Bigg Boss 9: హరీష్, ఫ్లోరాలకి బ్లాక్ స్టార్..  సిల్వర్ స్టార్ పొందింది ఎవరంటే..?

  బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వీకెండ్ వచ్చేసింది. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం... నాగార్జున ఈసారి నాలుగు వారాల పర్ఫామెన్స్ ని బట్టి స్టార్స్ ఇచ్చాడు. మొదటగా ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఆ తర్వాత కొంతమందికి సిల్వర్ స్టార్స్ వచ్చాయి. రీతూ, దివ్య, తనూజ, శ్రీజ, సంజన, భరణి, సుమన్ శెట్డి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ లకి సిల్వర్ స్టార్స్ వచ్చాయి.   ఫ్లోరా సైనీ, మాస్క్ మ్యాన్ హరీష్ కి బ్లాక్ స్టార్స్ వచ్చాయి. హౌస్ లో ఫ్లోరాకి సొంత నిర్ణయం అంటూ ఏం లేదు సంజనకి అసిస్టెంట్ గా ఉంటూ తన ఆట తను ఆడడం లేదని బ్లాక్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ ఎందులో ఇన్వాల్వ్ మెంట్ లేదు.. హౌస్ లో అన్ని వస్తువులు ఎలాగో.. నువ్వు అలాగే అని నాగార్జున చెప్పాడు. ఫ్లోరా, హరీష్ ఇద్దరికి బ్లాక్ స్టార్ వచ్చింది కనుక ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండడానికి అనర్హులు అని భావిస్తారో వాళ్ళ ఫోటోని క్రషర్ లో వెయ్యమని కంటెస్టెంట్స్ కి నాగార్జున చెప్తాడు.   దాంతో హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎక్కువగా ఫ్లోరా సైనీని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తనకి రెండు వారాలు ఎవరు నామినేషన్ చేయకున్నా డైరెక్ట్ నామినేషన్ లో ఉంటుందని నాగార్జున చెప్పాడు. దానికి ఫ్లోరా సరే అంటుంది. నిజానికి గత నాలుగు వారాలుగా ఫ్లోరా నామినేషన్ లో ఉంటూ వస్తుంది. ఈ వీక్ నామినేషన్ నుండి ఫ్లోరా సైనీ సేవ్ అవుతుందో లేదో చూడాలి మరి.  

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్.. తన లవ్ స్టోరీకి నాగార్జున ఫిదా!

  బిగ్ బాస్ సీజన్-9 అప్పుడే నాలుగో వీకెండ్ కి వచ్చేసింది. శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో జరిగిన సంఘటనలకి నాగార్జున కంటెస్టెంట్స్ కి కోటింగ్ ఇచ్చాడు. ఈ వారం పర్ఫామెన్స్ బాగా ఉన్నవాళ్ళకి గోల్డ్ స్టార్.. యావరేజ్ పర్ఫామెన్స్ ఉన్నవాళ్ళకి సిల్వర్ స్టార్.. పూర్ పర్ఫామెన్స్ ఉన్నవాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చాడు నాగార్జున.   ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. అల్ రౌండర్ ఇన్ ది బిగ్ బాస్ హౌస్.. నవ్విస్తావు.. ఆడుతావ్.. కరెక్ట్ మాట్లాడుతావని ఇమ్మాన్యుయేల్ ని నాగార్జున మెచ్చుకుంటాడు. నీ లవ్ స్టోరీ వింటే చాలా హార్ట్ టచింగ్ గా ఉంది.. నీ లవ్ లో జెన్యూన్ ఉంది కాబట్టి అక్కడున్న నువ్వు మిస్ అవుతున్నావని నాగార్జున అంటాడు. అవును సర్ చాలా గుర్తొస్తుంది. ప్లీజ్ ఒకసారి తను ఎలా ఉందో చెప్పండి సర్ అని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు.    బిగ్ బాస్ లో ఉన్న నిన్ను, యూఎస్ లో ఉన్నవాళ్ళు కూడా చూస్తున్నారు. దానికి తోడు ఇక్కడ ఉన్నవాళ్ళతో బిగ్ బాస్ గురించి డిస్కషన్ కూడా జరుగుతుందని నాగార్జున చెప్తాడు. నాలుగు వారాలలో ఆల్ రౌండర్ ఇమ్మాన్యుయల్  అనేది కరెక్ట్ నిర్ణయం. గోల్డ్ వచ్చిందని ఆగిపోకుండా ఇంకా ముందుకి సాగాలని నాగార్జున చెప్తాడు. హౌస్ లో ఉన్న పదమూడు మందిలో ఒక్క ఇమ్మాన్యుయేల్ కి మాత్రమే గోల్డ్ స్టార్ వచ్చింది.  

అది సూసైడ్ అటెంప్ట్ లాంటిది.. చిరంజీవి సెక్యూరిటీ నాతో చెప్పిన మాటకు...

