హీరోయిన్స్ ని తొక్కేద్దామనుకుంటున్నారా... సంతూర్ మమ్మీ సుమ

సుమ హోస్టింగ్ చేయడమే కాదు అప్పుడప్పుడు సరదాగా, స్పాంటేనియస్ గా చెప్పే కామెంట్స్, కామెడీ బిట్స్, చేసే డాన్సులు, వేసే డ్రెస్సులు కూడా బాగా ఫన్నీగా ఉంటాయి. అలాంటి కనకాల ఫామిలీ నుంచి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో రోషన్ కనకాల నటించిన మూవీ "బబుల్ గం"ని ఆడియన్స్ బాగా ఆదరిస్తుండడంతో ఆ మూవీకి మంచి టాక్ వస్తోంది. అందులోనూ సుమ దగ్గరుండి స్పెషల్ కేర్ తో ప్రొమోషన్స్ చేసింది. దగ్గరుండి ప్రెస్ మీట్స్ పెట్టించింది. నేచురల్ హీరోస్ తో తన తనయుడి మూవీ గురించి మాట్లాడించింది. ఇక ఇప్పుడు మౌత్ పబ్లిసిటీతో మూవీ మంచి టాక్ ని సొంత చేసుకునేసరికి సుమ  ఆనందానికి అంతే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో హల్చల్ మచాయిస్తోంది. ఆమె హోస్టింగ్ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సుమ ఇప్పుడు హీరోయిన్స్ కి పోటీగా రెడీ అవుతోంది. రీసెంట్ గా బబుల్ గం పేరుతో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఒక రేంజ్ లో ఫోటో షూట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఈ పిక్స్ మాములుగా లేవు. అసలు సుమనా ఎవరైనా హాలీవుడ్ హీరోయిన్ ఆ అన్న రేంజ్ లో ఉన్నాయి.. "స్వాగ్ అక్క" అని ఆరియానా కామెంట్ చేసింది.  నెటిజన్స్ ఇక ఊరుకుంటారా బీభత్సంగా కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. "హబ్బా భయమేస్తోంది మేడం లేడీ సలార్ లుక్...చాలా యంగ్ గా, కొత్త హీరోయిన్ లా కనిపిస్తున్నారు, ఏంటి మేడం హీరోయిన్స్ ని తొక్కేద్దామనుకుంటున్నారా...సడెన్ గా చూసి హాలీవుడ్ నటి అనుకున్నా...ఇదే కదా మేకప్ పవర్ అంటే...సంతూర్ మమ్మీ...బబుల్ గం 2 హీరోయిన్ సుమ గారు..హీరో రాజీవ్ కనకాల గారు..హీరోయిన్ మెటీరియల్,..నువ్వు హీరోయిన్ గా ట్రై చేస్తున్నావా...సుమ గారికి మేకప్ వేసిన ఆర్టిస్ట్ సూపర్..." అంటూ ఫన్నీ కామెంట్స్ ని పెట్టారు.  

భార్యాభర్తల కోరికలు... ఆన్లైన్ లో పెళ్లిలు.. పౌర్ణమి రోజు ఫస్ట్ నైట్!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ కామెడీగా సాగిపోయింది. ఈ వారం ఈ ఎపిసోడ్ కి వచ్చిన  సీరియల్ వైఫ్ అండ్ హజ్బెండ్స్ తో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ గేమ్ ని ఆడించింది. స్టేజి మీదకు ఒక ముడుపులు చెల్లించుకునే  "విష్ ట్రీ"ని తీసుకొచ్చింది. ఇక ఒక్కో సీరియల్ జంటను పిలిచి వాళ్ళ వాళ్ళ సీరియల్  కోరికలను కాయితాల మీద రాయించి చదివించి ఆ చెట్టుకు కట్టించింది. ఐతే మరి ఈ సీరియల్ వైఫ్ అండ్ హజ్బెండ్స్ ఏమేం కోరికలు రాసారో వింటే భలే ఫన్నీగా ఉంటుంది...ముందుగా "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ నుంచి మీనా అండ్ బాలు వచ్చారు. "సీరియల్ లో నాకు నచ్చకుండా పెళ్లి జరిగింది కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి" అని రాసాడు బాలు. "షూటింగ్ లో ఫస్ట్ నైట్ సీన్ క్యాన్సిల్ అవ్వాలి సెట్ లో ఉన్న వాళ్లందరినీ మా హీరో బాలు గారు ఫస్ట్ నైట్ సీన్ కి ఇన్వైట్ చేసారు అందుకే క్యాన్సిల్ అవ్వాలని అనుకున్నా" అని చెప్పింది సీరియల్ హీరోయిన్ మీనా. తర్వాత "బ్రహ్మముడి" సీరియల్ నుంచి కావ్య అండ్ రాజ్ వచ్చారు. "టెంపుల్ లో కావ్యని ఎత్తుకుని తిరిగే సీన్స్ ని డైరెక్టర్ కి క్యాన్సిల్ చేయించాలి ఎందుకంటే ఈమధ్య కావ్య బాగా బరువు పెరిగిపోయింది." అని చెప్పాడు రాజ్. "నా భర్త రాజ్ నా కాళ్లకు మాత్రమే రాకుమారుడిలా మిగతా వాళ్లకు వికారం వచ్చేలా కనిపించాలి" అని తన కోరిక రాసింది కావ్య. తర్వాత నాగ పంచమి సీరియల్ నుంచి మోక్ష అండ్ పంచమి వచ్చారు. "మన ఫస్ట్ నైట్ ని పౌర్ణమి రోజున కాకుండా ఏదైనా రోజున పెట్టాలి ఎందుకంటే సీరియల్ లో పౌర్ణమి రోజున ఫస్ట్ నైట్ పెడితే పాములా మారిపోతుంది" అని రాసాడు మోక్ష. "నా ఫస్ట్ నైట్ సీన్స్ అన్నీ పౌర్ణమి రోజునే జరగాలి" అని రాసింది పంచమి. తర్వాత మామగారు సీరియల్ నుంచి గంగా అండ్ గంగాధర్ వచ్చారు. "మా సీరియల్ పేరు మామగారు కదా ఆ టైటిల్ మార్చి భర్తగారు అని పెడితే బాగుంటుంది ఎందుకంటే మామగారు తప్ప భర్తగారు కనిపించట్లేదు అందుకే టైటిల్ మార్చాలి" అన్నాడు గంగాధర్ . " మా ఆడవాళ్లు కస్టాలు చాలా ఉంటాయి. ఎంత సేపు రెడీ అవుతావు అంటారు. సో ఈయన కూడా ఒక రోజు అమ్మాయిలా రెడీ అవ్వాలి, బెల్లి డాన్స్ చేయాలి సీరియల్ లో ఐనా ఎక్కడయినా ఓకే " అని చెప్పింది గంగ. తర్వాత కుంకుమ పువ్వు సీరియల్ నుంచి బంటి అండ్ అంజలి వచ్చారు. "నెక్స్ట్ షెడ్యూల్ లో షూటింగ్ టైంలో బంటికి లూజ్ మోషన్స్ వచ్చేయాలి" అని అంజలి రాస్తే "పెళ్లి అనేదాన్ని ఆన్లైన్ చేయాలి.. రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ చేయొచ్చు.." అని బంటి రాసాడు. "పెళ్లి ఆన్లైన్ లో ఓకే మిగిలినవన్నీ వీడియో కాల్ లోనా" అంటూ ఆట పట్టించింది బ్రహ్మముడి కావ్య.

