నీతి సూక్తులు చెప్తున్న గీతూ రాయల్!

బిగ్ బాస్ సీజన్ - 6  గీతూ రాయల్ అందరికి తెలిసిందే.. బిగ్ బాస్ లో అందరిని ఒక అట ఆడుకొని ఎవరూ ఉహించని విధంగా బయటకొచ్చింది. "టైటిల్ విన్నర్ అనుకున్న నన్ను ఇలా ఎలిమినేట్ చేస్తారా" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన కొందరు ఆఫర్స్ తో బిజీ కాగా మరికొందరు 'బిబి జోడీ' లో పాల్లొంటూ తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే గీతూ మాత్రం ఖాళీగానే ఉంటుంది.  బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన ఫ్రెండ్ ఆదిరెడ్డి అంటూ చెప్తూ ఉండేది. ఆదిరెడ్డి కి సర్ ప్రైజ్ గా తన ఫ్యామిలీని కలిసిన గీతూ.. తనతో చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్ లో షేర్ చేసింది. ఫైమా బయటకొచ్చాక తనని కలిసి వీడియో చేసింది. ఇలా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని కలిసి ఆ వీడియోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది గీతు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చిన్న చిన్న షోస్ లో మెరిసి కూడా.‌. ఆమెకున్న ఆటిట్యూడ్ కి ఎక్కువగా ఫ్యాన్ బేస్ సంపాదించుకోలేకపోయింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది గీతూ.. అందులో  "మనది కానిది మనం తీసుకుంటే.. మనకు వచ్చేది భగవంతుడు రానివ్వడు " అంటూ చెప్పింది. దీంతో ఈ వీడీయోని చూసిన నెటిజన్లు... "అందుకే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "ఇక ఇలా నీతిసూక్తులు చెప్పుకునే ఉండాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి గీతూ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.  

చీటింగ్ కేస్ పెడతానన్న ముకుంద.. మురారి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -68 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో కృష్ణకి మురారి మీద డౌట్  వస్తుంది. ముకుంద ఎందుకు వచ్చింది అని ప్రశ్నలు వేస్తునే ఉండడంతో కృష్ణ సమాధానం చెప్పలేకపోతుంటాడు. నేను పిలిచినా రాననే చెప్పింది కానీ వాళ్ళ అమ్మ నాన్న నచ్చచెప్పి పంపిచారని ముకుంద చెప్తాడు. సరే అయితే ముకుంద ఏమైనా కండిషన్ పెడితే అది తప్పకుండా చెయ్యండి లేదంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అని కృష్ణ  చెప్తుంది. ముకుంద చెప్పిన కండిషన్ చెబితే నువ్వు ఏమైపోతావో కృష్ణ అని మనసులో ఆలోచించుకుంటూ మురారి పడుకుండిపోతాడు. మరోవైపు మురారి గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. మురారి నన్ను తీసుకొచ్చింది నా మీద ప్రేమ తో కాదా?  కృష్ణ చెపితే తీసుకొచ్చాడా? అంటూ కోపంతో.. మురారిని  'గార్డెన్ కి రా 'అని మెసేజ్ చేస్తుంది. మురారి నిద్ర పోవడంతో ఆ మెసేజ్ చూసుకోలేకపోతాడు. దాంతో ముకుంద కోపంతో రగిలిపోతుంది.  మరోవైపు ముకుంద గురించి ఆలోచిస్తూ రేవతి టెన్షన్ పడుతుంది. నిద్ర పట్టక భవాని దగ్గరికి వెళ్లి.. మనం ఇప్పుడు ముకుందని తీసుకురావడం కరెక్ట్ కాదక్కా.. ఒక వైపు పెళ్ళైన జంట గదిలో ఉండగా, అవతలివైపు ముకుంద గదిలో ఒంటరిగా ఉండటం బాగోలేదని చెప్తుంది. దానికి భవానీ నాక్కూడా అలాగే అనిపిస్తుందని అంటుంది. మరి ఏం చేద్దామని భవానీ అడుగుతుంది. వీలైనoత త్వరగా ఆదర్శ్ ను ఇంటికి వచ్చేలా చెయ్యాలని చెప్తుంది. నేను అదే పనిలో ఉన్నాను రేవతి అని భవానీ చెప్తుంది. అయితే వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్ని ముకుంద వింటుంది.  రేవతి అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి.. నాకు మురారి అంటే ఇష్టమని తెలిసిపోయిందా ఏంటి? ఎలాగైనా వీళ్ళకి డౌట్ రాకుండా మురారిని సొంతం చేసుకోవాలని ముకుంద ఆలోచిస్తుంటుంది. మురారి స్టేషన్ కి కార్ లో వెళ్తుంటే.. కార్ వెనకాల సీట్ లో ఉన్న ముకుంద అద్దంలోకి చూస్తూ గుడ్ మార్నింగ్ అని అనడంతో మురారి షాక్ అవుతాడు. కార్ ఒక్కసారిగా ఆపి.. నువ్వేంటి ఇక్కడ, దిగు ముందు. ఎవరైనా చూస్తారు అంటూ టెన్షన్ పడుతాడు. "లేదు నేను స్టేషన్ లో కంప్లేంట్ ఇవ్వాలి. నా ప్రేమ మిస్ అయింది. మిస్సింగ్ కేసు పెట్టాలి. నన్ను ఒకరు చీట్ చేసారు. నా మీద ప్రేమతో నా పుట్టింటి నుండి తీసుకొచ్చారని అనుకున్నా.. కానీ తన భార్య తీసుకురమ్మంటే తీసుకొచ్చారు" అని ముకుంద అంటుంది. అలా అనగానే ఎవరైనా చూస్తారేమో అని మురారి కంగారు పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

