అతని మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే బాగుండేది అని సారీ చెప్పిన రష్మీ

రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద అతనికి సారీ చెప్పింది. ఈ వారం కాయిన్స్ ఎపిసోడ్ లో భాగంగా రష్మీ ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగితే అందులో గోల్డ్ కాయిన్ వచ్చింది. "నేను న లైఫ్ లో ఒక మనిషికి సారీ చెప్పాలి. ఆ మనిషి ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు. అతను తన టాలెంట్ ని ఈ స్టేజి మీద చూపించేటప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఐతే ఈ జర్నీలో ఎన్నో విషయాలు చెప్పాడు. మొదట్లో పట్టించుకోలేదు కానీ తర్వాతర్వాత అతను పెర్ఫార్మ్ చేసే స్కిట్స్ కి కనెక్ట్ ఇపోయా. అందుకే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని అనుకుంటున్నా. ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ బాబు ఎవరో కాదు మన ఆర్టిస్ట్ బాబు. అప్పట్లో ఆయన వేసిన వేషాలకు యాక్టర్ బాబు కాస్త రైటర్ బాబు అయ్యాడు. అప్పుడు మేమంతా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాడు. అవకాశం ఇవ్వకపోతే కోసుకుంటా అని బెదిరించాడు అందుకే ఈ రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చాను. అందుకు ఆడియన్స్ కి సారీ" అని చెప్పింది రష్మీ. రష్మీ ఇంతలా చెప్తూండేసరికి మొదట అందరూ సుడిగాలి సుధీర్ గురించి అనుకున్నారు కానీ ఫైనల్ గా బాబు అనేసరికి అందరూ ఫీలయ్యారు.

తగ్గేదేలే.. మా టీమ్ నుంచి ఇద్దరు టాప్ లో ఉంటారు

సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ షో ఐన 'డాన్స్ ఐకాన్' గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య పోటీ మాములుగా లేదు. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్లను అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానాలు ఇచ్చారు. డాన్స్ కంటెస్టెంట్స్ వేలం పాటలో ఈయన ఆసిఫ్ ని, అరుంధతిని దక్కించుకున్నారు.  "గ్రాండ్ ఫినాలేలో మీ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఉండడం మీకెలా అనిపిస్తోంది?" అని అడగగా.. "చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరూ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు." అన్నారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో మీ ఫేవరేట్ ఎవరు?" అనే ప్రశ్నకు "నేను ఒకళ్లు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చెప్పను. నాకు ఇద్దరూ చాలా ఇంపార్టెంట్." అనే సమాధానం ఇచ్చారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో టాప్ 2 లో ఎవరుంటారని అనుకుంటున్నారు?" అని అడగటంతో "మా టీమ్ నుంచి ఆ ఇద్దరూ ఉండాలని కోరుకుంటున్న. ఇద్దరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నా..బాగా చేయండి. విన్ అవ్వండి." అన్నారు. మీ ఇద్దరి  కంటెస్టెంట్స్ లో ఎవరిదీ  బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మీరు అనుకుంటున్నారు? అడగగా.. "అరుంధతి చేసిన 'పరేషాను'రా అనే సాంగ్ కి చేసిన డాన్స్ ది బెస్ట్." అని తన కంటెస్టెంట్స్ గురించి చెప్పారు.. అలాగే వాళ్లకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

సౌమ్య కచ్చితంగా విన్నర్ అవుతుంది.. ఫ్లోరీనా అందరికీ గట్టి పోటీ ఇస్తోంది

యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ షో ఐన 'డాన్స్ ఐకాన్' ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడింది. ఐతే ఇప్పుడు పోటీ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ ని అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కంటెస్టెంట్స్ వేలం పాటలో ఈయన ట్రోన్ బ్రదర్స్ ని, సౌమ్య అనే కంటెస్టెంట్ ని దక్కించుకున్నారు.  "గ్రాండ్ ఫినాలేలో మీ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఉండడం మీకెలా అనిపిస్తోంది?" అని అడగగా.. "నేను సెలెక్ట్ చేసుకున్న ఇద్దరూ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళ డాన్స్ మాములుగా ఉండదు. రన్నర్, విన్నర్ కూడా వీళ్ళే అవ్వాలి, ట్రోఫీని సొంతం చేసుకొవాలి అనుకుంటున్నా" అన్నారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో మీకు ఎవరంటే ఇష్టం?" అని అడగటంతో.. "సౌమ్య అంటే ఇష్టం. కచ్చితంగా విన్నర్ అవుతుంది." అని చెప్పారు. "మీ కంటెస్టెంట్స్ చేసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏది?" అనే ప్రశ్నకు "సౌమ్య చేసిన బుట్ట బొమ్మ సాంగ్ ది బెస్ట్" అని సమాధానం ఇచ్చారు. "మీ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీని ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు?" అని అడగగా.. "అల్లు అరవింద్ గారు సెలెక్ట్ చేసుకున్న ఫ్లోరీనా అనే చిన్న పాప. చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది." అని చెప్పారు రవిశంకర్.

