హీరో సూర్యకి భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. డాన్స్ ల సందడి సండే రోజు ఉంటుంది లేదంటే ఫినాలే వీక్ ఉంటుంది. కానీ ఈ సారి స్పెషల్ గెస్ట్ ని తోసుకొచ్చాడు బిగ్ బాస్ మామ. అతనే హీరో సూర్య. సూర్య భాయ్ అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చాడు సూర్య. తన కొత్త సినిమా 'కంగువా' ప్రమోషన్ కోసం వచ్చిన సూర్య.. హౌస్ మేట్స్ ని ఉత్తేజపరిచాడు. సూర్య స్టేజ్ పైకి వచ్చి నాగార్జున తో ముచ్చటించాడు. కాసేపటికి ఆ మూవీ టీమ్ అంతా కూడా స్టేజ్ పైకి వస్తారు. ఇక మువీ ట్రైలర్ ని చూపించారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు కూడా సూర్యకి సర్ ప్రైజ్ గా తన సినిమాలోని పాటలని  ఇద్దరు జంటగా డాన్స్ వేస్తూ ఎంటర్‌టైన్ చేశారు. నిఖిల్-యష్మీ, పృథ్వీ-విష్ణుప్రియ, ప్రేరణ-నబీల్, మెహబూబ్-నయని, తేజ-హరి తేజ. అవినాష్-రోహిణి. గౌతమ్-నయని లు తమ డ్యాన్స్ స్టెప్స్ తో సూర్యని సర్ ప్రైజ్ చేశారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరిని పరిచయం చేశాడు. విష్ణుప్రియని పరిచయం చేస్తాడు. నిన్ను చూసి శృతి హసన్ లాగా ఉన్నావని సూర్య అంటున్నాడని నాగార్జున అనగానే.. విష్ణుప్రియ మురిసిపోయింది. నాకు తెలుసు ఇప్పుడు మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారని విష్ణుప్రియ అంటుంది. ఇక నయని,సూర్యకి పెద్ద ఫ్యాన్ అంట.. ముందు రోజే సూర్య వస్తున్నాడని తెలిసి ఎమోషనల్ అయిందట. ఆ విషయం సూర్యకి హరితేజ చెప్తుంది. అయితే నీకు ఒక ఆఫర్ నయని.. ఒక అయిదు నిమిషాలు నువ్వు ఇక్కడికి వస్తే సూర్య తో ఉండొచ్చు.. మళ్ళీ హౌస్ లోకి వెళ్ళకూడదని నాగర్జున అనగానే దానికి నయని ఒప్పుకుంటుంది. చూసావా సూర్య నీకు తెలుగులో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారోనని సూర్యతో నాగార్జున అంటాడు. ఇక హౌస్ మేట్స్ అంతా గ్రాంఢ్ గా ఆల్ ది బెస్ట్ చెప్తారు.

బెడ్ రూమ్ లో బొమ్మ బొరుసు ఆడుకుంటున్న భార్యాభర్తలు.. అత్త ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -237 లో.....రామలక్ష్మికి అభి ఎదరుపడి మాట్లాడితే సీతాకాంత్ కి డౌట్ వస్తుందని అనుకుంటాడు. అభి రామలక్ష్మి దగ్గరికి వస్తుంటే మాణిక్యం కన్పించడంతో అభి భయపడి వెళ్ళపోతాడు. ఆ తర్వాత సిరిని డిశ్చార్జ్ చేసి పంపిస్తుంటారు.  మరొకవైపు శ్రీలత చేస్తున్న కుట్ర మోసం గురించి శ్రీలతతో మాణిక్యం మాట్లాడుతాడు. నా కూతురు జోలికి రాకు అంటు మాణిక్యం వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఏదో జాగ్రత్త అంటున్నావని సీతాకాంత్ అనగానే.. సిరి జాగ్రత్త అంటున్నానని మాణిక్యం కవర్ చేస్తాడు. ఎందుకు తనతో పెట్టుకుంటున్నావ్.. ఆవిడ బుద్ది అసలే మంచిది కాదని సుజాత అనగానే.. ఆ శ్రీలత కి నేను అంటే భయం పుట్టాలి.. లేదంటే కూతురు అల్లుడిని కలిసి ఉండనివ్వదని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సిరిని సీతాకాంత్ జాగ్రత్త గా చూసుకుంటుంటే.. అపుడే రామలక్ష్మి వచ్చి నేను చూసుకుంటాను. మీరు మీ పని చూసుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత అభి ఎందుకు వచ్చాడని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అత్తయ్య చెప్పిన మాటలు నమ్మేసినట్లున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది. నా గురించి తప్పుగా అనుకుంటున్నారా అని రామలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు వేరే ఆలోచనలో ఉన్నా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నందినికి శ్రీలత ఫోన్ చేసి.. సందీప్ ని చైర్మన్ చెయ్ అని అంటుంది. ఇద్దరి అవసరం ఈక్వల్ గా ఉంది.మ టైమ్ వచ్చినప్పుడు చేస్తానని నందిని అంటుంది.ఆ తర్వాత ఆ శ్రీలతతో జాగ్రత్త అని నందినితో హారిక అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ దగ్గరికి పాలు తీసుకొని వస్తుంది. ఇద్దరు ఫన్నీ ఒక గేమ్ ఆడతాడు. బొమ్మ బొరుసు వేస్తుంది. బొమ్మ పడితే నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటుంది. బొమ్మ పడుతుంది నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మిమ్మల్ని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ భీమ్ ని చూసినట్టుంది!