వసుధారకి దేవయాని వార్నింగ్.. క్షమించమని అడిగిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -674 లోకి అడుగు పెట్టింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో వసుధార దగ్గరికి పెద్దమ్మ ఎందుకు వెళ్ళింది అంటూ రిషి కోపంగా వస్తాడు. నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను రిషిని వదిలి వెళ్ళని దేవయాని అంది. మీకన్నా నేను మొండి దాన్ని మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. వెళ్లిపోండి మేడం అని వసుధార అంటుంది. "వెళ్ళిపో.. వెళ్ళిపో అంటున్నావ్. ఇదేం నీ ఇల్లు కాదు. గౌతమ్ ది అంటే రిషిది అన్నట్లేగా" అని దేవయాని అనేసరికి.. చక్రపాణి ఇంట్లో నుండి బయటకు వచ్చి.. "ఇది రిషి సర్ ఇచ్చిందే కదమ్మా" అని అంటాడు. ఇస్తే మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటారా? వసుధార నీకు భయమే లేదు అనుకున్నాను.. సిగ్గు కూడా లేదా?  అని దేవయాని అంటుంది. ఈ ఇల్లు నాకు అఫీషియల్ గా ఇచ్చింది. మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అని వసుధార అంటుంది. ఇద్దరి మధ్య గొడవ ముదురుతుండగా అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. "ఏంటీ పెద్దమ్మా.. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏం జరుగుతుంది. మన పర్సనల్ వాటికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దయచేసి వెళ్దాం పెద్దమ్మ "  అని రిషి అంటాడు. అసలు రిషికి ఎలా తెలుసు.. నేను ఇక్కడికి వచ్చానని వసుధార చెప్పిందా.. పిలవగానే రిషి వచ్చేసాడా అని దేవయాని మనసులో అనుకుంటుంది.  మా పెద్దమ్మ మిమ్మల్ని ఏమైనా బాధపెడితే క్షమించండి అంటూ చేతులు జోడించి చెప్తాడు రిషి. అలా వసుధారకి సపోర్ట్ చేసినట్లు రిషి మాట్లాడడంతో వసుధార హ్యాపీ గా ఫీల్ అవుతుంది. రిషి, దేవయాని కలిసి వాళ్ళింటికెళ్తారు. అక్కడే ఉన్న జగతి, మహేంద్రలతో "రిషిని తీసుకొచ్చాను" అని దేవయాని చెప్తుంది. రిషిని ఇంటికి  తీసుకొచ్చినందుకు థాంక్స్ అని జగతి చెప్తుంది. మళ్ళీ మా ముగ్గురిని విడదీయకండి వదిన అని మహేంద్ర చెప్తాడు. వసుధార గురించి ఆలోచిస్తూ "నేను వేరొకరి భార్య గురించి ఆలోచించడం మర్యాద కాదు" అని రిషి అనుకుంటాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కనకం కల నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. మధ్యతరగతి ఇంట్లో ఉండే కష్టాలు పోవాలంటే గొప్పింటికి కోడళ్ళని చేయాలనే ఒక అమ్మ తపనతో మొదలైన ఈ కథ.. రోజు రోజుకి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కాగా ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 7 లో.. ఇంతకు ముందు వచ్చిన కళావతినే నీకు భార్యగా వస్తే ఏం చేస్తావ్ అని రాజ్ తో అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా..రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్ ఇంట్లో జరుగుతున్న పూజకు కనకం తన కూతుళ్ళతో వస్తుంది. లోపలికి వెళ్ళేముందు సెక్యూరిటీ వాళ్ళని ఆపుతాడు. పాస్ చూపించు అనగా... మొత్తం వెతుకుతుంది కనకం. తీరా చూస్తే పాస్‌లు మర్చిపోయి వస్తారు. సెక్యూరిటిని ఎంత బ్రతిమాలినా కూడా వినిపించుకోడు... లోపలికి వెళ్లనివ్వడు.  విసిగిస్తున్నారని కనకం కూతురు అప్పును తోసేస్తాడు సెక్యూరిటి.  అప్పుడే కనకం మరో కూతురు కావ్య పాస్ లు పట్టుకొని వస్తుంది. పడిపోబోతుంటే అప్పు ని పట్టుకుంటుంది కావ్య. ఇంట్లో వాళ్ళే కాదు.. ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా పొగరు అంటూ సెక్యూరిటికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత అందరూ పాస్ లు తీసుకొని లోపలికి వెళ్తారు. మరోవైపు ఇంటికెళ్తున్న కావ్యని చూసి "మీరు వెళ్లిపోతున్నారా.. పూజ కి ఉండట్లేదా?" అని కళ్యాణ్ అడుగుతాడు. కావ్య వెళ్లిపోతున్నా అని చెప్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు కూడా మా డబ్బుని చూసి వస్తున్నారు. నిజానికి ఈ పూజకి రావడానికి మీకు ఒక్కరికే అర్హత ఉంది అని అంటాడు. ఒక కవిగా పిలుస్తున్నాను.. వినాయకుడు మీ మీద అలుగుతాడని కళ్యాణ్ చెప్పేసరికి సరే అంటూ కావ్య ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. రాజ్ దృష్టిలో స్వప్నని ఎలా పడకొట్టాలని కనకం ఆలోచిస్తుంది. " అటుగా వస్తున్న రాజ్ ని డ్యాష్ ఇవ్వమని చెప్తుంది.  అయినా రాజ్ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని చూసి.. ఆ డాన్స్ స్వప్నతో చేయించాలని, ఆ డాన్స్ చేసే అమ్మాయిని కిందకి పడేలా చేసి.. ఆ అమ్మాయి ప్లేస్ లో  స్వప్నని రెడీ చేస్తుంది కనకం. నిజానికి స్వప్నకి డాన్స్ రాదు. కావ్య నేర్పిస్తూ ఉంటుంది. తన కూతళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేయాలనే కనకం ఆశ ఫలిస్తుందా లేదా చూడాలి.

30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను!

సుమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు..అలాంటి సుమ మూవీ ప్రొమోషన్స్ మాత్రమే కాదు కాలేజీ స్టూడెంట్స్ కూడా చిట్ చాట్ చేస్తూ వెరైటీ అండ్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి నవ్వించింది. ఎక్కడ అంటే మద్రాస్ ఐఐటి కాలేజీలో. రీసెంట్ గా ఆమె ఆ కాలేజీ క్యాంపస్ కి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబులు ఇచ్చింది. "క్యాంపస్ లోకి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి " అని అడిగేసరికి "మన ఊరిలో మేకలు తిరిగినట్టు ఇక్కడ జింకలు తిరుగుతున్నాయి. మన ఊరిలో కూకలు తిరిగినట్టు ఇక్కడ కోతులు తిరుగుతున్నాయి. ఇది కాలేజా, అడవా అన్నట్టుగా ఉంది. ఇంత ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ క్యాంపస్ లో చదువు విషయం ఏమో కానీ రొమాన్స్ బాగా జరుగుతుందేమో అన్నట్టుగా ఉంది.  ఇంకా నేను పుట్టింది పాలక్కాడ్ లో నా 15 ఇయర్స్ ఏజ్ లో యాంకరింగ్ లోకి వచ్చాను. అప్పుడు మా అమ్మ తెలుగు నేర్చుకుని మాకు తెలుగు నేర్పి ఇక్కడికి పంపించింది. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది. నాకు పేరు రావాలి రావాలి అంటే రాదు. ఏం చేయాలి అనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేసినప్పుడే పేరు వస్తుంది. నా ఏజ్ కి నాకు క్లారిటీ లేనే లేదు..ఎందుకంటే నేను ఇంటర్ లో బైపీసీ చేశా డిగ్రీలో బీకామ్ చేసి తర్వాత ఎంకామ్ చేశా. ముందు అకౌంట్స్ సెక్షన్ లోకి వెల్దామనుకున్న తర్వాత టీచర్ అవుదామనుకున్న తర్వాత ఏదో అలా అలా చేస్తూ చేస్తూ వెళ్తే దానికి యాంకర్ అని పేరు వచ్చింది.  "ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్" అనే సంస్థ నా డ్రీం..ఎందుకంటే నన్ను ఇష్టపడి ఇంత దాన్ని చేసిన ఆడియన్స్ కి నేను కూడా ఎంతో కొంత చేయాలి అనుకున్నా. లేదంటే వయిపోతానేమో అని భయం వేసింది. నాకు వచ్చేదాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలని ఇది స్టార్ట్ చేసాను... 30  మంది స్టూడెంట్స్ ని  అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యేవరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు." అని చెప్పింది సుమా..ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

బీబీ జోడీస్ మధ్య ఫైట్...ఫైర్ ఐన జడ్జెస్...నేను ఇంక ఈ షో చేయను!

