యష్మీ ఎలిమినేటెడ్.. వెళ్తూ అతనిపై బిగ్ బాంబ్ పడేసింది!

  బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ పన్నెండు వారాలు ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో సండే ఫండే అంటూ నాగార్జున ఆటలతో పాటలతో అలా సాగించారు.  నామినేషన్లో ఉన్మ ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరగా పృథ్వీ, యష్మీ ఉన్నారు. ఇక వారిద్ధిని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు నాగార్జున. ఇక మెయిన్ గేట్ ఓపెన్ అయి యష్మీ ఎవిక్టెడ్ అనే బోర్డ్ ప్రత్యక్షమైంది. దాంతో యష్మీ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేసి స్టేజ్ మీదకి రమ్మన్నాడు‌. ఇక స్టేజ్ మీదకి వచ్చాక యష్మీ జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. ఫ్యామిలీ వీక్ లో వాళ్ల నాన్న వచ్చినప్పుడు చెప్పినవన్నీ గుర్తుంచుకొని ఆడిన ప్రతీ టాస్క్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ఇచ్చానంటూ యష్మీ అంది. ఇక హౌస్ లో ఎవరు తన ఫ్రెండ్స్? ఎవరు ఎనిమీస్(శత్రువులు) బోర్డ్ మీద పెట్టమన్నాడు నాగార్జున. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియలని ఫ్రెండ్స్ బోర్డ్ లో పెట్టిన యష్మీ.. గౌతమ్, రోహిణి, అవినాష్, తేజలని ఎనిమీస్ లో పెట్టేసింది. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది యష్మీ. ప్రేరణ తన వంద శాతం ఇస్తుంది. చిన్న చిన్న కోపాలు తగ్గించుకుంటే లేడి విన్నర్ అవుతావని‌ ప్రేరణతో యష్మీ అంది.  నిఖిల్ తో కలిసి బడ్డీగా వచ్చాను. నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తావో నీకు తెలుసు, అవి కరెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతావంటు నిఖిల్ తో యష్మీ అంది. పృథ్వీది నా పక్క బెడ్. నా అన్ని విషయాలు షేర్ చేసుకుంటా..బయట కలుద్దామని పృథ్వీతో అంది.  గౌతమ్ అందరితో కలిసి ఉండు.. అది నీ గేమ్ కి హెల్ప్ అవుతుంది. ఇండివిడ్యువల్ గా ఉండటం మంచిదే కానీ అందరితో నవ్వుతూ ఉండమని గౌతమ్ తో యష్మీ అంది. అవినాష్ ఎప్పుడూ నన్ను నవ్విస్తాడు. ఇంకా కొన్నిరోజులో మిగిలి ఉంది. కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకోమని అవినాష్ తో యష్మీ అంది. రోహిణికి కూడా తనని తాను నిరూపించుకోవాల్సి ఉందని యష్మీ అంది. ఇక హౌస్ నుండి వెళ్లే ముందు నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో ఎవరో ఒకరిని  నామినేట్ చేయాలంటు బిగ్ బాంబ్ పేరిట స్పెషల్ పవర్ ఇచ్చాడు నాగార్జున. దాంతో గౌతమ్ ని నామినేట్ చేసింది యష్మీ.  

క్యారెక్టర్ గురించి మాట్లాడిన విష్ణుప్రియ.. రోహిణిదే తప్పన్న బయాస్డ్ బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికి పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే హౌస్ లో విష్ణుప్రియ ఏం చేసిందనేది అందరికి తెలుసు. తను తప్పేం చేసినా ఎడిటింగ్ లో లేపేయ్యండి అని బిగ్ బాస్ మామ ఎడిటర్స్ కి గట్టిగానే చెప్పాడు అనేది సోషల్ మీడియా టాక్. అందుకేనేమో లైవ్ లో విష్ణుప్రియ చేసే కథలన్ని నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో షేర్ చేస్తున్నారు. రోహిణి-విష్ణుప్రియల మధ్య గొడవ ఎలా మొదలైందంటే.. ఈ వారం మెగా చీఫ్ కోసం రోహిణి, విష్ణుప్రియ, యష్మీ, పృథ్వీ, టేస్టీ తేజ రేసులోకి వచ్చారు. ఇక వారికి ఆటో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.‌ ఇందులో ఆటోలో మొదటగా టేస్టీ తేజని అందరు కలిసి బయటకు తీసేశారు. ఆ తర్వాత రోహిణిని, యష్మీని తీసేయగా పృథ్వీ, విష్ణుప్రియ ఇద్దరే మిగిలారు.‌ మీరిద్దరు గేమ్ ఆడి బయటకు రావాలని యష్మీ అంది. వాళ్ళు చేతిలో చేతులు వేసుకొని బయటకొస్తారు. అంతేకానీ గేమ్ ఆడరని రోహిణి అంది. దాంతో నీ క్యారెక్టర్ తెలుస్తుందని విష్ణుప్రియ అంది. క్యారెక్టర్ గురించి మాట్లాడకని రోహిణి అన్నా వినిపించుకోకుండా . నీ క్యారెక్టర్ దీన్ని బట్టే తెలుస్తుందంటూ విష్ణుప్రియ అంది. ఇక మొదట నిఖిల్ కి ట్రై చేశావ్.. పడకపోయేసరికి పృథ్వీకి ట్రై చేశావ్ నీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది అందుకే ఇన్ని వారాలు ఉన్నావని రోహిణి అంది. ఇది వందకి వంద శాతం నిజం. బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఇదే విషయం గురించి నిన్నటి ఎపిసోడ్ లో రోహిణిది తప్పు అంటూ నాగార్జున అనడం పెద్ద దుమారం రేపుతోంది. కంప్లీట్ గా విష్ణుప్రియకి బయాస్డ్ గా బిగ్ బాస్ ఉన్నారని నెట్టింట ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. రోహిణి, అవినాష్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ లాంటి జెన్యున్ అండ్ ఫెయిర్ గా ఆడే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ మామ అన్యాయం చేస్తున్నాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.

నువ్వు అతనిలా చేయలేవు.. నా లైఫ్ పార్టనర్ అలా అనేసరికి...

