హైపర్ ఆది మీద మంత్రి రోజా కామెంట్స్ వైరల్...భయపెట్టి మాట్లాడిస్తున్నారు

ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంత్రి రోజా, జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిన విషయమే. ఇక మధ్యలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ గురించి కూడా తెలిసిందే. మరో వైపు పవన్ పై కౌంటర్స్ వేస్తూనే కమెడియన్ ఆది మాటలపై కూడా స్పందించారు.  ‘హైపర్ ఆది చిన్న ఆర్టిస్టు. అలా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో ఉండనివారు అనే భయం. ఇంకా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్దది.  ఆ ఫ్యామిలీతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో.. వెనుక నుంచి  వెకిలిగా మాట్లాడిస్తున్నారు. ఇలా భయంతో  ఎక్కువ కాలం బతకలేరు. మంత్రులకు శాఖలు తెలియవు అంటే కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, శారద, నేను ఎలా గెలిచాం. మేమూ సినిమా వాళ్ళమే కదా ! మరి ప్రజలు మమ్మల్ని గెలిపించారు మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు ? ఎవరు ఎలాంటివారో జనాలకు తెలుసు.ఈ రాష్ట్ర ప్రజలకు అందరి గురించి తెలుసు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మైండ్ లోనూ, మనసులో ఉండాలి.. ” అని చెప్పుకొచ్చారు రోజా ఒక ఇంటర్వ్యూలో.  

ఆయన్ని అవమానించిన ఆ స్టేజి మీదకు నేను వెళ్ళేది లేదు!

"అన్ స్టాపబుల్" షో ఆహాలో ప్రసారమవుతూ ఆడియన్స్ క్రేజ్ ని సంపాదించుకున్న షో. హోస్ట్ గా బాలకృష్ణ ఈ షోని మంచిగా రక్తి కట్టిస్తున్నారు. పార్టీలకతీతంగా సెలెబ్స్ ని ఇన్వైట్ చేసి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి సందడి చేస్తున్న షో ఇది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయ్యేసరికి సీజన్ 2  కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి రోజాకి  ఇప్పటికే రెండు సార్లు ఇన్విటేషన్స్ అందాయి.  ఐతే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలిపారు.  అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినా వెళ్ళేది లేదు అని ఆమె తేల్చి చెప్పేసారు. ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారో ఆ క్షణమే ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడుని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి చనిపోయిన ఎన్టీఆర్ గారిని మరోసారి అవమానించేలా మాట్లాడటం ఒక ఆర్టిస్ట్ గా  తనకు ఎంత మాత్రమూ నచ్చలేదు అని చెప్పారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే దేవుడి లెక్క అలాంటి మహా నటుడిని అవమానించి కించ పరిచిన ఆ స్టేజి మీదకు వెళ్లాలని తనకు లేదని చెప్పారు మంత్రి రోజా.

అనసూయ కోరిక తీరేనా..?

అనసూయ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కోపం వస్తే శివంగి  లేదంటే చాలా కూల్ అని. బుల్లితెర మీద అనసూయ గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ కూడా ఉన్న యాంకర్. ఇక ఈమె బుల్లితెర మీద యాంకర్ గా చేయడం మానేసి సిల్వర్ స్క్రీన్ మీద మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేస్తోంది. రీసెంట్ గా ఈమె టేస్టీ తేజతో కలిసి "సంక్రాంతి స్పెషల్ లంచ్ " అనే  ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది.  తేజ ఆమెను ఎన్నో ప్రశ్నలు కూడా వేసాడు. మీ డ్రీం రోల్ ఏమిటి ? ఇలా ఇండస్ట్రీలో కి వస్తానని అనుకున్నారా ? అని. దానికి అనసూయ ఆన్సర్స్ ఇచ్చింది. "ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. కానీ అది ఛాలెంజింగ్ గా లీడ్ రోల్ లా ఉండాలి. ఆ పాత్రకు నేను మాత్రమే సూట్ అవుతాను అనే ఒక థాట్  రైటర్ లో, డైరెక్టర్ లో రావాలి. అలా వెర్సటైల్ రోల్స్ లో నటించాలని నా కోరిక. ఏ ఫిలిం మేకర్ కి ఐనా సరే నేను ఒక సేఫ్ యాక్టర్ గా ఉండడం నాకు ఇష్టం...అలా ఉంటే చాలు నా డ్రీం ఫుల్ ఫీల్ ఐనట్టే. అసలు నేను యాక్టర్ అవుతానని, ముఖానికి రంగులు పూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నేను ఆర్థోడాక్స్ ఫామిలీలో పుట్టాను. పద్ధతి తప్ప పాడు అనే మాట కూడా మా ఇంట్లో వినిపించదు. మా పేరెంట్స్ దగ్గరకు వెళ్లిప్పుడు అక్కడి పద్ధతులు, మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులు కచ్చితంగా ఫాలో అవుతాను.  నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నాన్నగారు వాళ్ళది భూదాన్ పోచంపల్లి. అమ్మ వాళ్ళది కర్ణాటక. తాతయ్య వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్స్ టైంలో ఘట్ కేసర్ కి వచ్చేసారు. నాన్నగారు నాకు పర్మిషన్ ఇచ్చాకే కెమెరా ముందుకు వచ్చాను అది కూడా న్యూస్ రీడర్ గా. అలా మెల్లగా నా దారిలో నేను అవకాశాలను అందుకుంటూ ఇంతదూరం వచ్చాను. నేను ఏం చేసినా మా నాన్నకి సంతోషమే ఎందుకంటే నాకు లోకజ్ఞానం ఎక్కువ అని అనుకుంటారు. అంతేకాదు నా మీద నాకు చాలా గర్వంగా కూడా ఉంటుంది. సంకల్పం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనేది నా గట్టి నమ్మకం. వికీపీడియాలో మా ఆయన పేర్లు పిచ్చిపిచ్చిగా రాసేశారు. దాన్ని అసలు నమ్మకూడదు. అసలు ఇంటరెస్టింగ్ విషయం చెప్పాలంటే నేను, మా ఆయన లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నాం. మా పేరెంట్స్ ని డబ్బులు పెట్టడానికి మేం ఒప్పుకోలేదు. ఎన్ సీసీ క్యాంపులో మాకు పరిచయమయ్యింది. ఎనిమిదేళ్లు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం ". అని చెప్పింది అనసూయ.