మగవాళ్ల కన్నా ఆడవాళ్ళకు వెంకీ ఆసనం చాలా అవసరం...

నేహా చౌదరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక డల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పరిస్థితి వివరించింది. "హాయ్ అందరికి.. అందరు బాగున్నారని అనుకుంటున్నా...ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.. ఒక ఆరు రోజులుగా సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో ఎక్కడా యాక్టివ్ గా లేను. ఎందుకంటే ప్రేగ్ ప్రాంతానికి డిసెంబర్ 31 న వెళ్లాం. ఫైర్ వర్క్స్ చూడడం కోసం అందరం అక్కడికి వెళ్లాం..అక్కడ మేము చేసిన స్టెంట్స్ వల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. నా లైఫ్ లో  నాలుగు రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. ఆ దేవుడికి నిజంగా ధ్యన్యవాదాలు..అనిల్ నన్ను దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు అంతా బాగుంది. నా గురించి తెలుసుకున్న అందరికి చాలా థ్యాంక్స్. ఐ యాం బ్యాక్." అంటూ ఒక వీడియోని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. అలాగే ప్రేగ్ లో వాళ్ళు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. డిసెంబర్ 31 న ప్రేగ్ లో రాత్రి 4 డిగ్రీల చలిలో అందరూ సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు. ఇక నేహా చౌదరి పరుగుపరుగున నడుస్తూ కనిపించింది ఆ వీడియోలో. 360 డిగ్రీస్ యాంగిల్ లో అక్కడ జరిగిన ఫైర్ వర్క్స్ ని చూపించింది. ఈ ఫైర్ వర్క్స్ చూడ్డానికి ఒక బ్రిడ్జి నుంచి ఇంకో బ్రిడ్జి మీదకు  చాలా దూరం నడిచారు..ఇక తన జీవితంలో దొరికే మగాళ్ల గురించి కూడా చెప్పింది వాళ్ల నాన్న వాళ్ల అమ్మను వదిలేసి నడిచేవాడట, వాళ్ల తమ్ముడు స్పీడ్ గా వెళ్ళిపోతూ గబగబా నడువు అని అరిచేవాడట ఇప్పుడు తన భర్త కూడా తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడట. ఇక తనతో పాటు స్పీడ్ గా రొప్పుతూ నడిచిన నేహా "ఇలాంటి టైంలోనే వెంకీ ఆసనము  బాగా పనికొస్తుంది. మగవాళ్లకు కాదండి ఆడవాళ్లకు కూడా ఇంకా ఎక్కువ అవసరం.." అంటూ చెప్పింది. ఇక చివరిలో అక్కడ ఫైర్ వర్క్స్ చూపించి " ఐ యాం ఇన్ లవ్ విత్ ప్రేగ్" అని అక్కడ గట్టిగా అరిచింది నేహా.

పెళ్లంటే ఆనందం కాదు..అదొక హార్డ్ వర్క్...

కొత్తగా పెళ్ళైన వాళ్లకు అనసూయ ఇచ్చిన టిప్ ఇదే.. పెళ్లి గురించి కూడా చాలా కొత్తగా తనదైన స్టయిల్లో కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. "బోర్ గా ఉంది కాసేపు మాట్లాడుకుందాం" రండి రండి అనేసరికి నెటిజన్స్ ఇక దొరికిందే ఛాన్స్ అంటూ  ఈ వీకెండ్ లో  అనసూయను వాళ్ళ వాళ్ళ ప్రశ్నలతో షూట్ చేశారు. అందులో ఒక వెరైటీ ప్రశ్న కనిపించింది. ఒక లేడీ ఈ ప్రశ్న అడిగినట్టు అర్ధమవుతోంది.."కొత్తగా పెళ్లయ్యింది. ఇప్పుడు ఈ మేల్ ఈగోని ఎలా భరించాలి..ఎలా డీల్ చేయాలి..కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఏవైనా టిప్స్ చెప్పరాదు" అని అడిగేసరికి "నిజం చెప్పాలంటే చాలా ఇంటరెస్టింగ్ క్వశ్చన్ ఇది. నాకు తెలుసు మీకు చాలా బాధగా ఉంటుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పెళ్లి అనేది ఒక హార్డ్ వర్క్ లాంటిది. అందరూ అనుకున్నట్టు ఆ వెరీ హ్యాపీ మారీడ్ లైఫ్ అన్నట్టుగా అస్సలు ఉండదు. అన్ని రకాల సమ్మేళనం ఈ పెళ్లి. కానీ అర్ధం చేసుకోవడానికి ప్రేమ, సమయం చాలా అవసరమవుతాయి. ఒకరికి ఒకరు కలిసి పనుల్లో సాయం చేసుకోవాలి. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మగాళ్లు బయటపడ్డారు..కానీ ప్రేమతో వాళ్ళను మార్చొచ్చు..పెళ్లి నిజంగా ఒక హార్డ్ వర్క్ లాంటిది. నిజంగా లవ్ చేస్తే అస్సలు వదలొద్దు" అని చెప్పింది. "మీమ్స్ ఇంకా ఉన్నాయా..నేను వాటిని పట్టించుకోను..టైం వేస్ట్ పిచ్చ లైట్ తీసుకున్నా..ట్రోల్ల్స్ చేసేవాళ్లను పట్టించుకోవడం మానేసాను. ఆ కంపు నాకు అంటకుండా చూసుకుంటున్నాను. నా మూవీస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ గురించి నన్నే అడిగారా...పడుకోవాలి...బాడీ హైడ్రేట్ గా ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అన్ని తెలుసు కానీ మనం చెయ్యం..ఎం చేసిన డార్క్ సర్కిల్స్ రాకూడదు కదా...ముసలితనం ఎవరికైనా వస్తుంది.. ముసలితనంలో కూడా ఒక బ్యూటీ ఉంది. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి.. ఇంకా స్ట్రాంగ్ అవుతాం..నా వయసు 39 ఏళ్ళు..నా లక్ష్యం ఆరోగ్యంగా ఉండడం, ఎం చేయాలనుకుంటున్నానో అది చేయడం. అంతేకాని యంగ్, ఓల్డ్ అనేది ఏమీ ఉండదు" అంటూ ఇలా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చి ఈరోజు బై బై అని చెప్పింది అందాల అనసూయ..  

ఏం చేస్తున్నావ్ అన్నవాళ్లకు...నెక్స్ట్ ఏమిటి అని అడిగిన వాళ్లకు...

మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లోకి రాకముందు.. టిక్ టాక్ వీడియోస్ , యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియో సాంగ్స్   ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక మెహబూబ్ క్రేజ్ ఇంకా  పెరిగిపోయింది. ఈ క్రేజ్ ద్వారానే బుల్లితెరపై పలు షోల్లో మెరుస్తున్నాడు. అలాంటి మెహబూబ్ కొన్ని నెలల నుంచి స్టేజి మీద పెద్దగా కనిపించడం లేదు. "నటుడిగా మారి సినిమా కోసం పనిచేయాలనేది నా కల...కానీ ఎక్కడ నుండి ఎప్పుడు, ఎలా  ప్రారంభించాలో నాకు అర్ధం తెలీదు. నా చిన్నతనంలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే  అవకాశం నాకు రాలేదు. కానీ నా కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలన్నంత ఆశ, తపన ఉండేవి. నిజం చెప్పాలంటే  2023 నాకు ఒక  రోలర్ కోస్టర్ రైడ్ గా సాగింది. అసలు నేనేం చేస్తున్నానో అంటూ  అని నా కుటుంబం, నా స్నేహితులు , నా ఫాన్స్ అందరూ  నన్ను అడుగుతూనే ఉన్నారు. నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అబ్బాయిలు, ఈ సంవత్సరం నేను భిక్షుస్ హౌస్ ఆఫ్ ఆర్ట్స్ లో నేను యాక్టింగ్ కోర్స్ చేసనము, ఆ వర్క్ షాప్స్ కి వెళ్లాను...థియేటర్ ఆర్ట్స్ కూడా ఇక్కడి నుంచే చేసాను. మహతి భిక్షు, అరుణ భిక్షు మేడం అలాగే ఎన్జె. భిక్షు సర్ నుండి నేను చాలా విషయాలు  నేర్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. భిక్షు సార్..ఈ నటనా కళ ఇంత  అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ అనుభవాలను నేను   మాటల్లో చెప్పలేను . నేను నా కలల వైపు ఇప్పుడిప్పుడే చిన్నపిల్లాడిలా  అడుగులు వేయడం స్టార్ట్ చేసాను. నాకు మీ అందరి సపోర్ట్ అలాగే విషెస్ కూడా కావాలి. నాకు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చినందు  బిక్షూ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. దేనికైనా ఒక టైం రావాలి. మీరంతా నన్ను చూసి ప్రౌడ్ గా ఫీలవుతారు. లాస్ట్ ఇయర్ అనుకున్న ఇప్పుడు నా డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నా. మీ కలను ఆపేదెవరు. ఇది ఒక జీవితం. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి" అంటూ మెహబూబ్ దిల్ సే ఒక లాంగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్, బుల్లితెర సెలబ్రిటీస్ అంతా  కూడా "మీరు నటన వైపు అడుగులు వేస్తున్నారు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

ఖర్మ నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నీ చాక్లెట్ నీకిచ్చేస్తుంది

"పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం..కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్నీ మర్చిపోదు...కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది...వడ్డీతో సహా" అంటూ బ్లడీ మేరీ అనే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ బిగ్ బాస్ కండల బాయ్ అఖిల్ సార్థక్ కూడా అదే మాట చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక డైలాగ్ పెట్టుకున్నాడు. మరి అఖిల్ కి ఎం జరిగిందో ఎవరి వలన హార్ట్ అయ్యాడో తెలీదు కానీ ఈ డైలాగ్ ని మాత్రం ఎవరికోసమే రిలేట్ అయ్యలానే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. "నిజం చెప్తున్నా..ఖర్మ చాలా చాలా పవర్ ఫుల్. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నీ టాఫీ, నీ చాక్లెట్ నీకిచ్చేస్తుంది..కాబట్టి అందరితో మంచిగా ఉండు, మంచి పనులు చెయ్యి. ఎవరినీ మోసం చేయాలని మాత్రం అస్సలు చూడకు. ఎందుకంటే ఖర్మ అనేది నీకంటే ఎక్కువగా, నీకంటే  చాలా అందంగా నిన్ను కూడా మోసం చేస్తుంది" అంటూ అద్దిరిపోయే ఒక కోట్ ని పోస్ట్ చేసుకున్నాడు. మరి ఇంతకు ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టాడో వాళ్ళు చూసారో లేదో తెలీదు కానీ ఫాన్స్ మాత్రం సూపర్ అంటున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ ఆట గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు..ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో అఖిల్ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా నిలబడేసరికి అతన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఎట్టకేలకు ఇన్డైరెక్ట్ గా  పల్లవి ప్రశాంత్ ని గెలిపించడంలో తన పాత్రను పోషించాడు అఖిల్. దమ్ముంటే ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆడి చూడండి అంటూ ట్రోల్లర్స్ కి కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు అఖిల్.  అఖిల్   ‘బావా మరదలు’ అనే చిత్రంలో నటించాడు. అలాగే  ‘ముత్యాల ముగ్గు’ ‘ఎవరే నువ్వు’ ‘కళ్యాణి’ ‘మోహిని’ వంటి సీరియల్స్ లో కూడా  నటించాడు. అఖిల్ కి కండలు పెంచడం, వేర్వేరు ప్రాంతాలకు దైవ దర్శనాలకు వెళ్లడం అంటే చాల ఇష్టం..  

పల్లవి ప్రశాంత్ తో కలిసి వ్యవసాయం చేస్తున్న ప్రిన్స్ యావర్!

ప్రిన్స్ యావర్.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూసినవాళ్ళంతా ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఒక సోదరుడిలా అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో జీరో పర్స్ంట్ నెగెటివ్ తో ఉన్న కంటెస్టెంట్ యావర్. చూడటానికి బాలీవుడ్ హీరో కట్ అవుట్ తో బిగ్ లోకి ఎంట్రీ ఇచ్చి వేలమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడని అనడంలో ఆశ్చర్యం లేదు. భాష రాకపోయిన మంచి మనసుతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాడు యావర్. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందే ప్రిన్స్ యావర్ అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటిది బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. హౌస్ లో శివాజి, ప్రశాంత్ , యావర్ లు కలిసి ఒక గ్రూప్ గా మొదలై మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. శివాజీ ఎప్పటికప్పుడు యావర్ కి గైడెన్స్ ఇస్తూ టాప్-5 వరకు ఉండేలా చేసాడు. యావర్ కూడా ప్రతి దాంట్లో శివాజి సలహా తీసుకుంటు ముందుకు వెళ్ళాడు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా యావర్ వాళ్ళ అన్నయ్య రాగా మోస్ట్ ఎమోషనల్ గా ఎపిసోడ్ సాగింది. అది కూడా యావర్ కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక స్పై బ్యాచ్  అయిన శివాజీ, ప్రశాంత్ యావర్ లు తరుచు కలుస్తూనే ఉన్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా యావర్ పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. అసలు విషయానికొస్తే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళి అతడిని కలిసిన యావర్..  ట్రాక్టర్ నడుపుతు పొలం దున్నుతూ కన్పించాడు. అంతే కాకుండా ఒడ్లు చెక్కడం లాంటి పనులు పొలంలో చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోని యావర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా దానికి విశేష స్పందన వస్తుంది. అదంతా చూస్తూ ఉంటే మెల్లి మెల్లిగా యావర్ కి ప్రశాంత్ వ్యవసాయం నేర్పించేలా ఉన్నాడని అది చూసిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బిగ్ బాస్ తర్వాత కూడా స్పై బ్యాచ్ కలిసి ఉండటం చూసి సీజన్ సెవెన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.  

బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వస్తే...రామ్-నితిన్ కాంబోలో ఐతే ...