యూట్యూబ్ లో పవన్ సిద్దు - సోనియా సింగ్ జోడి క్రియేట్ చేసే వెబ్ సిరీస్, వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ కి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. సోనియా సింగ్ విరూపాక్ష మూవీలో రవికృష్ణతో కలిసి చేసిన క్యారక్టర్ కి ఫుల్ మర్క్స్ పడ్డాయి. ఐతే పవన్ సిద్దు రీసెంట్ గా అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 లో నటించి మంచి టాక్ ని సొంతం చేసుకున్నాడు.  ఐతే పవన్ రవికృష్ణ చేసిన క్యారెక్టర్ లాంటి దాని కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ చేయాలి అన్నదే నా ఆలోచన. అంటే విరూపాక్షలో సోనియాతో చేసిన రవి కృష్ణ క్యారెక్టర్ లాంటిది చేయాలి. సోనియా కంటే నాకు రవికృష్ణ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆఖరి పది నిమిషాలు అదరగొట్టేసాడు. నిజానికి షూటింగ్ జరిగే టైములో ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయాల్సి ఉంది. కానీ అది కాస్తా రవికృష్ణ దగ్గరకు వచ్చింది. ఐతే ఒక రోజు సోనియా వచ్చి విరూపాక్షలో క్యారక్టర్ రవి కృష్ణ చేస్తున్నాడని చెప్పింది. తర్వాత కొన్ని రోజులకు నేను సోనియాతో ఇలా అన్నా నేను చేసేవాడిని కదా నన్ను సజెస్ట్ చేయొచ్చు కదా అని అడిగా. నేను ఎలా సజెస్ట్ చేస్తాను వాళ్ళు పిలిస్తే చేయొచ్చు కదా అని చెప్పింది. అప్పుడు సోనియా అసలు నువ్వు ఆ రవి కృష్ణ క్యారెక్టర్ చేయలేవు అని చెప్పింది. దాంతో నాకు కూడా బాగా కోపం వచ్చేసింది. ఎవరికైనా నువ్వు చెయ్యలేవు అంటే ఎలా ఉంటుంది. కానీ నా లైఫ్ పార్టనర్ సోనియా నన్నే అలా అనేసరికి నేను తీసుకోలేకపోయాను. సినిమా చూసాక చెప్పు అంది సోనియా. సినిమా చూసాక నేను షాక్ అయ్యా..రవికృష్ణ క్యారెక్టర్ చూసి ఫోన్ చేసి అతన్ని పొగడకుండా ఉండలేకపోయా. అలా ఎవరో  ఒకరు నాకు ఫోన్ చేసే ఇలాంటి క్యారెక్టర్ గురించి చెప్పాలి. అప్పుడు ఆ క్యారెక్టర్ తో మంచి పేరు తెచ్చుకోవాలి" అని చెప్పాడు.

సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సుమ సాయం..

యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ తో నిండిపోతుంది. ఏ కార్యక్రమానికైనా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. అది మూవీ రిలీజ్ ఫంక్షన్ ఐనా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఐనా, యాడ్స్ లో కామెడీ చేయాలన్నా ఏదైనా సుమ నిత్యం కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుంది. అలాంటి సుమ ఒక్క యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సుమ. ఈ ఫౌండేషన్ ద్వారా 30కి పైగా విద్యార్థులకు, సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సహాయం అందించినట్లు తెలుస్తోంది.  అలాగే 200 పైగా కంటి చికిత్సలు, 2 వేలకు పైగా కంటి పరీక్షలు  కూడా చేయించిందట. అంతేకాకుండా ఎన్నో అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్  బతుకుదెరువు కోసం కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేయించింది సుమ. అలాగే 100 మంది సీనియర్ సిటిజన్స్ ఉండేలా నెక్స్ట్ ఓల్డేజ్  హోమ్  ని సుమ ఏర్పాటు చేసింది. ప్రతీ పండగకు ఎదో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం చాలా మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సుమ.