సుమకి ప్రొపోజ్ చేసిన జానీ మాస్టర్

సుమ సుదీర్ఘ కాలం పాటు చేసిన క్యాష్ షో ప్లేస్ లోకి ఇప్పుడు "సుమ అడ్డా" అనే సరికొత్త షో స్టార్ట్ అయ్యింది. ప్రతీవారం ఈ షోకి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకి రావడంతో మంచి  రేటింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ షో. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గెస్ట్స్ గా వచ్చారు.  ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఈ డాన్స్ మాస్టర్స్ ఇద్దరూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు.  ముఖ్యంగా వీరిద్దరి మీద సుమ వేసిన పంచులు వేరే లెవెల్.  శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని కూడా స్క్రీన్ పై వేసి చూపించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోలో ప్రేమదేశం మూవీ సీన్స్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఈ స్పూఫ్ లో భాగంగా మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి అని సుమ అడిగేసరికి జానీ మాస్టర్ పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగేసరికి సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. జానీ మాస్టర్ మాటలు స్టేజి మొత్తం కూడా ఈలలు కేకలే...ఇలా ఈ ఎపిసోడ్ ఫన్నీగా ఎంటర్టైన్ చేయబోతోంది. సుమ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వున్న యాంకర్. ఎంత మంది గ్లామరస్ యాంకర్స్ వచ్చినా సుమతో పోటీకి మాత్రం దిగలేకపోతున్నారు. 

కూతురికి భోగి పళ్ళు పోసి సెలబ్రేట్ చేసుకున్న రేవంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6  టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ గురించి అందరికీ తెలుసు. టైటిల్ నాదే అనే చెప్పి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి టైటిల్ తోనే తిరిగొచ్చాడు. సింగర్ రేవంత్  తోటి కంటెస్టెంట్ శ్రీహాన్ రన్నర్ గా వచ్చాడు.  ఇక రేవంత్ విన్నర్ అయ్యాడు మరో వైపు తండ్రి కూడా అయ్యాడు. టైటిల్ ని తీసుకెళ్లి తన  కూతురికి బహుమతిగా ఇచ్చాడు...ఇక రేవంత్ తన పాప ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పాప పుట్టాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున ఇంట్లో భోగి పళ్ళు పోసి వేడుక చేసాడు. ఈ సెలబ్రేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పాప చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్  కామెంట్స్ పెడుతున్నారు.  "మకర సంక్రాంతి శుభాకాంక్షలు …మన చిట్టి తల్లి వచ్చాక సంక్రాంతి సంబరాలు !!! బొమ్మలకొలువు & భోగిపళ్లు !" అని కాప్షన్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో రేవంత్ కూడా ఒకరు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మాత్రమే కాదు గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ కూడా.  ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక బుల్లితెర మీద షోస్ కి స్పెషల్ ఇన్విటేషన్ అందుకుంటున్నాడు రేవంత్. అలాగే బయటికి వచ్చాక హౌస్ మేట్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే ఇంటర్వ్యూస్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు.

డాక్టర్ బాబుని ముద్దు పెట్టుకుని ఏడ్చేసిన వంటలక్క!

కార్తీక దీపం సీరియల్ స్టార్ మా కొన్నేళ్లుగా అలరిస్తూ ఎంటటైన్ చేస్తోంది. ఇప్పుడు ఈ సీరియల్ చివరికి వచ్చేసింది. ఆరేళ్ళ పాటు ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిన ఈ సీరియల్ ఎంతో మంది మనసుల్ని దోచుకుంది. ఈ  సీరియల్ ఈ వారంతో ముగిసిపోతుంది అనే విషయాన్ని ఇప్పటికే ఈ టీమ్  ప్రకటించింది. అందరికీ నచ్చే క్లైమాక్స్‌తో సీరియల్‌కు ముగింపు పలకబోతున్నట్లు చెప్పింది. ఫైనల్ డే షూటింగ్ అంటూ సీరియల్ లో విలన్ రోల్ చేసిన మోనిత టీమ్ మొత్తానికి స్వీట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది.  ఇక ఇప్పుడు  స్టార్‌ మాలో ప్రతీ ఆదివారం ప్రసారం అయ్యే "ఆదివారం విత్ స్టార్‌ మా పరివారం"  ప్రొగ్రామ్‌లో కార్తీకదీపం సీరియల్‌కు ఫేర్‌వెల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి  కార్తీక దీపం సీరియల్‌ మెయిన్‌ క్యారెక్టర్లు చేసిన వాళ్లంతా పార్టిసిపేట్ చేశారు. పరిటాల నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, పిల్లలు శౌర్య, హిమ, సౌందర్య అందరూ వచ్చారు. వీరికి ఘనంగా సన్మానం చేశారు. ఈ ఫేర్ వెల్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, దీప కలిసి డాన్స్ చేసి.. అందరిని ఆకట్టుకున్నారు. “ఇప్పుడే కుట్టింది చీమ.. డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ” అని కవిత్వం చెప్పి.. వంటలక్క వాహ్ అనిపించుకుంది.  ఇక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అంటే కాస్త బాధగా ఉందని నిరుపమ్ ఎమోషనల్‌ అయ్యాడు. ఆడియన్స్ అంతా కలిసి డాక్టర్ బాబు రీల్ ఫ్యామిలీకి గజమాల వేసి సత్కరించారు. చివరగా వంటలక్క కార్తీకదీపం సీరియల్‌ గురించి ఎమోషనల్‌ అవుతూ.. డాక్టర్ బాబుని ప్రేమగా హగ్ చేసుకుని ముద్దు పెట్టి ఏడ్చేసింది.

వసుధార వ్యక్తిత్వాన్ని చూసి సిగ్గుపడుతున్నానని చెప్పిన చక్రపాణి!