జబర్దస్త్ లో చైల్డ్ ఆర్టిస్టులు ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు అందులో యోధ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా పాపులర్. ఒకప్పటి జడ్జి రోజాకి ఆమె అంటే చాల ఇష్టం కూడా. అలాంటి యోధ..సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఛాన్సెస్ వస్తే అటు సీరియల్స్ లో ఇటు మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. అలాంటి యోద్ధ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో "సంథింగ్" అని అడిగింది..ఇక నెటిజన్స్ కూడా వాళ్లకు నచ్చిన ప్రశ్నలన్నీ అడిగేసారు. అందులో ఒక ఇంటరెస్టింగ్ ప్రశ్న వచ్చింది.."బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తావా" అని అడిగేసరికి "కచ్చితంగా చేస్తాను" అని చెప్పింది. "నీకు నవ్వు తెప్పించే అంశాలు ఏమిటి" "నా ఫ్రెండ్స్ ని ఇరిటేట్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉంటా" , "మీరు చేసిన మూవీస్ లో మీ ఫేవరేట్ మూవీస్ ఏమిటి" "గోవిందుడు అందరి వాడేలే, విరూపాక్ష", "ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఫస్ట్ ప్రోమోలో చాల క్యూట్ క్యూట్ గా ఉన్నావ్ యోధ "థ్యాంక్యూ", రామ్, నితిన్ తో కాంబో" " ఆ..ఆ మాట వినడానికే చాల సంతోషంగా ఉంది.. యోధ జబర్దస్త్ కి రావాలన్నా ఎక్కడైనా షూటింగ్ కి వెళ్ళాలి అన్నా  వాళ్ళ నాన్న చందుతో కలిసి వెళ్తుంది. వాళ్ళ నాన్న కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. కొంతకాలం క్రితం వరకు  యోధ బాగా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ పాప సినిమాల్లో కూడా నటించింది. యోధ కూడా స్టార్ కమెడియన్ లకు సైతం పోటీనిస్తోంది యోద్ధ, అతి చిన్న వయసులోనే చైల్డ్ బెస్ట్  కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. ఇక యోధ ఇప్పుడు తన స్టడీస్ మీద ఏకాగ్రత చేస్తోంది. ఐతే అప్పుడప్పుడు ఛాన్సెస్ వస్తుంటే వదులుకోకుండా కూడా వాటిల్లో కూడా నటిస్తూ స్టడీస్ ని, నటనని మేనేజ్ చేస్తోంది.    

భర్త భాగోతం తెలుసుకున్న భార్య.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -299 లో.. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తే నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని మా అత్త చెప్పింది. నేను ఏ తప్పు చేయలేదని నిరుపించాను కదా.. నన్ను అసలు పట్టించుకోవడం లేదని రుద్రాణి గురించి ఇందిరాదేవికి స్వప్న చెప్తుంది. స్వప్న అన్న దాంట్లో కూడా న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారని రుద్రాణి అడుగుతుంది. ఇక నుండి స్వప్నని జాగ్రత్తగా చూసుకోవాలని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక రుద్రాణి సరే అంటుంది. ఆ తర్వాత ఒక జ్యూస్ తీసుకొని రండి అని రుద్రాణికి స్వప్న చెప్తుంది. మరొకవైపు రాజ్, శ్వేతలని కలవడానికి లాయర్ ఆఫీస్ కి వస్తాడు. డివోర్స్ ఇద్దరికీ ఇష్టమేనని రాజ్ అంటాడు. తొందరపడుతున్నామని అనిపిస్తుందని శ్వేత అంటుంది. ఏం లేదు.. నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. ఆ తర్వాత లాయర్ వెళ్ళిపోతాడు. రాజ్ శ్వేత చెయ్యి పట్టుకొని.. నువ్వు ఏం టెన్షన్ పడకు నేను ఉన్నానని చెప్తాడు. శ్వేతతో రాజ్ అలా మాట్లాడడం కావ్య విని.. పక్కకి వెళ్లి కూర్చొని బాధపడుతుంటుంది. కాసేపు మాట్లాడి శ్వేతని రాజ్ పంపిస్తాడు. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉన్న కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ఎప్పుడు వచ్చావని రాజ్ అడుగుతాడు.. నేను వచ్చానని కూడా మీరు చూడన్నప్పడు వచ్చానని కావ్య అంటుంది. దాంతో రాజ్ కంగారుపడుతు ఉంటాడు.. మీ కోసం బాక్స్ తెచ్చానని కావ్య అంటుంది. అయినా ఎందుకు తెచ్చావ్.. బయట తినేవాన్ని కదా అని రాజ్ అంటాడు. బయట రుచులకు అలవాటయ్యారని నాకేం తెలుసని కావ్య అంటుంది. మరొకవైపు అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు కానీ అప్పు ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అప్పుడే అనామిక వచ్చి.. తనకి నీపై ప్రేమ ఉందని తెలిసినా ఎలా మాట్లాడుతున్నావ్? నాకు నచ్చదని కళ్యాణ్ తో అనామిక చెప్తుంది. మరొకవైపు అప్పు పరధ్యానంగా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంటే కావ్య వెళ్తున్న ఆటోకి అడ్డుగా వస్తుంటుంది. డ్రైవర్ ఆపి అప్పుని తిడుతుంటాడు. అది కావ్య చూసి అప్పుని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక కనకం, అన్నపూర్ణ, అప్పులతో కావ్య మాట్లాడుతుంది. మరొకవైపు రుద్రాణితో స్వప్న చాకిరీ చేయించుకుంటుంది. మరొకవైపు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి కావ్యని చూసి.. మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మ అని అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగం లో ఇప్పటివరకు ఎక్కడకి వెళ్ళావని కావ్యను అపర్ణ అడుగుతుంది. మా పుట్టింటికి వెళ్ళానని కావ్య చెప్పగానే వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా కావ్య అంటు కావ్యతో అనామిక అనేసరికి అందరు కోపం వచ్చేలా మాట్లాడతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిడ్డను కోల్పోయిన ముక్కు అవినాష్.. ఏం అడగొద్దంటూ ఇన్స్టా లో పోస్ట్

బుల్లితెర మీద జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్(Mukku Avinash) గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సందడి చేసాడు. ఐతే అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజాని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం వరకు అన్ని విషయాలను కూడా తన ఫాన్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఐతే ఇప్పుడు ఒక విషాదకర సంఘటన గురించి కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా చెప్పి చాలా బాధపడ్డాడు. "నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను  కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ" మీ అనూజ అవినాష్ అంటూ ఒక సుదీర్ఘ మెసేజ్ ని రాసాడు.  ఇంతకు ఏమైందో ఎలా బేబీని కోల్పోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. అడిగి బాధపెట్టొద్దని చెప్పడంతో నెటిజన్స్ కూడా ఆ విషయం గురించి అడిగే ప్రయత్నం చేయలేదు. "సారీ ఫర్ యువర్ లాస్..జాగ్రత్తగా స్ట్రాంగ్ గా ఉండండి.." అని కొందరు, "మీరు తండ్రి కాబోతున్న విషయాన్ని షేర్ చేసుకోకూడదు...ఈసారి మాత్రం కొంచెం సీక్రెట్ గా ఉంచు ఏ విషయాన్ని ఐనా.. దేవుడు కరుణిస్తాడు త్వరలోనే మీకు మరో బిడ్డ పుడుతుంది " అని కొందరు సలహాలు ఇస్తున్నారు.

వాడి కాలర్ పట్టుకొని అడిగింది.. నేరస్తుడు దొరికినట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'(Krishna Mukunda Murari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -360 లో...ముకుందకి కృష్ణ ఉండే దగ్గర నలుగు కార్యక్రమం మొదలుపెడుతుంది. అది చూసిన శకుంతల ఏడుస్తుంటుంది.  నువ్వు ఇలా శుభకార్యంలో ఏడవకని భవాని కోప్పడుతుంది. ఇదంతా మీ వల్లే ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోవాలని ముకుంద అనగానే.. సంవత్సరం లోపు ఒక పండంటి పాపని ఇవ్వమని భవాని అంటుంది. అ తర్వాత ముకుందకి భవాని నలుగు పెడుతుంది. కాసేపటికి కృష్ణని భవాని నలుగు పెట్టమని చెప్తుంది. మరొకవైపు ప్రసాద్, రేవతి వాళ్ళు కలిసి మురారికి నలుగు పెడుతుంటారు. అప్పుడే మురారికి ఎవరో ఫోన్ చేసి శ్రీధర్ ని హత్య చేసిన వాళ్లలో ఒకడు దొరికాడని చెప్తాడు. దాంతో మురారి వెంటనే భవాని దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పి వెళ్తానని అనగానే.. వద్దు నువ్విప్పుడు బయటకు వెళ్ళాకూడదు. కానిస్టేబుల్ కు చెప్పు అతన్ని తీసుకొని రమ్మని అని మురారికి భవాని చెప్తుంది. అసలు ఈ దేవ్ ఎక్కడకి వెళ్ళాడని దేవ్ కి ముకుంద ఫోన్ చేస్తుంది. నాకే టెన్షన్ గా ఉంది ఇంక టెన్షన్ పెట్టకని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఆ తర్వాత అందరు హాల్లో వెయిట్ చేస్తుంటారు. ఇంక రావడం లేదు. నేను వెళ్తానని మురారి అనగానే నువ్వు ఎందుకు వెళ్తానని అంటున్నావ్.. అక్కడికి వెళ్లి మళ్ళీ తారుమారు చెయ్యడానికి ప్రయత్నం చేస్తావా అని భవాని అనగానే... మీరు ఎందుకు ఏసీపీ సర్ ని వెళ్లనివ్వడం లేదు. నిజం నిరూపిస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోననే భయం కదా మీకు అని కృష్ణ అనగానే..  కృష్ణపై భవాని కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ రౌడీని తీసుకొని వస్తాడు. రౌడీని మురారి నిజం చెప్పమని కొడతాడు. ఇదంతా చేస్తే పెళ్లి ఆగిపోతుందని మా అన్న చెప్పాడు. మా అన్నకి పెద్దపల్లి ప్రభాకర్ చెప్పాడంట అని ఆ రౌడీ అనగానే అందరు షాక్ అవుతారు. కృష్ణ, మురారి ఇద్దరు అలా చెయ్యడని చెప్పే ప్రయత్నం చేసినా భవాని ఎవరి మాట వినదు. నేను నిజాలు కనుక్కుంటానని మురారి వెళ్ళాబోతుంటే భవాని ఎమోషనల్ గా మాట్లాడి వెళ్లకుండా చేస్తుంది. ఆ తర్వాత కృష్ణని అక్కడ నుండి భవాని పంపిస్తుంది. మరొకవైపు ఆ కానిస్టేబుల్ , రౌడీకీ బయటకు వచ్చాక దేవ్ డబ్బులు ఇస్తాడు. తరువాయి భాగంలో దేవ్ వేలికి  ఉన్న ఉంగరాన్ని కృష్ణ చూసి దేవ్ కాలర్ పట్టుకొని వీడే శ్రీధర్ ని హత్య చేసిందని చెప్తుంది. అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ పేరుతో మోసం.. యాంకర్ స్వప్న చౌదరి సంచలన వీడియో!

మోసం అన్ని చోట్లా జరుగుతుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణే...బుల్లితెర మీద కూడా చాల మోసాలు జరుగుతూ ఉంటాయి..కానీ చాల వరకు బయటకు రావు..ఎవరైనా ధైర్యం చేసి బయట పెడితేనే అవి కూడా తెలుస్తాయి..ఇప్పుడు బిగ్ బాస్ విషయంలో ఒక మోసం జరిగిందన్న విషయం రీసెంట్ గా బయటపడింది. యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి (Swapna Chowdary) ఈ విషయంలో మోసపోయింది. ఆ విషయాన్ని తానే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.  "రేలార్" టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరించింది స్వప్న. అలాగే "నమస్తే సేట్‌జీ"  అనే మూవీలో కూడా నటించింది.  బిగ్ బాస్‌ (Bigg Boss)కి వెళ్ళాలన్న ఆమె  ఆశను కొంతమంది కాష్ చేసుకున్నారని  చెప్పారు.  "బిగ్ బాస్‌కి వెళ్లడమంటే నాకు చాలా  ఇష్టం. ఎంత ఇష్టమంటే.. నేను కనే కలలో కూడా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు  అన్నీ సీజన్స్ ఫాలో అయ్యాను. బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్‌లో‌కి పంపిస్తాను అని చెప్పి తమ్మాలి రాజు అనే వ్యక్తి నా దగ్గర నుంచి  రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగితె పీఆర్, రేటింగ్ పెంచుకోవడం, కాస్ట్యూమ్ కోసం అని చెప్పారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేశారు. దాని కోసం రూ. 25 వేలు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బులు ఇచ్చాను..కానీ బిగ్ బాస్ షోకి వెళ్లలేకపోయా.. అడిగితే.. బిగ్ బాస్ 8లో పంపిస్తామన్నారు. ఇదిగోండి నాకు ఆయన ఇచ్చిన అగ్రిమెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ లోకి పంపలేకపోయాను కాబట్టి డిసెంబర్‌లో డబ్బు తిరిగి ఇస్తానని కూడా రాశారు. బిగ్ బాస్ కోసం నేను అప్పు చేసి ఇచ్చాను. నా పరిస్థితి బాగోలేదని చెప్పాను..అప్పుడు కూడా  వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తాను అని చెప్పాడు. నా డబ్బు  డిసెంబర్ 20 లోగా ఇస్తానని చెప్పి ఆ తర్వాత జనవరి 6 న ఇస్తానని చెప్పాడు. ఇప్పడు ఫోన్ చేసి డబ్బు అడుగుతుంటే 'పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇస్తావా.. ఇచ్చుకో, ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో’ అని సమాధానం ఇస్తున్నాడు. బిగ్ బాస్ టీమ్ ఇది గమనించండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు" అని తన వీడియోలో చెప్పింది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి.

Guppedantha Manasu : కొడుకుని ఆ సిచువేషన్ లో చూసి ఏడ్చేసిన నాన్న.. సాధించావమ్మా కోడలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -966 లో.. రిషిని చక్రపాణి దగ్గరకి తీసుకొని వస్తుంది వసుధార. ఆ  తర్వాత తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక కాసేపటికి అసలు ఏం జరిగిందని వసుధారని చక్రపాణి అడుగుతాడు. ఇదంతా శైలేంద్ర చేస్తున్న కుట్ర అని వసుధార చెప్తుంది. మరి అందరికి చెప్పి వాడికి శిక్ష పడేలా చెయ్యాలని చక్రపాణి అంటాడు. రిషి సర్ గురించి మావయ్యకి తెలియదు ఉదయం చెప్పాలని వసుధార అంటుంది. మరుసటి రోజు ఉదయం ఎందుకు ఇలా జరుగుతుందని మహేంద్ర టెన్షన్ పడుతుంటాడు. రిషి కన్పించడం లేదని బాధని దాచుకోని తిరుగుతున్నాను. ఇప్పుడు వసుధార కన్పించడం లేదు ఏమైంది? అసలు ఎక్కడ ఉందని అనుపమతో మహేంద్ర అంటాడు. నువ్వు టెన్షన్ పడకని మహేంద్రకి అనుపమ ధైర్యం చెప్తుంది. అప్పుడే వసుధార ఫోన్ నుండి మహేంద్రకి కాల్ వస్తుంది. వసుధా ఫోన్ చేస్తుందని అనుకుని మహేంద్ర ఎక్సయిట్ మెంట్ తో లిఫ్ట్ చేస్తాడు. కానీ రిషి మాట్లాడతాడు. హలో డాడ్ అని రిషి అనగానే మహేంద్ర సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్. ఎక్కడ ఉన్నావ్ నాన్న రిషి? ఎలా ఉన్నావంటూ ఎమోషనల్ అవుతాడు. మీరేం కంగారు పడకండి డాడ్. నేను బాగున్నానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషితో అనుపమ మాట్లాడుతుంది. ఇప్పుడు చక్రపాణి మావయ్య ఇంట్లో ఉన్నామని అనగానే సరే వస్తున్నామని మహేంద్ర, అనుపమ  ఇద్దరు బయలుదేర్తారు. ఆ తర్వాత అనుపమ మహేంద్ర ఇద్దరు రిషి దగ్గరకి వస్తారు. రిషి దగ్గరకి మహేంద్ర వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. అసలు ఈ దెబ్బలు ఏంటి నాన్న అని రిషిని మహేంద్ర అడుగుతాడు. రిషి మౌనంగా ఉంటాడు. ఇప్పుడు సర్ ఎక్కువ సేపు కూర్చొలేకపోతున్నారు నడవలేకపోతున్నారని వసుధార చెప్తుంది. కాసేపటికి జరిగింది మొత్తం మహేంద్రకి వసుధార చెప్తుంది. అసలు రిషిని నువ్వు ఎలా కలిసావని వసుధారని మహేంద్ర అడుగుతాడు. రిషి సర్ కాల్ చేసి చెప్పారు. నేను వెళ్తుంటే కూడా రౌడీలు నన్ను ఫాలో అయ్యారు. వాళ్ళని డైవర్ట్ చేసి సర్ ని కలిసాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. రిషి సర్ ముకుల్ కి కాల్ చేయగానే సర్ వచ్చి కాపాడారని వసుధార చెప్పగానే.. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదని మహేంద్ర అంటాడు. ఆ సిచువేషన్ లో నాకు రిషి సర్ ని కలవాలన్న అలోచన తప్ప ఏం తోచలేదని వసుధార చెప్తుంది. కాసేపటికి రిషి మన ఇంటికి వెళదాం పదా అని మహేంద్ర అనగానే.. వద్దు మావయ్య ఇక్కడ అయితేనే సర్ సేఫ్ గా ఉంటారని వసుధార అంటుంది. మహేంద్ర కూడ ఒప్పుకుంటాడు. కాసేపటికి రిషికి వసుధార బ్రెడ్ తినిపిస్తుంది. మహేంద్ర ఆపిల్ తీసుకొని వస్తాడు. ఇద్దరు తినండి. నువ్వు ఎలాగైనా సాధించావ్.. నీ రిషి సర్ ని కాపాడుకున్నావంటూ వసుధారని మహేంద్ర పొగుడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నాగార్జున కోసం మరో అమల.. ఏం మాట్లాడాలో అర్థంకావట్లేదన్న కింగ్ నాగ్

సంక్రాంతి వస్తుందంటే చాలు మూడు రోజుల పాటు బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా ముస్తాబవుతుంది. స్పెషల్ ఈవెంట్స్ తో ధూమ్ మచాలే అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇప్పుడు స్టార్ మా సంక్రాంతి కానుకగా వస్తున్న నాగార్జున నటించిన మూవీ  'నా సామిరంగా' పేరుతోనే ఒక స్పెషల్ ఈవెంట్ కి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ షోకి  స్పెషల్ గెస్టుగా నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్  వచ్చారు. ఇప్పుడు ఈ షో ప్రోమో ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తోంది. ఇక బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు ఈ షోలో మళ్ళీ తళుక్కుమన్నారు. సీరియల్ సెలబ్రిటీస్ ని కూడా తీసుకొచ్చారు మేకర్స్. ప్రోమో స్టార్టింగ్ లో నటుడు శివాజీ  పంచె కట్టులో ఎంట్రీ ఇచ్చాడు. మా ఊరి పేరు మొగ్గాపురం" అనడంతో స్పై  టీమ్   శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్‌దీప్ "మా ఊరు చుక్కాపురం" అంటూ రచ్చ రంబోలా రేంజ్ లో డైలాగ్ చెప్పారు. నాగార్జున  సార్ మా ఊరంటే మా ఊరొస్తారంటూ  రెండూ టీమ్‌లు గొడవపడుతుండగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌తో కలిసి నాగార్జున ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేశారు .  ఇంతలో సడెన్‌గా బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తున్న  కావ్య అలియాస్ దీపిక రంగరాజు నాగార్జున దగ్గరికి వచ్చి  "ఒక 10 మినిట్స్ నేనే మీ అమల" అని కావ్య ఫన్నీగా అడిగేసరికి నాగార్జున సిగ్గుపడుతూ పక్కకి పారిపోయారు. కావ్య తన అల్లరితో కింగ్ ని  వదలకుండా నాగార్జున చేయి పట్టుకొని  "నా సామిరంగా" మూవీలో రామ్ మిరియాల పాడిన పాట "ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల" సాంగ్ కి డాన్స్ చేయించింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.. నాగార్జున మాత్రం  కావ్యను చూసి "నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు" అంటూ నవ్వేశారు.  ఈ షోలో  బ్రహ్మముడి సీరియల్  హీరో రాజ్ అలియాస్ మానస్, కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల, ప్రియాంక లవర్ శివ్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు భోలే, నయని పావని, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, దామిని, శ్రీసత్య, ముక్కు అవినాష్, నిఖిల్  సందడి చేశారు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సుమ హోస్ట్ గా ఉన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాగ్ నటించిన "నా సామి రంగ" మూవీ ప్రమోషన్స్ కూడా ఐపోయాయి. ఇక ఈ షో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

చూస్తోంది వ్యూహం మూవీనా...ఆ వీడియోస్ ఆ...ఆర్జీవిని అడిగిన నెటిజన్

రామ్ గోపాల్ వర్మ "వ్యూహం" మూవీని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి..అసలు చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే ఇలాంటి వెదర్ లో వ్యూహం మూవీ గొడవ   రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది. ఐతే ఈ మూవీని  జనవరి 11వ తేదీ వరకు రిలీజ్ చేయకూడదని హైకోర్టు స్టే విధించింది. రామ్ గోపాల్ వర్మ తెచ్చుకున్న సెన్సార్ సర్టిఫికెట్ మీద ఈ స్టే విధించింది న్యాయ స్థానం. ఐతే ఈనెల 11 కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది. ఇది అసలు విషయం... ఐతే ఇప్పుడు తన మూవీ తానే హ్యాపీగా మందేస్తూ డాక్టర్ ప్రదీప్ చింతా అనే వ్యక్తితో కలిసి ఆ మూవీని చూస్తున్న పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇది చూసిన నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.." ఎలాగో థియేటర్ లో రిలీజ్ కావడం లేదని నీ మూవీని నువ్వే చూసుకుంటున్నావా బ్రో ...ఇంత దీర్ఘంగా చూస్తున్నారు అంటే పోర్న్  వీడియోస్ అయ్యుండొచ్చు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన  పరిణామాలు..ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. వైఎస్ జగన్  ఎలా పాదయాత్ర మొదలుపెట్టి ఏపీ సీఎంగా ఎలా అయ్యాడు వంటి స్టోరీ లైన్ తో వ్యూహం అనే మూవీ తీసాడు ఆర్జీవీ.  ఐతే ఇందులో టీడీపీ   తమను కించపరిచే విధంగా చూపించే ఉంటారని, రాబోయే ఎన్నికల్లో ఈ మూవీ ప్రభావం ప్రజల మీద ఉంటుందనే  ఉద్దేశంతో నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు ఈ మూవీ మీద కేసు వేశారు.

ఆయన శ్రీధర్ మాష్టర్ కాదు..సాయిసాత్విక్ కి ఘాటు వార్నింగ్

ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో కమెడియన్ ఆది సింగర్ గా, టచ్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి కాసేపు ఫన్ క్రియేట్ చేసాడు.. హోస్ట్ నందు సింగర్ గా ఒక పాట పాడమనేసరికి ఏదో సాంగ్ పాడి అందరినీ నవ్వించాడు. తర్వాత "ఏరా జెస్సి టచప్ చేయనా" అనేసరికి "ఏరా జెస్సి" ఏంటి అంటూ ఫీలయ్యాడు..దానికి ఆది కౌంటర్ వేసాడు "అక్కా టచప్ చేయనా" అని అడిగేసరికి పడీపడీ నవ్వుకున్నాడు జెస్సి. తర్వాత కొన్ని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయ్యాక జడ్జిగా ఉన్న శ్రీధర్ మాష్టర్ కూతురు అక్షద స్టేజి మీదకు వచ్చి వాళ్ళ నాన్న అసలు రూపం బయట పెట్టింది. ఇక ఆది దొరికిందే ఛాన్స్ అని "మీ నాన్న గారి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పండి" అనేసరికి "ఒకసారి నాకు ఇంట్లో బాగా బోర్ కొట్టింది. ఆ టైంలో నేను వేరే నంబర్ నుంచి నాన్నకు కాల్ చేసాను. కొత్త నంబర్ కదా ఎవరో తెలీక ఎవరు అన్నారు. నేను ప్రియా, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని అడిగేసరికి మా నాన్న ఓకే చెప్పేసారు." అని అక్షద చెప్పేసరికి "ఐతే శ్రీధర్ మాష్టర్ కాదు శేఖర్ మాష్టర్ 2  అన్నమాట మీరు " అని ఆది శ్రీధర్ మాష్టర్ పరువు తీసేసాడు. "ఇన్స్టాగ్రామ్ లో ఒక గర్ల్ ఫ్యాన్ తో చాట్ చేస్తుండగా ఆమె నాన్న నంబర్ అడగగానే పంపించేశారు" అని ఇంకా కొన్ని విషయాలు చెప్పేసరికి స్టేజి మీద నుంచి శ్రీధర్ మాష్టర్ వచ్చేసి చెప్పొద్దూ అనేసరికి ఆది అడ్డుపడ్డాడు "ఇంతకు మీ గర్ల్ ఫ్యాన్ పేరేమిటి ఇంతకు" అని ఆది అడిగాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఇక ఈ ప్రోమోలో ఫైనల్ గా కార్తీక దీపం చిన్నారి హిమ అలియాస్ సహృద వచ్చి "ఫిదా" మూవీ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ కి శ్రీధర్ మాష్టర్ 45 మార్క్స్ ఇచ్చేసరికి సాత్విక్ లేచి "ఆ సాంగ్ కి థీమ్ లేదు..దానికి మీరు 45 మార్క్స్ ఇస్తున్నారా" అనేసరికి "నేను సినిమాల్లో ఉంటాను తెలుసా ..కూర్చో" అంటూ వేలు పెట్టి సాత్విక్ కి వార్నింగ్ ఇచ్చారు జడ్జి శ్రీధర్ మాష్టర్..ఇక ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో ఇక నుంచి హాట్ హాట్ గొడవల కంటెంట్ రాబోతోందన్న విషయం దీన్ని బట్టి తెలుస్తోంది.  

ఏస్ ఫోటోగ్రాఫర్ గా...న్యూ నికాన్ క్రియేటర్ గా సదా సయ్యద్

జయం మూవీలో నటించిన సదా గురించి అందరికీ తెలుసు. "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే డైలాగ్ తో మంచి ఫేమస్ కూడా అయ్యింది. ఆ తర్వాత తమిళ్ లో మాధవన్, విక్రమ్‌ తో కలిసి   ‘ఎతిరి’, ‘అన్నియన్‌’ మూవీస్ లో కూడా  నటించింది.  ఐతే కొంత కాలం నుంచి సదా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.  వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో ఆమె అన్ని రకాల ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తోంది.  ప్రొఫెషనల్‌ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది సదా. స్టార్ మాలో టెలికాస్ట్ ఐన 'నీతోనే డ్యాన్స్'షోలో సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్‌తో పాటు సదా కూడా జడ్జీగా పని చేసింది. సినిమా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి అప్పటినుంచి ఆమె  బుల్లితెరకి వచ్చేసింది . కన్నడలో 2014లో వచ్చిన జోడి నం.1 అనే డ్యాన్స్ షోకి జడ్జిగా, తర్వాత 2016లో తెలుగు డ్యాన్స్ షో ఢీ జూనియర్స్ 1, 2 సీజన్లకు జడ్జిగా, 'ఢీ జోడి'లో కూడా కంటిన్యూ చేసింది.  చివరిగా 2018లో 'టార్చ్‌లైట్' అనే మూవీలో నటించింది. ఇక ఇప్పుడు ఆమెకు నికాన్ ఫామిలీ వెల్కమ్ చెప్పింది. " సదా సయ్యద్‌ను మా ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నాం. వృత్తిరీత్యా నటి ఐనా కూడా  సదాకు వన్య ప్రాణులంటే చాలా ఇష్టం. అలా ఆమె  2021 అక్టోబర్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, పన్నా టైగర్ రిజర్వ్‌లో తన మొదటి జంగిల్ సఫారీకి వెళ్లినప్పుడు అక్కడి  వన్యప్రాణులను చూసి వాటి మీద ఆమె ఆసక్తి పెంచుకుని జంగిల్ సఫారీలను చిత్రాలుగా తీశారు.   2022లో నికాన్ Z 6IIతో కూడిన ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీలోకి దూసుకెళ్లారు. కాబట్టి మేము నికాన్ కుటుంబానికి సదాను స్వాగతిస్తున్నాము...ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ ప్రయాణంలో భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది" అంటూ నికాన్ కంపెనీ చెప్పింది. సదా తన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కోసం నికాన్ Z 6II కెమెరాని వాడుతూ ఉంటుంది. ఈ కెమెరా ఖరీదు రెండున్నర లక్షలు... దీంతో తన అభిరుచుని నెరవేర్చుకునే పనిలో పడింది సదా. ఇక ఈ కెమెరాతో టైగర్ వాకింగ్ ని క్లోజప్ లో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.  

Guppedantha Manasu:ఇటు కన్నింగ్ మొగుడు.. అటు కేరింగ్ వైఫ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -965 లో.. రిషిని వసుధార తనతో తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రిషి జరిగింది మొత్తం వసుధారకి చెప్తాడు. మనం శైలేంద్ర అన్నయ్యని హాస్పిటల్ లో చూడడానికి వెళ్ళినప్పుడు.. నాకు ఎవరో ఫోన్ చేసి మీకు కావలిసిన ఇన్ఫర్మేషన్‌ కావాలంటే మీరు వెంటనే ఇక్కడికి రండి అని చెప్పగానే వెళ్లిపోయాను. అక్కడ రౌడీలు నన్ను తీసుకొని వెళ్లారు. తప్పించుకొని వెళ్తు ఫారెస్ట్ లో పడిపోయాను. అ తర్వాత నేను వాళ్ళు దగ్గర ఉన్నానని రిషి చెప్తాడు. మిమల్ని ఎప్పటిలాగే మార్చుకుంటానని రిషికి వసుధార చెప్తుంది. ఇప్పుడు ఇంటికేనా వెళ్ళేదని రిషి అడుగుతాడు. లేదు ఇప్పుడు మిమల్ని సేఫ్ ప్లేస్ లో ఉంచాలని రిషి ని తీసుకొని వసుధార బయలుదేర్తుంది. మరొకవైపు ఆ వసుధార ఎలా తప్పించుకుంది. ఇప్పుడు ఏమి చెయ్యబోతుందని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. తన ప్లాన్ లు అన్ని ఫెయిల్ అవుతు ఉండడంతో శైలేంద్ర డిస్సపాయింట్ అవుతాడు. పుండు మీద కారం చల్లినట్లు అప్పుడే ధరణి వచ్చి.. ఏమైంది అలా ఉన్నారని అడుగుతుంది. ధరణికి ఏమి సమాధానం చెప్పలేక శైలేంద్ర నసుగుతు ఉంటాడు. ఈయన ప్లాన్ ఎదో ఫెయిల్ అయినట్లు ఉంది. అందుకే ఇలా ఉన్నాడు ఈయన ఇలా టెన్షన్ పడుతున్నాడంటే వాళ్లకి ఏమి కాలేదని అర్థమని ధరణి తన మనసులో అనుకుంటుంది. మరుసటిరోజు ఉదయం మహేంద్రకి ఫణీంద్ర కాల్ చేసి వసుధార ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. రాలేదు అందరికి ఫోన్ చేసి కనుకున్నానని మహేంద్ర అంటాడు. వసుధరా వస్తే ఫోన్ చెయ్ అని చెప్పి ఫణింద్ర ఫోన్ కట్ చేస్తాడు. అ తర్వాత దేవయాని వస్తుంది. వసుధార కన్పించడం లేదని ఫణింద్ర చెప్పగానే.. ఎక్కడకి వెళ్ళింది.. ఏమైనా జరిగి ఉంటుందా అని దేవయాని మాట్లాడుతుంటే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ధరణికి వసుధార కన్పించడం లేదని తెలిసి టెన్షన్ పడుతుంది. మరొకవైపు రిషిని వసుధార తీసుకొని చక్రపాణి దగ్గరకి వస్తుంది. గాయాలతో ఉన్న రిషిని చూసి చక్రపాణి ఏమైందని అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగింది మొత్తం చెప్తుంది. రిషిని వసుధార దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇన్ని రోజులు తను దూరంగా ఉంటే పడ్డ బాధని రిషికి చెప్తుంది. ఆ తర్వాత రిషి సర్ టాబ్లెట్స్ వేసుకున్నారా అని చక్రపాణి అడుగుతాడు. ఇప్పటి వరకు టాబ్లెట్స్ లాంటివి ఏమి వెయ్యలేదని వసుధార చెప్తుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బబుల్ గం అంత వయొలెంట్ ప్రేమ హనుమాన్ లో ఉండదు : ప్రశాంత్ వర్మ

సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ సజ్జ ఇప్పుడు పెద్దవాడైపోయి హీరోగా "హనుమాన్" అనే మూవీలో నటించాడు. అలాగే కామెడీ కూడా కాస్తా ఎక్కువగానే చేసాడు. సుమకు కౌంటర్ లు కూడా వేసాడు. ఇక ఈ వారం షోకి హనుమాన్ మూవీ టీమ్ తేజ సజ్జ, అమృత అయ్యర్, ప్రశాంత్ వర్మ, గెటప్ శీను వచ్చారు. ఇక సుమా ఈ టీమ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు "ఇప్పటి వరకు వచ్చిన సూపర్ హీరో ఫిలిమ్స్ లో మీ సూపర్ హీరో ఎవరు" అని సుమ ప్రశాంత్ వర్మని అడిగేసరికి "హనుమాన్" అని ఆన్సర్ ఇచ్చాడు. "అబ్బా ఫస్ట్ మన సినిమాను మనం ప్రేమిద్దాం..తర్వాత సంగతులు తర్వాత.." అని కౌంటర్ వేసింది సుమ. "హనుమాన్ అని ఉంది కదా డివోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుందా మూవీలో" అని సుమ తేజని అడిగేసరికి "పండక్కి ఫామిలీ మొత్తం వెళ్లి చూసే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అందులో దేవుడి ఎలిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది" అని తేజ చెప్పేలోపు "రొమాన్స్ ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే హనుమాన్ కదా" అని సుమ కౌంటర్ వేసింది దానికి "రొమాన్స్ అనేది మా ఇద్దరి సినిమాల్లో ఉండదు" అని తనను, ప్రశాంత్ వర్మని కలిపి చెప్పాడు తేజ. ఆ కౌంటర్ కి సుమ షాకయ్యింది. "అవును కదా ఎందుకలా" అని సుమ అడిగేసరికి "ఎందుకంటే ఆయనకు నాకు రొమాన్స్ చేయడం రాదు" అని చెప్పాడు తేజ. ఇక ప్రశాంత్ వర్మ నోరు విప్పు "నాకు అర్ధమయ్యింది కానీ బబుల్ గం అంత వయొలెంట్ ప్రేమ కాదు" అని చెప్పాడు. ఇక ప్రశాంత్ వర్మ కామెంట్స్ రూటు మారుతోందని తెలిసి సుమ టాపిక్ ని గెటప్ శీను వైపు మళ్లించింది "ఈయన జాంబీ రెడ్డిలో జాంబీగా బాగా యాక్ట్ చేసాడు ఎందుకంటే ఆ దెయ్యం పోలికలు అవి చాలా కరెక్ట్ గా పెట్టగలడు" అనేసరికి అందరూ నవ్వేశారు.