Illu Illalu Pillalu : సాగర్ తో ప్రేమ విషయం ఆమె రామరాజుకి చెప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -11 లో.. వేదవతికి కాలు బెనికితే రామరాజు కాళ్ళు పట్టుకొని మసాజ్ చేస్తుంటే.. వేదవతి మురిసిపోతుంది. ఎదురింట్లో ఉన్న భద్రవతి కుటుంబం వాళ్ళని అన్యోన్యంగా ఉండడం చూసి కుళ్ళుకుంటారు. ఇంకా వాడి పనిమనిషి బుద్ది పోలేదని భద్రవతి అనగానే.. అది భార్యపై ప్రేమ అని భద్రవతి తల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత వేదవతి తన అక్క భద్రవతితో  ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడుతుంది. అది చూసి నువ్వు ఆలా బాధపడకంటూ రామరాజు ప్రేమగా మాట్లాడతాడు. మరుసటి రోజు ఉదయం చందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. సుభద్ర కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే ధీరజ్ వచ్చి.. లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెడతాడు. దాంతో సుభద్ర ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. ఎందుకు రా ఆ అమ్మాయిని బాధపెడతావ్.. నువ్వు నీ ప్రేమ విషయం నాన్నతో చెప్పమని చందుని ధీరజ్ పంపిస్తాడు. కానీ చందు రామరాజుకి భయపడి చెప్పడు. అదంతా వేదవతి చూసి.. ఏంటి రా మీ అన్నని ఏదో చెప్పమంటున్నావని అడుగుతుంది. అదేం లేదు చెప్పాల్సిన వాళ్లు చెప్తే బాగుంటుందని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత అన్నాతమ్ముళ్ల మధ్య ఏదో నడుస్తుందని వేదవతి అనుకుంటుంది. మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లీవ్ తీసుకొని రా.. పెళ్లిచూపులు అని వాళ్ల అమ్మ అంటుంది. ఇప్పుడే ఎందుకని నర్మద అంటుంది. మా మాటకి ఎందుకు ఎదురు చెప్తున్నావ్.. నువ్వు మధ్యాహ్నం వరకు రా అంటూ నర్మద పేరెంట్స్ అంటారు. తరువాయి భాగంలో కలవాలని సాగర్ కి నర్మద ఫోన్ చేస్తుంది. ఇప్పుడు వీలు కాదు అనడంతో డైరెక్ట్ మిల్ దగ్గరికి వస్తుంది నర్మద. రామరాజు ఎవరు కావాలని అడగడంతో సాగర్ వంక చూపిస్తుంది. సాగర్ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హౌస్ లో స్నేక్ ఎవరు? లాడర్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం‌ ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ-గౌతమ్ ల మధ్య జరిగిన గొడవ, విష్ణుప్రియ-రోహిణిల మధ్య జరిగిన గొడవ గురించి డిస్కషన్ చేశాడు నాగార్జున. హౌస్‌‌‌ లో చివరి మెగా చీఫ్‌ గా రోహిణి ఎంపిక అయ్యింది. ఇక ఫినాలేకి ముందు అంతా నడిచేదంతే టికెట్ ఫినాలే వార్. సరిగ్గా ఈ రేస్ మొదలు కాబోతుండగా.. నాగార్జున ఒక బిగ్ బాంబ్ విసిరారు. హౌస్‌లో వాళ్లతో స్నేక్ టాస్క్ ఆడించాడు. మీ ఆటలో మీకు అడ్డు తగులుతున్న వాళ్లు ఎవరు? వెనక్కి లాగుతున్న వాళ్లు ఎవరని కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. రోహిణి క్యారెక్టర్ గురించి నోరు పారేసుకున్న విష్ణు ప్రియని చాలా సుతిమెత్తగా క్లాస్ పీకాడు నాగార్జున. దాన్ని క్లాస్ అని కూడా అనలేం.. ఎంతైనా తన ప్రియమైన కళామ్మతల్లి ముద్దు బిడ్డ కాబట్టి చాలా ముద్దుగానే సర్దిచెప్పాడు నాగార్జున.  ఇక హౌస్ లో స్నేక్ ఎవరు లాడర్(నిచ్చెన) ఎవరో చెప్పమని కంటెస్టెంట్స్ ని నాగార్జున అడిగాడు.  విష్ణుని అడగడంతో.. ఆమె పృథ్వీ మైకంలోనే ఉంది కాబట్టి పృథ్వీ పేరే చెప్పింది. పృథ్వీ వల్ల ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్ వస్తుంది సర్ అని చెప్పింది. ఆమె ఏమి సోది చెప్పినా నాగార్జున అలా వింటుంటాడు. మొదటి నుంచి ఈ పత్తేపారం అలా సా..గుతూనే ఉంది. ఇక మెగా ఛీఫ్ రోహిణిని అడుగగా.. తనని మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అవినాష్ కి లాడర్ ఇచ్చింది. పృథ్వీకి స్నేక్ ఇచ్చింది. టేస్టీ తేజని అడుగగా అవినాష్ కి లాడర్, విష్ణుప్రియకి స్నేక్ ఇచ్చాడు. తను మెగా ఛీఫ్ లో ఉన్నప్పుడు ఏడు గ్లాస్ లు తీసుకెళ్తుంటే విష్ణుప్రియ పడేసిందంటూ కారణం చెప్పాడు. నిఖిల్‌ తన ఆటని కిందకి లాగాడని తనకి స్నేక్ ఇచ్చి, పృథ్వీకి లాడర్ ఇచ్చాడు నబీల్. ఆ తర్వాత  గౌతమ్‌కి స్నేక్ ఇచ్చాడు పృథ్వీ. ఇక యష్మీ గౌడ.. నిఖిల్‌కి షాకిస్తూ.. అతన్ని స్నేక్ అని అనేసింది. నన్ను ఎక్కువ హర్ట్ చేసింది నిఖిలే అని చెప్పింది యష్మీ. ఆమె దృష్టిలో హర్ట్ అంటే.. ఆమె లవ్‌ని యాక్సెప్ట్ చేయకపోవడమేమో కానీ.. హర్ట్ చేశాడని చెప్పింది యష్మీ. ఇలా కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ముందు చిచ్చు పెట్టాడు నాగార్జున.

Eto Vellipoindi Manasu : అత్తకి తగ్గ కోడలు.. మన బంధాన్ని ఎవరూ విడదీయలేరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -261 లో.. రామలక్ష్మి ఆస్తులపై ప్రేమతో నన్ను మోసం చేసి ఆస్తులు రాయించుకుందని సీతాకాంత్ తనపై కోపంగా ఉంటాడు. దాంతో ఇదే కరెక్ట్ టైమ్.. వాళ్ళ ఇద్దరిని విడగొట్టడానికని శ్రీలత ప్లాన్ లు వేస్తుంది. శ్రీలత, సందీప్, శ్రీవల్లీలని ఇంట్లో పనులు చెయ్యండి. ఆస్తులు ఇవ్వనంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ఏం చెయ్యలేక పనులు చేస్తుంటారు. సీతాని బాధపెట్టి దూరం చేసుకుంటున్నావని సిరి, పెద్దాయన అంటారు. నన్ను అర్థం చేసుకోండి.. ఏం చేసిన ఆయన కోసమే.. నాపై నమ్మకం ఉంటే కాస్త ఓపిక పట్టమని చెప్తుంది. ఇక ఇంటిపనులు తప్పించుకోవాలని డాక్టర్ కి ఫోన్ చేసి తను చెప్పినట్టు చెప్పమని సందీప్, శ్రీవల్లికి శ్రీలత చెప్తుంటే.. రామలక్ష్మి విని మీ సంగతి చెప్తానని అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి తనకి బాలేదు బీపీ ఎక్కువ అయిందంటూ చెప్తాడు. చూసావా నా తల్లికి పనులు చెప్పి ఎలా చేసావో అంటూ రామలక్ష్మి పై సీతాకాంత్ కోప్పడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒక ఫైల్ తీసుకొని వచ్చి.. ఇది వారం కిందటి అత్తయ్య రిపోర్ట్స్ చూడండి అని రామలక్ష్మి ఆ డాక్టర్ కి ఇస్తుంది. అందులో చెక్ ఉంటుంది. నీకు ఎంత కావాలో అంత రాసుకోమని రామలక్ష్మి అందులో రాస్తుంది. అది చూసి డాక్టర్ టెంప్ట్ అయి ఈవిడ బాగుంది. ఇప్పటివరకు చేసిన పనులు కంటిన్యూ చేయండి అని డాక్టర్ అనగానే.. శ్రీలత వాళ్లు షాక్ అవుతారు. సీతాకాంత్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ రామలక్ష్మి కావాలనే ఇలా చేసిందని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి పడిపోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి తాళి సీతాకాంత్ చైన్ ముడిపడితాయి. మన బంధాన్ని ఎవరు విడదియ్యలేరని రామలక్ష్మి అంటుంది. అదంతా చూసి శ్రీవల్లి.. శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తుంది. నాకు తెలుసు మేమ్ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరని అనుకుంటూ రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పృథ్వీకి విష్ణుప్రియ మసాజ్.. ఇది బిగ్ బాస్ హౌసా లేక..?

బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అదిరిపోయే స్టెప్స్ తో కాస్ట్లీ కాస్ట్యూమ్ తో వచ్చేశాడు. ఇక వచ్చీ రాగానే శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించాడు నాగార్జున. మెగా చీఫ్ టాస్క్ తర్వాత పృథ్వీ, యష్మీ, నిఖిల్, విష్ణుప్రియ బెడ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేది చూపించాడు. ఇక ఇక్కడ యష్మీ, నిఖిల్  సీరియస్ గా మాట్లాడుకుంటుంటే విష్ణుప్రియ మాత్రం పృథ్వీ కాళ్లని ఒళ్లో పెట్టుకుని కాళ్లకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తుంది. ఇక పృథ్వీ కాళ్లని తన ఎదకి నొక్కిమరీ ఆయిల్ రాసే సీన్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. సొంత పెళ్ళాంలాగా ఫీల్ అవుతుందనిపిస్తోంది. కళామ్మతల్లి ముద్దుబిడ్డ యొక్క బిగ్ బాస్ ప్రేమ కావ్యంలో ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. కానీ బిగ్ బాస్ మామ గురించి తెలిసిందేగా .. కొంచెం ఏమైనా విష్ణుప్రియకి నెగెటివ్ అనిపిస్తుందంటే చాలు ఎడిటింగ్ లో లేపేస్తారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో కనిపించిన ఈ దృశ్యాన్ని నాగార్జునతో పాటు ప్రపంచమంతా కన్నులారా చూసారు. రోజు రోజుకి ఆ కొంపలా మార్చేలా ఉందని విష్ణుప్రియని తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిఖిల్‌ పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుంటే.. గౌతమ్ ఓదార్చిన విధానం ఏదైతే ఉందో నేటి ఎపిసోడ్‌లోనే హైలైట్. నిఖిల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని తనకి జరిగిన ఇష్యూని తలుచుకుని బాధపడుతుంటే.. గౌతమ్ వెళ్లి అతనికి ధైర్యం చెప్పాడు. ఇవన్నీ పక్కనపెట్టేసెయ్ మచ్చా.. నువ్వు యంగ్ బాయ్‌వి.. చాలా లైఫ్ ఉంది. ఏదీ హార్ట్‌కి తీసుకోకు. నేను ఎక్స్ పీరియన్స్‌తో చెప్తున్నా.. బయటకు వెళ్లిన తరువాత.. నీకు కావాల్సిన వాళ్లతో మాట్లాడి.. చెప్పాల్సింది చెప్పి.. సెట్ చేసుకో. ఇంక ఎన్నివారాలో లేదు. గేమ్‌ని దృష్టిలో పెట్టుకో.. టఫ్ ఫైట్ ఇవ్వు. ఈ మూడు వారాలు బయట ఏం జరుగుతుందో అని ఆలోచించకని నిఖిల్‌కి ధైర్యం చెప్పాడు గౌతమ్. రియల్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కి అర్థం చెప్తూ గౌతమ్ చెప్పిన మాటలని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Karthika Deepam 2 : కార్తీక పౌర్ణమి రోజున కార్తీక్, దీపలు ఒక్కటయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -210 లో......జ్యోత్స్న గుడికి వెళ్తుంది. తనని చూసి కార్తీక్ కోప్పడుతుంటాడు. ఉండమంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోతానని జ్యోత్స్న అనగానే.. సరే ఉండు అని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను దీప చెప్తుంది. ఆ తర్వాత శౌర్య బాగుండాలని దీప మొక్కుకొని కోనేటిలో వదులుతుంది. శౌర్య ఆరోగ్యం బాగుండాలని కార్తీక్ దీపం వదులుతాడు. జ్యోత్స్న మాత్రం కార్తీక్ జీవితం నుండి దీప వెళ్ళాలని కోరుకొని దీపం వదులుతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కోనేటీలో వదిలిన దీపాలు ఒక్క దగ్గరికి వస్తాయి. దాంతో జ్యోత్స్న విడగొట్టాలని రాయి విసరబోతుంటే కార్తీక్ చూసి ఆపబోతుంటాడు. ఆ రాయి కాస్త జ్యోత్స్న వదిలిన దీపానికి తాకుతుంది.  ఇక నీ బుద్ది మారదన్నట్లు జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చాక కార్తీక్ దీప దగ్గరికి వచ్చి.. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అంటూ మాట్లాడతాడు. నాలాగా అందరికి దూరంగా మీరు ఉండడం ఇష్టం లేదని దీప అంటుంది. ఇన్ని రోజులు మీకు ఎలా హెల్ప్ చెయ్యాలంటూ కారణం వెతుకున్నేవాడిని కానీ అలా ఇప్పుడు లేదు.. మీరు నా కళ్ళ ముందే ఉన్నారని కార్తీక్ అంటాడు. కార్తీక్ అటువైపు తిరిగి మాట్లాడుతుంటే.. కార్తీక్ కాళ్ళు మొక్కుతుంది దీప. మీరు భర్తగా రావడం నా అదృష్టమని దీప అనుకుంటుంది. మరొకవైపు పారిజాతానికి జ్యోత్స్న తన బాధని చెప్పుకుంటూ బాధపడుతుంది. నీకు ఆస్తులున్నాయి ఇంకేంటి అన్నట్లు పారిజాతం మాట్లాడుతుంది. నా బావ కూడా కావాలని అంటుంది. మరొకవైపు దాస్ కి ఒకతను ఫోన్ చేసి.. నువ్వు చెప్పిన అతను చనిపోయాడంట.. వాళ్ళింట్లో వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారని అతను అంటాడు. కనీసం పేరు అయిన చెప్పు అనగానే.. కుబేరుడు అని చెప్తాడు. ఆ తర్వాత కుబేర్ స్కెచ్ ఆర్ట్ ని పట్టుకొని చూస్తుంటే.. కాశీ వస్తాడు. అది చూసి ఏంటని అడిగితే దాస్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నోర్ముయ్.. గౌతమ్‌పై నాగార్జున ఫైర్...