'గుప్పెడంత మనసు'  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-661 లో..  వసుధార వాళ్ళింట్లో ఒంటరిగా కూర్చొని రిషీతో గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు ఏడుస్తూ ఉంటుంది. మరో వైపు వసుధారని తల్చుకుంటూ రిషి తన ఇంట్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. వసుధార ఎందుకిలా చేసిందని పదే పదే అనుకుంటూ ఉంటాడు. వసుధార వాళ్ళ అమ్మనాన్నలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నాన్న చక్రపాణికి అన్నం తినిపిస్తుండగా.. తను వసుధారని అన్న మాటలు గుర్తుచేసుకొని చక్రపాణి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. "ఎందుకు నాన్న ఏడుస్తున్నావ్?" అని వసుధార అడుగుతుంది. "నీ వ్యక్తిత్వాన్ని చూసి సిగ్గు పడుతున్నాను అమ్మా" అంటు చక్రపాణి బాధతో చెప్తాడు. "ఏడవకండి నాన్నా" అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది వసుధార.  సూట్ కేస్ తీసుకొని రిషి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న దేవయాని, జగతి, మహేంద్ర చూస్తారు. రిషిని ఆపుతుంది దేవయాని. "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతుంది. "ఈ బంధం శాశ్వతం కానప్పుడు, తను నాతో లేనప్పుడు ఇంకెందుకని అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను" అని రిషి అంటాడు.  "ఏదో జరిగిందని పరిస్థితులకు భయపడి పారిపోతున్నావా?" అని మహేంద్ర అడుగుతాడు. "పరిస్థితులకు భయపడేంత పిరికివాణ్ణి కాదు డాడీ. ఈ బాధ పోవాలంటే నన్ను నేను శిల్పిగా చెక్కుకోవాలి" అని రిషి అంటాడు. "నువు వెళ్తే కాలేజీని ఎవరు చూసుకుంటారు?" అని దేవయాని అడుగుతుంది. "కాలేజీ అన్ని బాధ్యతలు జగతి మేడం చూసుకుంటుంది. ఆల్రెడి మేడంకి మెయిల్ చేశాను" అని రిషి సమాధానమిస్తాడు. "మెయిల్ చేస్తే అయిపోతుందా.. మినిస్టర్ గారు ఒప్పుకుంటారా?" అని దేవయాని అడుగుతుంది‌. "మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేశాను" అని రిషి అంటాడు. "ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా?" అని మహేంద్ర అడుగుతాడు. "అత్యంత అవసరం డాడీ" అని రిషి సమాధానమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నూకరాజు-ఆసియా పెళ్ళికి నో చెప్పిన తల్లి...

జబర్దస్ కామెడీ షో తెలుగు ఆడియన్స్ మనసుల్ని దోచుకుంది.  పదేళ్ల నుంచి నిర్విరామంగా నవ్విస్తూనే ఉంది ఈ షో. ఈ షో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు, తెచ్చుకుంటూనే ఉన్నారు. ఈ వేదిక మీదుగా లవర్స్ ఐనవాళ్లు ఉన్నారు..రీల్ జోడీస్ కూడా ఉన్నారు. ఇక కడుపుబ్బా నవ్వించడానికి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు..కొంతమంది వెళ్లిపోగా వాళ్ళ ప్లేస్ లోకి ఇంకొంతమంది వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. జబర్దస్త్ జోడీస్ లో  ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ సుడిగాలి సుధీర్ - రష్మీ జంటదే..తర్వాత ఎంతో మంది జోడీస్ వచ్చారు స్టేజిని కళకళలాడిస్తూ ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ మరో జంట నూకరాజు-ఆసియా. వీళ్ళు పటాస్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు జంటగా వీడియోలు చేస్తూ టూర్స్ కి వెళ్తూ రచ్చ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఈ స్టేజి మీద రీల్ జోడీగా ఎన్నో స్కిట్ లు చేశారు.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటామని ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. రెండు కుటుంబాల పెద్దలు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన ఒక సీన్ చూస్తే ఫుల్ షాకింగా అనిపించింది. లేటెస్ట్ గా  ‘జబర్దస్త్’ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా నూకరాజు తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నే స్కిట్ గా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్కిట్ లో నూకరాజు-ఆసియా తల్లిదండ్రులు కూడా ఇందులో భాగమయ్యారు. స్కిట్ అంతా పూర్తయ్యాక ఇంద్రజ మాట్లాడుతూ"ఇంత దూరం తీసుకొచ్చారు తాంబూలాలు ఇచ్చుకునే టైంలో అలా కట్ చేసి వదిలేశారేమిటి" అని అడిగేసరికి "మేడం ఇది స్కిట్ వరకే అన్నారు నిజంగా ఐతే ఈ పెళ్లి చేయడం కుదరదు" అని నూకరాజు వాళ్ళ అమ్మ  చాలా సీరియస్ గా చెప్పేసరికి ఆసియా ఒక్కసారిగా షాకయ్యింది ఆ మాటలకు. ఆ తర్వాత అందరూ స్టన్ అయ్యారు. అయితే నూకరాజు-ఆసియా లవ్ స్టోరీకి బ్రేక్ వేయడం అంతా కూడా స్కిట్ లో భాగంగానే చేశారా లేదా నిజంగానే వీళ్ళ పెళ్ళికి బ్రేక్ పడబోతోందా తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు.

యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నా ? మీరేమంటారు...

జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసిన అనసూయ మానేసరికి ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. ఇక రష్మీ కూడా  జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా చేస్తుండగా మూవీస్ తో బిజీ ఐపోతున్న కారణంగా రష్మిని జబర్దస్త్ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లోకి సౌమ్య రావు ని తీసుకొచ్చారు.  ఇక ఈ యాంకర్ వస్తూనే ఆదిని చెడుగుడు ఆడేసుకుంది. ఆది కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఈమె మీద సెటైరికల్ గా డైలాగ్స్ వేసేవాడు. ఇక ఈమెకు తెలుగు రాదు అని చాలా మంది నెటిజన్స్ కూడా అన్నారు. రష్మీని చూసి ఉన్న ఆడియన్స్ కి కొత్త యాంకర్ అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు సౌమ్య జబర్దస్త్ తో పాటు మాల్స్ ఓపెనింగ్ కి కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన జొస్ అలుక్కాస్ వాళ్ళ ఐవీ జ్యువెలరీని లాంచ్ చేసింది. పసుపు రంగు శారీలో సౌమ్య అదిరిపోయింది. ఇక ఇదే టైంలో అమ్మడు తన ఫాన్స్ ని ఒక ప్రశ్న వేసింది. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. " యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా..గైస్ మీరేమంటారు ?" అని అడిగింది. ఈరోజున ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి అంటే అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అకౌంట్స్ తెరవాల్సింది. ఇక ఇప్పుడు సౌమ్య కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి మరింత ఫెమిలియర్ కావడానికి ట్రై చేస్తోంది. మరి మీరేమంటారు.. 

కొన్నిసార్లు డబ్బు మ్యాటరే కాదు...ఆలోచనా విధానమే ముఖ్యం!

అనసూయ రోజురోజుకూ గ్లామరస్ గా తయారవుతూ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఇప్పుడు రెడ్ కలర్ శారీలో హాట్ మిర్చీగా కనిపించి సందడి చేస్తోంది. అనసూయ అందరి లాంటి యాంకర్ కాదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ తేల్చేసుకుంటుంది. సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది. చేసినన్నాళ్లు అనసూయ బుల్లితెర మీద చేసి అక్కడ రెస్పెక్ట్ లేకపోవడాన్ని భరించలేక ఆ షోస్ అన్నీ వదిలిపెట్టేసి బిగ్ స్క్రీన్ మీదకు వెళ్ళిపోయింది.   నటిగా బిజీ అయిన అనసూయ ఫుల్ టైం సినిమాలకే కేటాయిస్తుంది. కెరీర్లో ఎవరైనా ఎలా బెటర్మెంట్ కావాలని ఆశ పడతారో అనసూయ కూడా అలాగే ఆలోచించింది. చేతి నిండా సినిమాలు రెడీగా పెట్టుకుంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంటరెస్టింగ్ కోట్ తో అందరినీ ఆలోచింపచేస్తోంది. " జీవితంలో ఎదగాలి అంటే డబ్బు, హోదానే కాదు ... నీవు ఆలోచించే విధానం, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు ఉంటే అదే నిజమైన అభివృద్ధి" అనే అర్ధం వచ్చేలా ఒక కోట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో అనసూయకు వరుసగా షాప్ ఓపెనింగ్స్ వంటి అవకాశాలు వస్తున్నాయి.  ఇలా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద నటిస్తూ వెబ్ సిరీస్ మీద కూడా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ ని అప్ లోడ్ చేస్తూ ఇంకా పాపులారిటీ తెచ్చుకుంటోంది.

నేను జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమె!

బుల్లితెర తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుని, అలరిస్తున్న టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. ఇక పండగలు, స్పెషల్ డేస్ లో ప్రసారమయ్యే ఈ షోను మరింత అందంగా ముస్తాబు చేసి రెడీ చేశారు మేకర్స్.  ఇక ఇప్పుడు  ఈ షోకు సంబంధించిన లేటెస్ట్  ప్రోమో రిలీజ్ అయ్యింది.  అందులో హైపర్ ఆది ఓ సెన్సేషనల్ కామెంట్ చేశాడు. తాను జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం కొత్త యాంకర్  సౌమ్యరావు  అంటూ స్టేజి మీద అందరి ముందు చెప్పేసాడు. దీంతో అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేక ఈవెంట్స్ లో తన పంచ్ డైలాగ్స్ తో అదరగొడుతూ ఉంటాడు ఆది. ఐతే ఈ మధ్య కొంత కాలం నుంచి  జబర్దస్త్ లో ఆది కనిపించడం లేదు. దానికి కారణం ఆమె అంటూ అందరి ముందు అసలు విషయం బయట పెట్టాడు. తాను జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ ప్రోమోలో తెలిపాడు.  శ్రీదేవి డ్రామా కంపెనీ 15 వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్   “సంక్రాంతి శుభాకాంక్షలు” పేరుతో రాబోతోంది. ఇందులో రాకెట్ రాఘవ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. ఈ షోలో ఆది పెదరాయుడు గెటప్ లో కనిపించి కడుపుబ్బా నవ్వించాడు. మధ్యలో  రష్మి.. హైపర్ ఆదిని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. వాటికి ఆది కూడా కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు.  

షోలో కాబోయే భార్య పరువు తీసిన కమెడియన్!

‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకరికొకరు షో బుల్లితెర మీద ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.   శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ఈ షో ప్రసారమవుతుంది.. బుల్లితెర ఆర్టిస్టులు, సెలబ్రిటీలు తమ తమ రియల్ జంటలతో పాల్గొని సందడి చేస్తున్నారు.  ఇక ఇదే టైములో ఈ షోలో పెళ్లి కానీ జంటగా ఉన్న రాకేష్-సుజాత కూడా పాల్గొన్నారు. ఇక ఈ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ప్రోమో మొత్తమంతా  సెలబ్రిటీ కపుల్స్ తో ఫన్నీగా సాగిపోయినప్పటికీ ఫైనల్ లో మాత్రం ఒక ట్విస్ట్ కనిపించింది. "రాకేష్ స్కిట్స్ చూసి నువ్వు బలవంతంగా నవ్వినా సందర్భాలు ఉన్నాయా " అని అడిగేసరికి మాట్లాడితే చాలా ఓ నవ్వుతూ ఉంటుంది సుజాత ఆవిడ జడ్జిమెంట్ వల్లనే నా స్కిట్స్ అన్నీ దొబ్బుతున్నాయి"అన్నాడు. "రాకేష్ వేరే వాళ్లకు పంపిన మెసేజెస్ నువ్వెప్పుడైనా సీక్రెట్ గా చదివావా" అని సుజాతని అడిగింది శ్రీముఖి. మాకు ఆ విషయంలో చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయి. చాలా సార్లు డిస్కషన్ కూడా అయ్యింది. ఐనా సరే  సుజాత నా చాట్స్ చదువుతుంది” అని చెప్పాడు రాకేష్. ఆడియన్స్ ముందు ఎంత ఫన్ చేసినా ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవ్వరికైనా ఇలాంటివి తప్పవు అని తెలుస్తోంది. అలా ఒకరి గురించి ఒకరు చెప్పుకుని  ఇద్దరూ హర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇంతకు  రాకేష్ – సుజాత మధ్య అసలు ఏం జరిగింది ? రాకేష్ ఎవరికీ అంతలా మెసేజెస్ పెట్టాడు. సుజాత ఏ మెసేజెస్ చదివి బాధపడింది అనేది తెలియాలంటే  వచ్చేవారం ప్రసారమయ్యే  పూర్తి ఎపిసోడ్  చూడాలి. 

