాలంటే పొట్ట చూడండి" అని సుడిగాలి సుధీర్ అనేసరికి "మరి ఇందాక సిక్స్ ప్యాక్ అని చెప్పావ్" అని కృతి అడిగింది. ఇలా కృతి, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన ఈ మ్యారేజ్ ప్రపోజల్ డ్రామా ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.

సునీత 1 మినిట్ మ్యూజిక్‌!

సింగర్ సునీత ఎంత ఫేమ‌స్ ప‌ర్స‌నో తెలిసిందే. ఇండస్ట్రీలోనూ ఆమెకు ఎంతో మంచి పేరుంది. 'గులాబీ', 'ఎగిరే పావురమా' మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న సింగర్ ఆమె. చిన్న వయస్సులోనే గాయనిగా కెరీర్  మొదలుపెట్టిన సునీత వేల పాటలు పాడారు. అలాగే 500 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదే #1 మినిట్ మ్యూజిక్ టైటిల్ తో వీడియోస్ చేస్తున్నట్లు చెప్పారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు తెలిపారు. సునీత ఏ పాట పాడినా ఎవ్వరైనా సరే  అలా ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోకుండా వుండరు. ఒక పక్కన "పాడుతా తీయగా" షోకి జడ్జి గా చేస్తూ మరో వైపు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు సునీత. ఇక తాను స్టార్ట్ చేయబోతున్న ఈ న్యూ కాన్సెప్ట్ కి ఆమె ఫాన్స్ ఫిదా అవుతున్నారు. "మీ గొంతు వినడానికి మేము సిద్ధం" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి అభినయశ్రీ

అభినయశ్రీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. అవును 'ఆర్య' మూవీలో "ఆ అంటే అమలాపురం" అనే సాంగ్ వింటే చాలు అభినయశ్రీ గుర్తొచ్చేస్తుంది. నిన్న‌టి త‌రం శృంగార తార అనూరాధ కుమార్తె అయిన ఈమె చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఈమె సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అభినయశ్రీ పేరు ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే కొంత కాలంగా ఫామ్ లో లేని, అంతా మరిచిపోయిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 కోసం క్వారంటైన్‌లో ఉన్న 20 మంది కంటెస్టెంట్‌లలో అభినయ శ్రీ కూడా ఒకరు అని గ‌ట్టిగా వినిపిస్తోంది. ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు, చందమామ వంటి మూవీస్ లో నటించింది అభిన‌య‌శ్రీ‌. ఇక 2014 లో తెలుగులో 'పాండవులు' అనే మూవీలో చివరిసారిగా క‌నిపించింది. ఈమె తెలుగుతో పాటు  తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా యాక్ట్ చేసింది. అభినయశ్రీ తమిళ్ లో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్ వంటి షోస్ లో హోస్ట్ గా చేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

అమరదీప్ అంతలా ఏడిపించాడు అందరినీ

అమరదీప్ - తేజస్విని సీరియల్ నటులే ఐనా ఒక రోజు  సడెన్ గా  ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ మొదలయ్యింది అనేది పెద్ద సస్పెన్స్. ఐతే అమరదీప్ తన కాబోయే భార్యతో, అత్తతో కన్నీళ్లు పెట్టించాడు. వాళ్లిద్దరూ స్టేజి మీదే ఏడ్చేశారు. వినాయక చవితి సందర్భంగా "మాతో పండగే పండగ" అనే ఈవెంట్ ఆగష్టు 31 న ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమో చూస్తే గనక ఎవ్వరైనా కంట తడి పెట్టకుండా ఉండలేరు. ఈ ఈవెంట్ లో అమరదీప్, తేజు స్పెషల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. వీళ్ళ లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయ్యింది..అనే ఎన్నో విషయాలు ఈ ప్రోమోలో చూపించారు. "నేను నీ లైఫ్ లోకి రావడం ఏమో కానీ నువ్వు నా లైఫ్ లోకి రావడం అదృష్టమే అంటూ ఒకరికొకరు ఐ లవ్ యూ" చెప్పుకుంటారు.  తర్వాత తేజుకి ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేసాడు అమరదీప్. తేజస్విని తండ్రి మైనపు విగ్రహాన్ని స్టేజి మీదకు తీసుకొస్తాడు. అలాగే కాబోయే అత్తగారి  కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి స్టేజి మీద కళ్ళ గంతలు విప్పుతారు. అంతే ఒక్కసారికి తేజు, వాళ్ళ అమ్మ షాక్ అవుతారు. అంతలోనే ఎమోషన్ ఐపోతారు. తేజు వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయారు. అందుకే ఆయన్ని గుర్తుచేయడానికి ఆయన ఆశీర్వాదం తీసుకోడానికి ఇలా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసాడు అమర్. ఇక తేజస్విని తల్లి అది చూసి " భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమను కూడా  నా కూతురికి అందిస్తావని నాకు అర్ధమయ్యింది. లవ్‌ యూ " అంటుంది.  అమర్‌దీప్‌ కూడా " లవ్యూ అమ్మ"   అన్నాడు. ఆ తర్వాత స్టేజీ మీద ఈ జంటకు మరోసారి నిశ్చితార్థం చేశారు బుల్లితెర నటులు. ఈ ఈవెంట్ లో వీళ్ళ హంగామా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోతుంది.

