కార్తీక్, దీపలను కలసిన హిమ, శౌర్య!

'కార్తీకదీపం' సీరియల్ స్టార్ మా టీవి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంగళవారం జరిగిన ఎపిసోడ్‌-1558 లో హిమ,  శౌర్యలు పడిపోతుండగా కార్తీక్ వచ్చి ఇద్దరిని పట్టుకుంటాడు. ఇద్దరూ కార్తీక్ ని చూసి ఎమోషనల్ అవుతారు. ఏడుస్తారు.. కార్తీక్ ఇద్దరిని ఎత్తుకొని ఏడుస్తాడు.  "డాడీ ఎక్కడున్నావ్? ఎన్ని రోజులుగా వెతుకుతున్నామో తెలుసా డాడీ" అని హిమ అడుగుతుంది. "అమ్మ ఎక్కడ డాడీ" అంటూ ఇద్దరు అడుగుతారు. "మీరు మొన్న నాకు కన్పించారు. నేను పిలుస్తూ మీ వెనకే వచ్చాను. మీరు చూడలేదా నాన్న" అని హిమ అంటుంది. "హిమ చెప్పినా.. నేను నమ్మలేదు నాన్న.  మీరు చూసే తప్పించుకొని తిరుగుతున్నారా నాన్న. మమ్మల్ని అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి నాన్న" అని ఇద్దరు అడుగుతారు. "మీరు వెళ్ళండమ్మా.. అమ్మని మీ దగ్గరికి తీసుకొస్తాను" అని కార్తిక్ చెప్తాడు. "తప్పకుండా వెళ్తాం. కానీ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి" అని హిమ అంటుంది. సౌందర్యని చేయి పట్టుకొని తీసుకొస్తుంది దీప. "మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమ్మా.. నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళు" అని దీపతో అంటుంది సౌందర్య. అంతలోనే దీప, సౌందర్య ఇద్దరు ఒకవైపు, కార్తీక్, హిమ, శౌర్యలు మరొకవైపు.. ఇలా ఒకరికొకరు ఎదురు పడుతారు. సౌందర్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కార్తీక్ ని పట్టుకొని ఏడుస్తుంది సౌందర్య. "ఎక్కడికెళ్లావ్ పెద్దోడా.. మాకు దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు. మీరు మాతో కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంత కాలం ఈ సంతోషం మాకెందుకు దూరం చేశారు" అని సౌందర్య అంటుంది. "మమ్మల్ని వదిలి మళ్ళీ వెళ్ళిపోతారా?" అని కార్తీక్ ని గట్టిగ పట్టుకొని ఉంటుంది హిమ. "లేదమ్మా.. ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు. మీతోనే" అని కార్తిక్ చెప్తాడు. "ఒకసారి మా స్థానంలో ఉండి చూడండి. మీకు దూరంగా ఉండి ఎంత నరకం అనుభవిస్తున్నామో తెలుస్తుంది. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అంతా నాకు తెలియాలి" అని సౌందర్య అంటుంది. అందరూ కలసి కార్తిక్, దీపలు ఉండే ఇంటికి బయల్దేరి వస్తుంటారు. మరోవైపు కార్తీక్, దీప ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటికి మోనిత వస్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి, ఆ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తుంది. తినడానికి ఏమైనా ఉందా అని ఇల్లంతా చూసి దోశలు వేసుకుంటుంది. అప్పుడే కార్తీక్, దీప, సౌందర్య, హిమ, శౌర్యలు వాళ్ళింటికి వస్తారు. తాళం పగులగొట్టడం గమనిస్తాడు కార్తీక్. "తాళం ఎవరు తీశారు" అని అంటూ అందరూ లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్లేసరికి దోశ తింటున్న మోనితని చూసి షాక్ అవుతారు.  "ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావ్ వెళ్ళు" అని దీప అంటుంది. "నా కొడుకు కోడలు మాకు దూరంగా ఉండడానికి కారణం నువ్వేనా?" అని సౌందర్య అంటుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రంగుల ప్రపంచం చూపించిన వసుధార ఇలా చేస్తుందనుకోలేదు.!

'గుప్పెడంత మనసు' సీరియల్.. ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతోంది. అయితే మంగళవారం జరిగిన ఎపిసోడ్-656 లో "రిషి ఎక్కడున్నాడు" అని జగతిని అడుగుతుంటుంది దేవయాని. అప్పుడే రిషి ఇంటికొస్తాడు. రిషిని చూసిన‌ దేవయాని ఎమోషనల్ అవుతుంది. "రిషి ఎక్కడికెళ్లావ్? ఇలా అయిపోయావ్ ఏంటి. ఏమైనా తిన్నావా? లేదా" అని దేవయాని అడుగుతుంది. రిషి మౌనంగా ఉంటాడు. అక్కడే ఉన్న మహేంద్ర కూడా "ఎక్కడున్నావ్ రిషి? ఎక్కడికెళ్లావ్?" అని అడుగుతాడు. "ఉన్నాను కదా డాడీ" అని రిషి చెప్తాడు. "ఏంటీ రిషి? ఏం మాట్లాడుతున్నావ్? " అని జగతి అడుగుతుంది. "వద్దు మేడం. నాకు ఇది అలవాటు అయింది. అందరూ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. ఒకరు బాల్యం లేకుండా చేసారు. ఇంకొకరు జీవితాంతం తోడుంటానని చెప్పి స్వార్థం చూపించారు. ఆ స్వార్థం పేరే సాక్షి. ఆ తర్వాత మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొచ్చి పరిచయం చేశారు. అప్పుడు మనసులో మీకు థాంక్స్ చెప్పుకున్నా. ఇప్పుడు నాకు మంచి గుణపాఠం చెప్పింది. థాంక్స్ మేడం" అని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు. మరో వైపు రిషి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటుంది వసుధార. "మీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా సర్" అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దేవయానిని పిలిచి "రిషి లేచాడా" అని రిషి పెద్దనాన్న అడుగుతాడు. "రిషి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు" అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఆ తర్వాత రిషి దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. రిషి రూంలోకి వెళ్ళి చూస్తే రిషి కింద పడుకొని ఉంటాడు. రిషి అలా కిందపడుకోవడం చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. "రిషి.. ఏంటీ నాన్న ఇక్కడ పడుకున్నావ్" అని మహేంద్ర అడుగుతాడు. "ప్రేమిస్తే ఇంత బాధగా ఉంటుందా డాడి. ప్రేమిస్తే బాధ ఉంటుందని.. ప్రేమించడం మానేస్తే, అది ప్రేమ ఎలా అవుతుంది డాడీ.  వసుధార గురించి ఆలోచించి.. ఆలోచించి అలసిపోయాను డాడీ. సాక్షి వెళ్ళాక నా జీవితం శూన్యం అయింది. వసుధార వచ్చాక రంగుల ప్రపంచం చూపించింది. ఇప్పుడు ఇలా చేస్తుందని అనుకోలేదు డాడి" అని రిషి ఏడుస్తాడు. ఆ తర్వాత దేవయానికి రాజీవ్ కాల్ చేసి వసుధారకి "బెయిల్ ఇప్పించండి" అని అడుగుతాడు. "నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్లేసరికి లాయర్ గారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తారు" అని దేవయాని చెప్తుంది. "ఒకే మేడం"అని రాజీవ్ కాల్ కట్ చేస్తాడు. వసుధారని లాయర్ బెయిల్ మీద బయటికి విడిపిస్తాడు. వసుధార, రాజీవ్ బయటకొస్తారు. "పదా వసుధార.. మీ అమ్మనాన్న దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ముందే పెళ్లి చేసుకుందాం" అని రాజీవ్ అంటాడు."నాకు పెళ్లి అయింది " అని చెప్తుంది వసుధార. "ఆ తాళి ఎవరూ కట్టలేదని, నాకు తెలుసు" అని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రొమాంటిక్ డాన్స్ చేసిన మానస్-విష్ణుప్రియ!