అనసూయని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

అనసూయ కొద్ది రోజులుగా ఆన్లైన్ లో వేధించే వాళ్ళ మీద గట్టిగానే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంత కాలం క్రితం ఆంటీ అని పిలుస్తూ ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్స్ అనసూయని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈమె ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీళ్ళ మీద సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినప్పటికీ ఆమెపై వేధింపులు ఆగలేదు. ఐతే అనసూయ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని అబ్యూజ్ కామెంట్స్ చేసిన ఒక వ్యక్తి మీద అనసూయ ఈ నెల 17 న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇతను కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పండరి రామవెంకట వీర్రాజుగా గుర్తించారు. సాయి రవి 267 అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా యాంకర్స్ ని, యాక్టర్స్ ని టార్గెట్ చేసి అబ్యూజ్ చేస్తున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా సెలబ్రిటీస్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, ప్రగతి, జయవాణి వంటి సెలబ్రిటీల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నట్లు తెలిపారు.

సిరి టాటూ నిజం కాదు.. శ్రీహాన్ నువ్వు మోసపోవద్దు

బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో శ్రీహాన్ ఉంటాడు అని ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు. ఐతే ఇదే బిగ్ బాస్ హౌస్ కి ఐదో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సిరి.. ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు శ్రీహాన్ హౌస్ లో చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఇకపోతే  రీసెంట్ గా  బిగ్ బాస్ హౌస్ లోకి సిరి వెళ్లి  శ్రీహాన్ తో కలిసి డాన్స్ చేసింది. తన కోసం మెడ మీద వేసుకున్న టాటూని కూడా చూపించింది. శ్రీహాన్ అది చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇప్పుడు వీళ్ళ మీద సోహైల్ వేసిన పంచులు వేరే లెవెల్లో ఉన్నాయి.  ఐతే బిగ్ బాస్ సీజన్ 6 ఎండింగ్ కి దగ్గర పడుతుండేసరికి ఫామిలీ మెంబర్స్ ని గత సీజన్స్ లోని కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి కొంచెం ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడానికి మేకర్స్ తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే ఒక్కో కంటెస్టెంట్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్లకు బాగా కావాల్సిన వాళ్ళని హౌసులోకి తీసుకొస్తున్నారు.  ఇక ఇప్పుడు వీకెండ్ వచ్చింది  కాబట్టి.. హౌస్ మేట్స్ కోసం వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఈ షోకి తీసుకొచ్చారు. అలా శ్రీహాన్ కోసం అతడి తండ్రితో పాటు బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ వచ్చాడు. శ్రీహాన్ పై పంచులు కూడా వేశాడు. అయితే ఇనయా కోసం షోకు వచ్చిన బిగ్ బాస్ సోహైల్ శ్రీహాన్ తో మాట్లాడుతూ.. "సిరి టాటూ పర్మినెంట్ కాదు, మోసపోవద్దు" అని ఫన్నీ కామెంట్స్ చేశాడు. "నమ్మొద్దు, నమ్మొద్దు" అనే సాంగ్ ని  పాడటానికి ట్రై చేశాడు. కానీ హోస్ట్ నాగార్జున ఆపేసారు. 