బిగ్ బాస్ హౌస్ లో అందరు ఎంతగానో ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున చీవాట్లు పెట్టే ఈ ఎపిసోడ్ కి వారమంతా ఎదురుచూస్తునే ఉంటారు. కానీ ఈ వారం స్పైసీ కొంచెం తగ్గినట్లుంది. ఆదివారం జరగాల్సిన ఫన్ డే కాస్త శనివారమే జరిగింది. ఈ వారం హౌస్ మేట్స్ అందరు బాగా పర్ఫామెన్స్ ఇచ్చారు. నాగార్జున మొదట కర్రతో వచ్చాడు కానీ తర్వాత కామెడీనే చేసాడు. హౌస్ మేట్స్ తో నాగార్జున ఒక్కొక్కరిగా తమ అటతీరు గురించి చెప్పుకొచ్చాడు. మొదటగా పృథ్వీ ఈ వారం ఫుల్ ఫైర్ తో ఆడావు.. నువ్వు టాస్క్ లో ఉన్నావంటే రాయల్స్ కి భయం పుట్టేలా చేసావంటూ పృథ్వీని మెచ్చుకున్నాడు నాగార్జున. కానీ నామినేషన్ అప్పుడు రోహిణిని నువ్వు చుసిన చూపు కొంచెం హర్టింగ్ గా ఉంటుంది. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోమంటూ స్మాల్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ.. ఈ వారం చాలా బాగా అడావు. పృథ్వీది నీ కాంబినేషన్ సూపర్ మిమ్మల్ని చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ భీమ్ లా అనిపించిందని నాగార్జున వాళ్లకి బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ సంచాలకుడిగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ హౌస్ మేట్స్ ఓపీనియన్ అడుగుతాడు. ఆ తర్వాత మిగతా హౌస్ మేట్స్ ఆటతీరు.. వారు చేసిన మిస్టేక్స్ అన్నీ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ వారం నిఖిల్, పృథ్వీలు ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళు పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేవ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Brahmamudi : క్లయింట్స్ రాకుండా ఆపేసిన అనామిక.. కావ్య ఏం చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -551 లో....రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు ఇప్పుడు నన్ను ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడుతారని అనుకుంటాడు. కానీ ఆవిషయం పక్కన పెట్టి ఖాళీగా ఉంటున్నావ్ కదా.. ఆ పని చెయ్.. ఈ పని చెయ్ అంటారు. ఇందిరాదేవి ఏకంగా కూరగాయలు తీసుకొని రమ్మని చెప్తుంది. రాజ్ తీసుకొని వస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. దాంతో ఇందిరాదేవి లిస్ట్ ఇస్తుంది. అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అపర్ణ, కనకం ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీ అల్లుడు బయలుదేరాడని ఇందిరాదేవి చెప్తుంది.‌ మరొక వైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ నుండి సెక్యూరిటీ షిఫ్ట్ చేసిన అతను కావ్యకి నమస్తే పెడతాడు. నీకు సెల్యూట్ ఎలా చేయాలో కూడా తెలియదా అని కావ్య అనగానే.. నేను ఏమైనా పుట్టుకతో సెక్యూరిటీనా అని అతను అంటాడు. ముందు సెక్యూరిటీ డ్యూటీ నేర్చుకోమని కావ్య కోప్పడి వెళ్ళిపోతుంది. కావ్య లోపలికి వెళ్లేసరికి.. శృతి ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా రాజ్ సర్ వస్తాడని ఒకరు.. కావ్య మేడమ్ వస్తారని ఒకరు పందెం కాస్తుంటారు. కావ్య వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత అపర్ణకి కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడోనని కావ్య అనగానే.. అదేం లేదని అపర్ణ అంటుంది. మరొకవైపు రాజ్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు ఎక్కువ ధరకి కొంటాడు. అదంతా చూసిన కనకం.. నా అల్లుడుని మోసం చేస్తున్నావంటూ అడుగుతుంది. అయిన మీరు చేసిన మోసం ముందు ఇది ఎంత అన్నట్లు రాజ్ మాట్లాడతాడు. మిమ్మల్ని ఎప్పటికి క్షమించలేనని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి శృతి వచ్చి.. క్లయింట్స్ రానని చెప్పారని అంటుంది. అప్పుడే అనామిక ఫోన్ చేసి.. వాళ్ళని నేనే రాకుండా ఆపానని అంటుంది. తరువాయి భాగ లో రాజ్ ని ఆఫీస్ కి వెళ్ళమని అందరు ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటే.. రాజ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బాడీ షేమింగ్ పై పృథ్వీకి నాగార్జున వార్నింగ్.. గౌతమ్ కి షాక్!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ఏడు వారాలు గడిచింది. ఇక అయితే ఎనిమిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. శనివారం నాటి ప్రోమో కోసం జనాలు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. గత వారం ప్రోమో లేటుగా అప్లోడ్ చేశారంటు బిబి టీమ్ ని నెటిజన్లు ట్రోల్ చేయగా.. ఇప్పుడు పొద్దున్నే వదిలారు.  బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున వచ్చీ రాగానే ఓ కర్రతో వచ్చాడు. నామినేషన్ లో కుండలు పగులగొట్టినట్టు అందరి పర్ఫామెన్స్ చూసి ఈ వారం ఎవరు చెత్తగా ఆడారో వారి ఫోటో ఉన్న కుండని పగులగొడతాడన్న మాట. ఇక పృథ్వీని లేపి.. కింద నుండి పై దాకా చూశాడు నాగార్జున. నేనేం నిన్ను బాడీ షేమింగ్ చేయడం లేదు.. అలా చూశాను అంతే అని నాగార్జున అనగానే ఆ ఇంటెన్షన్ తో చూడలేదు సర్ అని పృథ్వీ అన్నాడు. నా ఇంటెన్షన్ కూడా అది కాదని నాగార్జున అన్నాడు.  ఆ పాయింట్ వినగానే రోహిణిని పృథ్వీ నామినేషన్ లో చూసింది అంతా గుర్తొచ్చింది. ఈ పాయింట్ మీద పృథ్వీకి గట్టిగానే వార్నింగ్ పడ్టట్టు ఉంది. ఇక నిఖిల్ సంఛాలక్ గా ఎలా ఉన్నాడో చెప్పుకొచ్చాడు నాగార్జున.   క్వశ్చన్ అంతా పూర్తయ్యాకే బజర్ నొక్కమని బిగ్ బాస్ చెప్పాడని టేస్టీ తేజ అనగానే.. మీ రాయల్స్ అంతా క్వశ్చన్ పూర్తయ్యాకే బజర్ నొక్కారా అని నాగార్జున అడిగాడు. క్వశ్చన్ రిపీట్ చేయదన్నారు చేయలేదు సర్ అని నిఖిల్ అనగానే.. తేజ ఈ కుట్ర నువ్వు పన్నావ్ అన్నమాట అని నాగార్జున అనగానే.. తేజ బిత్తరపోయాడు.  యష్మీ విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశావని నాగ్ అడుగగా.. సెవెన్ వీక్స్ లో ఇండివిడ్యువల్ గేమ్ నాకు ఎక్కడ కనపడలేదని యష్మీ అంది.. మరి నీ ఇండివిడ్యువల్ గేమ్ ఏదని నాగార్జున క్వశ్చన్ చేసేసరికి.. తను షాక్ అయ్యింది.  నువ్వు మెగా ఛీఫ్ అయ్యాక లేడీస్ వీక్ అని డిక్లేర్ చేస్తున్నావ్.. కొన్ని వినడానికే బాగుంటాయి. ఆచరించడానికి బాగోవు.. కోపంలో ఓ మాట.. కోపం తగ్గాక ఓ మాట.. ఇష్టం ఉంటే ఓ మాట.. ఇష్టం లేకపోతే ఓ మాట మాట్లాడతావా అంటు గౌతమ్ ని నాగ్ అడిగాడు. ఏదో షార్ట్ టెంపర్ లో అలా అన్నాను అని గౌతమ్ అన్నాడు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తే కొందరికి గట్టిగానే వార్నింగ్ వచ్చినట్టు ఉంది. యూట్యూబ్ లో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. 