నేను ఎందుకు ఇంత లేట్ గా పుట్టాను ? బాధపడుతున్న ఆరియానా

ఆరియానా  గ్లోరీ బుల్లి తెర మీద పరిచయం ఉన్న అమ్మాయే. సినిమా అనే రంగుల ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఇంటర్వూస్, కొన్ని మూవీస్ కొంతమందిని ఓవర్ నైట్ స్టార్ ని చేసేస్తాయి. ఇలా పాపులర్ అయినవాళ్ళలో  అరియనా కూడా ఒక అమ్మాయి. అప్పట్లో ఈ అమ్మడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్  రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన కారణంగా రాత్రికిరాత్రే ఫుల్ పాపులర్ ఐపోయింది. ఇక తర్వాత తెలుగులో ఫేమస్  రియాల్టీ గేమ్ షో  బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. అందులో పోటాపోటీగా పార్టిసిపేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈవెంట్స్, షోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది..అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆరియానా కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక క్రేజీ కామెంట్ చేసింది. " నేను ఎందుకు సర్ ఇంత లేట్ గా పుట్టాను. లవ్ యూ నాగ్ సర్...విష్ యూ హ్యాపీ బర్త్ డే" అంటూ నాగ్ తో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ కాప్షన్ కి నెటిజన్స్ కొందరు విష్ చేస్తుంటే కొందరు మాత్రం బూతులు తిట్టేస్తున్నారు ఆరియానని. ఐతే ఆరియానా ఇలాంటివి అస్సలు పట్టించుకోను అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

డాన్స్ ఇండియా డాన్స్ షోకి రాబోతున్న మహేష్ బాబు , సితార

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  వరుస సినిమాలతో ఎప్పుడూ ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు ఈ టాలీవుడ్ సూపర్ స్టార్.  మహేష్ బాబు బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. బుల్లి తెర మీద అసలే కనిపించరు. తన సినిమా ఈవెంట్స్ కి మాత్రమే వస్తూ ఉంటారు. మహేష్ బాబు కూతురు సితార మాత్రం వాళ్ళ నాన్నలా కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ చెప్తుంది మొత్తానికి సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ పేజీ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది.  ఐతే ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్లు కలిసి ఒక డాన్స్ షోకి రాబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్  పూర్తయ్యిందని తెలుస్తోంది.ఇకపోతే  మహేష్ బాబు తన కూతురు సితార చేయి పట్టుకుని  ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.  ఈ షూటింగ్ వీడియో ట్విట్టర్ లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్ పేజీలో కూడా పోస్ట్ చేశారు. డాన్స్ ఇండియా డాన్స్ షో హోస్ట్ అకుల్ బాలాజీ మహేష్ బాబుకి  స్వాగతం పలుకుతుండగా సితారతో కలిసి మహేష్ నడుస్తూ వస్తున్న ఒక ఇమేజ్ ట్విట్టర్ లో ఫుల్ ట్రోల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు సితారతో కలిసి ఒక తెలుగు టీవీ షోకి రావడం ఇదే ఫస్ట్ టైం.

సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ విన్నర్ సుదీక్ష!

బుల్లి తెర చరిత్రలో ఎంతోమంది సూపర్‌ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన  స్టార్‌ మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీల ఫైనల్స్‌ ముగిసాయి . 13  వారాలు 14 మంది జూనియర్స్ ఇందులో పోటీ పడ్డారు. ఇక ఈ షో ఫైనల్స్‌లోకి  ఐదుగురు చేరుకున్నారు. ఇక ఈ ఫైనల్  ఈవెంట్ ఎంతో గ్రాండ్ లుక్ తో అదరగొట్టేసింది. ఈ ఎపిసోడ్‌కు మెయిన్ గెస్ట్స్ గా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ యూనిట్  కృతిశెట్టి, సుధీర్‌ బాబు, ఇంద్రగంటి మోషనకృష్ణ వచ్చేసారు.  ఈ  ఫైనల్స్‌కు సీనియర్ సింగర్స్ చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి జడ్జెస్ గా, అనసూయ, సుధీర్‌ హోస్ట్‌గా వ్యవహరించారు.  ఇక ఈ ఫైనల్స్ లో పోటాపోటీగా పాడారు కంటెస్టెంట్స్. ఫైనల్లీ   సుధీక్ష సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ ని గెలుచుకుంది. హీరో నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీని 10 లక్షల కాష్ ప్రైజ్ ని అందుకుంది. మయూఖ్ సూపర్ సింగర్ జూనియర్స్ రన్నరప్ గా నిలిచి 3 లక్షల కాష్ ప్రైజ్ అందుకున్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో నిలిచినందుకు భువనేష్ కి 2 లక్షల   కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక నాగార్జున మాట్లాడుతూ "నాకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. " అలాగే కింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని గిటార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అందరూ. "రాము బావ..మమ్మల్ని ఇలా ఎప్పుడూ  ఇన్స్పైర్ చేస్తుండాలి" అంటూ అనసూయ "ఆనాటి భారతంలో మా అర్జున..సినీ రంగంలో గ్రేట్ మా నాగార్జున" అంటూ మనో, "స్టే బ్లెస్సెడ్" అంటూ చిత్రమ్మ, "హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ కింగ్ " అంటూ సుడిగాలి సుధీర్ గిటార్ మీద రాసి అందించారు. ఇలా ఒక పండగలా ఈ సీజన్ పూర్తయ్యింది.  