తినడానికే తిండి ఉండదు.. ఇంకా వాషింగ్ మెషిన్ కూడా ఉంటుందా

ఏ కొత్త మూవీ రిలీజ్ ఐనా సరే ఆ మూవీకి పబ్లిసిటీ ఇవ్వడానికి చాలా మంది సెలబ్రిటీస్ టేస్టీ తేజతో కలిసి ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవలే ఎలిమినేట్ ఐన వాసంతి కృష్ణన్ ని తేజ ఇన్వైట్ చేసాడు. ఇక ఆ ఇద్దరు కలిసి ఫుల్ గా ఫుడ్ తింటూ బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.  "మమ్మల్ని వీకెండ్స్ లో చూసేవాళ్లంతా కూడా మాకు ఎవరైనా హెయిర్ స్టయిలిష్ట్స్ వచ్చి మేకప్ చేస్తారేమో అనుకుంటారు కానీ కాదు మాకు మేమే రకరకాలుగా హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం. ఇక హౌస్ లో మా బట్టలు మేమే లోపల ఉతుక్కుంటాం. కానీ చాలామంది వాషింగ్ మెషిన్ ఉండి ఉంటుంది లోపల అనుకుంటారు. కానీ అలా ఏమీ ఉండదు. బిగ్ బాస్ హౌస్ లో తినడానికే ఫుడ్ సరిగా ఉండదు ఇంకా ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తారు. హౌస్ లోకి బ్యాక్ ఎండ్ నుంచి కూడా ఎవరూ రారు. కేవలం కెమెరాలు చూసుకోడానికి వస్తారు. ఇక నాకు బాయ్ ఫ్రెండ్ అనేవాళ్ళు లేరు..నేను సింగల్. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో నాకు విఐపి రూమ్ అంటే చాలా ఇష్టం. గుడ్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ అవి దొరికేవి కావు. ఎవరైనా ఎలిమినేట్ ఐనప్పుడు మాత్రమే గుడ్లు మిగిలేవి.. ఇక నాన్-వెజ్ తినాలి అంటే లగ్జరీ బడ్జెట్ లోనే దొరికేది. ఇనాయ, కీర్తి నాకు బాగా కనెక్ట్ అయ్యారు. టాప్ 5 లో రేవంత్, శ్రీహన్, ఇనాయ, ఆదిరెడ్డి, కీర్తి వీళ్ళే ఉంటారు." అని వాసంతి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.

బిగ్ బాస్ టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చిన ఇనయా!

నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ లో నోటి దురుసు, వసపిట్టలాగా అరుస్తోంది అనుకున్న ఇనయా కాస్త ఇప్పుడు టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చింది.  మాటకి మాట, హౌస్ మేట్స్ లో దాదాపు అందరితో గొడవ పెట్టుకుంటూ కనిపించే ఇనయా, మొదటి మూడు వారాల్లోనే బయటకొచ్చేస్తుందని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి, కెప్టెన్ అయ్యింది. దీంతో సెమీ ఫైనల్ కి చేరుకుంది. కెప్టెన్ అయిన కారణంగా టాప్ త్రీలో ఇనయా ఉండబోతుంది. అసలు ఏం జరిగిందంటే రెండు వారాల క్రితం హౌస్ లో జరిగిన 'ఫిజికల్ టాస్క్' లో రేవంత్ తో తలబడింది ఇనయా. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్న రేవంత్ ని, ఇనయా ఆపడం అనేది చాలా కష్టం.. కానీ ఇనయా తనకి గట్టిపోటీ ఇచ్చింది. దీంతో ఇనయాకి ఫ్యాన్ బేస్ పెరిగింది. నెట్టింట్లో ఇనయాకి చాలా మంది మద్దతు దొరికింది. "ఒక ఆడపిల్ల పులిలా తలబడటం చూడటం ఇదే ఫస్ట్ టైం" అంటూ నెట్టింట్లో ఇనయాకి సపోర్ట్ గా ట్వీట్స్ కూడా వస్తుండటంతో ఇనయా ఈ సారి టైటిల్ గెలుస్తుందనే అనుకుంటున్నారంతా. అయితే రేవంత్ గట్టి పోటీ ఇస్తుండటంతో ఇనయా రన్నర్ గా సరిపెట్టుకుంటుందో లేక అంచనాలను దాటుకొని విన్నర్ అవుతుందో? లేదో? చూడాలి మరి.

జబర్దస్త్ లోకి నాటీ నరేష్ నాన్న.. సెలబ్రిటీని చేయడానికే!

జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కామెడీ షో. టాలెంట్ ఉన్న వాళ్ళను  ప్రోత్సహించే రియాలిటీ షో. ఇక ఈ జబర్దస్త్ ద్వారా ఎంతో మంది స్టార్స్ కూడా అయ్యారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఐతే ఇలాంటి వేదిక మీదకు తమ పిల్లల్ని పంపి ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లితండ్రుల్ని కూడా మల్లెమాల టీమ్ ఆడియన్స్ కి పరిచయం చేస్తూ ఉంటుంది. బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న కూడా అలాగే ఈ స్టేజి మీద ఎన్నో స్కిట్స్ వేసాడు. ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ నాటీ నరేష్ తన తండ్రిని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి స్కిట్ చేయించాడు.  గతంలో నరేష్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో తన తండ్రిని పరిచయం చేసాడు. అయితే ఆ టైములో ఎలాంటి స్కిట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నరేష్ తండ్రి ఒక స్కిట్ లో నటించారు. ఈ స్కిట్ లో తన తండ్రి మీదే నాటీ నరేష్ పంచులు బాగా వేశాడు. అయితే నరేష్ తండ్రికి ఈ స్కిట్స్ అవి కొత్త కావడం వలన ఆయన డైలాగ్స్ చెప్పకుండా.. ఎక్స్ ప్రెషన్స్ తోనే స్కిట్ ని రక్తి కట్టించారు. కెవ్వు కార్తీక్ "నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి" అంటే.. నరేష్ తండ్రి.. "రైట్ రైట్" అని అంటాడు. దానికి నరేష్.. "నాన్న నిన్ను సెలబ్రిటీని చేద్దామనుకుంటున్నాను. ఇంకా నువ్వు రైట్ రైట్ అనుకుంటానే ఉన్నావ్" అంటూ పంచ్ డైలాగ్ వేసేసరికి నరేష్ వాళ్ళ నాన్న ఏం అనాలో తెలియక సైలెంట్ గా ఉంటాడు.

గుండెల్ని హత్తుకునేలా ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి మాటలు!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క. నిన్న మొన్నటి దాకా గొడవలతో సాగిన షో కాస్త ఎమోషనల్ గా మారింది. కాగా బిగ్ బాస్ లో ప్రతి శనివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ చేసిన తప్పులు చెప్తూ, వాటికి పనిష్మెంట్ ఇస్తుంటాడు అనే విషయం తెలిసినదే. కానీ ఇప్పుడు అవేవి లేకుండా హౌస్ మేట్స్ సన్నిహితులు, ఇంకా గత సీజన్లలో కంటెస్టెంట్స్ గా ఉన్న సెలబ్రిటీలను కలిపి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అయితే అలా వచ్చినవాళ్ళలో మొదటగా ఇనయాని సపోర్ట్  చేస్తూ సోహెల్, ఇనయా బ్రదర్ వచ్చారు. అలాగే శ్రీహాన్ కి సపోర్ట్ గా ఫాదర్ అమీర్ సాప్, బిగ్ బాస్ సీజన్-1 విజేత శివ బాలాజీ వచ్చారు. ఆ తర్వాత ఫైమాని సపోర్ట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ రాగా, ఇంకా ఫైమా వాళ్ళ సిస్టర్ సల్మా వచ్చింది. రేవంత్ కి సపోర్ట్ గా రేవంత్ బ్రదర్ సంతోష్, రోల్డ్ రైడా వచ్చారు. అలాగే రోహిత్ కి సపోర్ట్ గా ప్రభాకర్ రాగా, ఇంకా రోహిత్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. ఆదిరెడ్డికి సపోర్ట్ గా తన చెల్లెలు నాగలక్ష్మి రాగా, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ లహరి షారి వచ్చింది. అలాగే రాజ్ కి సపోర్ట్ గా తన స్నేహితులు రాగా, శ్రీసత్యకి సపోర్ట్ గా తన స్నేహితులు వచ్చారు. కీర్తీకి సపోర్ట్ గా సీరియల్ యాక్టర్ ప్రియాంక, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ విథిక వచ్చింది.  నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి స్టేజ్ మీదకి వచ్చింది. "అన్న నువ్వు కనిపించట్లేదు.. ఇన్ని రోజులు మా పక్కనే ఉండేవాడివి.‌. ఇప్పుడు లేవు" అని ఏడ్చేసింది నాగలక్ష్మి. ఆ తర్వాత నాగార్జున ఓదార్చాడు. "కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అన్నా" అని చెప్పి ఆదిరెడ్డికి మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ మాటలు గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు.

అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

రియాలిటీ షోస్ లో ఈ మధ్య జడ్జెస్ చాలా తెలివి మీరారు. ఏం చేస్తే ప్రోమోలో పడతారు, ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు ఎలా తిప్పుకోవాలి వంటి విషయాలను బాగా స్టడీ చేసి జనాల నాడి పట్టుకుంటున్నారు. ఆ విధంగానే ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.  కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' పేరుతో ఒక కామెడీ షో త్వరలో ఆహాలో స్ట్రీమ్ కావడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో చూస్తే గనక డైరెక్టర్ అనిల్ రావిపూడి యాంకర్ దీపిక పిల్లిని పట్టుకుని లిప్ కిస్ ఇస్తున్నట్లు ఫోజ్ పెట్టాడు. ఈ ఫోజ్ లో అనిల్ రావిపూడిని  చూసి జనాలు అవాక్కయ్యారు. ఈ ఒక్క బిట్ తో  మొత్తంగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోపై ఆడియన్స్ లో ఆసక్తి అనేది పెరిగింది. అంటే ఎప్పుడూ సరదాగా ఉండే ఈ డైరెక్టర్ లో కూడా ఇలాంటి యాంగిల్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.  డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ఉన్న ఈ షోకి దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ హోస్ట్స్ గా చేస్తున్నారు. ఈ షోలో కమెడియన్స్ పెర్ఫార్మ్ చేసే కామెడీకి ఆడియన్స్ మార్క్స్ వేస్తారు. డిసెంబర్ 2 నుండి ఈ షో ప్రారంభంకానుంది. రోజుకో రకం ప్రోమోస్ ని ఆడియన్స్ కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఈ షోకి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు.

'ఒక్కడు' మూవీ స్పూఫ్ లో ఓవరాక్షన్ చేసిన నూకరాజు

మహేష్ బాబు, భూమిక నటించిన మూవీ 'ఒక్కడు'. ఈ మూవీలో ఆయన మేనరిజమ్, డైలాగ్స్ అదిరిపోతాయి. ఇక హీరోకి పోటీగా విలన్ ప్రకాష్ రాజ్ కూడా పోటీ పడి మరీ నటించారు. ఇక ఇప్పుడు 'జాతిరత్నాలు' షోలో ఇమ్మాన్యుయేల్, నూకరాజు టీమ్‌ మహేష్ బాబుని ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఒక్కడు మూవీని  స్పూఫ్‌ గా చేశారు. ఐతే నూకరాజు మరీ ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలిసిపోతోంది. నెటిజన్స్ కూడా ఇదే మాట అంటున్నారు.  ఒక్కడు సినిమాలో మహేశ్‌ బాబు క్యారెక్టర్‌ నూకరాజు చేశాడు. స్టార్టింగ్‌ నుంచి ముక్కును వేలితో గోక్కుంటూ కొంచెం ఎక్కువ చేసాడు.. "మొన్న క్యాలీఫ్లవర్‌ చేశాడు సంపూర్ణేష్‌ బాబు.. ఈరోజు నేను మహేష్‌ బాబుని" అంటూ స్టార్ట్ చేశాడు. "ఈసారి కబడ్డీ కర్నూల్ లో గెలవాలన్నయ్య" అంటూ వెటకారం చేసాడు. మహేష్ బాబు క్యారెక్టర్ ని కావాలనే నెగటివ్ గా పెర్ఫార్మ్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో చాలా మూవీ స్పూఫ్స్ చేశారు కానీ ఇలా ఇంత వెటకారంగా ఎప్పుడూ చేయలేదు. మరి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటి అని నెటిజన్స్ నూకరాజు మీద విరుచుకుపడుతున్నారు.

'బిగ్ బాస్-6' విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చిన గెస్ట్స్!

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ రానే వచ్చింది. వారం నుండి కొనసాగుతున్న ఫ్యామిలీ వీక్ ఫుల్ ఆన్ ఎమోషన్స్ తో నిండగా, వీకెండ్ లో వచ్చిన నాగార్జున కూడా రెండింతలుగా ఎంటర్‌టైన్మెంట్ తో శనివారం హౌస్ మేట్స్ ముందుకు వచ్చాడు. గెస్ట్ లతో బిగ్ బాస్ స్టేజ్ 'బంచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' గా మారింది. ఇందులో గెస్ట్ గా వచ్చినవాళ్ళకి "హౌస్ లో ఎవరు టైటిల్ రేస్ లో ఉన్నారు? ఎవరికి ఎవరు పోటీ?" అని చెప్పమన్నాడు నాగార్జున. కాగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా రేవంతే కాంపెటీషన్ అని చెప్పుకొచ్చారు. "రేవంత్ ఆటతీరు బాగుంటుంది" అని అందరూ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వచ్చిన గెస్ట్ లు, రేవంత్ కి ఇండైరెక్ట్ గా విన్నర్ నువ్వే అని హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గెస్ట్ లు కొంతమంది పాజిటివ్ పాయింట్స్ చెప్పగా, మరికొంతమంది నెగెటివ్ పాయింట్స్ చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కూడా మెజారిటీ అఫ్ గెస్ట్స్, రేవంతే టఫ్ కాంపెటీషన్ అని చెప్పారు. అయితే గెస్ట్ లు చెప్పిన విషయాలు హౌస్ మేట్స్ అందరూ సీరియస్ గా తీసుకొని బాగా ఆడి, తమ పర్ఫామెన్స్ తో ఎవరు ఆకట్టుకుంటారో చూడాలి. కాగా టైటిల్ రేస్ లో ఎవరు ఉన్నారనేది, లాస్ట్ వీక్ వరకు చూడాలి మరి. ఎవరు విన్నరో? ఎవరు రన్నరో? అనే ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడాలంటే ఇంకో మూడు వారాలు ఆగాల్సిందే మరి!