తోప్ కంటెస్టెంట్ కి ఎలిమినేషన్ తప్పదు.. సీక్రెట్ రూమ్ ఆ డబుల్ ఎలిమినేషనా!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో తమకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. అయితే హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన వాళ్లే చివరి వరకు ఉంటారు. అయితే ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ప్రస్తుతం నామినేషన్ లో నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, పృథ్వీ, నయని పావని మొత్తంగా ఆరుగురు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రేరణ ఉంది. నిఖిల్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో విష్ణుప్రియ ఉండగా నాల్గవ స్థానంలో పృథ్వీ ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరున్నారు. ఇక ఈ వారమంతా హౌస్ లో మెహబూబ్ కాస్త గేమ్ ఆడాడు.‌ కానీ నయని పావని ఏం ఆడలేదు. ఎప్పుడు చూసిన ఏడుపే.. హౌస్ లో క్రైయింగ్ బేబీ అని పేరు తెచ్చుకున్న నయనికి ఈ వీకెండ్ లో క్రైయింగ్ తప్పదేమోననిపిస్తుంది. అయితే బిగ్ బాస్ మామ మరోలా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే గంగవ్వ హౌస్ లో ఉన్నా పెద్దగా పర్ఫామెన్స్ లేదు పైగా తోటి కంటెస్టెంట్స్ మీద చిరాకు పడటం.. ప్రతీసారీ ఇదే రిపీట్ అవుతుంది. రాయల్స్ - ఓజీ క్లాన్ ల మధ్య టాస్క్ లు భారీగా జరుగుతున్నాయి. వాటిల్లో గంగవ్వ పార్టిసిపేషన్ లేదు కాబట్టి తనని ఎలిమినేషన్ చేసి.. ఈ వారం లీస్ట్ లో ఉన్న నయని పావనిని లేదా మెహబూబ్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఫుడ్ దగ్గర టాస్క్ లలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. మరి మన బిగ్ బాస్ మామ డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికి షాకిచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ రెండు కాకుండా పృథ్వీ-విష్ణుప్రియ మధ్య ఫేక్ లవ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది. తోటి హౌస్ మేట్స్ అంతా వాళ్ళిద్దరి వల్ల టాస్క్ లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. మరి వీరిలో లీస్ట్ లో ఉన్న నయని, మెహబూబ్ లని పక్కన బెట్టి వారిపైన ఉన్న పృథ్వీని బయటకు పంపిస్తాడో లేదో చూడాలి మరి.

యష్మీ-గౌతమ్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్.. నిఖిల్ కి జెలస్ అంట!

  బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ లోను ఆర్య-2 ట్రాయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుంది. గౌతమ్ కి యష్మీ అంటే ఇష్టం అది స్వయంగా తనే యష్మీతో చెప్పుకొచ్చాడు. యష్మీకి నిఖిల్ అంటే ఆ విషయం కూడా తనే స్వయంగా చెప్పుకొచ్చింది. నిఖిల్ మాత్రం ఈ విషయంలో బయటపడడం లేదు.. యష్మీ తన మనసులో మాట చెప్పినప్పుడు నిఖిల్ ఏ సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఆ తర్వాత కిచెన్ లో ఉన్న యష్మీ దగ్గరికి వచ్చి నుదుటి పై ముద్దు పెట్టాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ నిఖిల్ లు సరదాగా గొడవ పడుతుంటారు. నాపై ఏ హోప్స్ పెట్టుకోకని నిఖిల్ అనగానే.. ఏంటి అలా అంటున్నావ్.. నాకేం తక్కువ.. నాకు ఎవరు దొరకరన్నట్టు ప్రతీసారీ హోప్ పెట్టుకోకు అంటున్నావ్.. నాకు పృథ్వీ ఎలాగో నువ్వు కూడా ఇక అంతే అంటూ కాస్త పొగరుగా చెప్పేసి యష్మీ అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత యష్మీ, ప్రేరణ ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. అలా ప్రతిసారీ అంటే నాకు నిజంగా హర్టింగ్ గా ఉంటుందని యష్మీ అంటుంది. నబీల్ తో  నిఖిల్ అన్న విషయం ఏంటో తెలిసిందా అని ప్రేరణ అడుగుతుంది. హా తెలిసింది.. నేను గౌతమ్ తో డాన్స్ చేస్తుంటే నిఖిల్ జెలస్ గా ఫీల్ అయ్యాడంట అని యష్మీ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన గౌతమ్ తో యష్మీ ఉండడానికి కారణం నిఖిల్ జెలస్ ఫీల్ అవ్వాలనే అన్నమాట. మరొకవైపు యష్మీ, గౌతమ్ ల గొడవలో గౌతమ్ మాట్లాడుతుంటే.. యష్మీ వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుంది.. అదేనా రెస్పెక్ట్ అని గౌతమ్ తో తేజ అంటాడు. మనకి అవసరం లేదు.. రెస్పెక్ట్ లేనిది ఎవరు వద్దని యష్మీపై  గౌతమ్ కోపంగా మాట్లాడతాడు. అదంతా కంటెంట్ కోసమే.. నిజంగానే ఏం అర్థం అవ్వడం లేదు.. ఏ విషయం అయిన హౌస్ నుండి బయటకు వచ్చాకే క్లారిటీ వస్తుంది. 

మెగా ఛీఫ్ టాస్క్ లో పృథ్వీకి వెన్నుపోటు పొడిచిన హరితేజ!

  బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎవరంటే అందరు పృథ్వీ అనే అంటారు. అగ్రెసివ్ ఎవరంటే కూడా ఠక్కున పృథ్వీ అంటారు. హౌస్ లో తమ క్లాన్ లో తప్ప మిగతా హౌస్ మేట్స్ కి పృథ్వి నచ్చడు. నిన్న మొన్నటివరకు పృథ్వీ-విష్ణు అంటూ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని విష్ణుప్రియ మొహంపైనే పృథ్వీ చెప్పడంతో రెండు రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అయితే నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో రాయల్స్ నుండి ఇద్దరు ఓజీ నుండి నలుగురు కంటెండర్ షిప్ రేసులో నిలిచారు. ఇక చివరి మెగా చీఫ్ టాస్క్ లో.. టేస్టీతేజ ఉండగానే పృథ్వీని తీసేయాలంటూ హరితేజ తన క్లాన్ తో చెప్పింది. మనకి మెగా చీఫ్ గా ఫస్ట్ తేజ  అవ్వాలి..కానీ వాళ్లు ఎలాగైనా తనని తీసేస్తారు.. తేజని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే హౌస్ కి మంచి మెగా చీఫ్ ని సెలక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. ఈ పృథ్వీని మనం టాస్క్ లోనే భరించలేం.. ఇక మెగా చీఫ్ అయితే వారమంతా ఎలా భరిస్తామని తన క్లాన్ వాళ్ళని రెచ్చగొట్టింది హరితేజ. ఇక ఆ తర్వాత మిరపకాయని రాయల్ క్లాన్ లోని అవినాష్ పట్టుకోవడంతో.. పృథ్వీని తీసేశాడు. ఈ రకంగా పృథ్వీని మెగా ఛీఫ్ కాకుండా చేసింది హరితేజనే. పృథ్వీ ఈ వారమంతా హౌస్ లోని జరిగిన అన్నీ టాస్క్ లు సూపర్ గా ఆడావ్ అంటు మొదట మెచ్చుకున్న అవినాష్.. మా క్లాన్ నుండి మెగా ఛీఫ్ కావాలంటూ కవర్ చేసుకున్నాడు. దాంతో అసలు విషయం తెలియని పృథ్వీ సరేనని లైట్ తీసుకున్నాడు. అదే హరితేజ తనని తప్పించాలని తన క్లాన్ తో చెప్పిందని తెలిస్తే ఇక పృథ్వీ చేతిలో హరితేజ కథ కాస్త బుర్రకథ అవుతుందేమో. మరి తమ క్లాన్ లోని సీక్రెట్స్ అన్నీ పక్క క్లాన్ కి చేరవేసే నయని పావని ఈ విషయం ఎవరికైనా చెప్తుందా లేక మరెవరైనా పృథ్వీకీ తెలిసేలా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.  