కప్పల పెళ్లి కోసం వైజాగ్ సముద్రాన్ని రాసిచ్చిన రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారంలాగే ఈ వారం కూడా  అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ లో కప్పల పెళ్లి అనే కాన్సెప్ట్ తో కడుపుబ్బా నవ్వించారు. ఆగష్టు వచ్చినా  వర్షాలు లేక జనాలు ఎండలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పల్లెటూళ్లలో కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయని ఒక గట్టి నమ్మకం పూర్వ కాలం నుంచి ఉన్నదే. అదే కాన్సెప్ట్ తీసుకుని మగ కప్పగా నరేష్ ని, ఆడ కప్పగా పవిత్రను పెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీం.  ఇక ఈ కప్పల పెళ్లి మనషుల పెళ్లిలా గ్రాండ్ గా మంచి ఆటాపాటతో చేశారు. అంత్యాక్షరితో పాటు మంచి ఫోక్ సాంగ్స్ కూడా వినిపించారు. రమణ పాడిన ఫోక్ సాంగ్స్ కి స్టేజి అదిరిపోయింది. తర్వాత కండక్టర్ పాప ఝాన్సీ వచ్చి డాన్స్ ఇరగదీసేసింది. అలా కప్పల పెళ్ళికి వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాక చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఫుల్ మస్తీ చేశారు.  ఆడ కప్పుకు రెండు లోతు బావులు, ఒక చెరువు, ఒక నీళ్ల తొట్టెను చదివించాడు హైపర్  ఆది. వైజాగ్ సముద్రాన్ని చదివించేసాడు ఆటో రాంప్రసాద్. వెంకీ మంకీస్ వాళ్ళ ఇంటి వెనక ఉన్న రెండు మురుక్కాలవలు, ఇమ్ము వాళ్ళ తొట్టెలో ఉండే నీళ్లు,  ఇంటెనక కాల్వను చదివించాడు రాఘవ. ఇక చదివింపుల కార్యక్రమం పూర్తయ్యాక  ఇద్దరి చేతా దండాలు మార్పించి పెళ్లి చేసేసారు.  ఇలా ఈ వారం కప్పల పెళ్లి బాగా ఫన్ క్రియేట్ చేసింది.  

చిరంజీవి గారు నాకెంతో గొప్ప సాయం చేశారు

మెహబూబ్ గురించి బుల్లి తెర ఆడియన్స్ కి కాస్త పరిచయమే. టిక్ టాక్ వీడియోస్ చేసుకుంటూ ఫేమస్ అయ్యేసరికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. హౌస్ లోకి వెళ్లి వచ్చాక తన పాపులారిటీ ఎంతో పెరిగిపోయింది. బిగ్ బాస్ సెలబ్రిటీ అయ్యాక వెబ్ సిరీస్ లు, ఈవెంట్స్, షోస్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. ఐతే ఇటీవల వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం అందరికీ తెలుసు.    తన తల్లిని ఎంత ప్రేమించేవాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆగష్టు 5 తన జీవితం మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకొచ్చాడు. "ఆ రోజు అమ్మకు షుగర్ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నాకు ఫోన్ చేయగానే నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బయల్దేరి వెళ్లాను. అమ్మ దగ్గరకు  రావడానికి ఇంకా కొంత దూరమే ఉంది..అంతలోనే అమ్మ తుదిశ్వాస విడిచింది. లాస్ట్ ఇయర్  అమ్మీకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ లో చేర్చాం. ఐతే అప్పుడు అమ్మకు ఇన్సూరెన్సుల మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. దాంతో అవేవి లేవు. అప్పుడు అమ్మకు హాస్పిటల్ లో రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. ఇక అదే టైములో మెగాస్టార్‌ చిరంజీవి గారు రూ.10 లక్షల చెక్‌ ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బుతో  నా దగ్గర ఉన్న డబ్బుతో అమ్మను కాపాడుకున్నాం" అంటూ చెప్పాడు మెహబూబ్.    "కానీ ఈ ఏడాది అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. పేరెంట్స్ ని బాగా చూసుకోండి ..వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్లకూ ఏం కావాలో ఇవ్వండి. వాళ్ళను హ్యాపీగా చూసుకోండి" అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పాడు మెహబూబ్.