బీబీ జోడి ప్రతీ వారం ఏదో ఒక కాంట్రావర్సీతో ఆడియన్స్ అటెంషన్ ని తమ వైపు తిప్పుకుంటోంది. రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ థీమ్ "డైరెక్టర్స్ స్పెషల్".  ఇక ఇందులో ఒక్కో పెయిర్ డాన్స్ ని ఇరగదీశారని చెప్పాలి. మెహబూబ్ – శ్రీ సత్య ఇద్దరూ డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ అని చెప్పి రోబోటిక్ పెర్ఫార్మెన్స్  చేసి చూపించారు. ఐతే ఆరియానా వీళ్ళ డాన్స్ మీద రియాక్ట్ అయ్యింది.."త్రివిక్రమ్ గారికి డేడికేట్ చేస్తున్నామన్నారు..కానీ మాకు శంకర్ గారి రోబో కనెక్ట్ ఐన ఫీల్ వచ్చింది" అంది. "నేను కూడా త్రివిక్రమ్ అంటే వేరే ఎక్స్పెక్ట్ చేసాను" అంది భానుశ్రీ.."త్రివిక్రమ్ స్టైల్ అంటే ఎట్లా ఉండాలని మీ ఆలోచన" అని వెంటనే సదా అడిగేసింది. "త్రివిక్రమ్ స్టైల్ అంటే ఆలా వైకుంఠపురం స్టైల్" అని అవినాష్ చెప్పాడు. "మెడ్లే ఉండాలి మేడం నాలుగు పార్టులు తీసుకుని కొట్టేస్తే అదే డాన్స్ మేడం...కానీ త్రివిక్రమ్ గారు ఒక వేళ ఇది చూస్తే నా సాంగ్ కి రోబోలా బాగా చేశారురా అనిపించాలి కదా మేడం" అని మెహబూబ్ కన్విన్సింగ్ గా చెప్పాడు. "కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు మా దాంట్లో పాయింట్స్ లేవా అండి...ఎందుకు ఒక పాయింట్ లో పెట్టేసి, కొట్టేసి, హైప్ ఇచ్చేసి..వాట్ ఐస్ థిస్ " అని ఫైర్ అయ్యింది ఆరియానా. ఇంతలో పక్కనుంచి భానుశ్రీ ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో తెలీదు.  తర్వాత అర్జున్ కళ్యాణ్ - వాసంతి టీం హాట్ పెర్ఫార్మెన్స్ చేశారు. డాన్స్ ఐపోయాక "రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కాబట్టి నాకు ఇంకొంచెం డాన్స్ మూవ్మెంట్స్ ఉంటే లిఫ్టింగ్ లు, రొమాంటిక్ స్టెప్స్ ఉంటే" అన్నాడు అవినాష్. "మీకు ఎవరు చెప్పారు ఇది డాన్స్ కాదు అని" అని సదా ఫైర్ అయ్యింది. తర్వాత ఆరియానా-అవినాష్ జోడి మధ్య వార్ జరిగింది. " మీరు పదికి పది మార్కులు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. నేను ఇంక ఈ షో చేయను" అని అవినాష్ మైక్ అక్కడ పెట్టేసి షోలోంచి లేచి వెళ్ళిపోయాడు.

నవ్యస్వామికి ప్రొపోజ్ చేసిన అర్జున్ దాస్!

బీబీ జోడి స్టేజి మీదకు ఈ వారం ఎపిసోడ్ లో బుట్టబొమ్మ టీం వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అర్జున్ దాస్, నవ్య స్వామి, అనైక, సూర్య వచ్చారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లు అయ్యాకా ధమాకా టీం-పటాకా టీమ్ లోని లేడీస్ కి ఒక టాస్క్ ఇచ్చింది హోస్ట్ శ్రీముఖి. ఆ టాస్క్ లో గెలిచిన అమ్మాయికి "బుట్టబొమ్మ" టైటిల్ ఇవ్వాలని అర్జున్ కి చెప్పింది. అంతే కాదు అదనపు కండిషన్ అంటూ ఆ బుట్టబొమ్మకు లవ్ ప్రొపోజ్ చేయాలని కూడా అర్జున్ కి చెప్పింది.  తర్వాత సిక్స్ లేడీ కంటెస్టెంట్స్ కి రకరకాల మ్యూజిక్స్ ప్లే చేసి వినిపించారు.. లేడీస్ అంతా ఆ మ్యూజిక్స్ ని హమ్ చేశారు. ఐతే ఈ టాస్క్ లో ఇద్దరు విన్నర్స్ అంటూ అర్జున్ దాస్ కాసేపు కంటెస్టెంట్స్ ని కంగారు పెట్టి చివరికి "ఫైమా" కి బుట్టబొమ్మ టైటిల్ ని ఇచ్చాడు..అలాగే శ్రీముఖిని కూడా విన్నర్ గా ప్రకటించాడు. ఇప్పుడు ఇద్దరికీ లవ్ ప్రొపోజ్ చేయాలి అనే కండిషన్ ఉండడంతో శ్రీముఖి, ఫైమా ఇద్దరూ సిగ్గు పడుతూ స్టేజి మీద నిలబడ్డారు. కానీ అర్జున్ దాస్ ప్లేట్ ఫిరాయించి తన మూవీ హీరోయిన్ నవ్య స్వామిని పిలిచి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేయి పట్టుకుని ప్రొపోజ్ చేసాడు. ఆ సీన్ చూసి అవినాష్ స్టేజి మీదకు వచ్చి వెటకారంగా నవ్వి వెళ్ళాడు.  ఇక  శ్రీముఖి, ఫైమా ఇద్దరూ బాధపడుతూ బ్యాక్ గ్రౌండ్ లో "ఆడజన్మకు ఎన్ని శోకాలో" అని సాంగ్ పాడుకుంటూ కళ్ళ నీళ్లు తుడుచుకున్నారు. ఫైమా సీరియస్ గా చూస్తుండేసరికి "ఏం చూస్తున్నవే" అని శ్రీముఖి సీరియస్ అయ్యింది. " హి బ్రోకెన్ మై హార్ట్" అని అర్జున్ దాస్ వైపు చూస్తూ ఫన్నీ డైలాగ్ చెప్పేసరికి స్టేజి మీద అందరూ నవ్వేశారు.