మహేష్ విట్టా తెలుగువన్ ఫన్ బకెట్ వీడియోస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలో. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాడు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. అలాంటి మహేష్ విట్టా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.  "బిగ్ బాస్ నాకు చాలా నేర్పించింది. ఒకణ్ణి నమ్మి ఒక ప్రాజెక్ట్ మొత్తం చేతిలో పెడితే.. హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయి నాకు డబ్బులు ఇస్తేనే తిరిగి ఇస్తా అంటూ నన్నే రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేసాడు. నేను కొట్టాలనుకుంటే కొట్టొచ్చు నేను వెళ్లి. కానీ అప్పటికే వాడి హార్ట్ కి స్టంట్ పడింది. వాడికి ఏమన్నా ఐతే వాడి పేరెంట్స్ ని తర్వాత నేనేం చెప్పుకోవాలి అని వాడిని వదిలేసి మళ్ళీ డబ్బులు పెట్టుకుని నేనే ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నా. ఈ తత్వం నాకు బిగ్ బాస్ నేర్పించింది.  బిఫోర్ బిగ్ బాస్ ఐతే నేను వెళ్లి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని. కానీ బిగ్ బాస్ తర్వాత నేను ఒకటి నేర్చుకున్నా. ఓకే కూల్ ఆ పెంటను ఇంట్లోకి తెచ్చుకోకూడదు అని తెలిసింది. బిగ్ బాస్ నాకు ప్లస్ అయ్యింది. అప్పటివరకు నేను కామెడీ రోల్స్ చేసుకుంటూ ఉండేవాడిని.. అప్పుడప్పుడే ఎదుగుతున్న. అదంతా వదిలేసి బిగ్ బాస్ వెళ్లాను. ఒకరకంగా అది సూసైడ్ అటెంప్ట్ లాంటిదే. నేను ఆడియన్స్ కి నచ్చుతాను అంటూ చాలామంది చెప్పారు. రెండు వారాలు ఉంటే చాలు అనుకున్నా. ఏది అనుకుంటే అది ఆ టైములో ఐపోవాలి అనే టైపులో ఉండేవాడిని బిగ్ బాస్ కి వెళ్ళకముందు వరకు. కానీ బిగ్ బాస్ కి వెళ్ళాక తెలిసింది ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయడమే అని.  బిగ్ బాస్ లో మర్చిపోలేని మెమరీ అంటే ఫినాలే టైంలో చిరంజీవి గారు నన్ను పొగడడమే. అప్పుడనిపించింది ఇండస్ట్రీకి దేవుడు అనుకునే వ్యక్తి నన్ను పొగిడారు అది చాలు అనిపించింది. ఇండస్ట్రీ మొత్తం ఒక సైడ్ నేనొక సైడ్ అన్నట్టు అనిపించింది. చిరంజీవి గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు అని ఆయన సెక్యూరిటీ వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. అంటే చిరంజీవి గారి కంట్లో మా రిఫ్లెక్షన్ పడుతోంది అది చాలు అనిపించింది. కానీ ఆయన బిగ్ బాస్ కి వచ్చి మహేష్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే సరికి చాలా హ్యాపీ అనిపించింది" అంటూ మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు.  

Jayam Serial: రుద్రపై చెడుగా చెప్పిన వీరు.. ఆమెను శకుంతల బయటకి పంపిస్తుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -75 లో... వీరు దగ్గరకి ఇషిక వస్తుంది. నీకోక విషయం చెప్పాలని అంటుంది. రుద్ర అంటే మనకి ఇష్టం లేదు.. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి గంగని బయటకు గెంటేద్దామని చూస్తుంటే.. తను ఏకంగా ఈ ఇంటికి కోడలు అవ్వాలని చూస్తుందని, గంగ తనలో తాను మాట్లాడుకున్న విషయం వీరుకి చెప్పగానే అతను షాక్ అవుతాడు.   ఆ తర్వాత శంకుతల దగ్గరికి వీరు వచ్చి.. రుద్ర బావ మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. అందుకు గంగని వాడుకుంటున్నాడని వీరు చెప్తాడు. శకుంతలకి ఇంకా రుద్రపై కోపం కలిగేలా వీరు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు గంగని పంపిస్తానని చెప్పండి.. అందుకు రుద్ర అసలు ఒప్పుకోడు.. ఒప్పుకుంటే నేను చెప్పింది నమ్మకండి అని వీరు అంటాడు.    ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. మీరు కేక్ లో విషం కలిసిందని కంప్లైంట్ ఇచ్చారు కదా.. అందులో ఎవరో కావాలనే విషం కలిపారు.. బేకరిలో అది జరగలేదని పోలీసులు చెప్పి వెళ్తారు. మరి ఎవరు చేసి ఉంటారని పెద్దసారు అంటాడు.    ఇంట్లో వాళ్లే చేసి ఉంటారు.. ఈ మధ్య తప్పుని ఒప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని రుద్రను ఉద్దేశించి శకుంతల మాట్లాడుతుంది. నేను గంగని ఇంట్లో నుండి పంపించేస్తాను.. సేఫ్ ప్లేస్ లో పెడతానని శకుంతల అనగానే వద్దని రుద్ర అంటాడు.    తరువాయి భాగంలో చిట్టి, పారుకి పార్క్ లో గొడవ అవుతుంది. చిట్టి వెంటనే రుద్రకి ఫోన్ చేసి రమ్మంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu: శ్రీవల్లితో ఆడుకున్న ప్రేమ.. భయంతో వణికిపోయిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -281 లో... శ్రీవల్లి దగ్గరికి నర్మద వచ్చి.. మీ వాళ్ళు రేపు ప్రొద్దున వరకు ఇక్కడ ఉండాలి.. లేదంటే మీ భాగోతం మొత్తం మావయ్య గారి ముందు బయట పెడుతానని నర్మద అంటుంది. శ్రీవల్లి భయపడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యానికి ఫోన్ చేసి నర్మద చెప్పిందంతా చెప్తుంది. దాంతో ఆనందరావు టెన్షన్ పడతాడు.   మరొకవైపు ప్రేమ డ్రింక్ చేసి ఉంటుంది. తనని ముందు కూర్చోబెట్టుకొని బైక్ పై ధీరజ్ వస్తాడు. ఇంటికి వచ్చాక ప్రేమ ఊగుతూ మాట్లాడుతుంటే శ్రీవల్లి చూస్తుంది. ప్రేమ ఏంటి అలా మాట్లాడతుందని అడుగతుంది. ఒరేయ్ ధీరజ్ అది దెయ్యంరా అని శ్రీవల్లిని ప్రేమ అంటుంది. నన్ను దెయ్యం అంటావా అని శ్రీవల్లి కోప్పడుతుంది. శ్రీవల్లి లోపలికి వెళ్లి.. అమ్మ ప్రేమా తాగి డాన్స్ చేసావా.. నీ సంగతి మావయ్యకి చెప్తానని అనుకుంటుంది.    భలే దొరికావే నీ సంగతి చెప్తానని శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్తుంటే.. ప్రేమ హాల్లో కూర్చొని రారా అని చేతిలో కత్తి పట్టుకుంటుంది. అది చూసి శ్రీవల్లి భయపడుతుంది. శ్రీవల్లి చేత ప్రేమ డ్యాన్స్ చేపిస్తుంది. ఎక్కడ కత్తితో పొడుస్తుందోనని ప్రేమ చెప్పినట్లు శ్రీవల్లి చేస్తుంది. ఆ తర్వాత గాజు వక్కలు ఇచ్చి డ్యాన్స్ చెయ్యమని ప్రేమ చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: వేలంపాట నుండి ఆ ముగ్గురు అవుట్.. జ్యోత్స్న ప్లాన్ అదేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -480 లో... జ్యోత్స్న వేలంపాటకి వెళ్లడానికి రెడీ అయి వస్తుంది. ఎలాగైనా ఈ వేలంపాటలో నేనంటే ఏంటో తేలుస్తానని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దశరథ్, శివన్నారాయణ కూడా రెడీ అయి వస్తారు. అప్పుడే కార్తీక్, దీప కూడా వస్తారు. మమ్మీ నన్ను ఆశీర్వదించమని సుమిత్ర దగ్గర జ్యోత్స్న ఆశీర్వాదం తీసుకుంటుంది. కార్తీక్ పదా అని శివన్నారాయణ అనగానే బావ ఎందుకని జ్యోత్స్న అంటుంది. రావాలని శివన్నారాయణ అంటాడు. ఛా బావ ఎందుకు మధ్యలో అని జ్యోత్స్న చిరాకుపడుతుంది.    ఆ తర్వాత సుమిత్ర ఎదురువస్తుంటే అందరు వేలంపాటకి బయల్దేరతారు. అల్ ది బెస్ట్ బావ అని దీప చెప్తుంది. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందని పారిజాతం అనుకొని.. దీప దగ్గరికి వెళ్తుంది. ఏం చేయబోతున్నారు? ఏం చేసినా నా మనవరాలు విజయంతో తిరిగి వస్తుందని పారిజాతం అంటుంది. ఏదైనా సరే మంచి జరగాలని కోరుకునే మనిషిని అని దీప అంటుంది.    మరొకవైపు వేలంపాట దగ్గరికి ముందుగా దశరథ్, శివన్నారాయణ వెళ్తారు. అక్కడ దశరథ్ ఫ్రెండ్ వైరా ఎదరుపడతాడు. వైరా పలకరిస్తే నీలాంటి మోసగాడితో మాట్లాడనని దశరథ్ అంటాడు. ఈ వేలం పాటలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండని దశరథ్ తో వైరా అంటాడు.   ఆ తర్వాత వెనకాలే కార్తీక్, జ్యోత్స్న వస్తారు. హాయ్ జ్యోత్స్న నేను మీ డాడ్ ఫ్రెండ్ ని అని వైరా పరిచయం చేసుకుంటాడు. ఎలాగూ మీ రెస్టారెంట్ లాస్ లో ఉంది.. నాకు అమ్మండి ఇప్పుడు వేలంపాటలో కూడా ఓడిపోతారని వైరా అంటుంటే.. అది జరగదని జ్యోత్స్న అంటుంది. డాడ్ వాళ్ళు ఉంటే నేను అనుకున్నది జరగనివ్వరని.. జ్యోత్స్న తన మనిషి చేత దశరథ్ కి కాల్ చేయించి.. రెస్టారెంట్ లో ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు తనిఖీకి వచ్చారని చెప్పిస్తుంది. దశరథ్ వెళదామని అంటాడు. కార్తీక్ ని కూడా తీసుకొని వెళదామని శివన్నారాయణ అంటాడు. ముగ్గురు అక్కడ నుండి వెళ్తారు. జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది.    మరొకవైపు సుమిత్రకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. నాకు ఇష్టమైన వంట చెయ్ అని దీపతో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: బిడ్డ కోసం భర్తని వదులుకోవడానికి భార్య సిద్ధం.. సూపర్ ట్విస్ట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -843 లో... రాజ్ పై కావ్య కోప్పడుతుంది. రాజ్ జ్యూస్ లో టాబ్లెట్ కలిపాడని చెప్పబోతు ఆగిపోతుంది. ఏంటి ఆగిపోయావ్ నేను నిజంగానే జ్యూస్ లో టాబ్లెట్ కలిపాను.. ఇప్పుడు ఏం చేస్తావని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు.   నేను నీ భర్తగా చెప్తున్నాను.. నువ్వు ఆపరేషన్ కి ఒప్పుకోమని రాజ్ అంటాడు. మీరు ఏ అధికారంతో నా బిడ్డని వద్దని అంటున్నారు. మీకు ఈ బిడ్డ అడ్డు అయితే నేను మిమ్మల్ని వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. నాకు మీరు అవసరం లేదని కావ్య మాట్లాడుతుంటే అందరు షాక్ అవుతారు.    ఆ తర్వాత నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు.. రాజ్ అంటే ఎంత ఇష్టం.. వాడిని వదిలేసి విడాకులు ఇస్తా అంటున్నావేంటని కావ్యతో అపర్ణ అంటుంది. ఆయనని విడిచి నేను ఉండలేను.. ఏదో బెదిరిస్తున్నా అంతే.. అప్పుడయినా నిజం చెప్తాడని అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పు ఏడుస్తూ ఇదంతా మనవల్లే అని కళ్యాణ్ తో అంటుంది.   మరొకవైపు కోడలు గురించి సుభాష్ ఆలోచిస్తాడు. తనకి చెస్ట్ లో పెయిన్ గా ఉంటే అపర్ణ వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి.. ఎందుకు విడాకులు ఇస్తానంటున్నావని అడుగతుంది. ఇదంతా నాటకమని అప్పుకి కూడా తెలియొద్దని కావ్య అనుకుంటుంది.    తరువాయి భాగంలో అప్పు భోజనం చెయ్యడానికి రాదు.. కావ్య తిట్టింది అందుకే రావట్లేదని రుద్రాణి అనగానే కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg boss 9 telugu: నాలుగో వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వీక్ ఓటింగ్ ఎప్పటికప్పుడూ మారిపోతుంది. టాస్క్ లు, ఆర్గ్యుమెంట్ల కారణంగా కంటెస్టెంట్ల గ్రాఫ్ పెరుగుతుంది. కొంతమందిది తగ్గుతుంది. నాలుగో వారం నామినేషన్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. ముగ్గురు సెలబ్రిటీలు. ముగ్గురు కామనర్స్. సెలబ్రిటీలు సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి కాగా.. కామనర్స్ శ్రీజ దమ్ము, దివ్య నిఖిత, హరిత హరీష్. వీళ్లలో ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. సంజనకి ఓటింగ్ భారీగా పడుతోంది‌. ఎందుకంటే హౌస్ లో తను కంటెంట్ ఇస్తుంది. దొంగతనం పేరుతో తోటి హౌస్ మేట్స్ తో ఓ ఆట ఆడుకుంటుంది సంజన. అందుకే తనకి అత్యధికంగా ఇరవై ఒక్క శాతం ఓటింగ్ పడుతోంది. దమ్ము శ్రీజ, రీతు చౌదరికి కూడా ఓటింగ్ బాగానే ఉంది. టాస్క్ లో ఆడటంతో వీళ్ల ఓటింగ్ తారుమారైంది.  శ్రీజ 18 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉండగా.. రీతు 16 శాతం ఓట్లతో మూడో ప్లేస్ లో ఉంది. రీతూకు డీమాన్ పవన్ ఓటింగ్ కూడా కలిసొస్తుంది. దివ్య నిఖిత కూడా 16 శాతం ఓటింగ్ తో నాలుగో ప్లేస్ లో ఉంది. ఇక మిగిలింది హరిత హరీష్, ఫ్లోరా సైనీ. వీరిలో ఫ్లోరా సైనీకి ఓటింగ్ బాగుంది. కానీ కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన మాస్క్ మ్యాన్ హరీష్ కి తక్కువ ఓటింగ్ ఉంది. అతనే చివరి స్థానంలో ఉన్నాడు. అతనే ఈ వారం ఎలిమినేషన్ అయ్యేలా ఉన్నాడు. హౌస్ లో పెద్దగా ఎవరితో మాట్లాడకపోవడం వల్లే అతనికి స్క్రీన్ స్పేస్ లేదు. పైగా నెగెటివ్ గా మాట్లాడుతుండటం అతనికి పెద్ద మైనస్. దానివల్ల అతనికి ఓటింగ్ పడటం లేదు. మరి ఈ వారమ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : లవ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ అయిన ఇమ్మాన్యుయేల్!

  బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగో వారం ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం వెబ్ సిరీస్ టీమ్ వస్తారు. అందులో భాగం గా హౌస్ మేట్స్ లవ్ స్టోరీ ని షేర్ చేసుకోమని అడుగుతారు. ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీని మొట్టమొదటి సారిగా రివీల్ చేసాడు. నేను స్టాండింగ్ కామెడీ చేస్తున్నాను.. అవి చూసి ఒకమ్మాయి మెసేజ్ చేసింది.‌ పరిచయం అయింది.. నెంబర్ ఇచ్చింది. కానీ అప్పుడు నాకు ఎలాంటి ఫేమ్ లేదు. డబ్బు కూడా లేదు.. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే అని ఫిక్స్ అయ్యాను కానీ ఎప్పుడు తనని డైరెక్ట్ గా చూడలేదు.. ఒకసారి ఊరు వెళ్తున్న కార్ తీసుకొనిరా వెళ్తు మాట్లాడుకుందామని అంది. నేను ఫ్రెండ్ కార్ తీసుకొని వెళ్లినా ఫోర్ అవర్స్ చాలా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను షూటింగ్ అంటూ బిజీ అయిపోయి తనపై చిరాకు పడ్డాను. కానీ ఇప్పటివరకు తనకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు.. ప్రతి బర్త్ డే కి డ్రెస్ తీసుకుంటా కానీ అది వేసుకోదు.. పెళ్లి అయ్యాక వేసుకుంటా అంటది.. అన్నీ నా బీరువాలో ఉన్నాయి. కానీ ఇన్నిరోజులు నీపై చిరాకు పడ్డాను.. ఇప్పుడు తెలుస్తుంది. నేను ఎంత కోప్పడ్డా నాపై ప్రేమ చూపిస్తుంది. ఈ నవంబర్ కి తను పారెన్ వెళ్ళాలి.. కానీ నాకోసం ఆగిపోయింది.. నిన్ను ఎప్పుడు వదులుకోను వీలైతే ఫ్యామిలీ వీక్ అప్పుడు.. రా.... నీకోసం మాత్రమే ఆడుతున్నా.. కప్ కొట్టి నీ చేతిలో పెడుతానే.. రోజు అందరిని నవ్విస్తాను కానీ రాత్రి దుప్పటి కప్పుకొని ఎంత బాధపడుతానో నాకు తెలుసని ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీ చెప్తూ ఏడుస్తాడు.

Bigg boss 9 Telugu : నాలుగో వారం కెప్టెన్ గా రాము రాథోడ్!

  బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ గా రాము, రీతూ, ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. మిగతా హౌస్ మేట్స్ బజర్ మోగినప్పుడు ఎవరు ముందు వెళ్లి గంట కొడతారో వాళ్ళు రేన్(Rain) డ్యాన్స్ చేయాలి. ఆ లోపు కంటెండర్స్ ఒక టేబుల్ ని దానికి సంబంధించిన బాక్స్ లో సెట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే రేన్(Rain) డ్యాన్స్ చేసే వాళ్ళు కంటెడర్స్ నుండి ఒకరిని రేస్ నుండి తొలగించాలి. అలా ముందుగా గంట కొట్టింది డీమాన్ పవన్. తను రేన్ లో డ్యాన్స్ చేస్తాడు. ఆ లోపు ఎవరు టేబుల్ ని సెట్ చెయ్యలేదు. డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ ని రేస్ నుండి తొలగిస్తారు. ఆ తర్వాత శ్రీజ రేన్ డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ని తొలగిస్తుంది. ఆ తర్వాత భరణి గంటని ముందు కొట్టి రేన్ డ్యాన్స్ చేసి రీతూని ఎలిమినేట్ చేస్తాడు. ఇక మిగిలింది మాత్రం రాము రాథోడ్. ఇక నాలుగో వారం ఇంటి కెప్టెన్ గా రాము రాథోడ్ కెప్టెన్ బ్యాండ్ ధరిస్తాడు. ఇక కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు‌. ఫ్రెండ్ అనుకొని నమ్మాను కానీ ఇలా చేస్తావనుకోలేదు అని డీమాన్ పవన్ తో మాట్లాడాడు. కళ్యాణ్ ని తీసేయమని రీతూ చెప్పిందట.. నువ్వే తీసేయ్ అన్నావా అని రీతూ ని కళ్యాణ్ అడుగగా అవునని రీతూ అంటుంది. వెంటనే చెయ్ వదులు అని రీతూపై కళ్యాణ్ సీరియస్ అవుతాడు.