బుల్లితెర షోస్ మాములుగా ఉండడం లేదు. మంచి జోష్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ఈవెంట్ బుల్లితెర మీద ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ప్రోమో చూస్తే గనక మంచి హీట్ పుట్టించే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు విష్ణుప్రియ, మానస్. విష్ణుప్రియ ‘పోరాపోవే’ షోతో యాంకర్ గా మారింది. తర్వాత ‘ వాంటెడ్ పండుగాడ్’ అనే మూవీలో  ఓ హీరోయిన్ గా చేసింది.  రీసెంట్ గా  ‘జరీ జరీ పంచె కట్టి’ అంటూ బిగ్ బాస్ మానస్ తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసింది. అది సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. దీంతో విష్ణుప్రియ-మానస్ జంటను మెయిన్ కాన్సెప్ట్ గా సెలెక్ట్ చేసుకుని సంక్రాంతి షో ప్లాన్ చేశారు మేకర్స్. వీళ్లకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాక స్టేజి మీదకు  విష్ణుప్రియ తరఫు బంధువులు, మానస్ తరఫు బంధువులు రావడం వాళ్ళ  పెళ్లి కోసం జరిగే హంగామా మొత్తాన్ని చూపించబోతున్నారు. ఇక వీళ్ళిద్దరూ ‘ఈ వర్షం సాక్షిగా’ అనే పాటకు చేసిన డాన్స్ లో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.  ఈ సాంగ్ ఐపోయాక అర్జున్ అంబటి వచ్చి "పెళ్ళికి ముందే ఇంత చేశారు అంటే ఇక పెళ్లి తర్వాత ఎంత చేస్తారో ఊహించుకుంటే ఆ" అని నవ్వుతాడు. తర్వాత అన్నపూర్ణ, సుధా, రజిత  వచ్చి "ఆది ఇక నుంచి జబర్దస్త్ కి ఇక నుంచి మేమే టీం లీడర్స్ అని కామెడీగా చెప్పేసరికి "ఇంతకు మీ టీం పేరేంటి" అని ఆది అడిగాడు. "అదరగొట్టే అన్నపూర్ణ, సూపర్ సుధా, రైజింగ్ రజిత" అనే చెప్పేసరికి "అవి అస్సలు మీకు సెట్ కాలేదు..అల్సర్ అన్నపూర్ణ, షుగర్ సుధా, రక్తపోటు రజిత" అనేవైతే సెట్ అవుతాయి అనేసరికి అందరూ నవ్వేశారు.  

చిరు లక్ష్మణరేఖనైనా దాటుతారు కానీ సురేఖను దాటి ఏదీ చేయరు!

సంక్రాంతి సందర్భంగా 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తన ఫాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వడానికి చిరు రెడీ అయ్యారు. ఫస్ట్ టైం ఒక గేమ్ షోలో అదే "సుమా అడ్డా"లో కనిపించి అలరించబోతున్నారు. ఫేమస్ యాంకర్ సుమ రీసెంట్ గా స్టార్ట్ చేసిన గేమ్ షోకు చిరు గెస్ట్‌గా వెళ్లారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.   ఈ రాబోయే ఎపిసోడ్ లో సుమతో మెగాస్టార్ చేసిన సందడి వేరే లెవెల్ అన్నమాట. చిరుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఐతే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సంతోష్ శోభన్ టీ‌మ్‌ వచ్చి ఫుల్ కామెడీ చేసి వెళ్ళింది. సెకండ్ ఎపిసో‌డ్‌కు మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ గెస్ట్‌ గా వచ్చారు. గతంలో ఆహాలో ప్రసారమైన సమంత చాట్ షోకి చిరు వచ్చారు. కానీ తొలిసారిగా చిరు హాజరైన గేమ్ షో ఇదే.   'వాల్తేర్ వీరయ్య' మూవీ  సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ గేమ్ షోలో సుమ హడావిడి మాములుగా లేదు.. చిరు చేయి చూస్తూ "ఈ రేఖల్లో ఏ రేఖ అంటే మీకు భయం" అని విద్యుల్లేఖా రామన్ అడిగేసరికి "ఆయన లక్ష్మణ రేఖనైనా దాటతారు కానీ సురేఖను దాటి రారు" అని సుమ కౌంటర్ వేసింది. దానికి చిరు పడీ పడీ నవ్వేశారు.  ఇక ఈ షోలో వెన్నెల కిషోర్ కూడా తనదైన స్టయిల్లో కామెడీ చేసి ఎంటర్టైన్ చేశారు. మరి ఈ రాబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే . వాల్తేరు వీర‌య్య‌పై ఆడియన్స్ లో  భారీ అంచ‌నాలున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరు  ప‌క్కా మాస్ లుక్‌లో కనిపించబోతున్న  మూవీ ఇది.

బీబీ జోడిలో కౌశల్..తేజస్వితో మొదలైన పాత గొడవలు

బీబీ జోడి ప్రతీ వారం సరికొత్త డ్యాన్సస్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే  ఇప్పుడు బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ని కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.. భానుశ్రీ-రవికృష్ణ, అఖిల్-తేజస్వి, అవినాష్-అరియానా, ఆర్జే సూర్య-ఫైమా, వాసంతి-అర్జున్ కళ్యాణ్ ఇలా ఇప్పటివరకు కొన్ని జంటలు డాన్సులు చేస్తూ వస్తున్నాయి. మెహబూబ్‌కి జోడీగా అషు ఇలా కనిపించి అలా ఫారెన్ ట్రిప్ కి వెళ్లిపోయేసరికి అతను సింగిల్ ఐపోయాడు. సైడ్ డాన్సర్‌తో  మెహబూబ్ డాన్స్ చేస్తుంటే.. జడ్జెస్ తరుణ్, రాధ, సదా ఒప్పుకోకపోయేసరికి.. ఈసారి సీజన్ 6 ఫైనలిస్ట్ శ్రీసత్యని తీసుకొచ్చి ఆమెతో స్టెప్‌లు వేసాడు మెహబూబ్. అలాగే మరో రెండు జోడీలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. సీజన్ 6 మిస్టర్ పర్ఫెక్ట్ రోహిత్, తన భార్య మెరీనాతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు.  ఫైనల్ గా సీజన్ 2 విన్నర్.. కౌశల్, అభినయశ్రీతో కలిసి జోడీగా వచ్చాడు. రావడంతోనే తేజస్వికి, కౌశల్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఉన్న అన్ని జోడీస్ లో మెహబూబ్ తర్వాత కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తున్న జంట అఖిల్-తేజస్వి. వాళ్ళు రంగస్థలం మూవీలోని సాంగ్ కి డాన్స్ చేశారు..ఐతే  కౌశల్ వాళ్లకి 5 మార్కులు ఇచ్చి తానే పాత గొడవల్ని మళ్ళీ పైకే తవ్వుకొచ్చాడు. " బిగ్ బాస్‌లో నీకు నాకు పడలేదు.. నువ్వు వెళ్లిపోయావ్.. దాన్ని నేను మనసులో పెట్టుకుని ఇది చేస్తున్నానని అనుకోవద్దు’ అని కౌశల్ అనేసరికి.. ‘అది అసలు నాకు గుర్తే లేదు కౌశల్’ అని పరువు తీసేసింది తేజస్వి. కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ గెలిచేంతవరకూ మంచి పేరే ఉంది కానీ.. బయటకు వచ్చాకే అసలు కౌశల్ అంటే ఏమిటో అందరికీ తెలిసింది.  బిగ్ బాస్ హౌస్ లో గెలిస్తే ఆ వచ్చే ప్రైజ్ మనీ మొత్తం క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇస్తానని చెప్పాడు కానీ అలా చేయలేదు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికి బిగ్ బాస్ జోడీలో కనిపించి.. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మళ్ళీ అలాంటి గొడవలనే స్టార్ట్ చేసాడు.  ఇక బిగ్ బాస్ పులిహోర రాజా అఖిల్‌ మీద అద్దిరిపోయే పంచ్ వేసింది సదా. కౌశల్‌ని చూసాక అఖిల్ మళ్లీ రన్నరప్ అవుతానేమో అనుకుంటున్నాడు మనసులో అని చెప్పేసరికి అఖిల్ ముఖం వాడిపోయింది. ఇక ఇలా రేపు సంక్రాంతి నాడు ఈ ఎపిసోడ్ రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  

కార్ కొనిస్తే పెళ్లి చేసుకుంటా..నిఖిల్ విజయేంద్ర సింహ వెరైటీ ప్రొపోజల్

నితిన్, నిత్యామీనన్ నటించిన ఇష్క్ మూవీ చూసే వుంటారు మీరంతా..అందులో స్టార్టింగ్ లో ఆటోలో వెళ్తున్న నిత్యా మీనన్ ఒక చోట రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ పక్కన జ్యువెలరీ బ్యాంగిల్స్ ఉన్న ఒక హోర్డింగ్ చూస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఈ  బ్యాంగిల్స్ ని ఎవరు కొనిస్తారో వాళ్లనే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. ఈ సీన్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది కదా .  ఇక ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ గురించి అందరికీ తెలుసు. సెలెబ్స్ ని తీసుకొచ్చి "నిఖిల్ తో నాటకాలు" అనే షో చేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు మూవీ ప్రొమోషన్స్ లో కనిపిస్తూ ఉంటాడు..బుల్లితెర ఈవెంట్స్ కి వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది మంచి మంచి కాస్ట్లీ కార్ ఫోటో అన్నమాట. " ఎవరైతే ఈ కార్ ని నాకోసం కొనిపెడతారో నేను వాళ్లనే పెళ్లి చేసుకుంటా"...అని ఇంగ్లీష్ లో చెప్పాడు. గీతంలో బి.కామ్ ఆనర్స్ చేసిన నిఖిల్ ని వాళ్ళ అమ్మకు ఎంటర్టైన్మెంట్ రంగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే తనకు చిన్నప్పటి నుంచి సంగీతం, డాన్స్ అన్నీ నేర్పించింది. అలా నిఖిల్  స్కూల్లో, కాలేజీలో ఎక్స్ట్రా కరిక్యూలర్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడట. గీతంకి వచ్చాక అన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసేవాడు నిఖిల్.  మరి ఇప్పుడు ఈ కార్ ని ఏ అమ్మాయి కొనిపెడుతుందో..మరి నిఖిల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.

మురారిని సస్పెన్షన్ చేసినందుకు సారీ చెప్పిన కమీషనర్.!

'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధారావాహిక. ఈ సీరియల్ ఎపిసోడ్‌-49లో కృష్ణతో మాట్లాడటానికి వాళ్ళ అత్తయ్య రేవతి వస్తుంది. "నిన్ను ఒక విషయం అడగాలి కృష్ణ.. మురారిని ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా? నీ మూలంగా నీ భర్త ఉద్యోగం పోయేలా ఉన్నా నీకు బాధ లేదా? అందరూ బాధపడుతున్నారు. మరి నువ్వు ఎందుకమ్మా ఇలా ఉన్నావ్? మా అందరికన్నా ఎక్కువ ఓదార్పు నీ దగ్గర నుండే కోరుకుంటాడు కదమ్మా. అలాంటిది నువ్వు ఏమీ పట్టనట్టు ఎందుకు ఉన్నావ్? మురారి నిన్ను బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడని, వాడెవడో శివన్న కంప్లెంట్ చేయడం ఏంటి. దానికి మీ ఊరివాళ్ళంతా సాక్షులుగా నిలబడం ఏంటి. నిన్ను నిలదీయాలని కాదమ్మ.. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సమాధానం నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు " అని కృష్ణని అడుగుతుంది రేవతి. కృష్ణ మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి కృష్ణ బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కృష్ణ ఇంట్లో లేదనే విషయం తెలుసుకుంటారు. ఎక్కడికి వెళ్ళిందని, కృష్ణ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో కమీషనర్ తో పాటు కృష్ణ వస్తుంది. భవానీతో  "కృష్ణవేణి నా దగ్గరకి వచ్చి జరిగిందంతా చెప్పింది. మురారి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మేం నిజమేంటో తెలుసుకోకుండా సస్పెండ్ చేశాం. మీ కుటుంబం మొత్తానికి సారీ చెప్తున్నాను" అని చెప్పేసి వెళ్తాడు కమీషనర్. "కృష్ణ.. మురారి కోసం ఇంత ధైర్యం చేసినందుకు, కేసు లేకుండా చేసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇంకోసారి బయటకు వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళు.. సరేనా" అని రేవతి అంటుంది. "సరే అత్తయ్య.. బాగా ఆకలేస్తుంది. పొద్దున్నుండి టిఫిన్ కూడా చేయలేదు" అని కృష్ణ అంటుంది. "అయ్యో.. సరే పదమ్మ టిఫిన్ పెడతాను" అని రేవతి అంటుంది. "భర్తకి వచ్చిన సమస్య తీర్చడం భార్య బాధ్యత అది సవ్యంగా చేసింది" అని భవాని అంటుంది.

నా ఇష్టప్రకారమే నా మెడలో తాళిపడిందన్న వసుధార.!

ఇప్పుడు స్టార్ మా టీవిలో అత్యంత వీక్షకాదరణ పొందుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్-655 లో జగతి, మహేంద్ర ఇద్దరు ఇంటికి వస్తారు. "రిషి వచ్చాడా" అని దేవయానిని అడుగుతాడు మహేంద్ర. అక్కడే ఉన్న రిషి వాళ్ళ పెద్ద నాన్న "ఏం జరిగింది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు" అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. ఆ తర్వాత అందరూ రిషి ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతారు. "కొంప తీసి రిషి ఏ అఘాయిత్యానికైనా పాటు పడలే కదా. రిషీకి ఏమైనా అయితే మీ సంగతి చెప్తా" అని దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రిషి ఒంటరిగా  పోలీస్ స్టేషన్ ముందు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. "ఏంటి వసుధార ఇలా చేసావు. నాకు సమాధానం చెప్పేవరకు వెళ్ళను" అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి రాజీవ్ వచ్చి "మీ రిషి సర్ మళ్ళీ వచ్చాడు చూడు" అని చెప్తాడు.  "నీ వల్లే  సర్ మళ్ళీ వస్తున్నాడు. వెళ్ళమని చెప్పు" అని అంటుంది. అంతలోనే స్టేషన్ SI వచ్చి "మళ్ళీ వచ్చావా.. ఎందుకు వచ్చావ్?" అని బెదిరిస్తాడు. "ప్లీజ్ సర్. ఒకే ఒక్క ప్రశ్న అడిగి వెళ్ళిపోతా" అని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. రాజీవ్ తో మాట్లాడుతుంది వసుధార.  "రిషి సర్ ని రానివ్వండి. నేను నిజం చెప్తాను" అంటుంది.  అలా అనడంతో రాజీవ్ బెదిరిస్తాడు. "ఒక్కసారి ఇంట్లో జరిగింది గుర్తు చేసుకో వసుధార.. ఇక ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో" అని బెదిరిస్తాడు. ఆ తర్వాత రిషి అక్కడే  ఉండటం గమనించిన SI మాట్లాడుతూ "వీడు వెళ్ళేలా లేడు కదా.. ఆ ఒక్క మాట ఏంటో మాట్లాడి వెళ్తాడంట. వాడిని లోపలకి పంపించండి" అని చెప్తాడు. అప్పుడు వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి. "వసుధార.. ఆ తాళి ఎవరు కట్టారు" అని రిషి అడుగుతాడు. "నా ఇష్టప్రకారంగానే నా మెడలో ఈ తాళి పడింది సర్" అని వసుధార చెప్తుంది. ఒక్కసారిగా రిషి ఎమోషనల్ అవుతాడు."మీరు ఇక్కడి నుండి వెళ్ళండి సర్" అని అంటుంది. ఆ తర్వాత రిషి ఎమోషనల్ అవుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నన్ను వీరవనితని చెయ్యొద్దు.. చారుశీలకు మోనిత వార్నింగ్.!

'కార్తీకదీపం' సీరియల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ‌సోమవారం జరిగిన ఎపిసోడ్-1557 లో మోనిత మాట్లాడిన మాటలను కార్తిక్, దీప గుర్తు చేసుకుంటారు. "డాక్టర్ బాబు.. నా జీవితంలో మొదటి సారి భయంగా ఉంది" అంటూ దీప ఏడుస్తుంది. "అలా ఎందుకు భయపడుతున్నావ్ దీప" అని కార్తిక్ అడుగుతాడు. "నేను పోయాక మిమ్మల్ని ప్రశాంతంగా  ఉండనివ్వదు ఆ మోనిత. మీ ప్రమేయం లేకుండా మీ బిడ్డకు తల్లి అయింది. నేను పోయాక మిమ్మల్ని తలుచుకుంటే భయమేస్తుంది. నన్ను బ్రతికించండి. మీతో కలిసి వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని ఉంది. కానీ నా తలరాత ఇంతే.. నాకు మీతో కలసి బ్రతికే అవకాశం లేదు. కానీ మోనిత మాత్రం మీ జీవితంలో కి రావొద్దు. ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ బాబు" అని కార్తీక్ తో చెప్పుకుంటూ బాధపడుతుంది. మరో వైపు సౌందర్య లేచి బయటకొస్తుంది. ఇంటి ముందే ఉన్న దీపని చూసి ఆశ్చర్యపోతుంది. "అమ్మా.. దీప వచ్చేశావా.. ఎన్ని రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నాం. దేవుడు మా మొర ఆలకించాడు" అని ఏడుస్తుంది. "అత్తయ్య.. మీతో మాట్లాడాలి" అని దీప అడుగుతుంది. " చెప్పమ్మ దీప" అని సౌందర్య అనేసరికి, దీప మాట్లాడుతూ "నాకొక మాట ఇవ్వండి అత్తయ్య. మీ కొడుకుని మీ దగ్గరకి తీసుకొస్తాను. అలా తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ మాట తప్పద్దు" అని అంటుంది. "అసలేం జరిగింది దీప. కార్తీక్ ఎక్కడున్నాడు. నాతో అన్ని చెప్పుకునే నువ్వు.. ఈ రోజు ఏదో దాస్తున్నావ్ అంటే నాకు భయమేస్తుంది దీప" అని సౌందర్య అంది. "మీకు అన్నీ చెప్తాను. పదండి" అని దీప అంటుంది. మోనిత తన ఫోన్ లో కార్తీక్ ఫోటో చూస్తూ.. హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన చారుశీల అది చూసి "ఏం చేస్తున్నావ్ మోనిత?" అని అడుగుతుంది. "నా కార్తీక్ ని చూస్తున్నాను. చూడు ఎంత బాగున్నాడో" అని అంది మోనిత. "అవును మోనిత. కార్తీక్ సర్ బాగున్నాడు" అని  అంది చారుశీల. ఆ తర్వాత మోనిత మాట్లాడుతూ "అందుకేనా నాకు కాంపిటీషన్ గా వచ్చావ్?" అని అడుగుతుంది. "అదేం లేదు" అని అంటుంది చారుశీల. "నేను కార్తీక్ గురించి ఒకరిని చంపి, జైలుకి వెళ్ళాను. ఒకరిని చంపితే హంతకుడు అంటారు. వంద మందిని చంపితే వీరుడు అంటారు. నన్ను వీరవనితని చెయ్యొద్దు" అని చారుశీలకి వార్నింగ్ ఇస్తుంది మోనిత. హిమ, శౌర్య ఇద్దరూ వాళ్ళ అమ్మా నాన్నలని వెతుక్కుంటూ తిరుగుతారు. అప్పుడే శౌర్య చేతిలో ఉన్న డబ్బుని దొంగ ఎత్తుకెళ్తాడు. దొంగని ఆపే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కిందపడిపోతుంటే..కార్తీక్ వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రీఓపెన్ చేసిన కిర్రాక్ ఆర్పీ

ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ ఐన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో మరో పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలం క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి ఓన్ బిజినెస్ చేసుకోవడం స్టార్ట్ చేసాడు. కర్రీ పాయింట్ పెట్టిన వెంటనే దానికి వచ్చిన రెస్పాన్స్ చూసే అతనే నోరెళ్లబెట్టాడు. జనాల తాకిడికి కాస్త బ్రేక్ ఇస్తూ షాప్ ని కొన్ని రోజుల పాటు మూసేసాడు.  ఐతే షాప్ పెట్టిన వెంటనే క్లోజ్ చేసేసరికి అంతా ఐపోయిందని అనుకున్నారు కానీ ఆ రూమర్స్ మీద ఆర్పీ క్లారిటీ ఇచ్చాడు. వస్తున్న జనానికి తగ్గట్టు సరిగా సప్లై చేయలేకపోతున్నామని ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు. అలా నెల్లూరు వెళ్లి అక్కడ సూపర్ గా చేపల పులుసు వండే ఆడవాళ్లను వెదకడం స్టార్ట్ చేసాడు. దానికి ఆడిషన్స్ కూడా పెట్టాడు. అందులో కొంతమందిని ఎంపిక చేసినట్లు చెప్పాడు. వాళ్ళను హైదరాబాద్ కి తీసుకెళ్లి అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు.  ఇంక నెల్లూరు చేపల పులుసు షాప్ ప్రారంభించి నెల రోజులు అయిన సందర్భంగా కిరాక్ ఆర్పీ మళ్ళీ షాప్ ఓపెన్ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు.  షాప్ తిరిగి ఓపెన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. పండుగ సందర్భంగా మాత్రం తమ కర్రీ పాయింట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సంక్రాంతి తర్వాతి నుంచి రోజూ నెల్లూరు చేపల పులుసు అందిస్తామని  చెప్పుకొచ్చాడు. కొత్త స్టాఫ్ ని పనిలోకి తీసుకున్నట్లు దానికి సంబంధించిన  సప్లై కూడా పెంచనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తనకు  నచ్చిన పని వదిలి ఎక్కడకీ వెళ్ళేది లేడు అన్నాడు. 

'కార్తీకదీపం' సీరియల్ కి శుభం కార్డు...దాని ప్లేస్ లో కొత్త సీరియల్ 'బ్రహ్మముడి'

బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కి ఎండ్ కార్డు పడబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ 2017 లో స్టార్ట్ అయ్యింది. అలా రాను రాను ఆ సీరియల్ టాప్ ప్లేస్ కి చేరుకుంది. సీరియల్ లోని క్యారెక్టర్స్ ని సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకునే పరిస్థితికి ఆడియన్స్ వచ్చారు. ఈ సీరియల్ కి సంబంధించి ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి.  ఐతే ఈ సీరియల్ లోని దీప, సౌర్య క్యారెక్టర్స్ ని పెద్దవాళ్ళను చేసి  చూపించేసరికి జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఆ టైములో రేటింగ్ కిందకి వచ్చేసింది. దీప, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ లేకపోయేసరికి ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఇక ఈ సీరియల్ మేకర్స్ విషయం అర్ధం చేసుకుని వెంటనే దీప-డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్స్ ని మళ్లీ ప్రవేశపెట్టారు. అయితే అప్పటికే మిగతా సీరియల్స్ కి ఎడిక్ట్  అయిపోయిన ప్రేక్షకులు.. సడెన్ గా ట్విస్టులు ఇచ్చేసరికి పెద్దగా పట్టించుకోలేదు. అలా ఆ సీరియల్ కి ఆ పాత రేటింగ్ రాకుండా వెనక్కి వెళ్ళిపోయింది.  ఆడియన్స్ కి కూడా ఈ సీరియల్ మీద పెద్దగా ఆసక్తి లేకపోయేసరికి ఇక సాగదీయడం వేస్ట్ అని తెలిసి దీనికి ఎండ్ కార్డ్ వేసేస్తున్నట్లు ఓ ప్రోమోని విడుదల చేశారు.  ఈ వీడియోలో దీప-డాక్టర్ బాబు స్వయంగా కొత్త సీరియల్ ని  ప్రమోట్ చేశారు.‘కార్తీకదీపం మీకెన్నో మరపురాని జ్ఞాపకాలని ఇచ్చింది. మీ గుండెల్లో మాకు మంచి చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకు గొప్ప ముగింపు ఉంటుంది. కార్తీకదీపం మీకు నచ్చే ఒక అద్భుతమైన క్లైమాక్స్ తో త్వరలో మీ ముందుకు రానుంది. కార్తీకదీపం క్లైమాక్స్ మరో సరికొత్త సీరియల్ కు నాంది పలకబోతోంది. అదే ‘బ్రహ్మముడి’. మా మీద చూపించిన ప్రేమాభిమానాలు.. కావ్య, రాజు పై కూడా ఇలానే చూపించాలి’ అని దీప-డాక్టర్ బాబు ఇద్దరూ ఆడియన్స్ ముందుకు వచ్చి చెప్పారు.  

గ్రాండ్ గా రవి వైఫ్ నిత్యా బర్త్ డే సెలెబ్రేషన్స్

యాంకర్ రవి బుల్లితెర మీద కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాకా సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతీ విషయం కూడా ఫుల్ వైరల్ అవుతోంది. "కాదే వీడియో సోషల్ మీడియాకి అనర్హం" అన్నట్టుగా చిన్న ఫంక్షన్ ఐనా సరే అప్ లోడ్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నారు. జనాల్లో ఒక క్రేజ్ సంపాదించుకుంటున్నారు.  రీసెంట్ గా యాంకర్ రవి తన వైఫ్ నిత్యా బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. యాంకర్ రవి తన భార్య నిత్యా, కూతురు వియా అందరికీ పరిచయమే..బుల్లితెర మీద ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి వీళ్ళను కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాడు. దగ్గరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ మధ్య పుట్టిన రోజు వేడుకను నిర్వహించాడు. తన వైఫ్ బర్త్ డే కోసం షాద్ నగర్ లో బ్యాక్ యార్డ్ గార్డెన్ లో ఉన్న ఫామ్ హౌస్ ని బుక్ చేసినట్లు చెప్పాడు..తాను టెంపుల్ కి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఈ ప్రోగ్రాం అంతా సెట్ చేసినట్లు చెప్పాడు. ఫైనల్ గా నిత్యాని ఫామ్ హౌస్ కి పిలిచి సర్ప్రైజ్ చేసాడు రవి. ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారని తెలియని నిత్యా అక్కడి వాళ్ళను చూసి ఒక్కసారిగా షాకయ్యింది.  ఈ పార్టీలో రవి ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు బాగా ఎంజాయ్ చేశారు. కూతురు వియా డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.   రవి కొన్నీళ్ళుగా బుల్లితెర మీద యాంకర్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలను కూతురు వియాతో దిగిన ఫొటోస్ అన్నీ తన ఫాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు.. శ్రీహాన్‌పై చిన్మయి అసహనం