బిగ్ బాస్ వాయిస్ కి మీరెందుకు ట్రై చేయకూడదు ? అర్జున్ కి సలహా ఇచ్చిన అవినాష్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం మంచి జోష్ తో ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటుంది. ఇందులో గేమ్ షోస్, డాన్స్, సింగింగ్ అన్ని ఎలిమెంట్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. శ్రీముఖి హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఇక ఈ వారం ఈ ఎపిసోడ్ లో బీబీ జోడి టీమ్స్ వచ్చి సందడి చేశాయి. అలాగే ఈ స్టేజి మీద "బుట్టబొమ్మ" మూవీ టీమ్ వచ్చింది.. అర్జున్ దాస్, నవ్య స్వామి, అనైక, సూర్య వచ్చారు. ఫైమా అర్జున్ దాస్ తో ఇంగ్లీష్ లో మాట్లాడి ఫన్ క్రియేట్ చేసింది. ఆయనతో కలిసి "బుట్టబొమ్మ బుట్టబొమ్మ " అనే సాంగ్ కి డాన్స్ చేసింది. "మీ మూవీని పైరసీ చేయొద్దని థియేటర్స్ లో చూడమని చెప్తాను" అని అంది. తర్వాత అవినాష్ అనైకతో కలిసి "బుట్టబొమ్మ" సాంగ్ కి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసాడు.  తర్వాత అర్జున్ దాస్ తో వాయిస్ ని ఇమిటేట్ చేసి "థ్యాంక్యూ సోమచ్..అవును మీరు  బిగ్ బాస్ సీజన్ 7 కి బిగ్ బాస్ వాయిస్ కి ఎందుకు ట్రై చేయకూడదు ? అని అవినాష్ అడిగేసరికి "నో హి ఈజ్ నాట్ ఇంట్రెస్టేడ్ ..నువ్వు వెళ్ళు" అంది పంపించేసింది  శ్రీముఖి. ధమాకా టీమ్ పాయింట్స్ తెచ్చుకునేసరికి పటాకా టీమ్ ఓడిపోయింది. దాంతో వాళ్లకు పనిషమెంట్ ఇచ్చింది శ్రీముఖి. పనిషమెంట్ లో భాగంగా భానుశ్రీని సైకిల్ మీద ఎక్కించుకుని రవికృష్ణ స్టేజి మీద ఉన్న సర్కిల్ చుట్టూ తిరిగాడు.

కేసీఆర్ కి కేటీఆర్ కి సింగర్ శ్రీరామచంద్ర విన్నపం!

సింగర్ శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. దానికి కారణం ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ కావడమే. మరి ఆయన ఫ్లైట్ మిస్ ఐతే కేసీఆర్ , కేటీఆర్ మీద ఎందుకు అసహనం వ్యక్తం చేశారనుకుంటున్నారా..ఒక పొలిటీషియన్ వస్తున్న సందర్భంగా పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ ని బ్లాక్ చేశారు. దాంతో ట్రాఫిక్ అంత ఫ్లై ఓవర్ కింద ఉండిపోయింది. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఎయిర్ పోర్ట్ కి అరగంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చిందట. దాంతో ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉండడం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇలా ప్లాన్ అంతా చేంజ్ అయ్యేసరికి శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు.  ఇలాంటి టైములో మరో ఫ్లైట్ ని క్యాచ్ చేసి గోవా వెళ్లడం ఎంతో కష్టమైన పని. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా ఆ ఫ్లైట్ మిస్ అయ్యారట. "తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారికి, సైబరాబాద్ పోలీసులకు నేను విన్నవించేది ఏమిటంటే.. పొలిటికల్ లీడర్స్ కోసం మాలాంటి సామాన్యులను ఇబ్బంది పెట్టకండి"... అంటూ ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశారు.  సింగర్ శ్రీరామచంద్ర  చేసిన ట్వీట్ కి మిశ్రమ స్పందన వచ్చింది. "ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ముందుగా బయల్దేరాల్సింది" అని అంటే "ఎలాంటి రోడ్ షోస్ వంటివి ఉన్నప్పుడు ప్రజలకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా..పొలిటీషియన్స్ కోసం మన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవాలా " అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేశారు.

రాజ్ డబ్బు, కావ్య ఆత్మవిశ్వాసం మధ్య పోటీలో గెలుపెవరిది! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 6 లోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో.. కావ్య ముగ్గు వెయ్యడంతో చాలా బాగా వేసింది అంటూ అందరూ మెచ్చుకుంటారు. రాజ్ మాత్రం ముగ్గు వేసి అందరిని ముగ్గులోకి దింపుతుందని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి అనుకోకుండా రాజ్ సూట్ కి కావ్య పెయింట్ అంటిస్తుంది. దాంతో రాజ్ చిరాకు పడుతూ కావ్య మీద అరుస్తాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం సూట్ కొత్త డిజైన్ బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తారు. అలా రాజ్ కూల్ అవుతాడు. ఆ తర్వాత కావ్య నీరసంగా ఇంటికి వెళ్తుంది. కావ్యను అలా చూసిన వాళ్ళ నాన్న... "ఏమైందమ్మా.. అలా ఉన్నావ్?" అని అడుగుతాడు. "ఏం లేదు నాన్న డబ్బుకి- కళకి మధ్య వాగ్వాదం.. ఒకరిది గర్వం.. మరొకరిది ఆత్మ విశ్వాసం. ఆత్మ విశ్వాసం కాపాడుకోవడంలో అలసిపోయాను" అని కావ్య అంటుంది. ఎంట్రీ పాస్ లు వచ్చిన ఆనందంలో కనకం, స్వప్న రిచ్ గా "ఎలా రెడీ అయ్యి వెళ్ళాలి" అని అనుకుంటారు. ఆ తర్వాత కావ్య చీరని కట్టుకుంటుంది స్వప్న. వీళ్ళ హడావిడిని చూసి కావ్య చెల్లి అన్ని సెటైర్ లు వేస్తుంది. దుగ్గిరాల వారసులైన రాజ్, కళ్యాణ్, రాహుల్ ముగ్గురు కలసి సరదాగా మాట్లాడుకుంటారు. "నువ్వు అన్నింటిలో పర్ఫెక్షన్ ఎందుకు కావాలనుకుంటావు" అని రాహుల్ అడుగుతాడు. "చిన్నప్పటి నుండి తాతయ్యని చూస్తూ పెరిగాను.. అన్నీ అయన నుండి నేర్చుకున్నవే " అని రాజ్ సమాధానమిస్తాడు. "ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నాం.. మన లైఫ్ లో కి కూడా వైఫ్ లు వస్తే ఇలా ఉండమెమో" అని రాహుల్ అంటాడు. "మన లైఫ్ లోకి ఎవరు వచ్చినా కూడా మనం ముగ్గురం ఇలాగే కలిసి ఉంటాం" అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు రాజ్. కనకం తన ఇద్దరి కూతుళ్లను రిచ్ గా రెడీ చేసి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారి పిలిస్తే ముకుంద ఎలా వచ్చిందని డౌట్ పడిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -67 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో.. ముకుందని మురారి తీసుకురావడంతో ఇంట్లో వాళ్ళు సంతోషపడుతారు. మురారికి చెరొక వైపు కృష్ణ, ముకుందలు ఉండగా.. ముగ్గురు కలిసి ఒకేసారి ఇంట్లోకి వస్తారు. ముకుంద రాకతో మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్న టెన్షన్ లో రేవతి కళ్లుతిరిగి కింద పడిపోతుంది.  ఇంట్లో వాళ్ళు లేపి.. ఏం అయిందని అడిగితే "నీరసంగా ఉంది" అని రేవతి చెప్తుంది. "ముకుంద.. ఇది నీ ఇల్లు. నీకు నచ్చినట్లు ఉండు.. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు" అని భవాని అంటుంది. ఇంతలో అమాయకురాలు కృష్ణ "థాంక్యూ ACP సర్.. నా కోసం ముకుందని తీసుకొచ్చారు" అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. కృష్ణ ఇలా మాట్లాడిన మాటలు విన్న ముకుంద "ఏంటీ కృష్ణ కోసం నన్ను తీసుకొచ్చాడా?" అని  అనుకొని షాక్ అవుతుంది. ముకుంద ప్రతి కదలికను అబ్ సర్వ్ చేయడంలో రేవతి నిమగ్నం అయింది. "ACP సర్... పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే వస్తా అంది కదా ముకుంద... మీరు పిలిస్తే ఎలా వచ్చింది. ఆ పిలవాల్సిన వాళ్ళు మీరేనా.. భవాని అత్తయ్య కదా  పిలవాల్సింది" అని కృష్ణ అడుగుతుంది. అలా  కృష్ణ డౌట్ గా అడిగేసరికి మురారికి ఒక్కసారిగా భయం వేస్తుంది. "లేదు కృష్ణా.. నువ్వు పెద్దమ్మకి మాటిచ్చావ్ కదా.. అందుకే తీసుకొచ్చాను" అని మురారి అంటాడు. కానీ కృష్ణ కి ఇంకా డౌట్ గానే ఉంటుంది. మురారి తన భార్య కోసం నన్ను తీసుకొచ్చాడా అనుకుంటూ... ఎలాగైనా మురారితో మాట్లాడాలని అనుకుంటుంది ముకుంద‌.  మురారి గది దగ్గరికి వెళ్లి వద్దులే అని వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

రిషిని వదిలేయమని వసుధారకి డబ్బులు ఆఫర్ చేసిన దేవయాని!

స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -673 లోకి అడుగు పెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. వసుధార గురించి రిషి ఆలోచిస్తుంటాడు. "అన్ని జ్ఞాపకాలు ఇచ్చావ్.. అంతా నువ్వే అన్నావ్.. ఇలాంటి రోజు మన మధ్య వస్తుందనుకోలేదు. మనిద్దరం వేరు వేరు కాదు అన్నావ్.. నేను ఎందుకు బాధపడాలి" అని వసుధార గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అయ్యాడు రిషి. జగతి, మహేంద్రలు చక్రపాణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి దేవయాని వచ్చి "చక్రపాణి, వసుధార మన ఇంటికి వచ్చారా? ఆ విషయం నాకు చెప్పలేదు" అని అంటుంది. "చాటుగా వినే బుద్ది ఇంకా మానుకోలేదా అక్కయ్యా" అని జగతి అంటుంది. "వాళ్ళ వల్లే కదా రిషికి ఈ పరిస్థితి వచ్చింది. అయినా మీరు రిషిని పట్టించుకుంటున్నారా? వసుధార పెళ్లి చేసుకుంది.. నువ్వు ఇంటికి వచ్చేసావ్.. ఇంకేంటి ఎంతసేపు నువ్వు మహేంద్ర పక్కనే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, కాలేజీ వెళ్లినా అనంతగిరి వెళ్లినా మీరిద్దరే   కదా... అసలు రిషి గురించి బాధ్యత ఉందా?  సాక్షిని పెళ్లి చేసుకోకుండా ఆపేసారు. వసుధారని ఎర వేసారు. రిషి బయట ఎక్కడో ఉంటే మీరు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మీ వల్లే కదూ... " మొత్తం మేమే బాధ్యులం అన్నట్టు మాట్లాడుతున్నారు" అని జగతి సమాధనమిస్తుంది. "మీరే బాధ్యులు" అని దేవయాని అంటుంది. "రిషిని తీసుకురావడం మీ వల్ల అయ్యేపని కాదు... నేను వెళ్ళి తీసుకొస్తాను" అంటూ దేవయాని వెళ్తుంది. వసుధారకు కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ లో చక్రపాణి, వసుధార అన్నం తింటూ ఉంటారు. అంతలో అక్కడికి దేవయాని వస్తుంది. రిషి ఎక్కడ అని అరుస్తూ ఉండగా.. రిషి సర్ ఇక్కడికి ఎందుకు వస్తాడు మేడం అని వసుధార చెప్తుంది. దాంతో దేవయానికి కోపం పెరిగిపోతుంది. మా రిషిని వదిలి వెళ్ళిపో నీకు డబ్బు ఎంత కావాలన్నా ఇస్తా అని ఆఫర్ ఇస్తుంది. అప్పుడే మహేంద్రకి ఫోన్ చేసి దేవయాని వచ్చినట్టుగా చెప్తుంది. "సర్... దేవయాని గారు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు" అని   వసుధార అంటుంది. అయితే అవతలి వైపు మహేంద్ర కాకుండా ఫోన్ రిషి లిఫ్ట్ చేస్తాడు. "పెద్దమ్మ అక్కడికెందుకు వెళ్ళింది" అని ఆవేశంగా రిషి అక్కడికి బయల్దేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

బీబీ జోడిలో మాటల యుద్ధం....స్ట్రాటజీ పుట్టిందే మీ నుంచి అంటూ ఫైమా ఫైర్

బీబీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా తయారై వచ్చేసింది. ఇందులో డ్యాన్సులు చూస్తే అందరూ పోటాపోటీగా చేశారు. డైరెక్టర్స్ స్పెషల్ థీమ్ కాబట్టి ముందుగా అఖిల్-తేజు వచ్చి "అదరగొట్టు..గొట్టు" సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతీ వారం ఈ జోడీ కొత్తకొత్తగా ట్రై చేస్తూ ఆడియన్స్ లో ఒక గుర్తింపును తెచ్చుకుంటోంది. "అఖిల్ నీ ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా ఉన్నాయి. గడ్డం లేదు కదా ఇంకా  బాగా కనిపిస్తున్నాయి" అని తరుణ్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును మాస్టర్ మీరు చెప్పింది నిజమే "అఖిల్ అందంగా ఉన్నాడు..ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇంకా అందంగా ఉన్నాయి" అంది జడ్జి సదా. సదా సిగ్గుపడుతున్నట్టు ఉన్నారు అని శ్రీముఖి అనేసరికి ఆమె నవ్వేసింది.  ఇక అక్కడ శ్రీముఖి సరదాగా ఒక "లుక్ ఛాలెంజ్" పెట్టింది సదాకి అఖిల్ కి మధ్యన. సదా అఖిల్ ని చూస్తే మధ్యలో నవ్వేసింది. తర్వాత అఖిల్-సదా కలిసి స్టేజి మీద డాన్స్ చేశారు. "అమ్మా సదా..తేజు చూడు ఎంత అందమైన పిల్ల .. అఖిల్ - తేజు పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు అఖిల్ తో కలిసి పార్కుల్లో డాన్స్ చేయడం న్యాయంగా ఉందా" శ్రీముఖి సరదాగా ఫన్ చేసేసరికి అందరూ నవ్వేశారు.  తర్వాత ఆర్జే సూర్య-ఫైమా జోడి వచ్చి "చామంతి పువ్వా..పువ్వా" సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ డాన్స్ కి సదా ఫుల్ ఫిదా ఐపోయింది. జడ్జెస్ అంతా లేచి నిల్చున్నారు. ఇక కౌశల్ వాళ్ళ డాన్స్ కి 4  మార్క్స్ ఇచ్చాడు. పదికి నాలుగు మార్కులా అని శ్రీముఖి అనేసరికి కౌశల్ జోడి  అభినయశ్రీ కూడా  షాకయ్యింది. "ఈ మార్క్స్ ఎందుకు ఇచ్చానో తెలుసా..ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు మార్క్స్ ఇస్తున్నారు కదా నేను కూడా అలా ఇస్తే మీకు ఆ బాధ తెలుస్తుందని ఇచ్చాను" అన్నాడు కౌశల్.ఆ మాటలకు అభినయశ్రీ అవాక్కైపోయింది. "స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా..అసలు స్ట్రాటజీ పుట్టిందే మీ నుంచి" అని స్ట్రాంగ్ కౌంటర్ వేసింది ఫైమా. తర్వాత కౌశల్-అభినయశ్రీ కలిసి "ధంధంధం" అని అఖండా మూవీలో సాంగ్ కి డాన్స్ చేశారు. వాళ్ళ డాన్స్ కి అఖిల్ పదికి ఆరు మార్కులు ఇచ్చాడు. "ఎలివేషన్ ఓకే కానీ తర్వాత ఎనర్జీ మొత్తం డ్రాప్..అన్ సింక్ " అని చెప్పాడు. "నాకు ఇంత కంటే ఎక్కువ ఎనర్జీ రాదు. నీకు పాతికేళ్ళు నాకు నలభై ఏళ్ళు. ఐనా నేను చేస్తున్నాను ఈ స్టేజి మీద అంటే నా రక్తం మరిగింది కాబట్టి  అంతే" అని ఫుల్ ఫైర్ అయ్యాడు.

తెలుగు బుల్లితెర పై కొత్త సీరియల్ తో త్వరలో కనిపించబోతున్న "ఆనందం" హీరో ఆకాష్

"ఆనందం" మూవీ హీరో ఆకాష్ గుర్తున్నాడా..మొదటి సినిమాతోనే  బిగ్ హిట్ అందుకుని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆకాష్ తో మూవీస్ చేయడానికి డైరెక్టర్స్   పోటీ పడ్డారు. కానీ ఆకాష్ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అలా ఫేడ్ అవుట్ ఐపోయిన ఆకాష్ చాలా ఏళ్ళ తర్వాత బుల్లి తెర మీద  కనిపించబోతున్నాడు. త్వరలో జెమినీ టీవీలో ఒక సీరియల్ ద్వారా అరంగేట్రం చేయబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ పిక్స్ లో ఆకాష్ తో పాటు సహనటులు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. ఆకాష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.  "బెంగళూరులో నా కొత్త సీరియల్ షూటింగ్" అంటూ సన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాడు. ఐతే సీరియల్ ఏమిటి అందులో ఆకాష్ పాత్ర ఏమిటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆకాష్ రెండు తమిళ డైలీ సీరియల్స్ "నీతానే ఎన్ పొన్వసంతం" " తవమై తవమిరుండు" లో నటించాడు. అలాగే ఆయన నటించిన  కన్నడ సీరియల్ ‘జోతాయి.. జోతాయల్లీ’ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. 2010 లో "నమో వేంకటేశ" మూవీలో నటించాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించని ఆకాష్ ఇప్పుడు ఇప్పుడు కొత్త  సీరియల్ ద్వారా  తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. శ్రీలంకలో పుట్టిన ఆకాశ్.. లండన్ లో సెటిల్ అయ్యాడు.  తర్వాత వాళ్ళ ఫామిలీ తమిళనాడుకు వచ్చేసింది. అలా  శ్రీలంకన్ తమిళియన్‌గా ఆకాశ్‌కు పేరుంది. ఆనందం తర్వాత తెలుగులో  పిలిస్తే పలుకుతా, నీతో చెప్పాలని, వసంతం, ఆనందమానందమాయే, అందాల రాముడు, నవ వసంతం, ఢీ, నమో వెంకటేశ లాంటి చాలా సినిమాలు చేసారు ఆకాష్. ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. ఇక ఆకాష్ కు  శ్రీలంకలో టీ పౌడర్ బిజినెస్ కూడా ఉంది. ఆకాష్ కె. బాలచందర్ నిర్మించిన "రోజావనం" మూవీలో సెకండ్ లీడ్ రోల్ లో చేసాడు.  అప్పటినుంచి అతను తన పేరును జై ఆకాష్ గా పెట్టుకున్నాడు.    

జబర్దస్త్ ని చూస్తుంటే బాధేస్తోంది...ఫస్ట్ జెనెరేషన్ కమెడియన్స్ కలిస్తే బాగుండనిపిస్తోంది!

కమెడియన్ అంటే గ్యాప్ లేకుండా కమిట్మెంట్ తో నవ్వించేవాడు అంటారు. స్మాల్ స్క్రీన్ లేని రోజుల్లో ఐతే కమెడియన్ అంటే ఒక ఆలీ, ఒక బ్రహ్మానందం, వేణు మాధవ్ ఇలా ఎంతో మంది గురించి చెప్పుకునే వాళ్ళం. సిల్వర్ స్క్రీన్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ టైములో బోల్డు మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళల్లో గెటప్ శీను, అదిరే అభి, పంచ్ ప్రసాద్, ధనరాజ్, రాకెట్ రాఘవ, వేణు, సుధీర్, షకలక శంకర్  ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ అనే ఒక వేదిక వీళ్ళలోని టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి పుట్టిందా అన్నట్టుగా ఉండేది. 2013లో మల్లెమాల సంస్థ చేసిన ప్రయోగం పేరే "జబర్దస్త్" . అది సూపర్ సక్సెస్ అయ్యింది. రోజా, నాగబాబు జడ్జెస్ట్ గా, అనసూయ యాంకర్ గా ఉంది షోని నడిపేవారు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా అన్నట్టు మొదట్లో ఇంటిల్లిపాదీ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్ళు ఆడియన్స్. దీనికి పోటీ వచ్చే షో మరొకటి లేదు అన్నట్టుగా రేటింగ్ ని మూటగట్టుకుంది. ఆ ఓల్డ్ టీమ్ జబర్దస్త్ ని నిలబెట్టి వేరే వేరే కారణాలతో వెళ్లిపోయారు.  తర్వాత కొత్త నీరు వచ్చింది. అందులో సుడిగాలి సుధీర్, రష్మీ ఈ షోని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. అప్పటివరకు ఉన్న కమెడియన్స్ టీమ్ లీడర్స్ కావడం వాళ్ళ ప్లేస్ లోకి కొత్త వాళ్ళు రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ని స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ అయ్యాక జబర్దస్త్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టాక ఇంకా డౌన్ అవుతూ వచ్చింది. అందులోనూ రోజా, నాగబాబు, అనసూయ, గెటప్ శీను, హైపర్ ఆది, సుధీర్, ఒక్కొక్కరిగా వెళ్లిపోయేసరికి ఆ షోకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది. కామెడీ పంచెస్ రాసేవాళ్ళు కూడా లేక వాళ్ళ మీద వాళ్ళే జోక్స్ వేసుకుని నవ్వించే పరిస్థితికి వచ్చేసింది.  అందులోనూ సోషల్ మీడియాలో కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఆ షోని మరింత డౌన్ చేసేసింది. ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఉండడమే తెలిసిన పాత టీమ్ తర్వాత జరిగిన పరిణామాలను చూసి బాధపడ్డారు ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించారు. ఆ బాధతో అదిరే అభి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక లెటర్ ఫుల్ వైరల్ గా మారింది. అభి వ్యక్తపరిచిన భావాల్లో నిజం ఉందని అంటున్నారు నెటిజన్స్...ఏ స్కిట్ చూసినా జడ్జెస్ బాగుంది అంటున్నారు తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు..ఆ పాత రోజులు మళ్ళీ వస్తే బాగుణ్ణు అనుకుంటున్నారు అదిరే అభి. అందరినీ నవ్వించే జబర్దస్త్ కి మళ్ళీ నవ్వే రోజులు వస్తే బాగుండు అని మనసులోని బాధనంతా వెళ్లగక్కారు. స్కూల్స్ లో, కాలేజెస్ లో రీ-యూనియన్ , పూర్వ విద్యార్థుల కలయిక పేర్లతో ఎలా ఐతే కలుస్తారో అలా ఆ పాత జబర్దస్త్ ఫస్ట్ జెనెరేషన్ టీం అంతా కలిసి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తే ఎంతో బాగుంటుంది అంటున్నారు జబర్దస్త్ ఫాన్స్. మరి ఆ రోజు కోసం మనం కూడా వెయిట్ చేద్దాం.