Karthika Deepam2 : కాశీని మోటివేట్ చేసిన శ్రీధర్.. కార్తీక్ నిజం చెప్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -479 లో..... కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నువ్వే కావాలని అత్తామామయ్యని విడగొడుతున్నావని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మరొకవైపు శ్రీధర్ వాళ్ళు అందరూ భోజనం చేస్తుంటే కార్తీక్ రిటర్న్ చెక్ ఇచ్చిన విషయం శ్రీధర్ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ.. ఒకరు ఇస్తే తీసుకోడని శ్రీధర్ అంటుంటే.. కాశీ తనని అంటున్నాడని ఫీల్ అయ్యి లేచి వెళ్తుంటాడు. కూర్చో అల్లుడు ఎందుకు అన్నింటికి ఫీల్ అవుతున్నావ్.. నిన్ను జాబ్ చెయ్ అనట్లేదు.. నీకు కావాల్సినంత టైమ్ తీసుకొ హ్యాపీగా ఉండు.. ఇలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వకని కాశీని శ్రీధర్ మోటివేషన్ చేస్తాడు. ఆ తర్వాత నేను బయటకు వెళ్తున్నానని చెప్పి శ్రీధర్ అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత కాంచనకి శ్రీధర్ చెక్ ఇస్తే కార్తీక్ తీసుకోలేదన్న విషయం తెలుస్తుంది. ఎందుకు తీసుకోలేదని కార్తీక్ ని కాంచన అడుగుతుంది. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పుడు నా కొడుకుపై నమ్మకం ఉంది అంటావ్.. మరి ఇప్పుడు ఏంటి అమ్మ ఇలా అంటున్నావని కార్తీక్ అంటాడు. నువ్వు ఆ ఇంట్లో పని చేయడం నాకు ఇష్టం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ని శ్రీధర్ బయటకు తీసుకొని వెళ్లి.. ఎందుకు నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నావని అడుగుతాడు. దీప ఋణం తీర్చుకోవడానికి అని కార్తీక్ అంటాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో నా మీద ఒట్టే చెప్పకపోతే అంటాడు. అలా ఏం వద్దు.. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని కార్తీక్ అంటాడు. కార్తీక్ వెళ్ళిపోయాక మీరు చెప్పరు.. నేనే తెలుసుకుంటానని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : బిడ్డ కోసం భర్తను వదలుకుంటానని చెప్పిన భార్య..రాజ్ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -842 లో..... కళ్యాణ్ ఇంటికి వచ్చి వదిన మీరు హాస్పిటల్ లో చూపించుకోలేదు కదా అంటాడు. నేను హాస్పిటల్ లో చూపించుకోలేదని నీకెలా తెలుసని కావ్య అడుగుతుంది. ఏదో క్యాజువల్ గా అన్నానని కళ్యాణ్ కవర్ చేస్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోయాక.. కళ్యాణ్ ఇది వరకు మాట్లాడిన మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. అవి గమనించిన కావ్యకి కళ్యాణ్  కి అన్ని తెలిసి ఉంటాయని అనుకుంటుంది. దాంగో అతన్ని అడగాలని వెళ్తుంది. కళ్యాణ్ దగ్గరికి కావ్య వస్తుంది. అసలేం జరుగుతుంది.. మీ అన్నయ్య ఎందుకు అబార్షన్ చేపిస్తానని అంటున్నాడని కావ్య అడుగగా కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. వెనకాల నుండి రాజ్ చూసి చెప్పొద్దని సైగ చేస్తాడు. దాంతో కళ్యాణ్ నాకు తెలియదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే రాజ్ వస్తాడు.. ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు.. అది కనుక్కుంటానని కావ్య అంటుంది. మరొక వైపు సుభాష్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉంది రమ్మని పిలుస్తాడు. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎందుకు బయటకుపోతున్నాయి కావ్యకి రాజ్ అబార్షన్ చేయించాలనుకున్నాడు అంట కదా అని అతను అనగానే సుభాష్, అపర్ణ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపాడని కావ్య అందరికి చెప్తుంది. నా బిడ్డ కోసం మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడ సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: ఇషిక ప్లాన్ అదే.. రుద్ర కోసం గంగ బాక్సింగ్ నేర్చుకుంటుందా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -74 లో.....రుద్రని ఉహించుకొని గంగ తనలో తాను మాట్లాడుకుంటుంది. ఆ పారుని మీరేలా లవ్ చేశారు.. పొగరుబోతు ది అది.. మీకు సెట్ అవదు నేను అయితే మీకు పర్ఫెక్ట్ సెట్ అని గంగ తనలో తనే మాట్లాడుకుంటుంది అదంతా ఇషిక విని షాక్ అవుతుంది. ఇంట్లోకి వచ్చి ఏకంగా ఇంటికి ఓనర్ అవ్వాలని కలలు కంటున్నావా గంగ అని ఇషిక అనుకుంటుంది. అసలు సర్ ఎక్కడ నేను ఎక్కడ అని గంగ అనుకుంటుంది. ఈ ఒక్క విషయం చాలు నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపడానికి కానీ పర్ఫెక్ట్ ప్లాన్ తో పంపిస్తానని ఇషిక అనుకుంటుంది. మరొకవైపు గంగ మాటలు గుర్తుచేసుకొని పారు నిద్ర పోకుండా ఆలోచిస్తూ బాక్సింగ్ చేస్తుంది. పారు వాళ్ళ అన్నయ్య వచ్చి ఏమైందని ఆడుగగా ఈ రోజు పార్క్ లో ఒకతి నాతో పొగరుగా మాట్లాడిందని చెప్తుంది. అవన్నీ ఏం ఆలోచించకుండా వెళ్లి పడుకోమని వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను మర్చిపోను రేపు మళ్ళీ పార్క్ కి వెళ్లి అదేవరో కనుక్కుంటానని పారు అనుకుంటుంది.  మరుసటి రోజు రుద్ర బాక్సింగ్ అకాడమీ నుండి కొందరు వస్తారు. చాలా థాంక్స్ మా ట్యాలెంట్ గుర్తించి మాకు ఛాన్స్ ఇచ్చారని వాళ్ళు అంటారు. అప్పుడే గంగ వస్తుంది. నేను బాక్సింగ్ నేర్చుకుంటే సర్ కి నచ్చుతాను అని అనుకొని నేను నేర్చుకుంటా అంటుంది. ఒకమ్మాయితో నువ్వు నాతో ఫైట్ చెయ్ అంటుంది. ఆ అమ్మాయి ఇచ్చిన ఒకటే పంచ్ కి కిందకిపడుతుంది గంగ. మాటలు మాట్లాడినంత ఈజీ కాదు వెళ్లి వంట చేసుకోమని రుద్ర అనగానే గంగకి కోపం వస్తుంది. ఎలాగైనా నేర్చుకుంటానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భాగ్యమే అసలు సూత్రధారి.. నర్మదకి తెలిసిన నిజం!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -280 లో.....ప్రేమ ఫొటోస్ గురించి ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసిందోనని కనుక్కోవడానికి తిరుపతిని భద్రవతి ఇంటికి పంపిస్తుంది నర్మద. మరొకవైపు ధీరజ్ వంక ఐశ్వర్య అలాగే చూస్తుంటే.. అది ప్రేమ చూసి కుళ్ళుకుంటుంది. ధీరజ్ ని డ్రింక్ చెయ్యమని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే నేను ప్రేమ వచ్చామురా మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కదా వద్దని ధీరజ్ అంటాడు. మరొకవైపు ప్రేమని తన ఫ్రెండ్స్ డ్రింక్ చెయ్యమని ఫోర్స్ చేస్తుంటే వద్దని అంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎదురింట్లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చావని అందరు కోప్పడతారు. మొన్న ప్రేమ విషయంలో వాళ్లకు సపోర్ట్ చేసావ్.. అలాంటి వాడికి ఇక్కడ ఏం పని అని భద్రవతి కోప్పడుతుంది. రామరాజు బావ ప్రేమ అలా వేరొకరితో ఫొటోస్ లో ఉన్నా కూడా ప్రేమని ఒక్క మాట కూడ అనలేదు. మీరే అనవసరంగా వచ్చి గొడవ చేసారని తిరుపతి అంటాడు. అనవసరంగా ఏం రాలేదు.. ఆధారం తోనే వచ్చామని విశ్వ అంటాడు. అలాంటి గొడవకి వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా అని తిరుపతి అంటాడు. మాకు వాళ్ళ వియ్యంకురాలు భాగ్యలక్ష్మి చెప్పిందని విశ్వ చెప్పగానే తిరుపతి షాక్ అవుతాడు.  ఆ తర్వాత నర్మద దగ్గరికి తిరుపతి వెళ్లి అక్కడ తెలుసుకున్న నిజం చెప్తాడు. దాంతో నర్మద కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమకి తన ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు ఇస్తారు. ధీరజ్ తో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే ప్రేమ చూడలేక కోపంగా ఐశ్వర్యని పక్కకి లాగి తను ధీరజ్ తో డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్ళను...

షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్ళాడు. ఇక హౌస్ లో షణ్ముఖ్ జశ్వంత్ కలిపిన పులిహోర మాములుగా లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఒక ప్రశ్న అడిగారు. "బిగ్ బాస్ లోకి మళ్ళీ పిలిస్తే వెళ్తారా" అని. అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఇలా చెప్పాడు. "కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని కొన్ని పనులు చేయను అందులో బిగ్ బాస్ కి అవకాశం వచ్చినా వెళ్ళను. లేదు అస్సలు వెళ్ళను. మొదటిసారి నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి రాను అనే చెప్పాను. దాదాపు 7 మీటింగ్స్ అయ్యాయి వాళ్ళు చాలా కన్విన్స్ చేశారు.  బిగ్ బాస్ తర్వాత నాతోనే సినిమా అని కూడా అన్నారు. ఇక సినిమా అనే మాట వినేసరికి నేను వెళ్లాలనుకున్నాను. లేకపోతె వెళ్ళేవాడిని కాను. ఎందుకంటే నేను ఆ షోకి పర్ఫెక్ట్ కాదు అన్న విషయం నాకు తెలుసు. నేను ఎంటర్టైనర్ ని కాను. యాక్షన్, కట్ అంతే నాకు తెలుసు. ఇంకో సారి బిగ్ బాస్ అవకాశం వస్తే నేను వెళ్ళను. ఆ షో ఇంట్రావర్ట్స్ కి, యాక్టర్స్ కి కాదు. ఆ షో కంటిన్యుయస్ గా ఎంటర్టైన్ చేసేవాళ్లకు మాత్రమే. హౌస్ లో అన్ని రోజులూ ఎంటర్టైన్ చేయడం ఎవరూ చేయలేరు కూడా." అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఎదురయ్యింది. "బిగ్ బాస్ వరమా, శాపమా" అని అడిగారు. "బిగ్ బాస్ కి వెళ్లడమే రాంగ్ స్టెప్. అది నాకు వరమూ కాదు అలాగని శాపం అని చెప్పి నేను చేసినదాన్ని వేరే వాళ్ళ మీదకు తోసేయలేను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చూస్తే అక్కడ నా కోసం కాదు మిగతా వాళ్ళ కోసం గొడవ పడి రెచ్చిపోయాను. నాగ్ సర్ ని నేను ఎంత ఇష్టమో వీకెండ్స్ లో కనిపించేది. ఆయనతోనే నేను కొంచెం ఫన్నీగా ఉండేవాడిని. నేను బిగ్ బాస్ కి వెళ్లడం రిగ్రెట్ లా ఫీల్ కావట్లేదు దాని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బిగ్ బాస్ కి ముందు నాకు ఏమీ తెలీదు. కానీ అక్కడికి వెళ్లొచ్చాక నన్ను నేను ఎలా ట్యూన్ చేసుకోవాలో తెలిసింది." అని బిగ్ బాస్ గురించి షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చాడు.

ఇంట్లో హీరో శ్రీకాంత్  పరిస్థితి...ఊహ ఏం చెప్పిందంటే!

  సిల్వర్ స్క్రీన్ మీద శ్రీకాంత్ ఎంత అందాల నటుడో ఊహ కూడా అంత కంటే అందాల నటి. ఆమె అందం ఒక పక్కన ఆమె పిల్లికళ్ళు మరో పక్కన వెరసి ఆమెకు ఒకప్పుడు బాయ్ ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. "ఆమె" మూవీ ఊహ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా. ఆమె ఎన్నో మూవీస్ లో నటించారు. ఆమె పేరుతో వచ్చిన "ఊహ" మూవీ కూడా అప్పట్లో హిట్ కొట్టింది. అలాగే ఆమె "అమ్మ నాగమ్మ" అనే మూవీలో ఆ తర్వాత ఊహా చిత్రం అనే మూవీస్ లో నటించారు. ఇక శ్రీకాంత్ కూడా ఎన్నో మూవీస్ లో నటించాడు. "పెళ్ళిసందడి, మహాత్మా, కోట బొమ్మాలి, శంకర్ దాదా ఎంబిబిఎస్" ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించారు. ఇక రీసెంట్ గా ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 ప్రోమోలో కనిపించరు. రాగానే శ్రీకాంత్ శ్రీముఖితో డాన్స్ చేసాడు. "నాకే టెన్షన్ లేదు శ్రీముఖి నా పక్కన ఉందిగా అంతా తనే చూసుకుంటుంది" అన్నాడు. తర్వాత శ్రీకాంత్ కళ్ళకు గంతలు కట్టింది. కొంతమంది అమ్మాయిల్ని పెట్టింది. అలాగే హీరోయిన్ ఊహను స్టేజి మీదకు సైలెంట్ గా తీసుకొచ్చింది. "మీ అసలైన సౌందర్య లహరి ఎవరో టచ్ చేసి చెప్పాలి" అని శ్రీకాంత్ కి టాస్క్ ఇచ్చింది. "అది ఏదన్నా పొరపాటు జరిగితే ఇంటికి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అన్నాడు. ఇక హోస్ట్ ప్రదీప్ చేతిని పట్టుకుని ఏయ్ ఏందయ్యా ఇది అన్నాడు శ్రీకాంత్ తర్వాత ఊహ చేతికున్న వ్వాచ్ పట్టుకుని పైకి లేపాడు. అలాగే ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఒకవేళా ఆయన కనిపెట్టకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి" అంటూ శ్రీకాంత్ గురించి ఊహను అడిగింది శ్రీముఖి. "ఇంటికి వెళ్ళాక ఉండేది" అని చెప్పింది ఊహ. దాంతో శ్రీకాంత్ హెయిర్ సర్దుకున్నాడు. శ్రీముఖి గట్టిగా నవ్వింది.

శ్రీముఖి తనకు కాబోయే భర్త గురించి ఏమి చెప్పిదంటే?

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ అచ్చంగా #singles పేరుతో తీసుకొచ్చారు. ఇక ఇందులో గుప్పెడంత మనసు రిషి సర్, ఆరియానా, అన్షు రెడ్డి, రోహిణి, శ్రీకర్ కృష్ణ, అర్జున్ కళ్యాణ్, భానుశ్రీ వంటి వాళ్లంతా ఈ ఎపిసోడ్ లో  ఉన్నారు. అబ్బాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలు కావాలో అమ్మాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలో కావాలో చెప్పుకుంటూ ఉంటే బ్యాక్ స్క్రీన్ మీద వాళ్ళ వాళ్ళ ఫొటోస్ వస్తూ ఉన్నాయి. ఇక శ్రీముఖి తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో చెప్పింది. "నాకన్నా హైట్ కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయి కావాలి." ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఒక అబ్బాయి ఫోటో వచ్చింది. దాంతో శ్రీముఖి "గర్ల్స్ నాకు సిగ్గేస్తోంది. మీరు మీ బావను చూస్తున్నారా" అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని తెగ సిగ్గుపడిపోయింది. "ఈ మధ్య నేను కొంచెం స్పిరిట్యుయల్ ఐపోయాను. నాతో పాటు గిరి ప్రదక్షిణలు చేసేవాడు కావాలయ్యా. ఓ మై గాడ్ షో మీ మై పిల్లల డాడ్. రారా రాజా" అని తెగ అరుస్తూ సందడి చేసింది. ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ హరి ఫుల్ ఫోటో పడింది. అంతే శ్రీముఖి, హరి, రోహిణి స్టేజి మీద ఉన్న వాళ్లంతా షాకయ్యారు. ఇక "బావొచ్చాడోయమ్మా బావొచ్చాడు" అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యింది. ఇక స్టేజి మీద నుంచి శ్రీముఖి పారిపోతూ కిందకి వచ్చేసింది. ఇక హరి అని తెలిసేసరికి శ్రీముఖి మళ్ళీ స్టేజి మీదకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది. వెంటనే హరి పక్కకొచ్చి "అమ్మగారు నిజంగా మీ మనసులో నేనున్నానా" అని ఆశ్చర్యంతో అడిగాడు. దాంతో శ్రీముఖి ఇంకా గొంతు పెంచేసి "నాకు అన్యాయం జరిగిపోయిందక్కో" అంటూ శోకాండాలు పెట్టింది.