సింగర్ చిన్మయి అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. ఈవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఎక్కడ ఏ చిన్న విషయం తప్పుగా అనిపించినా నిప్పులు చెరగడం ఈమె నైజం. తప్పు చేసిన వారెవరైనా చిన్నా, పెద్దా అని కూడా చూడరు.. వారిని విమర్శించడానికి, కడిగిపారేయడానికి ఆమె ఎంతమాత్రమూ వెనుకాడరు. ఎక్కడో ఏదో జరిగింది నాకు సంబంధం లేదులే అని ఎంతమాత్రమూ అనుకోరు. అలాంటి సింగర్ చిన్మయి రీసెంట్‌గా ఒక ఇష్యూ మీద గొంతు విప్పారు.  బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోను ఆమె తప్పుబట్టారు. అసలు ఈ వీడియోలో ఏముందో చూస్తే.. సిరితో కలిసి తను పెంచుకుంటున్న బాబుకు భయం చెప్పడం కోసం శ్రీహాన్ తనని తాను బెల్టుతో కొట్టుకుంటూ ఉన్నాడు. మాములుగా ఐతే అందరి ఇళ్లల్లో మాట వింటావా లేదా అని పిల్లల్ని పెద్దవాళ్ళు భయపెడతారు, వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తారు. అందుకు భిన్నంగా శ్రీహాన్ తనని తాను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ.. పిల్లాడికి భయం చెప్తున్నాడు.  ఇక సింగర్  ఈ వీడియో మీద రెస్పాండ్ అయ్యారు. మన సొసైటీలో  పిల్లలు మాట వినినప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే తమని తాము తిట్టుకుని, కొట్టుకుని, గాయాలు చేసుకుని బెదిరిస్తూ ఉంటారు. బాల్యం నుంచే పిల్లలకు ఇలాంటి అస్సలు నేర్పించకూడదు. ఫ్యూచర్ జెనెరేషన్స్ లో ఇలాంటి బెదిరింపులతో భయపెట్టే కల్చర్ అస్సలు ఉండకూడదు. పిల్లల మనసులపై ఇలాంటి ఘటనలు చెరగని ముద్ర వేస్తాయి అని అన్నారు.  ఇక  చిన్మయి హీరోయిన్ సమంతకు కొంతకాలం క్రితం వరకు  డబ్బింగ్ చెప్పారు. ఐతే ఆమె ముక్కుసూటితనమే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అవకాశాల్ని తగ్గించేస్తోంది. దాని కారణంగా ఆమెకు చాలా తక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.

సుశృత్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసిన శ్రీముఖి

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అల్లరి చేస్తుంది. ఆటలు ఆడిస్తుంది. హోస్టింగ్ ని మంచి జోష్ తో చేస్తుంది. ఆడియన్స్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా కామెడీ కంటెంట్ తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అని చూడదు ఎవరితోనైనా కామెడీ చేస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత బాగా చేస్తుంది.  ప్రెజంట్ జనరేషన్ లో బుల్లితెర మీద వన్ అండ్ ఓన్లీ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్  శ్రీముఖి. అలాంటి శ్రీముఖి ఇప్పుడు తన తమ్ముడు సుశృత్ బర్త్ డే వేడుకను చాలా గ్రాండ్ గా చేసింది. "అందరికంటే నాకు నువ్వుంటేనే ఇష్టం...హ్యాపీ బర్త్ డే .. ఐ లవ్ యు సుశృత్" అంటూ తన తమ్ముడికి ముద్దుపెడుతూ ఉన్న  బర్త్ డే ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి ఫాన్స్, నెటిజన్స్, బుల్లితెర నటీనటులు అంతా సుశృత్ కి విషెస్ చెప్పారు. సింగర్, యాక్టర్ సాయికిరణ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ "హ్యాపీ బర్త్ డే" అని కామెంట్ చేశారు.  సింగర్ సిద్ శ్రీరామ్ "హ్యాపీ బర్త్ డే రా బామ్మర్ది" అని విష్ చేసాడు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది. "నేను శైలజ, జులాయి" వంటి మూవీస్ లో శ్రీముఖి నటించింది. సిల్వర్ స్క్రీన్ మీద కంటే స్మాల్ స్క్రీన్ మీద ఆమె పేరు మోత మోగిపోతూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె మీద వచ్చినపెళ్లి రూమర్స్ ని ఖండించింది శ్రీముఖి..

రాధను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిన చైతూ-కాజల్!

'బిబి జోడి' షో ప్రతీ శనివారం, ఆదివారం శ్రీముఖి యాంకర్ గా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. అయితే ఇందులో జడ్జ్ లుగా తరుణ్ మాస్టర్, సదా, రాధ చేస్తున్నారు.‌ కాగా జోడిలుగా అఖిల్- తేజస్విని, సూర్య- ఫైమా, వసంతి- అర్జున్, చైతూ- కాజల్ ఉన్నారు. అయితే ఈ షోలో శనివారం ఎపిసోడ్‌లో ప్రాపర్టీ రౌండ్ జరిగింది. ఇందులో బెడ్ ప్రాపర్టీ తీసుకొ‌ని అఖిల్-తేజస్విని జోడి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన చైతూ- కాజల్ స్కూల్ బెంచ్ ప్రాపర్టీ తీసుకొని, స్కూల్ లైఫ్ లో అల్లరి చేసే పిల్లలుగా తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అలరించారు. వీరి పర్ఫామెన్స్ చూసి జడ్జ్ గా చేస్తున్న రాధ తన జడ్జ్ మెంట్ చెప్తూ స్కూల్ లైఫ్ లో తన అనుభావాలను పంచుకుంది. రాధ మాట్లాడుతూ "నా 4th క్లాస్ లో లైనా అనే అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం సెకండ్ బెంచ్ లో ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఒక రోజు లైనా ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి శశికళ అని కూర్చుంది. ఆ రోజు మాకు ఒక టెస్ట్ ఉంది. నేను క్లాస్ కు వెళ్లి చూసి బయటకు వచ్చేశాను. అది చూసి మేడమ్ నన్ను పిలిచి 'ఏ ఎందుకు రాయలేదు టెస్ట్' అని అడిగింది. అక్కడ లైనా ఉండాలి. తను లేదు. నాకు నచ్చలేదు మేడమ్. అందుకే రాయలేదు టెస్ట్" అని చెప్పాను. "అప్పటి నుండి ఇప్పటి వరకు నేను లైనాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె మా ఊళ్ళోనే, మా ఇంటి పక్కనే ఉంది. నేను మా ఊరికి వెళ్ళాలి. లైనాతో మాట్లాడాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి" అని అనుకుంటున్నాను అని రాధ చెప్పుకొచ్చింది.

సస్పెండ్ అయిన మురారి.. సంతోషంలో కృష్ణ, బాధలో ముకుంద!

స్టార్ మాలో ప్రేక్షకులను అలరిస్తోన్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఇది ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-48 లో కమిషనర్ దగ్గరకి వెళ్తాడు మురారి. ఆ తర్వాత తన మీద వచ్చిన ఎలిగేషన్ గురించి మాట్లాడి బయటకు వచ్చేసి ఒక దగ్గర ఆలోచిస్తూ కూర్చుంటాడు. అదే సమయానికి ఇంట్లో వాళ్ళంతా మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతసేపటికి మురారి రాకపోయేసరికి.. మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని కాల్ చేస్తుంది. "ఏంటి మురారి.. ఇంత జరిగినా ఈ పెద్దమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నిన్ను సస్పెండ్ చేశారని నాతో ఎందుకు చెప్పలేదు" అని  భవాని అంటుంది. "నువ్వు నాతో మాట్లాడుతున్నావా పెద్దమ్మ.. నా మీద కోపం తగ్గిందా" అని మురారి అంటాడు. దానికి భవాని "నీ మీద కోపమేంటి మురారి.. నీ మీద కాదు‌. ఆ పిల్ల మీద. నువ్వు అన్నావే అలక అని.. అదే అంతే"  అని అంటుంది. "మరి ఇన్ని రోజులు పరాయి వాడిగా చూశావ్" అని మురారి అనగా, "నువ్వేగా మమ్మల్ని పరాయి వాళ్ళని చేసావ్" అని భవాని అంటుంది. "పోనీలే పెద్దమ్మ.. నువ్వు మారిపోయావ్. అది చాలు. ఐ లవ్ యూ పెద్దమ్మ" అని మురారి అంటాడు. "అది సరే.. ఇలా జరిగిందేంటి.‌ ఇంత సిన్సియర్ ఆఫీసర్ ని, అలా ఎలా సస్పెండ్ చేస్తారు. చెప్పు ఎవరితో ఫోన్ చేయించాలి? డీజీపితోనా..ఎవరితో?" అని భవాని అడుగుతుంది. "అదేం లేదు పెద్దమ్మ" అని అంటాడు మురారి. ఒక వైపు భవాని, మురారి కేస్ గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మరో వైపు కృష్ణ తీరిగ్గా కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. ఇక ఫోన్ లో భవాని మాట్లాడుతూ "ఇక్కడ ముకుంద.. నీ గురించి ఆలోచిస్తుంది.. నీ భార్య ఏమో ఏమీ పట్టనట్టు అన్నం తింటుంది. తినేవాళ్ళని లేపకూడదనే సంస్కారం నాకుంది కాబట్టి సరిపోయింది లేకుంటే.. సరేలే.. అది అంతా వదిలెయ్ మురారి. నువ్వు త్వరగా ఇంటికి వచ్చెయ్" అని భవాని అంటుంది. "సరే పెద్దమ్మ.." అని కాల్ కట్ చేసి వస్తాడు మురారి.  "ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు నిండిందా? నా బాధ నీకు సంతోషన్నాన్నిస్తుంది కదా. అందుకే నువ్వు ఇక్కడ కడుపు నిండా, తృప్తిగా తిన్నావ్ కదా. నాకిష్టమైన నా జాబ్ పోతే కూడా నీకు ఏమీ అనిపించలేదా?" అని మురారి అంటాడు. "కదా.‌. మనకి ఇష్టమైంది దూరమైతే భరించలేనంత బాధగా ఉంది కదా.. నీకు ఈ జాబ్ పోతే ఆస్తి ఉంది. కానీ నాకు ఎవరూ లేరు. నాకంటూ ఉంది ఒక్క మా నాన్న మాత్రమే. ఆయన్ని నువ్వు చంపేశావ్. నాకు పూడ్చలేని వెలితి. అలా చేసింది ఎవరూ? నువ్వు. నాన్న లేకుండా ఎలా బ్రతుకుతున్నానో తెలియదు. శూన్యమనిపిస్తుంది. మీకోసం ఇంత కుటుంబం ఉంది. బాగా సంతోషంగా ఉందా, కడుపు నిండిందా అని అన్నావ్ కదా.. ఉంది. కచ్చితంగా ఉంది. దేవుడు ఉన్నాడు. పైనుండి అన్నీ చూస్తున్నాడు. మా నాన్న ప్రాణం తీసినందుకు తగిన శాస్తే చేసాడు. నేను ఇలాగే అంటాను" అని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మురారి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న మురారిని ఓదార్చడానికి ముకుంద వస్తుంది. "నీకు ఈ ఉద్యోగం ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఎవరు ఓదార్చినా ఆ బాధ తీరదు. కానీ నువ్వు వస్తే ఓదార్చాలని ఎదురుచూస్తున్నాను. నీకు నేనున్నాను" అని మురారిని ఓదార్చుతుంది. అప్పుడే బయటకు వస్తుంది కృష్ణ. వాళ్ళిద్దరిని అలా చూసిన కృష్ణ ఏం చేస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