పుష్ప రోల్ ని కమల్ తప్ప ఎవరూ చేయలేరు...ప్రభాస్ నా క్రష్ అన్న రాధ!

బీబీ జోడిలో జడ్జెస్ ఎవరో మనకు తెలుసు..రాధా, సదా. మరి సదా సరికొత్తగా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అదే "చిట్ చాట్ విత్ రాధా". ఇందులో సదా రాధను కొన్ని ప్రశ్నలు వేసింది.. రాధా కూడా వాటికి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. "మీకు ఏ హీరో డాన్స్ అంటే ఇష్టం" అని అడిగేసరికి " ఆన్సర్ చెప్పడం కష్టం..జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్" అని చెప్పింది. "ఒకవేళ మూవీ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే టీచర్ ని అయ్యేదాన్ని..ఆ కోరిక ఇప్పుడు బీబీ జోడిలో జడ్జి రూపంలో తీరింది" అని చెప్పింది. "మీ టైములో పుష్ప మూవీ తీసి ఉంటే పర్ఫెక్ట్ హీరో ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు" అనేసరికి " బన్నీ తప్ప ఆ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. 80 S లో అలా డిగ్లామర్ రోల్ లో ఎవరూ చేసేవారు కాదు. ఒకవేళ అలా చెయ్యాలి అంటే మాత్రం కమల్ హాసన్..ఆయన తప్ప ఆ ప్రయోగం మరొకరు చేయలేరు. మా టైంలో కమల్ డ్రీం బాయ్, హ్యాండ్సమ్ గై, బ్యూటిఫుల్ మ్యాన్ . స్టీరియో టైపు కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తారు." "లాస్ వేగాస్ నాకు ఇష్టమైన హాలిడే స్పాట్. ఎందుకు అంటే అక్కడికి వచ్చే వాళ్లంతా ఒకే మూడ్ తో ఎంజాయ్, ఎంజాయ్ అంటూ వస్తారు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని సిగ్గు పడరు. " ఈ జనరేషన్ హీరోస్ లో ప్రభాస్ నా క్రష్..ఒకవేళ నాకు ఫేమ్ రాకపోయి ఉంటే పిల్లల్ని కానీ గుడ్ హౌస్ వైఫ్ గా సెటిల్ ఐపోయి  బిజినెస్ పెట్టుకుని నడుపుకునేదాన్ని. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంత పేరు రావడానికి కారణం భారతిరాజాగారు నా గాడ్ ఫాదర్ , మా అమ్మ, మా సిస్టర్ నాకు ఇన్స్పిరేషన్. టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక షెడ్యూల్ చేసాను..తర్వాత బ్రేక్ వచ్చింది అప్పుడు నేను స్కూల్ కి వెళ్లాల్సి ఉంది. ఐతే  నా స్కూల్ లో నన్ను ఎవరైనా గుర్తుపడతారా  అని అనుకునే టైంలో మలయాళం పేపర్ లో హీరోతో ఒక రొమాంటిక్ పోజ్ వచ్చింది. అది చూసినప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అప్పటికి సెలబ్రిటీ స్టేటస్ అంటే తెలీదు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. నా పేరు మార్చింది భారతి రాజా గారు. నా అసలు పేరు ఉదయ చంద్రిక..ఆ పేరు కూడా నాకు చాలా ఇష్టం. నేను సూపర్ వుమన్, గుడ్ మదర్, గుడ్ హౌస్ వైఫ్..ఇవే నా సూపర్ పవర్స్. ఇండస్ట్రీలో సరితా తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఫోర్త్ క్లాస్ నుంచి ఇప్పటివరకు  జయ, షీలా అనే ఫ్రెండ్స్ ఉన్నారు. పెళ్లయ్యాక బొంబాయిలో రీతూ అనే ఫ్రెండ్ ఉంది.  ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాకు రామ్ చరణ్ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. తెలుగులో ఛాన్స్ వస్తే పాజిటివ్ రోల్ కాదు నెగటివ్ రోల్ కాదు మంచి రోల్ వస్తే చేయడానికి రెడీ ఉన్నా" అంటూ రాధ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

అల్టిమేట్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోన్న బీబీ జోడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బీబీ జోడి' ఆసక్తికరంగా సాగుతోంది. ఒక్కో జోడి ఒక్కో లెవల్ పర్ఫామెన్స్ ఇస్తూ అల్టిమేట్ డ్యాన్స్ ని చేస్తున్నారు. కాగా ఈ బీబీ జోడిల డ్యాన్స్ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. రవికృష్ణ-భాను జోడి మొదట డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసారు. పొగలు వచ్చేలాగా చేశారని శ్రీముఖి చెప్పగా... సదా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పింది. పర్ఫెక్ట్ మూమెంట్స్ అని రాధ చెప్పింది. "స్పానిష్ డ్యాన్స్ ఎలా చేస్తారో అనుకున్నా కానీ యూ గాయ్స్ ఆర్ డామినేటింగ్ ద స్టేజ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. ఆ తర్వాత అవినాష్-అరియానా జోడి కలిసి శివుడు, గంగలుగా కలసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. "గెటప్ ని డామినేట్ చేసావ్ అవినాష్. గంగ లాగా అరియానా... యూ డిసర్వింగ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "అమేజింగ్  కొరియోగ్రఫీ, మీరు శివుడిలాగా రౌద్రం చూపించిన తీరు అద్భుతం" అని సదా చెప్పుకొచ్చింది. అర్జున్- వసంతి జోడి చేసిన డ్యాన్స్ కి  'ఓ మై గాడ్' అని అరిచింది రాధ. 'బీబీ జోడియా మజాకా' అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "కెమెస్ట్రీ బాగుంది. అర్జున్ వెల్ డన్.. ఇప్పుడు లిప్ బాగా ఇచ్చారు. ఎక్స్‌ప్రెసెషన్ కూడా ఎలివేట్ అయ్యింది. లవ్లీ పర్ఫామెన్స్. యూ పుట్ ఇన్ ఆల్... ఎవ్రీతింగ్ ఫైన్" అని సదా చెప్పింది.  శ్రీసత్య-మెహబూబ్ జోడి కలిసి సాల్సా డ్యాన్స్ చేసారు.‌ ఇది చూసి జడ్జ్ లు షాక్ అయ్యారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి బెస్ట్ పర్ఫామర్స్ గా నిలిచారు. జడ్జ్ లు అన్ని‌ జోడిలకు ఫుల్‌ మార్క్స్ ఇచ్చారు. ఈ వారం జరిగిన అన్ని జోడీల పర్ఫామెన్స్ అల్టిమేట్ డ్యాన్స్ గా నిలిచింది.

దూడపిల్లకు గడ్డి తినిపించిన అష్షు..సోనియాగాంధీలా ఉన్నావన్న నెటిజన్!

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి అంటే అందరికీ తెలుసు. హీరోయిన్స్ కంటే కూడా సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..సోషల్ మీడియా హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. కాంట్రావర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని  ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓవర్ నైట్ లో ఫేమస్ ఐపోయింది. యూట్యూబ్ స్టార్ ఒక వెలుగు వెలిగింది. అలా ‘బిగ్ బాస్ " హౌస్ లోకి ఎంట్రీ దక్కించుకుంది.  ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీలో నటించింది. ఇప్పుడు మరో కొత్త మూవీ షూటింగ్ కోసం ఆమె పులివెందులకు వెళ్ళింది అష్షు. అక్కడి పల్లె అందాల్ని ఆస్వాదించింది. పువ్వుల్ని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రెడ్ కలర్ శారీలో ఒక దూడ పిల్లకు గడ్డి తినిపిస్తూ దిగిన ఫోటో కూడా పోస్ట్ చేసింది...ఇక ఈ ఫోటోకి నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.."శారీలో చాలా బాగున్నారు, ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా ఉన్నారు..ఇంకా మీరు యానిమల్ ప్రమోషన్ చేస్తున్నారేమో  " అంటే మరో నెటిజన్ ఇంకొంచెం ముందుకు వెళ్లి "మీరు సోనియాగాంధీ రోల్ కి సూటవుతారు అలాంటి అవకాశం వస్తే వదులుకోవద్దు" అంటూ సలహా ఇచ్చారు.  ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఆర్జీవీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అషు రెడ్డిని  సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాలును ముద్దు పెట్టుకున్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.  

బుల్లితెర షోస్ లో విచ్చలవిడిగా ముద్దూముచ్చట్లు!

బుల్లితెర మీద ఈమధ్య ముద్దులు హద్దులు దాటుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ తో పాటు స్మాల్ స్క్రీన్ కి సెన్సార్ బోర్డు అవసరం ఏమో అనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ముద్దులు పెట్టుకోవడం, డాన్సులు ఇలా ఎన్నో బుల్లితెర షోస్ లో ఈమధ్య విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు హాయిగా ఇంటిల్లిపాది చూసేలా ఉండేవి ఈ షోస్ కానీ అప్పుడప్పుడు హద్దులు కూడా దాటుతున్నాయి. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే ఆ విషయం తెలుస్తోంది. ఈవారం కాన్సెప్ట్ కింద లేడీస్ హాస్టల్ వర్సెస్ బాయ్స్ హాస్టల్ మధ్య పోటీలు పెట్టారు. ఇందులో లేడీస్ హాస్టల్ వార్డెన్ గా భావన, జెంట్స్ హాస్టల్ వార్డెన్ గా ఆటో రాంప్రసాద్ వచ్చారు.  ఇక ఎప్పటిలాగే కమెడియన్స్ అంతా హాస్టల్ లో స్టూడెంట్స్ లా లైన్ లో నిలబడి అటెండెన్స్ వేయించుకున్నట్టు కమెడియన్స్ వాళ్ళ టీం లీడర్స్ తో పంచులు వేయించుకుని వెళ్తుంటారు. అలా ఈ షోకి జెస్సి వచ్చాడు. ఇంకా సీరియల్ యాక్టర్ కీర్తిభట్ మిత్రుడు ఐన ఆది వచ్చి " ఏమిటి జెస్సి ఈమధ్య డల్ గా ఉంటున్నావ్..డిప్రెషన్ లోకి వెళ్లిపోయావ్" అని అడిగేసరికి " ఏం లేదురా..ఈ మధ్య నాకు ఒక అమ్మాయి మెసేజ్ చెయ్యట్లేదు అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో అంకిత వీడియో ప్లే చేశారు..ఏం అంకిత నాకు నువ్వు ఎందుకు మెసేజ్ చెయ్యట్లేదు..రిప్లై ఇవ్వట్లేదు" అని అందరి ముందు అడిగేశాడు. "ఎందుకు రిప్లై ఇస్తాననుకుంటున్నావ్..ఎవ్వరితో బడితే వాళ్ళతో ఫోటోలు దిగి స్టేటస్ లో పెట్టుకుంటున్నావ్" అనేసరికి "అందరూ ఒక ఎత్తు ..నువ్వు నాకు సంథింగ్ స్పెషల్ కదా..ఆ విషయం నీకు తెలుసు కదా" అని జెస్సి ఆన్సర్ ఇచ్చేసరికి అంకిత నవ్వేసింది.  "స్పెషల్ అని చెప్తే సరిపోదు అలా చూసుకోవాలి" అని అంకిత అనేసరికి ఒకసారి ఇటురావే  అని పిలిచి "సంథింగ్ స్పెషల్ చూస్తావా..అటు చూడు అని అంకిత బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు. అంతలో  రోహిణి లైన్ లోకి వచ్చేసి "ముద్దు పెట్టినప్పుడు కూల్ గా ఎందుకు వున్నావ్ కొట్టు వెళ్లి" అంది సీరియస్ గా.."అంటే జెస్సి ముద్దుపెట్టడం వలన నాకు ప్రాబ్లమ్ లేదు" అని చెప్పేసింది అంకిత. దాంతో రోహిణి హర్ట్ అయ్యి వెళ్ళిపోయింది జెస్సి ఈల వేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. "మెసేజ్ కి రిప్లై ఇవ్వడం ప్రాబ్లమ్ కానీ ఇలా ముద్దు పెడితే ప్రాబ్లమ్ లేదా" అని రష్మీ అడిగేసరికి "లవ్ అనేది లోపల ఉంది కానీ ఎక్స్ప్రెస్  చెయ్యట్లేదు" అని చెప్పింది. ఏదేమైనా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇలాంటి షోస్ చూసేటప్పుడు ఈ విధమైన ముద్దు ముచ్చట్లు ఉంటే ఎవరు ఎలా చూడగలుగుతారు చెప్పండి అంటున్నారు నెటిజన్స్.