నేనొక బ్యాట్స్ మెన్ ని... క్రికెటర్ ని అయ్యేవాడిని...

  ఒకప్పుడు తరుణ్ అంటే చాలు ముందుగా గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369 . అమ్రిష్ పురి, బాలకృష్ణ వంటి లెజెండ్స్ తో చిన్న వయసులోనే నటించేసాడు. ఆ తర్వాత యంగ్ ఏజ్ లోకి వచ్చింది "నువ్వే కావాలి" మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఎన్నో మూవీస్ చేసాడు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా దూరమైపోయాడు. ఇక ఇన్నాళ్లకు పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు షోకి వచ్చాడు. అలాగే పూర్ణ పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. ఆమె కూడా ఈ షోకి వచ్చింది. ఐతే ఆమె ఒక విషయం అడిగింది. "తరుణ్ గారు యాక్టర్ కాకపోయి ఉంటే ఎం అయ్యేవారు" అంటూ అడిగింది పూర్ణ. శ్రీముఖి కూడా అడిగింది. "తరుణ్ గారు మీరు హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అని పూర్ణ గారికి తెలుసుకోవాలని ఉంది" అని చెప్పింది. "అసలు హీరో అవ్వాలనే ఐడియానే లేదండి నాకు. నేను క్రికెటర్ ని అవుదామనుకున్నా. అనుకోకుండా ఈటీవీ వాళ్ళ ఉష కిరణ్ మూవీస్ నుంచి నువ్వే కావాలి మూవీ ఆఫర్ వచ్చింది. దాంతో క్రికెట్ వదిలేసి హీరో అయ్యాను." అని చెప్పాడు తరుణ్. ఇక ఈ షోకి ఆదితో కలిసి జంటగా వచ్చిన సౌమ్య ఐతే "సర్ మీరు క్రికెటర్ ఐతే మీరు బౌలింగ్ చేయకుండా ముందే అన్ని వికెట్స్ వదిలేస్తారు" అని చెప్పేసరికి "లేదండి నేను బ్యాట్స్ మెన్ ని" అని చెప్పాడు తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తరుణ్ నటించిన చిన్నపిల్లలా మూవీ అంజలి అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు.

నేను యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాడిని 

పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు పేరుతో ప్రసారమైన దసరా ఈవెంట్ అందరినీ అలరించింది. ఇందులో ఒక స్కిట్ చేశారు డ్రామా జూనియర్స్ లోని కొంతమంది పిల్లలు. ఆర్టిస్టులు కాకపోయి ఉంటే లైఫ్ లో ఇంకేం అయ్యేవాళ్ళు అంటూ.. అందులో ఒక కుర్రాడు ఆది పోస్టర్ వేసుకుని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా వచ్చాడు. ఒక చిన్నారి పూర్ణ పోస్టర్ వేసుకుని డాన్స్ టీచర్ ల వచ్చింది. ఇంకో కుర్రాడు రాంప్రసాద్ పోస్టర్ తో మెడికల్ షాప్ ఓనర్ లా వచ్చాడు. ఇంకో చిన్నారి సుహాసిని పోస్టర్ తో డాక్టర్ డ్రెస్ లో వచ్చింది. ఇక శ్రీముఖి ఒక్కొక్కరి ప్రొఫెషన్ గురించి అడిగి తెలుసుకుంది. "ఒకవేళా ఇలా యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళ" అని ఆదిని అడిగింది శ్రీముఖి. "అవును నేను బిటెక్ కంప్లీట్ చేసి ఒక రెండు నెలలు ట్రై చేసాను. వాళ్లేమో ఒక చోటే కూర్చోమన్నారు. నాకేమో ఒక చోట కూర్చోవడం ఇష్టం లేదు. ఇక్కడంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. కానీ అక్కడా అలా ఏమీ మాట్లాడలేనుగా" అన్నాడు. "సుహాసిని నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదానివన్నమాట ఇలాగా" అని శ్రీముఖి అనేసరికి "అవును నాకు ఇంజక్షన్ చేయడం అంటే ఇష్టం" అని చెప్పింది. తర్వాత ఎంబిబిఎస్ అంటే ఏంటి అని శ్రీముఖి అడిగేసరికి చెప్పలేకపోయింది సుహాసిని. "మిస్టర్ రాంప్రసాద్ మీరేంటి మెడికల్ షాప్ ఏంటి" అని శ్రీముఖి అడిగేసరికి "నేను ఇండస్ట్రీలోకి రాకముందు మెడికల్ లో ఉండేవాడిని ఒక షాప్ కూడా ఉంది నాకు., ఇక్కడ చేస్తూ అక్కడ షాప్ చూసుకునేవాడిని. ఇక్కడ బాగుండేసరికి అది వదిలేసి వచ్చాను. చాలామంది ప్రాణాలు కాపాడాను" అని చెప్పాడు.