సోహెల్ వస్తే కథ వేరే ఉంటది!

బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు సోహెల్ పేరు సుపరిచితమే. ఎందుకంటే సీజన్ 4 లో ఒక ఆట ఆడుకున్నాడు. అంతలా ఉండేది ఆ ఆటతీరు. ఇది సీజన్ 6 అయినా కూడా అతని పేరుని ప్రేక్షకులు మరచిపోలేకపోతున్నారంటే, అట్లుంటది సోహెల్ తో మరి. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున బోలెడు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసాడు. ప్రతీ కంటెస్టెంట్ కి సంబంధించిన ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు.  కాగా అందులో ఇనయా తరుపున సోహెల్ వచ్చి, ఇనయా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్ని ఇప్పుడు వద్దు అని చెప్పినా వినకుండా నాగార్జునతో చెప్పేసాడు. సోహెల్ మట్లాడుతూ "ఇనయా ఒక జిమ్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఆ జిమ్ నుండి ఎందుకు మానేసిందో? అడగండి సర్" అని నాగార్జునతో చెప్పగా, ఇనయా ఆశ్చర్యంగా "ఇక చాలు సోహెల్ ఆపేయ్" అని అంది.  అసలు విషయం ఏంటి అంటే సోహెల్ బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుండి ఇనయాకి ఇష్టం ఉండడంతో సోహెల్ ఎక్కడ ఉంటాడో కనుక్కొని, తను ఉండే దగ్గరికి షిఫ్ట్ అయిందట. అలాగే అతను ఏ జిమ్ కి వెళ్తాడో కనుక్కొని, సరిగ్గా ఆ జిమ్ లోనే జాయిన్ అవ్వగా, అక్కడ సోహెల్ ఇద్దరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడం చూసి జలస్ గా ఫీల్ అయిందంట. అలా సోహెల్ తన మొదటి క్రష్ అని, తన నెంబర్ కూడా అడగుదామని అనుకున్నట్టు ఇనయా చెప్పుకొచ్చింది.

కిక్కిచ్చే మిరపకాయ్ ఎంట్రీ..మెరిసిపోనున్న గ్రాండ్ ఫినాలే స్టేజ్!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ ఇక ఫైనల్ కి చేరుకుంది. ఇప్పటివరకు డాన్స్ పెర్ఫామెన్సెస్ తో పాటు స్కిట్స్ కూడా ఆడియన్స్ ని ఎంతో  అలరించాయి.  ఇక ఇప్పుడు ఎలిమినేషన్స్ రౌండ్స్ పూర్తైపోయి. గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి కిక్కిచ్చే హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. "కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని హీరో, పవర్ తప్ప పొగరు లేని హీరో, ఇదిగో అబ్బాయి... వస్తున్నాడు మన మిరపకాయ్" ..అని ప్రదీప్ మంచి జోష్ తో అనౌన్స్ చేసేసరికి మాస్ మహారాజ రవితేజ ఉరుములు, మెరుపులతో అలా నడుచుకుంటూ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసేసాడు.  ఇక ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ సెట్ లో రవితేజని చూసేసరికి అందరూ లేచి వీలలు, కేకలు వేశారు. ఇక ఆ సౌండ్ తట్టుకోలేక "ఒరేయ్ ఆగండ్రా" అనే మాస్ డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించాడు మాస్ మహారాజ. రవితేజ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 4 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుని డాన్స్ చేసిన హైపర్ ఆది!

బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షో "ఢీ".  14 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.   ఈ స్టేజ్ నుంచే ఎంతో మంది డాన్సర్లు మాస్టర్లు అయ్యారు. ఇక ఇప్పుడు ప్రసారమవుతున్న ఈ షో సీజన్ 14 చివరి దశకు చేరుకుంది.  ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. టైటిల్ ఎలాగైనా కొట్టాలి అని కొరియోగ్రాఫర్స్ అంతా  తమ  టాలెంట్ ని బయటికి తీస్తున్నారు. గతవారం ఎపిసోడ్ లో అఖిల్ తో పాటు మరో లేడీ టీమ్ లీడర్ శ్వేతా నాయుడు చేసిన డాన్స్ తో అందరూ ఫిదా ఇపోయారు. వీళ్ళను చూసిన హైపర్ ఆది.  నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను కూడా డాన్స్ చేస్తాను అంటూ శపథం చేశాడు. ఆయన శపథం గురించి ప్రదీప్ జోక్ కూడా వేసాడు.  కానీ ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని తెలుస్తోంది. ప్రత్యేకంగా డాన్స్ నేర్చుకుని వచ్చి మరీ పెర్ఫార్మ్ చేసాడు. జడ్జి పూర్ణ కూడా ఆది డాన్స్ చూసి వచ్చి అతనితో కలిసి స్టెప్పేసి బాగా చేసావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్టయిల్లో అవినాష్ డైలాగ్

కామెడీ షోస్ అన్నిటినీ బీటౌట్ చేయడానికి ‘‘కామెడీ స్టాక్ ఎక్స్చేంజి’’ పేరుతో ఆహాలో సరికొత్త కామెడీ షో రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి ఉన్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, కామెడీ స్టార్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించే చాలామంచి కమెడియన్స్ ఈ షోలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. ఈ షో డిసెంబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ లో మొత్తం కూడా స్కూల్ , క్లాస్ రూమ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీని అందించారు కమెడియన్స్. ఇక ఇందులో సీనియర్ మోస్ట్ కమెడియన్ వేణు వండర్స్ వచ్చి "నా చిన్నప్పుడు స్కూల్స్ అనేవి "గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.." అనేలా ఉంటే ఇప్పుడు స్కూల్స్ మాత్రం " గున్నాగున్నా మామిడి.." అనేలా  ఉన్నాయి అని చెప్పి ఎంటర్టైన్ చేసాడు. ఇక తర్వాత సుధీర్ కామెడీ క్లాస్ రూమ్ పేరుతో ఒక స్కిట్ వేసాడు. సుధీర్ మాస్టర్ గా మిగతా కమెడియన్స్ స్టూడెంట్స్ గా ఉన్నారు. సుధీర్ "రా..రా.."అని సద్దాంని పిలిచేసరికి "ఎక్కాసెక్క" అని సాంగ్ పాడి కామెడీ చేసాడు. దాంతో మిగతా స్టూడెంట్స్ లేచి ఫన్ చేశారు. సుధీర్ వెంటనే కర్ర తీసుకుని అందరినీ కొడుతూ అవినాష్ దగ్గరకు వెళ్లేసరికి " ఏయ్ ..ఎలా కొడతారు మీరు, ఏ విధంగా కొడతారు మీరు" అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిల్లో మాట్లాడేసరికి అందరూ నవ్వేశారు. 

రేవంత్, ఫైమాల మధ్య సిల్లీ లొల్లి!

బిగ్ బాస్ సీజన్ - 6  పూర్తి కాబోతుంది. దీంతో  రోజు రోజుకి హౌస్ లో కంటెస్టెంట్స్ ఇచ్చే పర్ఫామెన్స్ వల్ల విజేత ఎవరు? అని అంచనాలు తారుమారు అవుతున్నాయి. దీంతో హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. సీజన్ లో హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అంటూ పాల్గొన్నారు. అయితే టాస్క్ లో రేవంత్, ఫైమా మధ్య మొదలైన గొడవ టాస్క్ ముగిసాక ఎక్కువ అయ్యింది. టాస్క్ లో బాల్ రేవంత్ చేతిలో ఉండగా ఫైమాని టాస్క్ నుంచి తొలగించాడు. "తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది. మళ్ళీ  ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది" అని ఫైమాను గేమ్ నుండి తప్పించాడు రేవంత్. రేవంత్ చెప్పిన కారణం తనకు నచ్చలేదు అని ఫైమా చెప్పింది. అదే విషయమై టాస్క్ ముగిసాక ఫైమా మిగతా హౌస్ మేట్స్ తో "ఒకరు సిల్లీ రీజన్ చెప్పి నన్ను తొలగిస్తే, వాళ్ళని కూడా వేరే వాళ్ళు సిల్లీ రీజన్ చెప్పి తొలగిస్తే ఆ హ్యాపీనే వేరు" అంటూ రేవంత్ కి వినిపించేలా ఫైమా మాట్లాడింది. దీంతో రేవంత్ కోపంతో "నువ్వు టాస్క్ నుండి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా వెళ్లిపోవాలని అనుకుంటావ్. నీ బుద్ధే అంత" అంటూ కౌంటర్ ఇచ్చాడు. దానికి బదులుగా ఫైమా రేవంత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, వదిలేసాడు. తను చాలా వరకు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. రేవంత్, ఫైమా ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం కొద్ది సేపటి వరకు కొనసాగింది. అయితే డేంజర్ జోన్ లో ఉన్న ఫైమా ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైం లో గొడవలు పెట్టుకుంటే తను ప్రేక్షకుల దృష్టిలో ఇంకా నెగెటివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. 