విషయం తెలియకుండా ఫన్ చేయొద్దు..బీబీ జోడి నుంచి తప్పుకోవడం పై అష్షు రియాక్షన్

సోషల్ మీడియా స్టార్ అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా.. ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ కి వెళ్ళింది.. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక స్మాల్ స్క్రీన్ పై వరుసగా ఆఫర్లు సంపాదించడం మొదలు పెట్టింది. అంతేకాదు స్పెషల్ షోస్ తో ఎంటర్టైన్ చేసింది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ మంచి ఆఫర్ ని కొట్టేసింది. ఏ మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న మూవీలో  ఆద్య అనే పాత్రలో అష్షురెడ్డి నటిస్తోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం కూడా మొదలు పెట్టింది అష్షు రెడ్డి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ ఎలా రీచ్ అవ్వాలో అష్షుని చూసి నేర్చుకోవాలి.  ఇక కొన్ని రోజుల క్రితం స్టార్ట్ ఐన బీబీ జోడిలో అష్షు మెహబూబ్ కి జోడీగా డాన్స్ చేసింది. ఐతే సడెన్ గా ఏమయ్యిందో ఏమో కానీ అష్షు ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. ఇక మెహబూబ్ కి కూడా ఒక వాయిస్ నోట్ పెట్టి డాక్టర్ మెడికల్ ఎమర్జెన్సీ అన్నారు..కంప్లీట్ రెస్ట్ అవసరమన్నారు..నేను రాలేను అని కూడా చెప్పింది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే తన స్టేటస్ లో "10 క్విక్ క్వశ్చన్స్" అనే టాస్క్ ఇచ్చింది. అందులో ఒకరు "బీబీ జోడి ఎందుకు మానేశారు" అని అడిగారు. " నాకు హెల్త్ ఇష్యూ ఉంది. రికవర్ అవడానికి వన్ మంత్ పడుతుంది. నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ఫన్ చేస్తే మాత్రం నాకు నచ్చదు. ప్రతీ విషయం అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వేరే రకంగా ఆలోచిస్తూ పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి. జరిగింది తెలుసుకోకుండా వేరే వారి గురించి అస్సలు ఫన్ క్రియేట్ చేయొద్దు" అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది.

దెయ్యంతో రొమాన్స్ చేయాలనుంది అంటూ ఆర్జీవీ లెవెల్లో చెప్పిన హైపర్ ఆది!

రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా "డేంజరస్" మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్ ని వెరైటీగా ప్లాన్ చేసాడు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి.. ఆమె కాళ్ల దగ్గర కూర్చుని ఆమె పాదాలను ముద్దాడుతూ కనిపించి సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు..ఈ మొత్తాన్ని ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు స్పూఫ్ గా చేసి చూపించారు. రేపు ఆదివారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయ్యింది.  ఇందులో చూస్తే హైపర్ ఆది రామ్ గోపాల్ వర్మగా, నాటీ నరేష్ అష్షు రెడ్డిగా నటించి డేంజరస్ మూవీ ప్రమోషన్ బిట్స్ ని స్పూఫ్ గా చేసి చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. నరేష్ పసుపు రంగు డ్రెస్ లో కుర్చీలో కూర్చుని "లెట్స్ వెల్కమ్ రాము" అని అనౌన్స్ చేసేసరికి "వచ్చిండు చూడు మన జిన్నాబాయ్" సాంగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంటే ఆది క్యాప్ పెట్టుకుని వచ్చి స్టేజి మీద నరేష్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.  "ఈరోజు నేను నీ అందాన్ని ఆస్వాదించడానికి వచ్చాను" అని ఆది అన్నాడు. నరేష్ సిగ్గుపడుతూ "వేర్ యు లుక్కింగ్ రాము " అని అడిగేసరికి "నీ లెగ్స్ అంటే నాకు చాలా ఇష్టం" అని నరేష్ కాలి స్లిప్పర్ తీసి చూసాడు. "ఎలా ఉంది" అని నరేష్ అడిగేసరికి "బాగుంది..నువ్ స్నానం చేసి ఉంటే ఇంకా బాగుండేది" అన్నాడు ఆది. "నాకు దెయ్యంతో రొమాన్స్ చెయ్యాలనుంది" అని ఆది అడిగేసరికి "రొమాన్సా..రా అని నరేష్ ఆదిని దగ్గరకు తీసుకుని మరీ ముద్దు పెట్టించుకున్నాడు".. ఇలా ఆది, నరేష్ చేసిన ఈ స్కిట్ ఈ షోకి హైలైట్ గా నిలవబోతోంది.