రాజీవ్ నిజస్వరూపం తెలుసుకున్న చక్రపాణి.. వసుధార కోసం రిషి కన్నీళ్ళు!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మాలో అతి ఎక్కువ వీక్షకాదరణ పొందుతూ వస్తున్న ధారావాహిక. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-654 లో రాజీవ్ హాస్పిటల్ లో ఉన్న వసుధార తల్లితండ్రుల దగ్గరికి వస్తాడు. "మామయ్య గారు.. కళ్లు తెరవండి.. నేను వచ్చేశాను. మీరు ఎంత కాలం నన్ను నమ్ముతారో.. అంతవరకు మీకు నటించే అల్లుడిగా ఉంటాను. మీతో ఏం ప్రాబ్లం లేదు మామయ్య గారు. అత్తయ్య గారితోనే ప్రాబ్లం. అత్తయ్యగారు మీరు లేస్తే పొడిచింది నేనే అని మామయ్య గారితో చెప్తారు. మీరు బ్రతికి నన్ను జైలుకు పంపిస్తారా? చచ్చిపోయి నాకు పెళ్లి చేస్తారా? మీరు చనిపోండి" అంటూ ఆక్సీజన్ మాస్క్ తీసేస్తాడు రాజీవ్. అలా చేస్తున్నప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడతాడు. "మీ కోరిక ఏంటో చెప్పండి అత్తయ్య.. వసుధారకి నాకు పాప పుడితే.. మీ పేరే పెట్టుకుంటాను. మీ కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను" అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. ఇదంతా జరిగేటప్పడు చక్రపాణి చూస్తాడు. రాజీవ్ మాటలను వింటాడు. వసుధార తల్లి బెడ్ పైన శ్వాస అందక తల్లడిల్లుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రిషి చూసి, ఆక్సీజన్ మాస్క్ పెట్టి డాక్టర్ ని పిలుస్తాడు. "డాక్టర్ .. ఎంత ఖర్చు అయిన నేను పెట్టుకుంటాను. వీళ్ళకి నేను ఉన్నాను" చెప్తాడు. ఆ తర్వాత రాజీవ్ వచ్చి రిషిని చూస్తాడు. "ఇక్కడికి నువ్వెందుకు వచ్చావ్" అని రాజీవ్ అనగా.. "వీళ్ళు వసుధార తల్లి తండ్రులు" అని రిషి అంటాడు. అప్పుడు రాజీవ్ "నీకు వసుధార తల్లిదండ్రులు మాత్రమే. కానీ నాకు అత్తయ్య మామయ్యలు" అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరికి వాగ్వాదం జరుగుతుంది. "ఇతని వల్లే, వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు" అని డాక్టర్ తో రాజీవ్ చెప్పి, రిషిని బయటకు పంపించేలా చేస్తాడు. ఆ తర్వాత రిషి గురించి జగతి, మహేంద్ర లు మాట్లాడుకుంటారు. "వసుధారకి అసలేం జరిగింది. తను ఎందుకిలా చేస్తుంది. రిషి ఇంత గోరాన్ని తట్టుకోలేడు. చాలా సున్నిత మనసు గలవాడు" అని మహేంద్ర అనగా, "లేదు.. రిషి తట్టుకొని గెలుస్తాడు మహేంద్ర" అని ఏడుస్తుంది జగతి. కాగా రిషి ఒంటరిగా దూరంగా వెళ్లి వసుధారని తల్చుకొని ఎమోషనల్ అవుతాడు. "వసుధార.. నా జీవితంలోకి రావడం వెళ్లడం నీ ఇష్టమేనా.. నన్ను మోసం చేసావా.. 'రిషిధార' నుండి నన్ను వేరు చేసావా" అని గట్టిగ అరుస్తాడు. ఆ తరువాత జగతి, మహేంద్ర ఇంటికి వచ్చి రిషి గురించి అడుగుతారు. అప్పుడే దేవయాని ఇంటికొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కార్తీక్ మన హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్-1556 లో శౌర్య, హిమలు హేమచంద్రకి కనపిస్తారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొని వెళ్తాడు.    తరువాత చారుశీల దగ్గరికి కోపంతో వస్తాడు కార్తీక్. "నువ్వు ఎంత మోసం చేసావ్. నువ్వు మోనిత పంపిన కీలుబొమ్మవి. మా విషయాలు అన్ని కూడా మోనితకి చేరవేశావు" అని అంటుంది. చారుశీల మాట్లాడుతూ "నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా, బాగానే చూసుకున్నా కదా" అని చారుశీల చెప్తుంది. "ఇంకా నమ్మించాలని చూడకు" అని అంటాడు. అంతలోపే చారుశీలను పిలుస్తుంది మోనిత. అది విన్న కార్తిక్ "ఓహో మోనిత ఇక్కడే ఉందా.. దానితోనే తేల్చుకుంటా" అని మోనిత దగ్గరికి వెళ్తాడు. కోపంగా వెళ్ళిన కార్తిక్ ని పట్టించుకోకుండా "ఈ బట్టలన్నీ కూడా మన పెళ్లికి, ఇంకా ఇవేమో హనీమూన్ కి. మనం హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం. ఇదిగో టికెట్స్" అని చూపిస్తుంది. దాంతో కార్తీక్ కోపంతో మోనిత మీదకి చెయ్యి లేపుతాడు. అప్పుడే దీప కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే వచ్చిన దీపని చూసి మోనిత "చూడు దీప.. కార్తీక్ నా వాడు. నువ్వు పోయాక మా పెళ్లి. ఇదిగో హనీ మూన్ టికెట్స్. నువ్వు ఇంకో వారం బ్రతుకుతావు. ఆ తర్వాత ఖేల్ ఖతం.. దుకాణం బంద్" అని అంటుంది. ఆ తర్వాత దీప మోనితల మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. దీప కార్తీక్ లు అక్కడి నుండి వెళ్తారు. ఆ తరువాత మోనిత హ్యాపీగా కార్తీక్ గురించి కలలు కంటుంది. అప్పుడే చారుశీల వస్తుంది. మోనిత మాట్లాడుతూ "దీప వెళ్ళాక కార్తీక్ నా సొంతం" అని అంటుంది. "కార్తీక్ నీ దగ్గరికి రావడానికి.. నీ మీద ఏమైనా మంచి అభిప్రాయం ఉందా" అని చారుశీల అడుగుతుంది. మోనిత మాట్లాడుతూ "కార్తీక్ ని.. నా సొంతం చేసుకోవడానికి జైలులో అద్భుతమైన పథకాలు రచించాను. అది తర్వాత చెప్తాలే గాని.. కార్తీక్, దీపలు ఏమంటున్నారు. అది చెప్పు" అని అడుగుతుంది. "ఏమంటారు.. నీకు మోనితకి తేడా లేదని, నిన్ను నన్ను కలిపేశారు. ఇంప్రెషన్ మొత్తం పోయింది" అని అంటుంది చారుశీల. "నీ మీద ఇంప్రెషన్ ఎలా ఉంటే ఏంటీ.. నువ్వు ఏమైనా కార్తీక్ ని ట్రై చేస్తున్నావా" అని అడుగుతుంది. "అదేం లేదు" అని చారుశీల అంటుంది. "అయితే సరే మరి" అని ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను మీతో కలిసి ఉంటాను.. దీపకు మోనిత ప్రపోజల్.!

'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-1555 లో మోనిత గురించి ఆలోచిస్తూ.. దీప పరధ్యానంతో వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్ వస్తాడు. దీప పరధ్యానం చూసి అడుగుతుంటాడు. కార్తీక్ మాట్లాడుతూ "ఏంటీ దీప.. మోనిత గురించి ఆలోచిస్తున్నావా? దాని గురించి ఎందుకు పట్టించుకుంటావ్. దాని సంగతి నేను చూసుకుంటా.. నువ్వేం ఆలోచించకు" అని చెప్తాడు. కార్తిక్ ఎంత చెప్పినా  దీప మౌనంగా ఉండిపోతుంది. "అసలా మోనిత మన దగ్గరికి రాలేదనుకో, మోనిత మన దగ్గరికి రాకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్. మోనిత ని కలవడానికి కార్తీక్ వస్తాడు. "మోనిత.. నీతో మాట్లాడాలి" అని కార్తిక్ అంటాడు. "మాట్లాడు కార్తీక్..ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, అంతులేని సంతోషాన్ని అందిస్తాను" అని మోనిత అంటుంది. "మా జోలికి రావొద్దు" అని కోపంగా చెప్తాడు కార్తిక్. "ఇకనుండి మా దగ్గరికి రావొద్దు.. మమ్మల్ని వదిలెయ్" అని కార్తిక్ ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుంది మోనిత. ఆ తర్వాత దీప దగ్గరికి మోనిత వస్తుంది. "డాక్టర్ బాబు గురించి ఎదురుచూస్తున్నావా" అని అడుగుతుంది. "నీకు ఎందుకే" అని దీప కోప్పడుతుంది.  "నీ గురించి మాట్లాడటానికే, కార్తీక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రశాంతంగా ఉంచాలని అడిగాడు. నేను ఒప్పుకోకపోయేసరికి, కోపంగా అక్కడి నుండి వచ్చాడు. నా కోరికకు నువ్వు అయినా ఓకే చెప్తావా?  నా కోరిక సింపుల్. నేను మీతో కలిసి ఉంటాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యను" అని మోనిత అడుగుతుంది. అలా అనగానే "చెప్పు తెగుద్ది" అని దీప అంటుంది.  మోనిత మాట్లాడుతూ "మీ పెళ్లి అయినప్పటి నుండి మీరు సంతోషంగా ఉన్నారు. ఇక కార్తీక్ ని నాకు అప్పగించు. పోయేలోపు ఈ ప్రపోజల్ తో నువ్వే నా దగ్గరికి వస్తావ్ చూడు" అని మోనిత అంటుంది. ఆ తర్వాత "మళ్ళీ కలుద్దాం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత. ఒకవైపు హిమ, శౌర్యలు వాళ్ళ అమ్మ నాన్నలను వెతుకుతుంటారు. అలా వెతుకుతున్నప్పుడు హేమచంద్ర ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.