అయ్యింది.. మనం అనుకున్నదే అయ్యింది.. కన్నడ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ జెన్యున్ గా ఆడే గౌతమ్, రోహిణిలని తప్పుబడుతూ బిగ్ బాస్ నడిపిస్తున్న ఆటలో నాగార్జున కీలుబొమ్మలా మారాడు. అసలేం తప్పులేని వారిని దోషులుగా చూపిస్తూ... రౌడీయిజం చేసే పృథ్వీకి కొమ్ముకాసాడు బిగ్ బాస్. గతవారం బిగ్ బాస్ హౌస్‌లో.. పృథ్వీ, గౌతమ్‌ల మధ్య పెద్ద గొడవ అయ్యింది. నువ్వేం పీకలేవ్ అని గౌతమ్ అంటే.. జుట్టు పీకిచ్చాడు పృథ్వీ. ఈ గోల గురించి నాగార్జున అడుగుతాడనే అనుకున్నాం. వైల్డ్ కార్డ్‌లను పంపేద్దాం అని హౌస్‌లో ఉన్న వాళ్లు అనుకోవడం తప్పేం ఉందని గౌతమ్‌ని అడిగాడు నాగార్జున. దాంతో గౌతమ్‌... వాళ్లకి తప్పుకాదేమో నా ఉద్దేశంలో అది తప్పే అని అన్నాడు. సరే వాళ్లది గ్రూప్ గేమ్ అంటున్నావ్.. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూప్ గేమ్ కదా అని అడిగాడు నాగార్జున. ప్రతిసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? లేదంటే ఒక్కసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా’ అని నాగార్జునకి రివర్స్ క్వచ్చన్ వేశాడు. దాంతో నాగార్జున ఫైర్ అయ్యాడు. గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా? ఒకడు నిన్ను వాడు వీడు అని అన్నాడు.. దానికి నువ్వు బొచ్చు కూడా పీకలేవని అనేస్తావా అని అడిగాడు నాగార్జున. దానికి గౌతమ్.. 100 పర్సెంట్ తప్పే సర్ అని అంటుంటే.. నేను మాట్లాడుతున్నప్పుడు నోరు మూస్కో.. నేను నీ హౌస్ మేట్‌ని కాదు.. హోస్ట్‌ని. మధ్యలో మాట్లాడకు అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు నాగార్జున. గౌతమ్ మీద పృథ్వీ జుట్టు పీకి విసిరేయడం తప్పే కాదన్నట్టు నాగార్జున అనడంతో బిగ్ బాస్ టీమ్ కన్నడ బ్యాచ్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక చివరాకిరికి గౌతమ్ ది తప్పు అన్నట్టుగా నాగార్జున పోట్రే చేయడం అనేది కంప్లీట్ గా అన్ ఫెయిర్ అనే చెప్పాలి. సింగిల్ గా సోలో భాయ్ గా ఆడుతున్న గౌతమ్ లాంటి వాళ్ళని అలా వక్రీకరించడంపై నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది.

Brahmamudi : తల్లి కోసం రాజ్ భార్యని ఇంటికి తీసుకెళ్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -575 లో.. నా కూతురికి న్యాయం చెయ్యండి అని కనకం బాధపడుతుంటే రెండే రెండు రోజుల్లో న్యాయం చేస్తానని అపర్ణ అంటుంది.రాహుల్, రుద్రాణి ధాన్యలక్ష్మిలు భోజనం చేస్తుంటారు. మిగతా వాళ్లంతా హాల్లో కూర్చొని ఉంటారు. రాజ్ వచ్చి భోజనం చేద్దాం పదండీ అనగా.. మాకు ఆకలిగా లేదని వాళ్ళు అంటారు.  ఆ తర్వాత వాళ్లు కావ్యని తీసుకొని ఇంటికి వచ్చేవరకు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు రాజ్ అని రుద్రాణి అంటుంది. నువ్వు భోజనం చెయ్ అని రాజ్ ని అంటుంది రుద్రాణి. నేను చెయ్యనంటూ రాజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అపర్ణ ఇంట్లో కన్పించదు. ఆ విషయం రాజ్ కి తెలిసి కంగారు పడుతుంటాడు. భార్యని తరిమేశాడు.. ఇప్పుడు తల్లిని తరిమేశాడు.. ఇక మేమేనా అని రాజ్ పై కోప్పడతాడు సీతారామయ్య. మరొకవైపు అపర్ణ బ్యాగ్ తో కనకం ఇంటకి వెళ్తుంది. ఏంటి అత్తయ్య మీరు ఇలా వస్తే కుటుంబం పరువు గురించి ఆలోచించారా అని అపర్ణని కావ్య అడుగుతుంది. నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఇదంతా ఆలోచించావా అని అపర్ణ అంటుంది. మీ ఇష్టం అత్తయ్య అని కావ్య లోపలికి వెళ్తుంది. అపర్ణకి సపోర్ట్ గా కనకం ఉంటుంది  మరొకవైపు  పనిమనిషి శాంత వచ్చి.. లెటర్ గదిలో దొరికింది అంటూ ఇస్తుంది. అందులో సుభాష్  ని ఉద్దేశించి ఉంటుంది. మీరు చేసిన తప్పుకి వెళ్లిపోతున్నా తప్పు అంటే మీ కొడుకుని అలా మొండిగా పెంచారని అపర్ణ రాసి పెడుతుంది. ఆ తర్వాత కనకంకి ఫోన్ చేస్తుంది స్వప్న. ఆంటి వచ్చిందా అని అనగానే.. వచ్చిందని కనకం అంటుంది. రాజ్ ఫోన్ తీసుకొని మమ్మీ ఇంటికి రా అంటాడు. నేను రానని చెప్పు కనకం.. తను ఇక్కడకి వచ్చి మాట్లాడమని కనకంతో అనడం రాజ్ వింటాడు. తరువాయి భాగంలో కనకం ఇంటికి రాజ్ వస్తాడు. తల్లిని భార్యని ఇంటికి తీసుకొని వెళ్తాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Yashmi Elimination: యష్మీ ఎలిమినేషన్.. ఎట్టకేలకు కన్నడ బ్యాచ్ నుండి ఒకరు అవుట్!