వసుధార తనకి అక్కర్లేదని చెప్పిన రిషి!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మా టీవీలో అత్యంత ఎక్కువ వీక్షకాదరణ పొందుతున్న ధారావాహిక. ఈ సీరియల్ లేటెస్ట్  ఎపిసోడ్-657లో వసుధార  పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్ కి వెళ్తుంది. రిషి తన కాలేజీ దగ్గరికి వస్తాడు. వసుధారతో తను గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. అప్పుడే రిషి దగ్గరకు వస్తుంది జగతి. "అన్ని జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోనవసరం లేదు రిషి. మర్చిపో" అని చెప్తుంది. "మీ శిష్యురాలు నాకు మంచి గుణపాఠమే చెప్పింది. మీరేమో నా పసి మనసును అర్థం చేసుకోకుండా చిన్నప్పుడే, అలా వదిలిపెట్టి వెళ్ళారు. నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో జవాబు చెప్పలేని  మీరు ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్తారు? మీ శిష్యురాలు మీకు కన్పిస్తే ఒక్కటి చెప్పండి. రిషీకి మోసపోవడం కొత్తేమీ కాదు. అలవాటే.. తను లేకపోయిన  తన జ్ఞాపకాలతో బ్రతికేస్తానని చెప్పండి. తను నాకు అక్కర్లేదని కూడా చెప్పండి" అని చెప్పేసి అక్కడి నుండి రిషి వెళ్ళిపోతాడు. వసుధార హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ అమ్మనాన్నలైన  చక్రపాణి, సుమిత్రలను చూస్తుంది. "అమ్మ.. లే అమ్మ" అని అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత తన తండ్రి చేయి పట్టుకొని "నాన్న మీకు గౌరవం పెంచే పనినే చేశాను. కాని ఎప్పుడు మిమ్మల్ని కించపరిచే పనిని చెయ్యలేదు నాన్న" అని ఏడుస్తుంది. వసుధార దగ్గరికి రాజీవ్ వస్తాడు. "నువ్వు నేను ఈ ప్రపంచానికి ఇప్పుడు భార్యాభర్తలం" అని రాజీవ్ అంటాడు. దానికి వసుధార "బావ నోరు అదుపులో పెట్టుకో" అని అంది. "అదుపులో ఉంటుంది వసు.. ఇప్పుడు మనమిద్దరం అనఫీషియల్ గా భార్యభర్తలమన్నమాట" అని చెప్తాడు. "పురాణాల్లో రాక్షసుల ముగింపు ఎలా జరిగిందో నాకు తెలుసు. నీకు అదే గతి పడుతుంది" అని చెప్తుంది వసుధార. "ఏంటి శాపాలు పెడుతున్నావా వసు. మీ రిషీ సర్ పాపం.. తన పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్ళలో మునిగిపోయే కాగితం పడవలా ఉంది. పడవే కానీ మునగక తప్పదులే. తనంటే నీకు ఇష్టమే, నువ్వంటే తనకు కూడా ప్రాణమే. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి అని అనుకుంటున్నాడు. కాబట్టి రిషి నీకు దూరమైనట్టే" అని అంటాడు. "పగటి కలలు కనకు బావ" అని వసుధార చెప్తుంది. ఆ తర్వాత చక్రపాణి, సుమిత్రలకు మెలకువ వస్తుంది. వాళ్ళు స్పృహలోకి రావడం చూసి, చాలా సంతోషపడుతుంది వసుధార. వెంటనే అక్కడున్న సిస్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నువ్వు నేను కలిసి ఉండలేం.. ముకుందకి తేల్చి చెప్పేసిన మురారి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్.. బుల్లితెరపై సరికొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్టార్ మాటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కోడళ్ళుగా ఒకే ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణ, ముకుందలది వేరు వేరు కథలు. మొదట ముకుందని ప్రేమించి, అనుకోని పరిస్థితుల్లో కృష్ణని పెళ్ళి చేసుకున్న మురారి కథే.. ఈ సీరియల్. బుధవారం జరిగిన ఎపిసోడ్-51లో మురారి సస్పెన్షన్ ని రద్దు చేపించినందుకు, కృష్ణకి థాంక్స్ చెప్తూ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేపించారు. అయితే మొదటగా మురారి కేక్ కట్ చేసి, వాళ్ళ పెద్దమ్మ భవానీకి తినిపించబోతుండగా.. "ముందు కృష్ణకి తినిపించు" అని సైగ చేస్తుంది. ఆ తర్వాత "కృష్ణ కేక్ తింటుందా? లేదా?" అనే అనుమానంతో అటువైపుగా చూస్తాడు మురారి.  "సరే అన్నట్టుగా" కృష్ణ సైగ చేయడంతో తనకి కేక్ తినిపిస్తాడు. ఇలా కృష్ణకి ప్రేమతో కేక్ తినిపించడం చూసిన‌ ముకుంద జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత "కృష్ణ నువ్వు మురారికి తినిపించు" అని రేవతి చెప్తుంది. "నువ్వు కూడా తినిపించు అక్క" అని భవానిని అడుగుతుంది రేవతి. భవాని కేక్ తీసుకొని కాసేపు "తినిపించాలా? వద్దా?" అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక తినిపించదేమోనని కృష్ణ దిగులుగా వెళ్ళిపోతుండగా.. "నీ భార్యకి అంత ఇగో ఏంటి మురారి. కాసేపు కూడా ఆగట్లేదు. కేక్ తినిపించకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ ని పార్శిల్ చేయాలా? ఏంటి" అని భవాని అడుగుతుంది. అప్పుడు కృష్ణ ఆగి భవాని దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత నవ్వుతూ కృష్ణకి కేక్ తినిపిస్తుంది భవాని. దీంతో‌ కుటుంబసభ్యులంతా చప్పట్లతో కృష్ణకి అభినందనలు తెలుపుతారు. అయితే వీళ్ళంతా కృష్ణకి దగ్గరవ్వడం చూడలేని ముకుంద, జెలస్ తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ముకుంద తన గదిలోకి వెళ్ళిపోతుంది.  "నిన్ను కలవాలి మురారి" అని మెసేజ్ చేస్తూ ఉంటుంది. మురారి తనని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. "ఏంటి మురారి. ఏం జరుగుతుంది. నా ప్రేమని మర్చిపోయావా? ఏంటి మీ సరసాలు" అని అడుగుతుంది. "నిన్ను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. నా మనసు తలుపు ఎప్పుడో మూసుకుపోయింది" అని సమాధానమిస్తాడు మురారి. "చాలా రోజుల నుండి ఆ తలుపు బయట నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను" అని అంది ముకుంద. "నువ్వు.. నేను ఎప్పటికీ కలసి ఉండలేం. నువ్వు మా కుటుంబంలో ఒక సభ్యురాలివి మాత్రమే. దయచేసి మళ్ళీ ఇలా కలవాలని నన్ను పిలవకు. ఇలా మన ఇద్దరిని, ఎవరు చూసినా బాగోదు" అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

దీప గురించిన నిజం సౌందర్యకి తెలుస్తుందా!