కీర్తి.. నువ్వు నా కూతురు లాంటి దానివి.. కాదు నా కూతురు వే!

ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ 'ఫుల్ ఆఫ్ ఎమోషన్స్' గా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ భార్య అన్విత వచ్చేసింది అని అనుకున్నారంతా, కానీ 'బిబి టీవి' లో వీడియో కాల్ మాట్లాడింది అంతే. "మన వాళ్ళకి ఎవరికి వీలు అవ్వట్లేదు. అందుకే నన్ను వీడియో కాల్ కి పిలిచారు. ఊరికే ఏడ్వద్దు. బాగా ఆడండి. కీర్తి గారు మీరు బాధపడొద్దు. మేము అంతా ఉన్నాం" అని అంది అన్విత. ఆ తర్వాత  రేవంత్ మాట్లాడాడు. అన్విత మాట్లాడుతూ "ఏం బాధపడొద్దు. మంచిగా ఆడి, టైటిల్ గెలుచుకొని రండి" అని అనగా, అందరి గురించి చెప్పమని రేవంత్ అనేసరికి టీవీ ఆఫ్ అయిపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. "బిగ్ బాస్ ప్లీజ్.. ఒక్కసారి ఆన్ చేయండి" అని హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేసారు. "ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి టీవీ ఆన్ చేయండి" అని  రేవంత్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయినా కూడా బిగ్ బాస్ స్పందించలేదు.  ఆ తర్వాత రేవంత్ వాళ్ళ అమ్మ వచ్చింది. హౌస్ లో వాళ్ళ అమ్మని చూసేసరికి రేవంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. "కోపం తగ్గించు. జనరల్ గా కోపం లేదు. నా కోపమే వచ్చింది" అని అమ్మ అన్నారు.  ఆ తర్వాత కీర్తిని దగ్గరకు రమ్మని పిలిచి, "నువ్వు, నా కూతురు లాంటిదానివి.. కాదు నా కూతురువే. ఎప్పుడు అయినా సరే నువ్వు మా ఇంటికి రావొచ్చు" అని అమ్మ చెప్పగానే, "అలాగే అమ్మ" అని కీర్తి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ తర్వాత రేవంత్ వాళ్ళ అమ్మని టైం అయిందని బిగ్ బాస్ బయటికి పంపించేసాడు. 

హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఇనయా!

హౌస్ లో కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ పేరు 'బాల్ ఇన్ ది సర్కిల్‌'. "ఒక్కో రౌండ్ లో బజర్ మోగేసరికి బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వారు ఒకరిని తీసివేయవచ్చు, అలా ఒక్కో బజర్ కి ఒక్కొక్కరిని తీసుకుంటూ రావాలి. చివరి రౌండ్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో వారే విజేతగా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే మొదటి రౌండ్ లో ఓడిన ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది. గేమ్ మొదలై, మొదట రేవంత్ తప్పుకున్నాడు. తర్వాత ఆదిరెడ్డి తప్పుకోగా, ఇలా చివరికి శ్రీసత్య, ఇనయా మిగిలారు. వారిద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. బజర్ మోగేసరికి బాల్ ఇనయా చేతిలో ఉంది. దీంతో కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఇనయా కొత్త కెప్టెన్ అయ్యింది.  ఇనయాని కెప్టెన్ గా చూడాలని, మొన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చెప్పిన విషయం తెలిసిందే. "అమ్మ కెప్టెన్ అయ్యాను చూడు" అని కెమెరా చూస్తూ చెప్పుకుంది. అయితే కొత్త కెప్టెన్ గా ఇనయా గెలిచాక, "నా రూల్స్  ఏం లేవు. అందరు నచ్చినట్టు ఉండండి. నచ్చినంత తినండి" అని హౌస్ మేట్స్ కి చెప్పింది.