బిగ్ బాస్ సీజన్-8 లో గత పన్నెండు వారాలుగా పన్నెండు మంది తెలుగు వాళ్లనే ఎలిమినేట్ చేశారు. అయితే ఈవారం నామినేషన్స్‌ చాలా భిన్నంగా జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చి నామినేట్ చేయడంతో.. కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ బయటజొచ్చేసింది. యష్మీ  ఈ వారం ఎలిమినేటి అయిందనే న్యూస్ బయటకు రావడంతో  బిగ్ బాస్ ఆడియన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. గత సీజన్ శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషంగా ఉన్నామంటు తెగ కామెంట్లు చేస్తున్నారు. నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ.. ఈ ఐదురుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే నలుగురు కన్నడ బ్యాచ్ నామినేషన్స్‌లోకి రావడంతో.. ఖచ్చితంగా వాళ్లలోనే ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. అంతేకాదు.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందనే ప్రచారం నడిచింది. ఎందుకంటే.. టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలంటే. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అనేది ముఖ్యం. అయితే బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడో ఏమో.. సీజన్ 8 కాబట్టి ఏకంగా ఎనిమిది మందిని ఫినాలేకి పంపబోతున్నారో ఏమో కానీ.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న యష్మీ, పృథ్వీ ఇద్దరికి ఓటింగ్ లేదు. వీరిద్దరితో పోలిస్తే ప్రేరణకు కాస్త మెరుగైన ఓటింగ్ ఉండటం వల్ల తను డేంజర్ జోన్ లో లేదు.‌ ఇక నబీల్ కి అత్యధికంగా ఓటింగ్ జరిగింది. నిఖిల్ సెకెంఢ్ ప్లేస్ లో ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి యష్మీ ఎలిమినేషన్ అవ్వడంతో మొట్టమొదటి సారిగా ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందంటు నెటిజన్లు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఆర్జీవి నంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన అరియనా...కారణం అదే

  స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అరియనా బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి మంచి పేరును సంపాదించుకుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన ఈ బ్యూటీ ఆరియానా గురించి చెప్పాలంటే ఒకానొకప్పుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి హైలైట్ అయ్యింది. అలాగే ఆర్జీవీ బ్యూటీగా ముద్ర పడింది. అలాంటి లైఫ్ ఇచ్చిన ఆర్జీవీ నంబర్ ని బ్లాక్ చేశానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అరియానా ప్రస్తుతం దావత్ అనే టాక్ షోను నిర్వహిస్తోంది. కొత్తగా విడుదలైన మూవీస్ కి సంబంధించిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే దావత్ అనే షోలో ఆరియానా ఈ కామెంట్స్ చేసింది. ఈ షోకి జబర్దస్త్ రాకేష్, సుజాత కలిసి వాళ్ళ  'కేసీఆర్' మూవీ  ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చారు. వచ్చాక రాకేష్ ఆరియానని ఇలా అడిగాడు " సర్ రాకింగ్ రాకేష్ అనే అతను ఇలా ఒక మూవీ తీసాడు. ఏదో విషయం మీద ట్వీట్ చేయించవా" అని అడిగాడు. అప్పుడు అరియానా "నేనసలు ఆయనతో  టచ్ లోనే లేను" అని చెప్పింది. "జిమ్ చేసేటప్పుడన్నా చెప్పు" అరియనా అని సుజాత కూడా అడిగేసరికి "మీరు నమ్మతారా ఆరు నెలల క్రితమే ఏడాది క్రితమో నాకు ఆర్జీవీ గారికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఆయన నంబర్ ని బ్లాక్ చేసేసాను." అని చెప్పింది. దానికి రాకేష్ "నువ్వు బ్లాక్ చేసావా..ఆయనే ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడు కదా" అని సెటైర్ వేసాడు. ఇక ఈ షో ద్వారా ఆర్జీవీకి ఒక కోరిక కోరింది.."మీకు కెసిఆర్ మూవీ గురించి తెలిస్తే మీరు కూడా ప్రమోట్ చేయండి. నేను మీ నంబర్ ని అన్ బ్లాక్ చేస్తా..మీరు కూడా అన్ బ్లాక్ చేయండి. నాకు మీతో మాట్లాడాలని ఉంది" అని చెప్పింది. "ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుంది" అని రాకేష్ అనేసరికి "అవన్నీ ఆయనకు ఉండవు" అని ఆరియానా కౌంటర్ వేసింది. ఇంతకు ఇద్దరి మధ్య ఏ విషయం మీద డిస్టర్బెన్స్ వచ్చిందో అని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.

మా నాయనా రైతు...నేను రైతు బిడ్డను..గీతూ కౌంటర్ 

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి జబర్దస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. పల్లవి ప్రశాంత్, భోలే షావలి, దామిని, గీతూ రాయల్, ఫైమా, కీర్తి భట్ వచ్చారు. సుమ అడ్డాలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం గట్టిగానే గొడవయ్యింది. దాంతో సుమ కూడా షాకయ్యింది. ఇక సుమ ఫస్ట్ రౌండ్ కోసం గెస్టులను కూర్చోబెట్టింది. ఐతే గీతూ, కీర్తి వచ్చి కూర్చున్నారు. దాంతో "ఫైమా నువ్వు రాలేదేంటి" అని అడిగింది సుమ. కీర్తి, గీతూ అనుకుని వెళ్లిపోయారు అని చెప్పింది. "స్కిట్ చేసేటప్పుడు నన్ను కలుపుకున్నావా" అని గీతూ అడిగింది. దాంతో ఇద్దరి మధ్య గొడవయ్యింది. "గట్టిగా అరవద్దు గీతూ నువ్వు తోపువి అని ఫీల్ కాకుండా వెళ్లి ఆడు" అని గట్టిగా ఇచ్చింది. మధ్యలో బోలె షావలి వచ్చేసరికి "నీ టీమ్ కాదుగా సైలెంట్ గా ఉండు" అంటూ గీతూ వార్నింగ్ ఇచ్చింది. "కీర్తి నువ్వు లే" అని సుమ అనేసరికి అంటే "నన్ను అవమానిస్తున్నారా" అంటూ ఫీలయ్యింది. "షో నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతా నాకు అవసరం లేదు" అని చెప్పింది గీతూ. "బాబోయ్ ఏమి ఈగోలు రా నాయనా" అంటూ సుమ తలపట్టుకుంది. పల్లవి ప్రశాంత్ కూడా గీతూ మీద కామెంట్స్ చేసేసరికి "బిగ్ బాస్ లో చేసిన గత్తరంతా ఇక్కడ నా ముందు చేయమాకా.. ఇలాంటి కామెంట్స్ తీసుకోలేకపోతే షోకి ఇంకా రామాకు "  అని సీరియస్ గా  చెప్పింది గీతూ. ఇక పల్లవి ప్రశాంత్ అదే రాగం అందుకున్నాడు. " మా నాయనా రైతు...నేను రైతు కొడుకును" అన్నాడు. "మా నాయనా కలెక్టర్ అయ్యాడని నేను కలెక్టర్ ని కాలేనుగా" అంటూ కౌంటర్ ఇచ్చింది గీతూ.

కెసిఆర్ మూవీలో అసలు నటించాల్సిన హీరోయిన్ ఎవరంటే ..

  కెసిఆర్ మూవీ హిట్ కొట్టిందంటూ జబర్దస్త్ రాకేష్ ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. ఐతే ఈ మూవీలో రాకేష్ కి హీరోయిన్ గా అనన్య కృష్ణన్ నటించింది. ఈమె ఎవరో కాదు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న సత్య కృష్ణన్ కూతురు. ఐతే రీసెంట్ గా రాకేష్ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ విషయంలో ఒకే విషయాన్నీ రివీల్ చేసాడు. ఐతే మొదట చాలా మంది అమ్మాయిలను హీరోయిన్స్ గా అనుకున్నారట. కానీ ఫ్రెష్ లుక్ తో ఇన్నోసెంట్ గా ఉండాలి అని అప్పుడు హీరోయిన్ రోల్ బాగా పండుద్ది అనుకున్నారట. ఐతే హీరోయిన్స్ లిస్ట్ లో ఆరియానా పేరు కూడా ఉందట. ఆరియానని కెసిఆర్ మూవీలో రాకేష్ కి హీరోయిన్ గా పెట్టుకుంటే తెలిసిన ముఖం కాబట్టి బాగుంటుంది అనుకున్న టైములో ఆమె చాలా బిజీగా ఉండడంతో హీరోయిన్ గా తీసుకునే ప్రొపోజల్ ని కాన్సుల్ చేసుకున్నారట. ఐతే బడ్జెట్ పరంగా ఆరియానా కూడా హై కాబట్టి అనన్య కృష్ణన్ ని తీసుకున్నామని సుజాత చెప్పుకొచ్చింది. ఐతే తానె హీరోయిన్ గా  ఎందుకు చేయలేదు అని అడిగేసరికి తన  గయ్యాళితనంతో ఇప్పుడే చాలా మూవీస్ లో చేసి ఉంది కాబట్టి ఈ మూవీకి అలా సెట్ కాదు కాబట్టి తానూ డ్రాప్ ఐనట్లు చెప్పింది సుజాత.  

హన్సిక అంటే చిన్నప్పుడు క్రష్...

  ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఊర మాస్ లెక్క ఉంది. ఇక హన్సికను చూసేసరికి విశ్వక్ మాములుగా డైలాగ్స్ వేయలేదు. హన్సిక ఇప్పటికీ స్వీట్ 16 లా ఉన్నారు. అసలు ఆవిడ ఏమీ మారలేదు. మా అబ్బాయితో కూడా ఆమె సినిమా చేసేంత స్వీట్ గా ఉన్నారు అంటూ లాస్ట్ లో ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. చిన్నప్పుడు ఏ క్రష్ ఐతే హన్సిక మీద ఉండేదో అది ఇప్పుడు ఆమెతో డాన్స్ చేసాక తీరిపోయింది అని చెప్పాడు.   ఇక ధమ్కీ షూటింగ్ విషయాలు గుర్తొస్తున్నాయంటూ ఆది గురించి చెప్పుకొచ్చాడు. థాయిలాండ్ లోని ఒక హోటల్ లో స్టే చేసినప్పుడు జరిగిన విషయాలను చెప్పుకొచ్చాడు.  ఆ టైములో సాయంత్రం అయ్యేసరికి రెండు గంటల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమైపోయేవాడు అది అని చెప్పాడు . ఇక శేఖర్ మాస్టర్ ఐతే విశ్వక్ ఆ సీక్రెట్ ఏంటో చెప్పవా అనేసరికి "రోజూ సాయంత్రం ఆదితో కలిసి డిన్నర్ చేద్దామనుకునేవాడిని కానీ ఆది డిన్నర్ చేయడానికి బయటకు వెళ్లిపోయేవాడు"  అని చెప్పాడు. ఇక చిట్టి మాష్టర్ కోరియోగ్రఫీ చూసాకా అందరూ ఫిదా ఇపోయారు. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ నందూ చెప్పుకొచ్చాడు.  

ఈ వారం పృథ్వీ ఎలిమినేషన్.. డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మీ సర్దుకోవాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం వీకెండ్ వచ్చేసింది. ‌ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇక కన్నడ బ్యాచ్ అంతా నామినేషన్ లో‌ ఉండగా నబీల్ ఒక్కడు తెలుగోడు ఉన్నాడు. ఇక ఓటింగ్ అనాలసిస్ చూస్తే నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నిఖిల్ సెకెంఢ్ ప్లేస్ లో ఉన్నాడు.  కొన్ని పోల్స్‌లో నబీల్ టాప్‌లో ఉంటే.. మరి కొన్ని పోల్స్‌లో నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్‌ని దోషిగా నిలబెట్టడంతో.. అతనికి మైనస్ ఎంత అయ్యిందో.. ప్లస్ కూడా అంతే అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే.. అతనికి తొలి నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఎక్కువే ఉండటంతో.. ఈవారంలో కూడా సత్తా చూపిస్తున్నాడు. ఇక శుక్రవారం నాటి ఓటింగ్ పోల్ లో పృథ్వీ, యష్మీ ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. వీరికంటే ప్రేరణకి అత్యధిక ఓటింగ్ ఉంది. ఇక కన్నడ బ్యాచ్ చేసే గ్రూపిజం కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. మన బిగ్ బాస్ మామ గురించి తెలిసిందేగా కంటెంట్ ఇచ్చే వాళ్లను, రౌడీయిజం చేసేవారిని, అందరు కలిసి నామినేషన్ ఎవరిని చేయాలో మాట్లాడుకునేవారినే హౌస్ లో ఉంచుతాడు. మిగతావాళ్ళని బయటకి పంపిస్తాడు. అవినాష్, టేస్టీ తేజ లాంటి ఎంటర్‌టైనర్స్ ని ఎలిమినేషన్ దాకా తీసుకొచ్చేస్తాడు. మరి ఈ వారమైన కన్నడ బ్యాచ్ లో వరెస్ట్ బిహేవియర్ తో ఉన్న పృథ్వీని పంపిస్తాడో లేక ఫ్లిప్పింగ్ స్టార్ యష్మీని ఎలిమినేషన్ చేస్తాడో చూడాలి మరి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మీ కూడా సర్దుకోవాల్సిందే.  

విరిగిన కాలుతో‌ వీరోచిత పోరాటం.. లాస్ట్ మెగా ఛీఫ్ గా రోహిణి!

  బిగ్‌బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ మీల్స్ లా అనిపించింది. హౌస్‌లో ఇప్పటివరకూ కన్నడ గ్యాంగ్ మధ్య సరైన గొడవ జరగలేదు. మొన్న సోనియా వచ్చి నిఖిల్-యష్మీ మధ్య మంట రాజేసిన ఒక్కరోజులో అది ఆరిపోయింది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో కన్నడ బ్యాచ్ వాళ్లలో వాళ్లే మంట పెట్టేసుకున్నారు. దీంతో అటు పృథ్వీ, ఇటు యష్మీ ఇద్దరూ మెగా చీఫ్‌ రేసు నుంచి తుస్సుమనిపించారు. రోహిణి కొత్త మెగా చీఫ్ అయిపోయింది. అయితే పృథ్వీకి వచ్చిన అవకాశాన్ని యష్మీ చెడగొట్టింది. బిగ్ బాస్ మొదటగా 'ఆటో టాస్క్' ఇచ్చాడు. ఇందులో పృథ్వీ గెలిచాడు. ఇక రెండో టాస్క్ 'తెడ్డు మీద గ్లాస్'.  ఈ టాస్కులో గెలవాలంటే కంటెండర్లు తెడ్డుపై గ్లాసులు పెట్టి వాటిని జిగ్‌జాగ్‌గా ఉన్న స్టాండ్ నుంచి అటు తీసుకెళ్లి తమ వాటర్ కంటెనర్‌లో వెయ్యాలి. ఇలా ఎవరైతే ఎక్కువ నీళ్లు నింపుతారో వారికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇందులో రోహిణి గెలిచింది. ఈ గేమ్‌లో సరిగా పర్ఫామెన్స్ చేయకపోవడంతో మెగా చీఫ్ రేసు నుంచి విష్ణుప్రియ, యష్మీ ఇద్దరు తప్పుకున్నారు. ఇక మెగా చీఫ్ కోసం ఫైనల్ రేసులో రోహిణి, పృథ్వీ, తేజ నిలిచారు. ఇక వీరికి బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చాడు. ఒక స్టాండ్ ఉంచి వాటి చివరన కుండ ఉంచి.. బజర్ మ్రోగిన తర్వాత ఒక్కో కంటెస్టెంట్ రెండు సార్లు ఇసుక పోయాలని, పోటీదారులు కుండని ఒక్క కాలుతో మాత్రమే బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పాడు. ‌ఇక ఇందులో మొదట టేస్టీ తేజ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పృథ్వీ, రోహిణి ఉన్నారు. ఇద్దరు చివరిదాకా కష్టపడ్డారు. కానీ పృథ్వీ బ్యాలెన్స్ చేయలేక అవుట్ అయ్యాడు. రోహిణి చివరి వరకు ఉండి విజయం సాధించింది. జీరో జీరో అంటు రోహిణిని విష్ణుప్రియ అవమానించింది.. దాని వల్లే తను కసిగా ఆడి గెలిచానని రోహిణి అంది. ఇక ఈ పోటీలో నబీల్, నిఖిల్, విష్ణుప్రియ అంతా పృథ్వీకే సపోర్ట్ చేశారు. కానీ గెలవలేదు. రోహిణి మాత్రం తన కాలు విరిగినా సరే బ్యాలెన్స్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత తను చాలాసేపటి వరకు కుంటుతూనే నడిచింది. రోహిణి అటు ఎంటర్‌టైన్మెంట్ ఇటు టాస్క్.. ఏదైనా ఇరగదీయగలదని ఆడియన్స్ కి ఈ విజయంతో అర్థం అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 లో రోహిణి ఆఖరి మెగా ఛీఫ్ గా నిలిచింది.

సోనియా ఆకుల ఎంగేజ్ మెంట్...వైరల్ అవుతున్న ఫోటోలు!

  సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్-8 తో ఫుల్ పాపులర్ అయ్యింది. తన నామినేషన్ చూస్తే అవతలి వాళ్ళు అసలు డిఫెండ్ చేసుకోలేరు.‌ నిజానికి సోనియాని సరిగ్గా డిఫెండ్ చేసే నబీల్ హీరో అయ్యాడు.  ఇక సోనియా హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఓ ఊపు ఊపింది.  నిఖిల్‌తో బాగా క్లోజ్‌గా ఉండటంతో వీళ్ల హగ్‌లు, రొమాన్స్‌ వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో దారుణంగా ట్రోల్ అయ్యింది. ఈ నెగిటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది సోనియా. ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలై.. క్యారెక్టర్‌ని కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటాడు. అలా ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలైంది సోనియా. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న సోనియా.. బయటకు వచ్చిన తరువాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకుని పన్నెండవ వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లి మరీ అతని గురించి బయటపెట్టేసింది. ఆడాళ్ల ఎమోషన్స్‌తో ఎలా ఆటలు ఆడుకుంటాడో.. అతను ఎంత మోసగాడో తెలియజేస్తూ నామినేట్ చేసింది. ఇక తాజాగా సోనియా ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ప్రేమించింది తన ప్రియుడు యష్ వీరగోని(Yashmi Veeragoni). బిగ్ బాస్ కి వెళ్లే ముందే వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ బిగ్ బాస్ అవకాశం రావడంతో మనసు మార్చుకుంది సోనియా. యష్, సోనియాలు డిసెంబర్‌లో నెలలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా.. సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్‌కి ఇది రెండో వివాహం కావడం విశేషం. అతనికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తరువాత.. భార్యకి విడాకులు ఇచ్చాడనే విషయం బయటకు వచ్చింది. దీని గురించి అతను ఎక్కడా మాట్లాడలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సోనియా.. తన ప్రియుడు గురించి చెప్తూ అతనికి విడాకులు అయ్యాయనే విషయాన్ని ప్రేరణకి చెప్పింది. అలా వీరి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే వీరి వివాహ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు కానీ.. వీడియోలో కానీ వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయకపోవడంతో.. అసలు ఇది రియలా ఫేక్‌నా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.