'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక.  ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సీరియల్.. ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ లతో సాగుతోంది. మోనిత సడన్ ఎంట్రీ. కార్తిక్, దీప, సౌందర్యలతో పాటు కుటుంబం అంతా కలిసిపోవడం. సౌందర్యకి తెలియకుండా కార్తిక్, దీపలు దాచే సీక్రెట్స్.. వెరసి ఇప్పుడు ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. బుధవారం వచ్చిన ఎపిసోడ్-1559లో ఇంట్లోకి హిమ, శౌర్యలతో పాటుగా సౌందర్య, కార్తిక్, దీపలు వస్తారు. వాళ్ళు వచ్చేకంటే ముందే ఇంట్లోకి వచ్చేస్తుంది మోనిత. మోనితని చూసి "ఎందుకే  మళ్ళీ వచ్చావ్?" అని జుట్టుపట్టుకొని సౌందర్య అడుగుతుంది. "అబ్బా ఆంటీ.. వదలండి. ఇప్పటికే మీ కొడుకు నా వంక చూడట్లేదు. ఇక జుట్టు  రాలిపోతే అసలే చూడడు" అని మోనిత సమాధానమిస్తుంది. పక్కనే ఉన్న దీప "బయటకు పోవే" అని అంటుంది. "ఎందుకు దీప.. అంత కంగారు. ఆంటీకి ఏం చెప్పలేదా? అయ్యో ఆంటీ వీళ్ళు మీకు ఏం చెప్పలేదా? ఇన్నాళ్ళు వీళ్ళు మీ దగ్గరికి రాకుండా ఎందుకు ఉన్నారో మీకు నిజంగా చెప్పలేదా?" అని మోనిత చెప్తూ ఉంటుంది. మధ్యలో కార్తిక్ కలుగజేసుకొని "మోనిత.. ఫస్ట్ ఇంట్లోంచి బయటకెళ్ళు" అని కోప్పడతాడు. "ఇన్నాళ్ళు చెప్పలేదంటే ఓకే కానీ.. ఆంటీ కనిపించాకైనా నిజం చెప్పాలి కదా కార్తిక్" అని మోనిత సాగదీస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య "ఏంట్రా ఏమిటో చెప్పాలంటుంది. ఏంటది?" అని కార్తిక్ ని అడుగుతుంది. వెంటనే దీప "అవన్నీ పట్టించుకోకండి అత్తయ్య. ఇది మన కుటుంబంలో ఎలా గొడవలు పెట్టాలని మాత్రమే చూస్తుంది" అని అంటుంది. ఆ తర్వాత మోనితని బయటకు గెంటేస్తుంది దీప. ఆ తర్వాత చారుశీల ఇంటికొస్తుంది మోనిత. అక్కడ చారుశీల, మోనిత ఇద్దరూ మాట్లాడుకుంటారు. "అసలు ఏం జరుగుతుంది" అని చారుశీల అడుగుతుంది. మోనిత మాట్లాడుతూ "కథ మళ్ళీ మొదటికి వచ్చింది.  పన్నెండు సంవత్సరాల నుండి కార్తీక్ వెంటపడుతున్నాను. దీపని మధ్యలో తప్పించి, కార్తీక్ కి దగ్గరయ్యాను. కానీ దీప వచ్చి గద్దలా తన్నుకుపోయింది. ఇప్పుడు కూడా దీపని సైడ్ చెయ్యడం సులువే. కానీ ఆ సౌందర్య నాకంటే డేంజర్. రివాల్వర్ రాణి. తేడా వస్తే కాల్చి పడేస్తుంది" అని చెప్తుంది. అలా చెప్పేసరికి "మరి కార్తీక్ ని వదిలేయచ్చు కదా" అని చారుశీల అంటుంది. దానికి మోనిత "అది జరగని పని. నేను కార్తిక్ ని వదిలిపెట్టను. కార్తిక్ ప్రేమను ఎలాగైనా దక్కించుకుంటాను. కార్తిక్ ని నా సొంతం చేసుకుంటాను " అని చెప్తుంది. కార్తిక్, దీప, హిమ, శౌర్య అందరూ కలిసి సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అందరూ సరదగా ఉంటారు.‌ సౌందర్య మాత్రం మోనిత చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కార్తిక్, దీపలు ఎలా ఉంటున్నారో ప్రతీది గమనిస్తూ, వీళ్ళు ఏదో దాస్తున్నారని ఇద్దరిపై అనుమానపడుతుంది సౌందర్య. అయితే మేడ మీదకెళ్ళి కార్తిక్, దీపలు మాట్లాడుకుంటున్నప్పడు, రహస్యంగా వినాలని చూస్తుంది సౌందర్య. కిటికీలో నుండి సౌందర్యని చూసిన దీప మెల్లిగా కవర్ చేస్తుంది. మాట మార్చి కార్తిక్ ని డైవర్ట్ చేసేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మా సంక్రాంతి పందెం...అంటూ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న బుల్లితెర నటులు!

