జానీ మాస్టర్ జీవితంలో ఇంత విషాదం ఉందా?

"ఢీ: ది డ్యాన్సింగ్‌ ఐకాన్" షో ప్రతీ వారం సరికొత్తగా దూసుకుపోతూ ఉంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో జానీ మాస్టర్ రియల్ లైఫ్‌ని ఒక సాంగ్ కమ్‌ స్కిట్ రూపంలో వేశారు కంటెస్టెంట్స్. ఆ సాంగ్ చూసేసరికి జానీ మాస్టర్ సెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. జానీ మాస్టర్ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో పరిచయమై ప్రాణ స్నేహితుడిలా ఆదుకున్న సిరాజ్ అనే ఫ్రెండ్ సౌదీ వెళ్లి డబ్బు పంపిస్తానని చెప్పాడు. దాంతో మూవీస్‌లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది అని సిరాజ్ చెప్పేసరికి జానీ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడట.  అదే టైంలో సిరాజ్ ఇండియా వస్తున్నా అని చెప్పడంతో ఆనందపడిన జానీ అంతలోనే  ఓ రోడ్డు ప్రమాదంలో సిరాజ్ మరణించాడనే వార్త విని కుంగిపోయాడు. ఆ త‌ర్వాత తన కొడుక్కి ఫ్రెండ్ పేరు పెట్టుకున్నాడు. ఈ విష‌యం చెప్పి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు జానీ. ఈ న్యూ ఎపిసోడ్ లో "ఢీ డ్యాన్సింగ్‌ స్టార్ జానీ మాస్టర్" అంటూ అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ "రాసుకునే వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే ఏదన్నా రాసుకోండి కానీ ఢీ స్టేజిని మాత్రం అవమానించవద్దు.. చాలా సీరియస్ గా చెప్తున్నా" అంటూ నేల మీదకు వంగి దణ్ణం పెట్టుకున్నాడు.  ఇక ఫైనల్‌గా జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని చోట్ల  జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసాడంటే అవి ఫుల్ వైరల్ ఐపోతాయి. ఆ స్టెప్పులు వేసిన‌ స్టార్ కూడా ఫుల్ ఫోకస్ ఐపోతాడు. ఈ మద్యే 'బీస్ట్' మూవీలో విజయ్, పూజా హెగ్డేతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్.  ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాలో నటిస్తున్నాడు.

మేక‌ప్ లేని రష్మిని చూసి షాకైన రోహిణి!

మేకప్ తో ఉంటేనే సెలబ్రిటీస్ ని చూడగలుగుతాం. ఒకవేళ మేకప్ లేదు అంటే వాళ్ళను గుర్తుప‌ట్ట‌డం క‌ష్టం. 'ఏమిటి ఇలా ఉన్నారు'.. అని అనుకోకుండా మాత్రం ఉండం. ఇప్పుడు రోహిణి కూడా రష్మీని చూసి అలాగే భయపడింది. కొత్తగా  ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఈ స్కిట్ రాబోతోంది. హాట్ యాంకర్ గా, గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రష్మీ.. రోహిణి మాటలకు షాకైపోయింది. ఈ ఎపిసోడ్ లో బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్‌లో రోహిణి, వర్షతో పాటు ఇమ్మాన్యుయెల్‌ కూడా క‌నిపించాడు. భాస్కర్ వాళ్ళ అమ్మగా కమెడియన్  రోహిణి నటించింది. "అమెరికా వెళ్దావమ్మా" అని అడిగేసరికి, రోహిణి " నేను హైదరాబాద్‌ చూశాకే అమెరికా వస్తాను" అంటూ పంతం పట్టుకుని కూర్చొంటుంది. దీంతో భాస్కర్‌ ఫ్యామిలీ హైదరాబాద్‌ వచ్చి, అక్కడ జబర్దస్త్ సెట్ ని చూపించడానికి తీసుకెళ్లారు.   అసిస్టెంట్‌గా ఉన్న ఇమ్మాన్యుయెల్‌ జబర్దస్త్ సెట్‌ని చూపించి, "అదిగో యాంకర్ రష్మీ, రష్మీ" అంటూ భాస్కర్‌ వాళ్లమ్మకి చూపించి ఆమె దగ్గరకు తీసుకెళ్లారు. రోహిణి చాలా ఎగ్జైట్‌మెంట్‌ తో రష్మి దగ్గరికెళ్లి "వాయమ్మో" అంటూ షాక్‌లోకి వెళ్ళిపోయింది. సృహ కోల్పోయినంత పని చేసి స్టేజి మీద అలాగే పిచ్చిదానిలా కూర్చుండిపోయింది. ఇది చూసిన ఇమ్మాన్యుయెల్‌, "నీకు ముందే చెప్పాను, మీ అమ్మకు హార్ట్ ఎటాక్‌ పెట్టుకుని భయంకరమైనవి చూపించకూడదు" అని రష్మిపై పంచ్‌లు వేశాడు.  దీనికి రష్మి కొంటెగా ఒక ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చింది. ఈ స్కిట్‌ ఆద్యంతం కామెడీని పంచింది. 

ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐ లవ్ యు చెప్పలేదు

ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త కొత్త స్కిట్స్ తో అలరించడానికి సిద్దమయ్యింది. ఇక ఇప్పుడు న్యూ ఎపిసోడ్  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇంద్రజ, ఖుష్బూ జడ్జ్ లుగా వ్యవహరిస్తూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో  పంచ్‌లు వేస్తూ , నవ్విస్తూ  షోని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ గ్లామర్‌ సెట్ లో అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.  చాలా మంది లవ్ స్టోరీలను ఇలాంటి ఎన్నో షోస్ లో విన్నాం. ఇక ఇప్పుడు  ఖుష్బూ వంతు వచ్చింది. ఆమె తన క్యూట్ లవ్‌ స్టోరీని ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజి పై రివీల్ చేసేసింది. రాకేష్‌, సుజాత స్కిట్ అయ్యాక " మీరిద్దరిదీ లవ్ మ్యారేజా మేడం " అని ఖుష్బూని అడిగాడు రాకేష్. "టోటల్" అని ఆన్సర్ ఇచ్చింది.." మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం" అని ఖుష్బూని అడిగాడు  రాకేష్. డైరెక్టర్, యాక్టర్ సుందర్‌ సి. ఖుష్బూ భర్త అనే విషయం మనందరికీ తెలుసు . "ఆయన డైరెక్టర్ గా  తమిళంలో `మురై మామన్‌` అనే తన ఫస్ట్ ఫిలిం షూటింగ్ టైంలో వచ్చి ప్రొపోజ్ చేశారు. పెళ్ళై 28 ఏళ్ళు అయ్యింది కానీ  ఇప్పటి వరకు ఐ లవ్ యు కూడా చెప్పలేదు తెలుసా" అనేసరికి "సరదాగా ఇప్పుడొకసారి  ఫోన్‌ చేసి ట్రై చేయండి  మేడమ్‌" అని రాకేష్ అనడంతో   షూటింగ్‌ సెట్ లోంచే భర్తకు   ఫోన్‌ చేసింది ఖుష్బూ. "సెల్ లో ఏ పేరు రాసుకున్నారు మేడం" అని మళ్ళీ అడిగేసరికి "స్వీట్ హార్ట్" అని ఆ కాలర్ ఐడిని అందరికీ చూపిస్తుంది. ఆ మాటకు సెట్ మొత్తం హోరెత్తిపోయేలా అరుస్తూ ఉంటారు. ఖుష్భూ కూడా అందంగా సిగ్గు పడుతూ ఉంటుంది. ఇంతలో  ఫోన్ చేసి హలో అంది ఖుష్బూ . అటు నుంచి ఆన్సర్ ఏమొచ్చింది ? సుందర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా ? లవ్ ప్రొపోజ్ చేసుకున్నారా లేదా ? అనే విషయం తెలియాలంటే ఈ షో కోసం కొంత టైం వెయిట్ చేయాల్సిందే.

బేబీ డాల్స్ గేమ్ లో గెలిచిన కంటెస్టెంట్లు ఎవరు?

తొమ్మిదో రోజు బిగ్ బాస్ "బుట్ట బుమ్మ" సాంగ్ తో మొదలైంది. మొదటగా ఫైమాతో "నువ్వు  కామెడీగా ఉండకూ, అందరూ అలానే చూస్తారు. నువ్వు మాట్లాడే విధానం బట్టి సులువుగా తెలిసిపోతుంది" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత ప్రతీసారీ అందరీకి నచ్చినట్టు ఉండటం త‌న‌ వల్ల కాదని రేవంత్ తో చెప్పింది శ్రీసత్య. బిగ్ బాస్ టాస్క్ గురించి వివరించాడు. "బేబీ డాల్స్ ని మీ బేబీలా చూసుకోవాలి. ఏ బేబీ ఒంటరిగా ఉంటుందో ఆ బేబీని లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరీయాలో పెట్టాలి" అని బిగ్ బాస్ కంటెస్టెంటలకు వివరించాడు. బిగ్ బాస్ కొత్త గేమ్ ను కంటెస్టెంట్ల‌కు వివరించాడు. ఈ గేమ్ పేరు 'సాక్స్ అండ్ షేప్స్'. "ఈ షేప్స్ ని  గార్డెన్ ఏరియాలో ఉన్న బాకస్ లలో సంచితో జంప్ చేస్తూ వెళ్ళి కరెక్ట్ గా సెట్ చేసి, అక్కడ ఉన్న గంటని మొదట కొట్టినవాళ్ళే విజేత" అని చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో సంచాలకులురాలిగా నేహా ఉంది. రేవంత్, ఫైమా, చంటి, గీతూ పోటీలో పాల్లొన్నారు. గేమ్ లో చంటి గెలిచాడు. తర్వాత చంటి కెప్టెన్‌గా బ్యాడ్జ్ ధరించాడు. తన బేబీని రాత్రంతా తన పక్కన పడుకోబెట్టుకోవాలని  అనుకున్నానని మెరీనాకు చెప్పుకొని ఏడ్చేసాడు రేవంత్. రేవంత్ కి నేహాకి మధ్య చిన్న గొడవ జరిగింది. "నేను గేమ్ లో ఉన్నప్పుడు రూల్స్ గురించి చెప్పలేదు. నాకు సపోర్ట్ చేయలేదు. ఫైమా తప్పుగా ఆడింది ఐనా నువ్వు తననే సపోర్ట్ చేసావు" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. దీనికి సమాధానంగా "నేను తప్పు చేయలేదు, గేమ్ ఎవరైతే సరిగ్గా ఆడారో వారే గెలిచారు" అని నేహా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ "తర్వాత ఛాలెంజ్ కి ఎవరు అర్హులు?" అని కెప్టెన్‌గా ఉన్న ఆదిత్యను అడిగాడు. "అర్జున్, ఇనయా, ఆరోహీ, కీర్తీ, ఫైమా తర్వాత ఛాలెంజ్ కి అర్హులు" అని ఆదిత్య, బిగ్ బాస్ కి వివరించాడు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరీయాలో ఉన్న బేబీలను ఎవరు తీసుకొచ్చి వేసారో వారినే స్టోర్ రూంలో ఆ బేబీలని పెట్టమని ఆదేశించాడు బిగ్ బాస్. మీ బేబీల భాగోగులు చూసుకునే బాధ్యత మీమీదే ఉంటుందని, ఎవరూ తమ బేబీలను దుస్తులలో దాచుకోకూడదని బిగ్ బాస్ ఆదేశించాడు. బేబీ డాల్స్ గేమ్ లో ఎవరు గెలవబోతున్నారని ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. తొమ్మిదో రోజు  గీతూ, అభినయశ్రీ, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్, మెరీనా-రోహిత్ నామినేషన్లో ఉన్నారు.

సెంటిమెంట్ సుబ్బయ్యతో ఆలీ ముచ్చట్లు!

ఆలీతో  సరదాగా షోకి ఎంతోమంది లెజెండరీస్ వచ్చి ఎన్నో విషయాలు చెప్పడం ఆడియన్స్ కి  కూడా ఈ షో నచ్చడంతో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా ముత్యాల సుబ్బయ్య గారిని షోకి తీసుకొచ్చారు ఆలీ. తెలుగు మూవీ ఇండస్ట్రీలో  తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుని, మంచి గుర్తింపు పొందినప్పటికీ మామూలు  మనిషిలా మెలగడం, మాట్లాడటం ఒక్క ముత్యాల సుబ్బయ్య గారికే సొంతం.  పెద్దా, చిన్నా తేడా  లేకుండా ప్రతి ఒక్కరినీ ‘గురువా’ అంటూ  పిలవడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.  "నా స్కూల్ నుంచి చాలా మంది వచ్చారు. నాది సెంటిమెంట్ స్కూల్. అందుకే చాలామంది నన్ను సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరుతో పిలుస్తారు.  ఐతే బోయపాటి శీను స్కూల్ వేరు . ఆయన అన్ని నరకడమే పనిగా పెట్టుకున్నాడు. యాక్షన్ అని నేను చెప్పింది  "మూడుముళ్ల బంధం" మూవీ కి . కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.  నేను రాజశేఖర్ తో ఎక్కువ సినిమాలు చేసాను. కోడి రామకృష్ణ గారు నాకంటే ఒక సినిమా ఎక్కువ తీశారనుకుంటా ఆయనతో. దాసరి గారు, బాలు గారి మీద పర్వతాలు- పానకాల సినిమా తీసాం,  కష్టపడి చేశాంగానీ సినిమా ఆడలేదు.హిట్లర్ సినిమాను మలయాళంలో చూసిన ఎడిటర్ మోహన్ గారు ఫోన్ చేసి  నన్ను డైరెక్షన్ చేయమన్నారు. దేవుడా అదృష్టం  ఈ రూపంలో వచ్చిందా అనుకుని వెంటనే చిరంజీవి గారిని కలిసాను. అలా ఆ సినిమా తీసాను" అంటూ చెప్పుకొచ్చారు సుబ్బయ్య గారు.

ఎప్పుడూ చూసే ఫేస్ కదా కొత్తగా ఏముంది!

బుల్లి తెర మీద ఇప్పుడు ఆలీ తన షోతో ఫేమస్ అయ్యాడు, మనో సింగింగ్ షోస్ కి జడ్జి హోదాలో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు, బాబా మాస్టర్ డాన్సింగ్ షోస్ కి జడ్జి గా అలరిస్తున్నాడు. బుల్లి తెర మీద వీళ్ళ హవా కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్య. ఐతే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పార్టనర్స్ ని తీసుకొచ్చారు.  జీ తెలుగు కొత్త కొత్త ఈవెంట్స్ కి, సీరియల్స్ కి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు "లేడీస్ అండ్ జెంటిల్ మాన్" పేరుతో ఒక ఫన్నీ ప్రోగ్రాం తీసుకురాబోతోంది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 18 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ ఈవెంట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పైన చెప్పిన ముగ్గురు వాళ్ళ వాళ్ళ భార్యలను ఈ షోకి తీసుకొచ్చారు. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ చేస్తున్నాడు. స్టేజి మీదకు వచ్చిన ఆలీ వైఫ్ "తనకు అస్సలు టైం ఇవ్వడం లేదు అని ఆలీ మీద కంప్లైంట్ చేసేసరికి..రోజూ చూసే ఫేస్ కదా అంటూ నాలుక్కర్చుకున్నాడు. "ఇక మనో గారిని "ఇంటికెళ్ళారు సర్ తర్వాత పరిస్థితి ఏమిటి" అని ప్రదీప్ అడిగేసరికి "అపురూపమైనదమ్మా ఆడజన్మ" అంటూ సాంగ్ వేసుకుంటాను అన్నారు  మనో. ఫైనల్ గా "ఎన్ని ఇయర్స్ అయ్యింది సర్ మ్యారేజ్ అయ్యి" అని బాబా భాస్కర్ మాస్టర్ ని అడిగాడు  ప్రదీప్ "19 ఇయర్స్ రన్నింగ్ అంటాడు బాబా. డేట్ ఏమన్నా ఐడియా ఉందా అని మళ్ళీ అడిగేసరికి యో..ఏంటయ్యా నువ్వు..గొడవలు పెట్టేలా ఉన్నావే" అన్నట్టుగా చూస్తాడు బాబా. ఇలా ఈ షోలో వీళ్ళ ముగ్గురు ఫామిలీస్ తో వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు.

'ప‌డ‌మ‌టి సంధ్యారాగం' సీరియ‌ల్‌ను సితార‌తో క‌లిసి ప్ర‌మోట్ చేస్తోన్న‌ మ‌హేశ్‌!

  టాలీవుడ్ స్టార్ కిడ్స్ లో సితార ఇప్పుడు టాప్ లెవెల్లో  ఉంది. తండ్రి కృష్ణ గారి నటనా వారసత్వాన్ని మహేష్  బాబు కొనసాగిస్తూ వస్తే మహేష్ బాబు నట వారసత్వాన్ని సితార కొనసాగిస్తోంది. సితార మంచి డాన్సర్. సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది సితార. "సర్కారు వారి పాట" ప్రమోషనల్ సాంగ్ తో అదరగొట్టింది.  ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా సితార తండ్రి మహేష్ బాబు తో  కలిసి ఒక సీరియల్ ప్రమోషన్ వీడియోలో మెరిసిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి జీ తెలుగులో రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోయే పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రోమోలో తండ్రీ కూతుళ్లిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపించారు. ‘‘ఇండియాకు, అమెరికాకు మధ్య దూరం వేల మైళ్లు కావచ్చు. రెండింటిని దగ్గర చేసేది అనుబంధం మాత్రమే’’ అంటూ సీరియల్‌ కాన్సెప్ట్‌ గురించి చెప్పారు  మహేష్‌ బాబు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   జీ తెలుగు చాన‌ల్‌తో మ‌హేశ్‌కు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. గ‌తంలోనూ 'ప్రేమ ఎంత మ‌ధురం', 'త్రిన‌య‌ని', 'తూర్పు ప‌డ‌మ‌ర' సీరియ‌ల్స్‌ను లాంచ్ చేయ‌డం ద్వారా వాటిని ప్ర‌మోట్ చేశాడు.

పెళ్లి కాని వాళ్లు ఉన్నారు.. రూమ్‌లో వాళ్ళేం చేస్తారు నాగ‌న్నా?

బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి చాలామంది ఈ హౌస్‌లోకి వెళ్లివ‌చ్చారు. బిగ్ బాస్ షోకి ముందు, ఆ త‌ర్వాత అన్న‌ట్లుగా కంటెస్టెంట్ల పాపులారిటీ పెరిగిపోయింది. సెల‌బ్రిటీలు కానివారు కూడా హౌస్ లోకి వెళ్లి వ‌చ్చాక ఆ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ షోకి ఎంత పాజిటివ్ టాక్ ఉందో అంతే నెగటివ్ టాక్ కూడా ఉంది. ఈ షో స్టార్ట్ ఐన దగ్గర నుంచి సీపీఐ అగ్ర నాయ‌కుడు నారాయణ చేస్తున్న కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.  ఇదివ‌ర‌కే బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అంటూ ఆయ‌న‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ షోని బ్యాన్‌ చేయాలని, అందుకు ప్రజలే ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. ఐతే ఈయన కామెంట్స్ పై బిగ్ బాస్ యాజమాన్యం కానీ, హోస్ట్ నాగ్ కానీ స్పందించలేదు. ఇటీవ‌ల బిగ్ బాస్ 6 షోపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు నారాయ‌ణ‌. దీనికి స్పంద‌న‌గా నాగార్జున ఒక కౌంటర్‌ వేశారు.  ఈ షోలో మరీనా- రోహిత్‌ రియల్‌ కపుల్‌ అన్న విషయం తెలిసిందే. కెమెరాలన్నీ ఉండేసరికి రోహిత్‌ తన భార్యకు దూరంగా ఉండడం చూసిన హోస్ట్ నాగ్.. వీకెండ్‌ ఎపిసోడ్‌లో మరీనాకు టైట్‌ హగ్‌ ఇవ్వాలని రోహిత్‌కు ఆర్డర్‌ వేశాడు. ఆ టైములో  "నారాయణ.. నారాయణ.. వాళ్లు మ్యారీడ్‌" అని అన్నారు. ఇది కాక‌తాళీయంగా అన్న‌ది కాద‌నీ, సీపీఐ నారాయణను ఉద్దేశించే ఆయ‌న అన్నార‌నీ జ‌నం అనుకుంటున్నారు.  అందుకే నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యకు కౌంటర్‌ గా ఒక వీడియో విడుదల చేశారు నారాయణ. “నాగన్నా.. నాగన్నా.. ఈ బిగ్ బాస్‌ షోలో పైళ్లైన వాళ్లకే లైసెన్స్ ఇచ్చారు, శోభనం గది ఏర్పాటు చేశారు. మరి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు.. రూమ్ లో వాళ్ళేం చేస్తారు? వాళ్లు బంధువులు కాదు కదా? మరి.. వాళ్ల సంగతి ఏంటో కూడా  చెప్పన్నా?” అంటూ ప్రశ్నించారు. "నాగన్నా.. నాగన్నా" అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

నేనెప్పుడూ హీరోయిన్ మెటీరియల్ కాదు అని అనుకుంటాను..

ఆలీతో సరదాగా షో చాలా ఫన్నీ గా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ వారం మసూదా మూవీ  టీం నుంచి కావ్య, సంగీత, తిరువీర్ వచ్చారు. సంగీతను చాలా ప్రశ్నలు అడిగాడు ఆలీ. హీరోయిన్ మెటీరియల్ ని కాదు అని ఎప్పుడూ అనుకుంటావట నువ్వు ఎందుకలా ? అని అడిగేసరికి " ఎందుకంటే నేను చిన్నప్పటినుంచి చాలా లావుగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద బుగ్గలు ఉండేవి. అలాగే స్కిన్ ఇష్యూస్ కూడా నాకు చాలా ఎక్కువ. అందుకే నేనెప్పుడూ అందంగా ఉండను అని నాకు అర్ధమయ్యేది. హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ నాకు లేవు అనిపించేది. ఇక నాకు ఇండస్ట్రీలో  ఎవరితో పెద్దగా పరిచయం లేదు..పెద్ద నెట్వర్క్ కూడా లేదు. తమిళ్ లో చిన్నప్పుడు చేసిన ఒక సినిమాలో నన్ను నేను చూసుకుని నా మొహం అస్సలు బాలేదని ఫీల్ అయ్యాను. ఇంకా నాకు ఒంటి మీద జ్యువెలరీ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ..అందుకే ఈ లక్షణాలు ఏవీ నాలో లేవు కాబట్టి నేను హీరోయిన్ మెటీరియల్ కాదు" అని నా ఫీలింగ్ అని చెప్పింది సంగీత. "ఐతే నీకు అమెరికా వీసా ఉంది కదా అక్కడికి వెళ్లి జేమ్స్ కెమెరూన్ ని కలవు ..అవతార్ పార్ట్ 2  ఐపోయింది కాబట్టి అవతార్ పార్ట్ 3 లో ఛాన్స్ ఇస్తారేమో అడుగు. ఆ సినిమాలో ఐతే ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోవాల్సిన పని లేదు" అని మంచి కామెడీ సలహా ఇచ్చాడు ఆలీ. ఇక తర్వాత  "మసూదా మూవీ స్క్రిప్ట్ చదవకుండానే ఓకే చేసేసాను. ఎందుకంటే వర్త్ ఉన్న డైరెక్టర్ అని నాకు తెలుసు ఆయన స్క్రిప్ట్ పంపినప్పుడు నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాను. ఇంకా స్క్రిప్ట్ చదివే ఓపిక లేక ఓకే చేసేసాను." అని చెప్పింది సంగీత.

ఎనిమిదో రోజు నామినేషన్లో ఉందెవరు..?

బిగ్ బాస్ ఎనిమిదో రోజు 'బాక్స్ బద్దలైపోయే' సాంగ్ తో మొదలైంది. బిగ్ బాస్, కంటెస్టెంట్లతో మాట్లాడుతూ  "ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా కీలకమైంది, ప్రతీ ఒక్కరికి ఒక్క ఓట్ మాత్రమే లభిస్తుంది. ఎవరిని బయటికి పంపిస్తే బిగ్ బాస్ ఇంటికి మంచిది అనిపిస్తుందో  వారినే నామినేట్ చేయండని" బిగ్ బాస్ చెప్పాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఉన్న కుండను బావిలో పడేసి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణం చెప్పండని, కెప్టెన్‌గా ఉన్న ఆదిత్య ఈ నామినేషన్ నుండి తప్పుకుంటున్నాడని, ఆరోహీ నామినేషన్ ను మొదలుపెట్టమని  బిగ్ బాస్ చెప్పాడు. ఆరోహీ, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. నువ్వు మాట్లాడే విధానం బాలేదని చెప్పి వెళ్ళిపోయింది. శ్రీహాన్ , గీతూని నామినేట్ చేసాడు. 'నువ్వు మగవాళ్ళకు బుద్ధి లేదు అని అన్నావ్ ', అది నాకు నచ్చలేదని చెప్పి శ్రీహాన్ వెళ్ళిపోయాడు. ఫైమా, రేవంత్ ను నామినేట్ చేసింది. నిన్ను నామినేట్ చేయడానికి  కారణం సండే ఫండే రోజూ అందరి మీద సీరియస్ అయ్యావు. అది నాకు నచ్చలేదని చెప్పింది. ఆదిరెడ్డి నామినేషన్ మొదలుపెట్టే ముందు ఆరోహీతో మాట్లాడాడు. నీతో రాపో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలా, టాస్క్ లో బాగా ఫర్మామెన్స్ చేసినవాళ్ళు ఉండాలా అని అడిగాడు. దానికి ఆరోహీ 'టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేసినవాళ్ళు ఉండాలి' అని చెప్పింది.  నువ్వు సరిగ్గా ఆడకపోయినా అందరూ ఆడలేదు మరి అలా ఎలా అంటున్నావ్ అని, తర్వాత మెరీనా-రోహిత్ ఇద్దరిని కలిపి నామినేట్ చేసాడు.ఆ తర్వాత చంటి, గీతూని నామినేట్ చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసారు. ఎనిమిదవ రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి,రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.

పరదేశి గుండెపై 'ఐశ్వర్య'

బుల్లి తెర షోస్‌లో పచ్చబొట్ల ట్రెండ్ నడుస్తోంది. లవర్స్ నేమ్స్ శరీరంలో ఎక్కడంటే అక్కడ పచ్చబొట్లుగా పొడిపించేసుకుని, దాని వెనక ఒక స్టోరీని అల్లేసి, షోస్‌లో అదే రియల్ లైఫ్ స్టోరీగా మేకప్ వేసేసి, అందరి చేతా కన్నీళ్లు పెట్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటి వరకు 'జబర్దస్త్' స్టేజి మీద లవ్ పుట్టి, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ప్రపోజ్ చేసుకుని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేసేసుకుని కొత్త ఈవెంట్స్ లో పిల్లలతో వస్తున్నారు చాలా మంది కమెడియన్స్. అలాంటి లవ్ స్టోరీస్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు పరదేశి, ఐశ్వర్య. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో స్టార్టింగ్ లో పరదేశి గుండెల మీద 'ఐశ్వర్య' అనే పేరుతో ఉన్న ఒక పచ్చబొట్టును చాలా దగ్గర నుంచి చూపించారు. ఇక పక్కనే ఉన్న ఐశ్వర్య అది చూసి ఫుల్ ఖుష్‌తో నవ్వుతూ కనిపించింది. ఇంటర్నేషనల్ ఫస్ట్ డే లవ్ సందర్భంగా ఈ కొత్త జోడి ఇప్పుడు సందడి చేస్తోంది.  ఐశ్వర్య.. 'జబర్దస్త్' ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఐతే ప‌ర‌దేశి-ఐశ్వ‌ర్య‌ మధ్య ఎప్పుడు, ఎక్క‌డ మొద‌లైంద‌నే విష‌యాలు ఏమీ ప్రోమోలో చూపించలేదు. వీళ్ళిద్దరూ నిజంగా జోడీనా? లేదంటే ఈ షో కోసం క్రియేట్ చేశారా? అనే విషయం తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

తిరువీర్ .. అసలు పేరేమిటో ఎవరికైనా తెలుసా ?

ఆలీతో సరదాగా షోలో ఈ వారం మసూదా మూవీ టీం నుంచి కావ్య, సంగీత, తిరువీర్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీలో హీరోగా చేస్తున్న తిరువీర్ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తిరువీర్ అనే నీ పేరు వెనక కథేంటి ఎవరు మార్చారు అని ఆలీ అడిగారు.." మా అమ్మ పెట్టిన పేరు నాకు తిరుపతి. మా అమ్మ పేరు వీరమ్మ. థియేటర్ ఆర్ట్స్ లో నాకు బాగా ఇష్టమైన నా డైరెక్టర్ పేరు రఘు వీర్. అమ్మ పేరులో వీర్ , ఈయన పేరులో వీర్ నాకు  ఎంతో నచ్చింది. దాన్ని తీసుకొచ్చి తిరుకి తగిలిద్దామని అనిపించి అలా తిరువీర్ అని నాకు నేనే పేరు  మార్చేసుకున్నా. నా పేరు చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు...తెలుగు వాడా , తమిళ్ వాడా అని అడుగుతుంటారు. తెలుగొచ్చా అని చాలా మంది అడిగారు నన్ను. సౌత్ కొరియా కూడా వెళ్లాను. థియేటర్ వర్క్ షాప్ కోసం వెళ్లాను. అక్కడ మిస్టర్ సాంగ్ అని ఒకాయన ఒక కార్యక్రమం నిర్వహిస్తారు.  ప్రతీ సంవత్సరం ఐదు దేశాల నుంచి పార్టిసిపంట్స్ వచ్చి ఇక్కడ  థియేటర్ రెసిడెన్స్ చేస్తారు. ఆ టైంలో  థియేటర్ కి సంబంధించి కల్చరల్ ఎక్స్చేంజి జరుగుతుంది. అలా 23 రోజుల పాటు ఆ వర్క్ షాప్ జరుగుతుంది. అక్కడ  అన్ని పనులు మేమే చేసుకోవాలి. అలా అక్కడికి వెళ్లి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను " అన్నాడు తిరువీర్.

ఛాలెంజింగ్ రోల్స్ చేసే సమంత అంటే నాకు ఇష్టం

బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకు ఆయన ఎదిగిన విధానం అందరికీ తెలుసు. రైటర్, యాంకర్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి ఆయనలో. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి  వెళ్లకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. తనకు ఎప్పుడూ ప్యాషనేట్ గా ఉండడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం తన  టార్గెట్ అన్నారు.తనకు  పర్సనల్ గా ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు , మురళీశర్మ ఇష్టమని చెప్పారు. ఎందుకంటే  వాళ్లు ఎంచుకునే పాత్రలు కొత్తగా ఉంటాయన్నారు. ఇప్పటికీ వాళ్ళ పాత్రల గురించే మాట్లాడుకుంటారు ఎవరైనా. ఇప్పుడు  పాత్రల ఎంపిక విషయంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ హిందీలో  నవజుద్దీన్ సిద్ధిఖీ, నసీరుద్దీన్ షా  కూడా ఇష్టమని చెప్పారు. అమితాబ్, కమల్ హీరోలుగా కంటే యాక్టర్లుగా చాలా ఇష్టమట. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల విషయానికి వస్తే  జూనియర్ ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి  ఇష్టమని , తర్వాత అల్లు అర్జున్ అంటే అభిమానమని చెప్పారు. ఎందుకంటే  బన్నీ స్టైల్, హార్డ్ వర్క్ చేసే విధానం నచ్చుతుందట తనకు . హీరోయిన్లలో సమంత అంటే చాలా ఇష్టమని బాలాదిత్య చెప్పుకొచ్చారు. సమంత ఎంచుకునే సినిమాలు ఫామిలీ మాన్, సూపర్ డీలక్స్ వంటివి చాలా బాగున్నాయని  అవన్నీ ఛాలెంజింగ్ రోల్స్ అని అన్నారు. సమంత యాక్ట్ చేసే విధానం కూడా  డిఫరెంట్ గా ఉంటుందన్నారు.  ఈటీవీలో అప్పట్లో వచ్చే   ఛాంపియన్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు అలాంటి షో ఒక్కటి చేస్తే చాలు అనుకున్న టైంలో  సంకల్ప బలం గట్టిగా ఉందేమో అనుకోకుండా  ఆ షో కి  హోస్ట్ గా చేసే ఛాన్స్ తనకు వచ్చేసరికి  ఎంతో సంతోషపడ్డాను అన్నాడు బాలాదిత్య.  ఇక ఇప్పుడు  బాలాదిత్య బిగ్ బాస్ షో ద్వారా హౌస్ లో అందరికీ ఆత్మీయుడు ఐపోయాడు.

రణవీర్ పై శ్రీముఖి హాట్ కామెంట్స్!

తెలుగులో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. వరుసగా షోస్ తో ఈవెంట్స్ తో దేశ విదేశాలు తిరుగుతోంది ఈ రాములమ్మ. ఇక ఇప్పుడు శ్రీముఖి అన్న  మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ గా  శ్రీముఖి బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్‌ ఫంక్షన్ లో  యాంకరింగ్‌ చేసింది. స్టేజిపై నటుడు ఆలీతో పాటు యాంకరింగ్‌ చేస్తున్న శ్రీముఖి రణవీర్ సింగ్ గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.  సైమా అవార్డు ఇచ్చేందుకు స్టేజ్‌పైకి వచ్చిన రణ్‌వీర్‌ సింగ్‌ ని  శ్రీముఖి తన వద్దకి పిలిచింది. "రణవీర్ ఈ స్టేజి నుంచి వెళ్లిపోయే  ముందు అమ్మాయిలంతా జెలస్ ఫీల్ అయ్యేలా ఒక హగ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను"  అని అడిగేసరికి  రెచ్చిపోయిన రణ్‌వీర్‌ సింగ్‌ ఆమెకి హగ్గులిచాడు. అంతటితో ఆగలేదు స్టేజి మీద  శ్రీముఖి రెండు చేతుల మీద  ముద్దులివ్వడం విశేషం. ఈ ఘటనతో ఉబ్బితబ్బిబ్బయ్యింది శ్రీముఖి. పక్కనే ఉండి  ఇదంతా చూస్తున్న ఆలీ  "దీపికా పదుకొనమ్మా  చూస్తున్నావా ఇదంతా ? " అంటూ ఆలీ వేసిన పంచ్‌ తో  అక్కడ ఉన్న అందరిలో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేసింది శ్రీముఖి. ‘‘ ఇది నిజంగానే  జరిగిందా ? ఇప్పుడే జరిగింది .. ఐ లవ్‌ యూ రణ్‌వీర్‌ సింగ్‌. ఇలా జరిగేలా  చేసినందుకు ఐ లవ్‌ యూ సైమా అవార్డ్స్‌’’ అంటూ టాగ్ లైన్ పెట్టేసింది శ్రీముఖి. సౌత్‌ ఇండియన్‌ మూవీలకు సంబంధించి  అందించే అవార్డు ఫంక్షన్‌లో శ్రీముఖి బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో రచ్చ చేసింది.  

పల్లకిలో పెళ్లికూతురు ..ఈ సీరియల్ డాక్టర్ బాబు క్రేజ్ ని పెంచుతుందా ?

బుల్లి తెరపై నిరుపమ్ పరిటాలకు ఉన్నంత క్రేజ్ మరే ఆర్టిస్ట్ కి లేదు. కార్తీక దీపంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నిరుపమ్ తన వైఫ్ తో కలిసి చంద్రముఖి సీరియల్ తర్వాత పెద్దగా ఎక్కడా కలిసి నటించడం లేదు. ఈ విషయం పై వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో మంజుల గతంలో క్లారిటీ కూడా  ఇచ్చింది. ఇద్దరం కలిసి నటించలేము అని చెప్పింది. కానీ ఇప్పుడు నిరుపమ్ తీస్తున్న సీరియల్ పల్లకిలో పెళ్లికూతురులో మంజుల నటిస్తోంది.  నిరుపమ్ సీరియల్స్  నిర్మిస్తుంటాడు అన్న విషయం తెలిసిందే . తన తండ్రి పేరు ఓంకార్. అందుకే  ఆయన పేరు  వచ్చేట్టుగా ఓం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్  మీద సీరియల్స్ నిర్మిస్తుంటాడు. ఇది వరకు "హిట్లర్ గారి పెళ్లాం" సీరియల్‌ నిర్మించాడు అందులో నటించాడు కూడా. జీ తెలుగులో ప్రసారం ఐన ఈ సీరియల్ తక్కువ టైములో ఎక్కువ పేరు సంపాదించేసింది. కాకపొతే ఈ సీరియల్ చాలా తక్కువ టైంలోనే పూర్తైపోయేసరికి ఫాన్స్ బాధపడ్డారు. ఇంకో సీరియల్ ఎప్పుడు ఎప్పుడు అంటూ అడుగుతున్న ఫాన్స్ కి ఇప్పుడు మంజుల, నిరుపమ్ గుడ్ న్యూస్ చెప్పారు.  తాజాగా తాను నిర్మిస్తోన్న కొత్త సీరియల్ గురించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ డేట్ ఇచ్చాడు . "పల్లకీలో  పెళ్లికూతురు" అనే కొత్త సీరియల్ , సరి కొత్త కథతో  రాబోతోందని, అది స్టార్ మాలో వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో  మంజుల కూడా ఓ పాత్రలో కనిపిస్తోంది. ఐతే ఇందులో  నిరుపమ్ నటిస్తాడా ? లేదా? అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియదు.

ఆంటీ అంటే ఊరుకోను నరేష్ కి వార్నింగ్ ఇచ్చిన సుమ!

ఇటీవల ఆంటీ అనే పదం  సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో , ఎంత వివాదాస్పదం అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాష్ షోలో కూడా ఆంటీ వివాదం కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా క్యాష్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో కి జబర్దస్త్ నుంచి దొరబాబు, గడ్డం నవీన్, సన్నీ, వెంకీ, దొరబాబు, బులెట్ భాస్కర్, నరేష్, తేజ వచ్చారు. " షోలో రూల్స్ అన్నీ మీకు తెలుసినవేగా" అని సుమ అనేసరికి "కొత్తవి ఉంటే చెప్పండి మేడం" అన్నాడు నరేష్.  "నువ్వే అంత పాతగా ఉంటే నేనేం కొత్తవి చెప్పను" అంటుంది సుమ. తర్వాత గబ్బర్ సింగ్ మూవీలో పోలీసుస్టేషన్ సీన్ ని ఇక్కడ స్పూఫ్ గా చేసింది సుమ. "అరె గబ్బర్ సింగ్ కె ఫోజియో" అని సుమ అనేసరికి "చెప్పండి ఆంటీ" అన్నాడు నరేష్. "ఎవడ్రా నీకు ఆంటీ.. ఈ జోక్ వేయొద్దని చెప్పానా నీకు.." అని ఫైర్ అయ్యింది  సుమ.  తర్వాత సుమ A to Z ఈవెంట్స్ పేరుతో ఫంక్షన్స్ అవీ చేస్తూ ఉంటుంది. అందులో నరేష్ ని కూర్చోపెట్టి లంగా ఓణీ ఫంక్షన్ చేస్తారు అందరూ కలిసి. తర్వాత "సారీ అండి అందరికీ  మా ఈవెంట్ వాళ్ళు సీమంతం ఫంక్షన్ ఒప్పుకున్నారు మర్చిపోయి అక్కడ చేయాల్సిన ఫంక్షన్ ఇక్కడ చేసేసారు" అంటూ ట్విస్ట్ ఇచ్చేసరికి  ఫూల్స్ అయ్యారు   జబర్దస్త్ కంటెస్టెంట్స్. ఫైనల్ గా గడ్డం నవీన్ కి భాస్కర్ కి కళ్ళకు గంతలు కట్టి కర్రలు తీసుకుని బాదేస్తారు అందరూ. ఇలా రాబోయే క్యాష్ షో అలరించబోతోంది.

ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన హైపర్ ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ షోలో ఆది పెర్ఫార్మెన్స్ చూస్తే మాటలు రావు. ఇప్పుడు  శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్  ప్రోమో రిలీజ్ అయ్యింది.  సెప్టెంబర్ 18న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో "జోడి నంబర్ 1 " పేరుతో  డిజైన్ చేశారు. సుజాత, రాకింగ్ రాకేష్ చేసిన  రొమాంటిక్ పెర్ఫామెన్స్ మాములుగా లేదు.  ఇక  పంచ్ ప్రసాద్ తన భార్యతో కలసి ఈ షోకి వచ్చాడు. ఈ షోకి హైలైట్ ఏంటి అంటే పంచ్ ప్రసాద్ రియల్ లైఫ్ ని స్కిట్ రూపంలో వేసేసరికి సెట్ లో ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యారు. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోయినా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎంత బాధపడుతుందో ఈ స్కిట్ లో చూపించారు. "ప్రేమించిన వాడికోసం డబ్బు ఖర్చుపెట్టిన అమ్మాయిని చూసా కానీ ఇలా తన  జీవితాన్నే ఖర్చు పెట్టిన  అమ్మాయిని ఈమెనే చూస్తున్నాను" అన్నాడు ఆది. తర్వాత వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని ఎత్తుకుని మ్యూజికల్ చేయిర్స్   ఆడాల్సి వస్తుంది. "శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ ప్రతీ ఎపిసోడ్ లో పెట్టాలి." అంటాడు ఆది తర్వాత ఆ గేమ్ లో ఆది అమ్మాయితో సహా కింద పడిపోతాడు.ఈ సమరంలో ప్రాణాలు పోయినా పర్లేదు గేమ్ మాత్రం ఆపొద్దు" అంటాడు మళ్ళీ ఆది.  ఇక తర్వాత ఇంటర్నేషనల్ ఫస్ట్ డే లవ్ సందర్భంగా వాళ్ళ ఫస్ట్ లవ్ నుంచి కొన్ని గిఫ్ట్స్ ని తెప్పించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అలా హైపర్ ఆదికి కూడా తన ఫస్ట్ లవ్ టైములో రాసిన లవ్ లెటర్ గిఫ్ట్ గా వచ్చేసరికి అది చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు స్టేజి మీద. ఇంతకు ఆ లవ్ లెటర్ లో ఏముంది..ఆది అప్పట్లో ఏం రాసాడు. మిగతా కంటెస్టెంట్ ఫస్ట్ లవ్ గిఫ్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

'డ్యాన్స్ ఐకాన్' షో జడ్జిగా రమ్యకృష్ణ.. కొత్త రమ్యని చూస్తారు!

విభిన్న పాత్రలతో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమయ్యే 'డ్యాన్స్ ఐకాన్' షో కోసం జడ్జిగా మారారు. ఆమెతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా జడ్జిగా ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఓంకార్ యాంకర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది. లాంచ్ ఎపిసోడ్ నిన్న(సెప్టెంబర్ 11న) ఆహాలో స్ట్రీమ్ అయింది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.   ఓటీటీలో న్యాయనిర్ణేతగా తన అరంగేట్రం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఫార్మాట్ ఈమధ్య కాలంలో ఎవరూ చేయలేదు. ఈ షో ద్వారా అందరూ కొత్త రమ్యని చూస్తారు" అన్నారు.   ఓంకార్ మాట్లాడుతూ.. "రమ్యకృష్ణ గారు ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఆమెతో పని చేయాలనే నా కల ఈ షోతో నెరవేరడం సంతోషంగా ఉంది. ఈ షో ద్వారా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాం" అన్నారు.   రమ్యకృష్ణ ఎంతోమందికి రోల్ మోడల్. డ్యాన్స్ పై ఎంతో అవగాహన ఉన్న ఆమె డ్యాన్స్ ఐకాన్ కు జడ్జిగా రావడం సంతోషంగా ఉందని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ అన్నారు.

ఫైమా ఫ్లవర్ అనుకుంటిరా.. కాదు ఫైర్!

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు హోస్ట్ నాగ్ ఒక సరదా టాస్క్ ఇచ్చారు . "హౌస్ లో బుట్ట బొమ్మ ఎవరు అని నీ ఉద్దేశం?" అంటూ బాలాదిత్యను అడిగారు నాగ్‌. "మెరీనా" అనేది ఆదిత్య ఆన్సర్. "ఎంత సేఫ్ గేమ్ ఆడావు బాలాదిత్య" అన్నాడు నాగ్. "ఇక్కడున్న ఆడపిల్లల్లో బంతి పువ్వు ఎవరు?" అని అడిగితే, "శుభానికి సూచిక బంతిపువ్వు కాబట్టి ఈ ఇంటికి సుదీప బంతిపువ్వు" అని చెప్పాడు.  తర్వాత శ్రీసత్యను శేఖర్ కమ్ముల సినిమాలో "హైబ్రిడ్ పిల్ల"గా అభివర్ణించాడు. అభినయశ్రీ "చాలా ప్రౌడీ అండ్ డైనమిక్", కీర్తిభట్ "బంగారు తల్లి", నేహా చౌదరి "స్ప్రింగ్", ఇనయా సుల్తానా "మిస్ స్మైల్", ఆరోహి రావు "సీమటపాకాయ్" అని అంటాడు. ఆరోహిని ఉద్దేశించి, "తనను పైకి చూసి చాలా సాఫ్ట్ అనుకున్న కానీ హౌస్ లో ఒక ఇష్యూ జరిగినప్పుడు తనని చూసి మామూలు సీమటపాకాయ్ కాదు థౌజండ్ వాలా అని ఫిక్స్ అయ్యా" అన్నాడు బాలాదిత్య. "వాసంతి ఎప్పుడూ రెడీ గా ఉంటుంది.. ఈరోజే వీకెండా అన్నట్టుగా ప్రిపేర్డ్ గా ఉంటుంది. గ్లామర్ ఆఫ్ బిబి హౌస్" అని చెప్పాడు. ఫైమా వంతు వచ్చేసరికి తను హ్యూమర్ బాగా చేస్తుందన్నాడు బాలాదిత్య. "నేను తనని వర్ణించమన్నాను కానీ లక్షణాలు చెప్పమనలేదు" అని నాగ్ అన్నాడు. అప్పుడు "ఫైమా ఒక ఫ్లవర్ సర్.. ఫ్లవర్ అంటే ఫ్లవర్ కాదు ఒక ఫైర్ సర్" అన్నాడు. "కాదు ఇంకా వర్ణించండి" అని ఫైమా అడిగేసరికి "ఫైమా ఫన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్" అని చెప్పాడు. ఇక ఫైనల్ గా "గీతక్క అంటే సీతక్కే" అన్నాడు బాలాదిత్య. "ఊరికే అంతా పైకి డాంబికమే కదా" అన్నాడు నాగ్. మధ్యలో గీతూ వచ్చి, "నేను టెంకాయ లెక్క పైకి గట్టిగా ఉంటా, లోపల స్వీట్ గా ఉంటా" అంటూ తన మీద తానే పంచ్ వేసుకుంది. ఇలా హౌస్ లో ఆడపిల్లలందరినీ తనదైన స్టయిల్లో ఎవరినీ నొప్పించకుండా వర్ణించాడు బాలాదిత్య.