మెగా చీఫ్ గా విష్ణుప్రియ.. అంతఃకరణ శుద్దితో ఉండగలదా!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎన్నడు లేని విధంగా టాస్క్ లు డిఫరెంట్ గా ఎంటర్‌టైన్మెంట్ తో ఉన్నాయి. మెగా చీఫ్ టాస్క్ కంటెండర్ షిప్ లో భాగంగా బీబీ రాజ్యంలో వారంలో ఏడు టాస్క్ లు జరిగాయి. అందులో ఎక్కువ టాస్క్ లు ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచి ఒక్కొక్క టాస్క్ గెలిచి ఒక్కక్కరు గా కంటెండర్ షిప్ కి అర్హత సాధించారు. రాయల్స్ క్లాన్ నుండి రోహిణి, టేస్టీ తేజలు కాగా.. ఓజీ క్లాన్ నుండి పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ లు  అయ్యారు. అయితే చివరగా అందరి కంటెండర్స్ కి మెడలో పూలమాల ఉంటుంది. బజర్ మొగినప్పుడల్లా మిగతా హౌస్ మేట్స్ మిరపకాయని ఎవరైతే ముందుగా వెళ్లి పట్టుకుంటారో వాళ్ళు కంటెండర్ గా అనర్హులని భావించిన వారికి పూలదండ తీసీ మిరపకాయ దండ వేసి తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. రాయల్స్ క్లాన్ వాళ్ళు ఓజీ వాళ్ళని.. ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్స్ వాళ్ళని తొలగించగా చివరగా విష్ణుప్రియ, నిఖిల్ ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ మిరపకాయని పట్టుకొని.. నాకు ఈ వీక్ లేడీ మెగా చీఫ్ అవ్వాలని ఉందంటూ నిఖిల్ మెడలో ఉన్న పూలమాల తీసి మిరపకాయ దండ వేస్తాడు. విష్ణుప్రియని మెగా చీఫ్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఎన్వలప్ లో రెండు లక్షల అమౌంట్ ఉంటుంది. అది ప్రైజ్ మనీ కి ఆడ్ అయ్యింది.  ఇక మెగా ఛీఫ్ అయ్యాక విష్ణుప్రియ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ' భరత్ అనే నేను ' సినిమాలోని డైలాగ్స్ కాపీ పేస్ట్ చేసింది. అటు రాయల్స్ క్లాన్, ఇటు ఓజీ క్లాన్ అని కాకుండా అందరికి సమన్యాయం చేస్తానని అంతఃకరణ శుద్దితో ప్రమాణం చేస్తున్నానని విష్ణుప్రియ అంది. ఇక హౌస్ మేట్స్ అంతా చప్పట్లోతో అభినందనలు తెలిపారు. ఇక ఈ వారం మెగా చీఫ్ గా విష్ణుప్రియ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Karthika Deepam2 : ఒకే బెడ్ పై కార్తీక్, దీప.. అంతా శౌర్య కోసమే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -185 లో......సుమిత్ర, దశరథ్ లు జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మనవడు ఉన్నాడు మంచి సంబంధం అంటూ పెళ్లి గురించి మాట్లాడుతారని జ్యోత్స్న అనగానే.. మరేం చేయమంటావని సుమిత్ర అంటుంది. నాకు ఆల్రెడీ బావ తో పెళ్లి అయింది. ఆ దీప బావతో నాకు పెళ్లి చేస్తానంది. ఆ మాట గుర్తు రాలేదా ప్రతీ దాంట్లో వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుందని జ్యోత్స్న ఫ్రస్ట్రేషన్ అవుతూ మాట్లాడుతుంది. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ లు బయటకు వచ్చి.. తను బాధలో ఉంది కొన్ని రోజులు వదిలేద్దామని దశరథ్ అంటాడు. ఒరేయ్ కార్తీక్ నువ్వు దీప మెడలో తాళి కట్టబోయే.. ముందు నా కూతురు గురించి కాకపోయిన నా గురించి ఆలోచించలేదా అని సుమిత్ర అనుకుంటుంది. మరొకవైపు మనం అనుకున్నట్లు రెండు పనులు చేసాం.. ఒకటి దీపని వంట చేయమనడం.. ఇంకొకటి కార్తీక్, దీపలని పక్కపక్కన కూర్చొపెట్టాం.. ఇప్పుడు ఇంకొక పని చెయ్యాలని అనసూయతో కాంచన అంటుంది. ఏంటని అనసూయ అడుగుతుంది. కార్తీక్ తో పాటు నీకు అక్కడే చెప్తానని కార్తీక్ దగ్గరికి కాంచన వెళ్తుంది. మీరు ఎంత కాదనుకున్న ఇప్పుడు భార్యాభర్తలు కలిసి కొత్త జీవితం మొదలు పెట్టేవాళ్ళు.. తన గదిలో తను.. నీ గదిలో నువ్వు ఉంటే ఎలా పెళ్లి అయిన తర్వాత జరగాల్సినవి కొన్ని జరగాలి... కొత్త భార్యాభర్తలతో సత్యనారాయణ వ్రతం చేయించాలని  అనుకుంటున్నాను.. నీకు ఏ అభ్యంతరం లేదు కదా అని కాంచన అనగానే.. నాకేం లేదు కానీ దీపని ఏ ఇబ్బంది పెట్టకండి అని కార్తీక్ అంటాడు. అది మేమ్ చూసుకుంటాం.. నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని కాంచన అనగానే.. లేదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కుబేర్ ఫోటో చూస్తూ దీప బాధపడుతుంటే శౌర్య వస్తుంది. ఇక్కడ పడుకోమని దీప అనగానే.. నేను ఇక్కడ పడుకోను.. నాన్న గదిలో పడుకుంటానని శౌర్య మొండికేస్తుంది. అప్పుడే అనసూయ వచ్చి.. తను కూడా కార్తీక్ గదిలోకి వెళ్ళండి అని చెప్తుంది. దాంతో శౌర్య, దీప ఇద్దరు కార్తీక్ గదిలోకి వెళ్తారు. ఇబ్బందిగానే కార్తీక్ గదిలో పడుకుంటుంది దీప. తరువాయి భాగంలో దీప గుడిలో కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే సుమిత్ర వస్తుంది. తన చేతిలో ఉన్న పండు కింద పడిపోయి దీప దగ్గరికి వస్తుంది. నువ్వు కార్తీక్ ని భర్తగా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. లేదని దీప అంటుంది. ఇదిగో ఈ ప్రసాదం.. పంతులు నా కూతురు జ్యోత్స్న కోసం ఇచ్చారు.. ఇది ఇప్పుడు దాని కంటే ఎక్కువ నీకే అవసరం ఉండేలా ఉంది తీసుకోమని దీపకి సుమిత్ర ప్రసాదం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రమాదమేమీ లేదు.. తల్లీ బిడ్డ క్షేమమే.. ఊపిరి పీల్చుకున్న కుటుంబం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -236 లో......సిరి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే రామలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వస్తుంది. శ్రీలత, శ్రీవల్లి వాళ్ళంతా అక్కడికి వస్తారు. సిరికి ఏమవుతుందోనని శ్రీలత టెన్షన్ పడుతుంటే.. ఏం కాదు అత్తయ్య.. మీరు టెన్షన్ పడకండి అని రామలక్ష్మి అంటుంది. అంత మీరే చేశారు నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరేనని రామలక్ష్మిని శ్రీలత తిడుతుంటుంది  అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వీళ్ళే ఏదో చేశారని రామలక్ష్మి కుటుంబంపై శ్రీలత నిందలు వేస్తుంది. మేమ్ ఏం చేస్తామని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఈ ఆస్తి కోసం ఇదంతా చేసావ్.. సిరికి పుట్టబోయే బిడ్డ నీకు అడ్డుగా ఉంటాడని ఇలా చేసావని శ్రీలత అంటుంది. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రామలక్ష్మికి ఇవ్వనన్న శ్రీలత మాటలని సీతాకాంత్ గుర్తుచేసుకుంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ప్రమాదమేమీ లేదు.  తల్లీబిడ్డ ఇద్దరు బాగున్నారు. ఇది మాములు కడుపు నొప్పి అని చెప్తుంది. దాంతో ఇప్పుడేం అంటావ్ చెల్లెమ్మ.. మేమ్ ఏదో విషమిస్తే ఇలా అయిందన్నట్లు మాట్లాడావని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత అందరు సిరి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. సిరిని చూసి సీతాకాంత్ ఎమోషనల్ అవుతుంటే.. ఎందుకు అన్నయ్య భాదపడుతున్నావ్.. నువ్వు బాగా చూసుకుంటావ్.. వదిన తల్లి ప్రేమ మరిపించేలా చూసుకుంటదని సిరి అంటుంది. ఆ తర్వాత అభిని శ్రీలత హాస్పిటల్ దగ్గరికి పిలిచి మాట్లాడుతుంది. ఎంత వరకు వచ్చిందంటు అభికి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి అభి కన్పిస్తాడు. వాడు అభిలా ఉన్నాడు ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే అభి తనని చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కళ్యాణ్ కి సినిమాల్లో అవకాశం రానుందా.. ఆమెకు సవాల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -550 లో.....కావ్య ఇంటికి వస్తుంది. ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందని కనకం అడుగుతుంది. చంపలేదు కానీ అంత పని చేసాడని రాజ్ గురించి కావ్య చెప్తుంది. ఇప్పుడు తాతయ్య గారి దగ్గరికి గొడవకి వెళ్ళాడని కనకంతో కావ్య చెప్పేసి లోపలికి వెళ్తుంది. మరొకవైపు అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు రాజ్ లో ఎలా మార్పు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. అందరు కలిసి రాజ్ ని తిరిగి ఆఫీస్ కి పంపించడం గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా పంపించాలని అపర్ణ అంటుంది.  ఆ తర్వాత రుద్రాణి దూరంగా ఉండి చూసి.. వీళ్ళేదో చేస్తున్నారని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇందిరాదేవి ఇ‌ంకా వాళ్ళంతా కలిసి రుద్రాణికి చివాట్లు పెట్టి వెళ్ళిపోతారు. అసలు వీళ్ళేం చేయబోతున్నారో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా నిన్ను ఇంట్లో నుండి గెంటేయ్యాలని చూస్తున్నారని స్వప్న అంటుంది. నిన్నే కాదు మీ అబ్బాయిని కూడా పంపాలని చూస్తున్నారని అనగానే.. అలా అయితే నిన్ను కూడా పంపిస్తారని రుద్రాణి అంటుంది. నాకేం..తాతయ్య గారు ఇచ్చిన ఆస్తితో బతికేస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు వస్తుంది. రైటర్ ఇలా అన్నాడని చెప్తాడు. దాంతో  అవేం పట్టించుకోకని అప్పు ఎంకరేజ్ చేస్తుంది. మరొకవైపు అసలు ఆఫీస్ లో ఏం జరుగుతుందో కనుక్కోవాలని రాజ్ ల్యాప్ టాప్ ఆన్ చేసి చూస్తాడు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడుగుతుంది. రాక్షసి పాస్వర్డ్ చేంజ్ చేసిందని అనుకుని కావ్యకి మెసెజ్ చేయగా..చెప్పనని కావ్య అనేస్తుంది. నేనే కనుక్కుంటానని రాజ్ అనుకొని ట్రై చేస్తుంటాడు. అప్పుడే కళ్యాణ్ ని అవమానించిన రైటర్ ఫోన్ చేసి.. నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. నువ్వు ఒక పాట రాస్తే.. అది నాకు నచ్చితే నీకు ఆఫర్ ఇస్తానని అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఇక అప్పు, కళ్యాణ్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు తనని ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడతారని రాజ్ అనుకుంటాడు కానీ ఎవరు పట్టించుకోరు. తరువాయి భాగంలో కావ్యకి అనామిక ఫోన్ చేసి.. అక్కడికి వచ్చే క్లయింట్స్ ని రాకుండా చేశాను. ఒక్కొక్కరిని నీ కంపెనీకి దూరం చేస్తానని సవాలు విసురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఓటింగ్ లో ప్రేరణ ప్రభంజనం.. లీస్ట్ లో ఎవరున్నారంటే!

  బిగ్‌బాస్ హౌస్ నుంచి 7వ వారం మణికంఠ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అంటూ ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళ సోషల్ మీడియాలో బిగ్‌బాస్ అన్‌ అఫిషియల్ ఓటింగ్ రిజల్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్ని ఓటింగ్స్ చూసినా దాదాపు అన్నింట్లోనూ ప్రేరణ టాప్ ప్లేస్‌లో ఉంది.  బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనిక, సీత, మణికంఠ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, నయని పావని నామినేషన్లో ఉన్నారు. అయితే ఓటింగ్ లో ప్రేరణ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు. ప్రేరణకి 25 శాతం ఓటింగ్ పడగా.. నిఖిల్ కి 19 శాతం ఓటింగ్‌ పడుతోంది. సాధారణంగానే నిఖిల్‌కి స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది. కానీ ప్రేరణ నామినేషన్లు ఫుల్ ఫైర్ అయ్యింది. అది తనకి భారీగా ఓటింగ్ పడేలా చేస్తోంది. ఇక వైల్డా కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. 16 శాతానికి పైగా ఓటింగ్‌తో మెహబూబ్ నిలిచాడు. ఎప్పుడూ టాప్-3లో ఉండే విష్ణుప్రియకి ఈసారి ఆడియన్స్ భారీ షాక్ ఇస్తున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం సాగుతోన్న ఓటింగ్‌లో విష్ణుప్రియ అందరికంటే లీస్ట్‌లో ఉంది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయనుకోండి. ముఖ్యంగా పృథ్వీపై పెట్టే కాన్సట్రేషన్ గేమ్‌పై పెట్టడం లేదు విష్ణు. దీంతో ఈ వారం విష్ణుకి నామినేషన్స్ కూడా అదే రీజన్‌పై పడ్డాయి. ఇదే ఓటింగ్ కొనసాగితే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేషన్ కన్ఫమ్. ఇక విష్ణుప్రియతో పాటు నయని పావని, పృథ్వీలకి ఓటింగ్ లేదు. వీరు ముగ్గురు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు.

యష్మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పాపం అశ్వథ్థామ!

  బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకో కథ మొదలవుతుంది. అయితే ఇది మాత్రం 'చిన్న కథ కాదు'. హౌస్ లో ఇప్పుడు జరుగుతున్నవి చూస్తే ఎన్ని సినిమాలు అయిన తియ్యచ్చు.. ఇప్పటివరకు ఎక్కడ లేని విచిత్రమైన ప్రేమకథలు జరుగుతున్నాయి.  ఏ సీజన్ లో ఇన్ని లవ్ స్టోరీలు జరగలేదు. హౌస్ నుండి వెళ్ళిపోయిన కిర్రాక్ సీతకి నిఖిల్ అంటే క్రష్ అని ఒకానొక సందర్భంలో చెప్పేసింది. అయితే అదే రూట్ లో సోనియా కూడా వెళ్ళింది. మొదట్లో హౌస్ లో సోనియా ఉన్నంతసేపు పృథ్వీ, నిఖిల్ ల మధ్య ట్రాయాంగిల్ లవ్ స్టోరీని నడిపించిందని సోనియాని అనగా.. ఇప్పుడు అది యష్మీ మీదకి వచ్చింది. కన్నడ పాప యష్మీ తన అటిట్యూడ్ విత్ బ్యూటీ తో అందరిని ఆకట్టుకుంటుంది. మొన్న యష్మీ దగ్గరికి గౌతమ్ వచ్చి.. నువ్వే అందరి కంటే క్యూట్ గా ఉంటావంటూ ప్రపోజ్ చేసాడు. అయితే యష్మీ కి నిఖిల్ అంటే ఇష్టం. దాంతో అప్పుడు గౌతమ్ పట్ల ఏం స్పందించలేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ దగ్గరికి యష్మీ వచ్చి.. తన మనసులో మాట చెప్పకనే చెప్పింది. అప్పుడు రియాక్ట్ కానీ నిఖిల్.. యష్మీ కిచెన్ దగ్గర ఉంటే వచ్చి తనకి ముద్దు పెడతాడు. అంటే తనకు ఇష్టమేనని నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. నిన్న జరిగిన ఎపిసోడ్ లో టాస్క్ లు అన్ని అయిపోయాక గౌతమ్ తన క్లాన్స్ తో డిస్కషన్ చేస్తుంటాడు. అప్పుడే యష్మీ, నబీల్ అక్కడికి వస్తారు. ఎవరు నీకు అన్నం తినిపిస్తానని అన్నారని యష్మీతో నబీల్ అంటాడు. ఇక మన మెగా చీఫ్ గౌతమ్.. నేనే అంటు యష్మీ వెనకాలే వెళ్ళిపోతాడు. నేను తినిపిస్తానంటూ అవినాష్ కూడా వెళ్తాడు. ఇదంతా చూసి హౌస్ మేట్స్ అంతా కలిసి యష్మీ, గౌతమ్ లని ఆట పట్టిస్తుంటారు. యష్మీ అటు నిఖిల్ తో ఇష్టమని చెప్పి..  ఇటు గౌతమ్ కి హోప్స్ క్రియేట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే యష్మీ ఎవరిని లవ్ చేయడం లేదని, హౌస్ లో ఉండేందుకే రెండు ట్రాక్ లు వేసిందని మరికొందరు అంటున్నారు. మరి తన బిహేవియర్ మీకేలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.  

టైటిల్ ట్రోఫీని మనలో ఒక్కరే ఎత్తాలి.. నిఖిల్ సంచలన నిర్ణయం!

  బిగ్ బాస్ సీజన్-8 ఎనిమిదో వారం వరకు వచ్చేసింది.‌ఇప్పటికే విన్నర్ ఎవరో ఒకరని అంచనాకి ప్రేక్షకులు రానే వచ్చారు. అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మంది రాయల్ క్లాన్ గా ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం దాదాపు ప్రతి టాస్క్ లో వాళ్లే విన్ అయి ఓజీ క్లాన్ ని డిప్రెషన్ లోకి నెట్టారు. వీళ్ళు బాగా ఆడితే మనల్ని పిలిచేవాళ్ళు కాదు కదా అంటూ గంగవ్వ స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది. అయితే గత వారం నాగార్జున ఓజీ క్లాన్ అందరిని తమ ఆట తగ్గిందని చెప్పకనే చెప్పాడు. అదంతా అవమానంగా ఫీల్ అయిన ఓజీ క్లాన్ లోని వాళ్ళంతా ఫుల్ జోష్ లో ఆడారు. ఈ వారం రాయల్స్ గట్టి పోటీ ఇవ్వాలని అనుకున్నారు. వరుసగా రెండు టాస్క్ లు గెలిచి తమ సత్తా చాటుకున్నారు. అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మేమ్ చాలా గెలిచినం.. గీ ఒక్క దాంట్లో గెలిస్తేనే ఇంత సంబరపడుతున్నారా అని గంగవ్వ వాళ్ళని చులకన చేసి మాట్లాడుతుంది. దాంతో‌ పాటు ఓజీ క్లాన్ లోని ప్రేరణ, యష్మీలకి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వస్తుంది. అయితే దాన్ని నిఖిల్ సాల్వ్ చేస్తాడు. మనం మనమే కొట్టకుంటే బాగోదని క్లాన్ తో నిఖిల్ మాట్లాడతాడు మన క్లాన్ నుండి మాత్రమే ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని నిఖిల్ చెప్తాడు. ఆ తర్వాత నబీల్, ప్రేరణ కూడా మాట్లాడుకుంటారు. అన్ని టాస్క్ లు వాళ్ళు గెలిచామన్న పొగరు వాళ్లలో ఉంది.. మనం ఇలాగే ఆడి గెలవాలని నబీల్ తో ప్రేరణ అంటుంది. మరుసటి రోజు కూడా మన క్లాన్ నుండే టైటిల్ విన్ అవ్వాలి.. టైటిల్ ఎత్తాలి.. ఎత్తాం కూడా అని నిఖిల్ వాళ్లలో జోష్ నింపుతాడు. దాంతో తథాస్తు‌ అని విష్ణుప్రియ అంటుంది. దానికి ఓజీ క్లాన్స్ అందరు ఫుల్ జోష్ లో ఉంటారు. నిఖిల్ స్ఫూర్తితో ఓజీ క్లాన్ ఇంకా ఎన్ని టాస్క్ లు గెలుస్తారో‌ మునుముందు తెలుస్తుంది. ఇక టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

పృథ్వీ, నిఖిల్ ధాటికి చిత్తుగా ఓడిన రాయల్ క్లాన్!

  బిగ్ బాస్  సీజన్-8 లో ఎనిమిదో వారం టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ లో రెండు టీమ్ లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లు అన్నీ కూడా మెగా చీఫ్ కంటెండర్ గురించి జరుగుతుండగా.. ఇరు క్లాన్స్ లో.. ఓడిపోయిన క్లాన్ నుండి ఒక హౌస్ మేట్ కంటెండర్ షిప్ రేస్ నుండి తప్పుకుంటే, గెలిచిన టీమ్ నుండి ఒకరు మెగా ఛీఫ్ కోసం కంటెండర్ గా నిలుస్తారు. ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ లో ఇప్పటికే హౌస్ లో మూడు టాస్క్ లు జరిగాయి. అందులో మొదటిది రాయల్ క్లాన్ గెలవగా..ఆ తర్వాత నిన్న జరిగిన రెండు టాస్క్ లు కూడా ఓజి టీమ్ గెలిచింది. మొదటి టాస్క్ వాటర్ కి సంబంధించినది అయితే రెండవ టాస్క్ లో.. బజర్ మోగగానే ధాన్యం బస్తాలు వస్తుంటాయి. ముందుగా ఎవరైతే తమకి కేటాయించిన బండిలో వాటిని తీసుకొచ్చి పెడతారో వాళ్ళు టాస్క్ విన్ అవుతారు. అందులో భాగంగా రాయల్ క్లాన్ నుండి మెహబూబ్, గౌతమ్ లు రాగా ఓజీ క్లాన్ నుండి నిఖిల్, పృథ్వీలు వచ్చారు. అయితే టాస్క్ మొదటి నుండే ఫుల్ ఆన్ ఫైర్ మీదున్నారు నిఖిల్, పృథ్వీ. వాళ్ళిద్దరికి తోడుగా బయట గైడెన్స్ ఇస్తూ నబీల్ రెచ్చిపోయారు. టాస్క్ మొత్తం ఫిజికల్ అవుతారు. నిఖిల్ పృథ్వీలు అసలు ముందు ఎవరు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా అప్పోజిట్ వాళ్ళని చిత్తు చిత్తు చేసారు. అయితే రెండవ బజర్ కి రాయల్స్ నుండి తేజ, అవినాష్ రాగా ఓజీ నుండి మాత్రం నిఖిల్ , పృథ్వీలు కంటిన్యూ అయ్యారు. అయితే వాళ్ళని కూడా చాకచక్యంతో ఫోల్డ్ చేసి అన్ని బస్తాలు.. ఓజీ వాళ్లే వేశారు. రాయల్స్ ఒక్కటంటే ఒక్క ధాన్యం బస్తా కూడా సేకరించలేదు. హౌస్ మొత్తం కూడా పృథ్వీ, నిఖిల్ అట తీరుని చూసి భయపడ్డారు. ఒకవేళ వాళ్ళు టాస్క్ లో ఉంటే మేమ్ ఇక ఆడలేమని రాయల్ క్లాన్ లో ఉన్న గర్ల్స్ అనుకుంటున్నారు. ఇక ఓజీ క్లాన్ వాళ్ళు  రాజ్యంలోని ఒక ప్లేస్ లో జెండా పాతేస్తారు. మరొక టాస్క్ అయిన వైరస్ బాల్స్ ఇరు క్లాన్స్ తమకి కేటాయించిన దాంట్లో ఎక్కువ బాల్స్ పడకుండా చూసుకోవాలి. ఇందులో కూడా ఓజీ విన్ అయి తమ జెండాని బీబీ రాజ్యంలో పెట్టారు. నిన్నటి ఎపిసోడ్ లో రెండు టాస్క్ లు కాగా వాటిల్లో రెండు ఓజీ మాత్రమే గెలిచింది.

Karthika Deepam2 :  కార్తీక్ , దీపలని కలపడానికి ఆ ఇద్దరు..  శౌర్య ప్రేమ కీలకం కానుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -184 లో.. కార్తీక్ ని శౌర్య చాటుగా చూస్తూ.. నాన్న అని పిలుస్తుంది. దానికి కార్తీక్ రియాక్ట్ అవ్వడు. దాంతో శౌర్య తన దగ్గరికి వచ్చి కార్తీక్ నిన్ను నాన్న అని పిలవచ్చా.. నాకు పిలవాలని ఉందని శౌర్య అంగగానే.. సరే అంటాడు కార్తీక్. నాన్న అని శౌర్య పిలవడంతో దగ్గరికి తీసుకొని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. అదంతా దూరం నుండి కాంచన, అనసూయ ఇద్దరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అక్కడ తల్లిని మనం కదిలించం.. ఇక్కడ నాన్నని కూతురు కదిలించింది. కదిలించడం కాదు అనసూయ.. కలపాలని కాంచన అంటుంది. ఆ తర్వాత అమ్మనాన్నలు దూరంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా ఉంటూ.. అనసూయ కాంచన ఇద్దరు కలిసి శౌర్యలో ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు. నాకు అర్థమైందంటు కార్తీక్ ని శౌర్య తీసుకొని వచ్చి హాల్లో కూర్చోపెడుతుంది. ఆ తర్వాత దీప కూరగాయలు కట్ చేస్తుంటే పాలు పొంగుతాయి. అప్పుడే శౌర్య వచ్చి దీపని తీసుకొని వెళ్లి.. కార్తీక్ పక్కన కూర్చోపెడుతుంది వాళ్ళ మధ్యలో శౌర్య నిల్చొని కాంచనని ఫోటో తీయమంటుంది. దీప చిరాకుగా ఉంటుంది. అప్పుడే దాస్, కాశీ, స్వప్నలు వచ్చి కంగ్రాట్స్ చెప్పి స్వీట్ ఇస్తారు. నాకు పని ఉందంటూ దీప లోపలికి వెళ్తుంటే.. అమ్మ ఇప్పుడే తినాలని శౌర్య తీసుకొని వెళ్లి దీపకి ఇస్తుంది. ఆ తర్వాత దాస్ కి ఫోన్ వస్తే పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే బాల్ కన్పించడం లేదని శౌర్య వెతుకుతుంటే దాస్ వస్తాడు. బాల్ ఎక్కడ ఉంది తాతయ్య అని శౌర్య అంటుంది. బాల్ శౌర్య తీసుకుంటుండగా బ్యాగ్ నుండి కుబేర్ ఫోటో కిందపడిపోతుంది. అది తీసి చూస్తుండగా అప్పుడే అనసూయ వచ్చి.. దాస్ చేతిలో నుండి తీసుకుంటుంది. దాంతో దాస్ ఫోటో చూడడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి దశరథ్, సుమిత్ర ఇద్దరు వస్తారు. వేరే పెళ్లి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే.. నాకు ఆల్రెడీ బావతో పెళ్లి అయిందంటూ జ్యోత్స్న ఆర్గుమెంట్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : గులాబ్ జామ్ తిని కడుపు నొప్పి తెచ్చుకున్న సిరి.. నందిని హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -235 లో... సీతాకాంత్ కి ఇష్టమైన గులాబ్ జామ్ చేస్తుంది రామలక్ష్మి. అదంతా అభి కిటికీలో నుండి చూస్తూ.. సీతాకాంత్ పై ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి రామలక్ష్మి అని అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే అభి చాటుగా వెళ్లి.. ఆ స్వీట్ లో ఏదో కలుపుతాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్ళాలని బట్టలు ఇవ్వమని అడుగుతాడు. అన్ని పనులు ముందే చేసాను కదా ఇప్పుడు ఎందుకు ఆఫీస్ అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఆఫీస్ నెంబర్ వన్ గా ఉండాలంటే ఇలా సెలవు తీసుకొని ఉండకూడదని సీతాకాంత్ అనగానే.. మీ మాటల్లో మీ కంపెనీతో ఎవరు పోటీ పడలేరని డ్రెస్ ఇస్తుంది. సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్ళడానికి తనే స్వయంగా రెడీ చేస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి సిరికి స్వీట్ ఇస్తుంది. సీతాకాంత్ కి ఇవ్వబోతుంటే అది కిందపడిపోతుంది. ఇక సీతాకాంత్ అది తినకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వీట్ సిరి తింటుంది. సీతాకాంత్ కి ఏం కాకపోవచ్చు కానీ వాళ్లు విడిపోవడం మాత్రం ఖాయమని అభి అనుకుంటాడు. ఆ తర్వాత నందిని రాత్రి.. సీతాకాంత్, రామలక్ష్మి లు ఒకటి అయ్యారేమోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రాత్రి అంత నీరసంగా ఉన్నావ్.. వద్దన్నా వెళ్ళావని నందిని అడుగుతుంది. వెళ్ళాను కానీ రాత్రి బాగా నిద్రపట్టింది తెల్లవారి లేచేసరికి ఎక్కడ ఉన్నాను ఏం జరిగిందో ఏం గుర్తు లేదని సీతాకాంత్ అనగానే.. హమ్మయ్య వాళ్ళ మధ్య ఏం జరగలేదని నందిని రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత శ్రీవల్లీని శ్రీలత పిలిచి.. నిన్న నేను  ప్లాన్ చెయ్యట్లేదు అన్నావ్ కదా రామలక్ష్మి, సీతాకాంత్ ని పుట్టింటికి తీసుకొని వెళ్లినా కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదంట అని శ్రీవల్లితో శ్రీలత చెప్పగానే.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సిరికి కడుపు నొప్పి వస్తుంది‌. దాంతో రామలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తు.. సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత వాళ్ళందరు హాస్పిటల్ కి వస్తారు. సిరికి  ఏం కాదని రామలక్ష్మి అంటుంటే.. మీరంతా అనుకొని చేసిన పనే ఇది అని రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఇంట్లో కాళీగా భర్త.. ఆఫీస్ లో బిజీగా భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -549 లో.. అనామిక మనిషిని జాబ్ నుండి తీసేసీ సెక్యూరిటీ పోస్ట్ ఇస్తుంది కావ్య. ఇలా ఎవరైనా ఆఫీస్ కి ద్రోహం చెయ్యాలని చూస్తే ఇలా సెక్యూరిటీ జాబ్ కాదు.. ఇక పోలీస్ స్టేషనే అని కావ్య ఎంప్లాయిస్ కి వార్నింగ్ ఇస్తుంది. మేడమ్ మీకు పెళ్లి అయి ఎన్ని రోజులు అవుతుంది. ఆరు నెలలు అవుతుందా అని శృతి కావ్యని ఆడుతుంది. నీకు తెలియదా.. ఆరు నెలలు మూడు సార్లు అయింది.. ఎందుకు అడిగావని కావ్య అనగానే.. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట మీరు రాజ్ సర్ లాగే చేస్తున్నారని శృతి అంటుంది. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడో లేదో అని అపర్ణ, ఇందిరాదేవిలు డిస్కషన్ చేసుకుంటుంటే.. ఏంటి అత్త కోడళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారని రుద్రాణి అంటుంది. దాంతో నీ భర్త ఎక్కడున్నాడో వెతకమని చెప్పాము. తెలిస్తే నీ దరిద్రం మాకు వదిలిపోతుంది కదా అని ఇందిరాదేవి అనగానే.. వద్దు నేను ఎక్కడికి వెళ్ళనని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ టీ షర్ట్ లుంగీ కట్టుకొని కిందకి వస్తాడు. అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. కాలిగా ఉన్నా అని సింబాలీక్ గా ఇలా వేసుకున్నానని రాజ్ అంటాడు. అపుడే కావ్య ఫోన్ చేస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్లకుంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉంటాయ్.. రమ్మని బ్రతిమిలాడడానికి కాల్ చేస్తుంది.. మీ అప్పలమ్మ అని రాజ్ వాళ్ళతో అంటాడు. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయా అని అంటాడు. లేదు ఇప్పడే ఫాస్ట్ గా అవుతున్నాయని కావ్య అంటుంది. మరెందుకు కాల్ చేసావని రాజ్ అడుగుతాడు. లాప్ టాప్ పాస్ వర్డ్ చెప్పండి అని కావ్య అడుగుతుంది. చెప్పను.. నువ్వు సీఈఓ అయ్యావ్ కదా కనిపెట్టమని రాజ్ అంటాడు. మరొక వైపు కళ్యాణ్ రైటర్ దగ్గరికి వెళ్తాడు. తనకి అవకాశం ఇవ్వమని అడుగుతాడు. దాంతో అతను కళ్యాణ్ ని అవమానిస్తాడు. కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వెళ్లి అపర్ణ, శాంతలని డిస్టర్బ్ చేస్తుంటాడు. హాల్లో కూర్చొని పని మనిషికి అది తీసుకొని రా.. ఇది తీసుకొని రా అంటూ పని చెప్తాడు.‌ రాజ్ ని కాళీగా ఉన్నావంటూ అందరు ఏదో ఒకరకంగా ఎగతాళిగా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.