"ఇన్నాళ్లు మీరు సంక్రాంతికి కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు చూసుంటారు..కానీ ఈ సంక్రాంతికి అంతకు మించిన పందెం చూడబోతున్నారు" అంటూ సుడిగాలి సుధీర్ "మా సంక్రాంతి పందెం" ఈవెంట్ ని హోస్ట్ చేసిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. "మా సంక్రాంతి పందెం సందడి చేయడానికి మా స్టార్ మా మొత్తం సిద్ధం" అని చెప్పాడు సుధీర్.  ఇక ఈ ఈవెంట్ కి బుల్లితెర యాక్టర్స్ మొత్తం ఎంట్రీ ఇచ్చారు.  ఇక "ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్" బాలయ్య సాంగ్ కి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చాడు. ఇక చంద్రహాస్ ఎలా ఐతే ఆటిట్యూడ్ చూపిస్తూ పోజులు, ఎక్స్ప్రెషన్స్ పెడతాడో జబర్దస్త్ అవినాష్ కూడా అలాగే ఇమిటేట్ చేసి చూపించి ఎంటర్టైన్ చేసాడు. "నీ ఆటిట్యూడ్ కి చాలా ట్రోల్ల్స్ వచ్చాయి..అంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది అని అవినాష్ అడిగేసరికి..పిచ్చ లైట్ తీసుకున్నా" అని ఆన్సర్ చేసాడు చంద్రహాస్. తర్వాత "పేట" మూవీ నుంచి "మరణం..మాస్ మరణం" సాంగ్ కి తండ్రికొడుకులైన ప్రభాకర్-చంద్రహాస్ ఇద్దరూ డాన్స్ చేశారు. బుల్లితెర స్టార్స్ తో రాంప్ వాక్ చేయించారు. ఈ షోకి "కళ్యాణం..కమనీయం" మూవీ టీమ్ వచ్చింది. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న అమరదీప్-తేజస్వినిని స్పెషల్ గా ట్రీట్ చేశారు. అలాగే బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ అద్దిరిపోయే సాంగ్స్ పాడి స్టేజి మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు. ఇక అమరదీప్-తేజస్వినికి అందరి తరపున బొట్టు పెట్టి పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ పండగ కాబట్టి చేతికి గాజులు వేసి చీర-సారె పెట్టారు. వాళ్ళతో సరదా గేమ్స్ కూడా ఆడించారు. ఇక ఆ జంట నిరుపమ్ పరిటాల-మంజుల భార్యాభర్తల దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక బుల్లితెర స్టార్స్, కామెడీ స్టార్స్ అంతా రెండు భాగాలుగా విడిపోయారు. ఒక టీమ్ చిరంజీవిని పొగిడారు. " ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్..చిరంజీవి మెగాస్టార్" మరో టీమ్ లో అవినాష్ తో ఉన్న వాళ్లంతా "కోకో కోలా పెప్సీ...బాలకృష్ణ సెక్సీ" అంటూ మాస్ స్టయిల్లో డైలాగ్స్ చెప్పారు. ఇలా ఆడియన్స్ అలరించడానికి  ఈ పండగ ఈవెంట్ 14 వ తేదీన స్టార్ మాలో రాబోతోంది.

'ఆదికి ఏది ఆగదు' అన్న శేఖర్ మాస్టర్!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం పర్వాలేదనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇందులో ఆది "ప్రేమాభిషేకం" మూవీలో నాగేశ్వరావు గెటప్ తో "ఆగదు ఆగదు" అనే పాట పాడుకుంటూ మందు బాటిల్ ని మరో వైపు కుక్కను పట్టుకొచ్చాడు స్టేజి మీదకు. "ఏం ఆగదు" సర్ అని ప్రదీప్ అడిగాడు. "ఈ స్టేజిని చూస్తే డాన్సర్ లకు ఆగదు..ఢీ టైటిల్ ని చూస్తే కొరియోగ్రాఫర్లకు ఆగదు, శ్రద్దాదాస్ ని చూస్తే నాకు ఆగదు" అని కామెడీ చేసాడు ఆది. "అది నాకు తెలుసు నీకు ఏదీ ఆగదు " అని శేఖర్ మాస్టర్ పంచ్ వేసాడు. "ఇందాక ఎవడ్రా మా ఇంటి ముందుకు వచ్చి డాన్సులు వేసింది" అని ఆది సీరియస్ అయ్యేసరికి .."ఏయ్ మా మాస్టర్ల గురించి తక్కువ చేసి మాట్లాడకు ఆది.  ఎండనక, వాననకా, రేయనక, పగలనక , దెబ్బలని కూడా లెక్క చేయకుండా ప్రాణాల్ని ఫణంగా పెట్టి..పస్తులుండి, అప్పులు చేసి టైటిల్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు..వాళ్ళురా మా మాస్టర్లంటే" అని ప్రదీప్ డైలాగ్ చెప్పేసరికి అందరూ వీలలు వేసి ఎంకరేజ్ చేశారు. ఆది లవ్ లో ఫెయిల్ అయ్యి మందు బాటిల్ తెచ్చుకున్నట్లు చెప్పి నవ్వించాడు. "అప్పట్లో ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు చిన్న తేడా ఉంది ఉంది..అప్పట్లో అమ్మాయిని ప్రేమిస్తే అమ్మడు అని తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు అమ్మడు..లెట్స్ డూ కుమ్ముడు అని తిరుగుతున్నాం" అని ప్రేమ గురించి చెప్పాడు. ఇంతకు నువ్ ప్రేమించిన అమ్మాయి ఎవరు అని ప్రదీప్ అడిగేసరికి మా పక్కింట్లో ఉన్న దివ్య అని చెప్పాడు ఆది.  అంతలో దివ్య "సిరిమల్లె పువ్వా" సాంగ్ పాడుకుంటూ బయటికి వచ్చింది.  ఇంతలో బిందె పట్టుకుని మోడల్ జెస్సి "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ దివ్య దగ్గరకు వచ్చాడు. "ఇంతకు ప్రదీప్ వీళ్లల్లో అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "అమ్మాయి మేల్ గెటప్ వేసినట్టుంది అంట నువ్వు పక్కకు రా" అన్నాడు ఆది. "దివ్య నన్ను పెళ్లిచేసుకుంటావా" అని ఆది అడిగేసరికి "నాకు నువ్వంటే ఇష్టం లేదు..జెస్సి అంటే ఇష్టం" అని చెప్పింది దివ్య..తర్వాత జెస్సి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగేసరికి "ఏదో ఆది నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పా" అంతే అని వెళ్ళిపోతుంది. "అదేంటి జెస్సి మందు తాగాక కదా ఎవరైనా ఊగుతారు..నువ్వెంటి ఊగేసాక తాగుతున్నావ్" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు.