Karthika Deepam2 : దీపే అసలైన వారసులైన విషయం తెలుసుకున్న జ్యోత్స్న.. ఏం చేయనుంది?

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -217 లో..... పారిజాతం ఇంటికి దాస్ వచ్చి సుమిత్ర దశరథ్ లు ఉన్నారా అని.. అడుగగా వాళ్ళ తో నీకేం పని.. వాళ్లు ఊళ్ళో లేరని శివన్నరాయణ తిట్టి పంపిస్తాడు. ఇతను ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నాడని జ్యోత్స్న తన వెనకాలే వెళ్లి మా మమ్మీ డాడ్ లని ఎందుకు కలవాలనుకుంటున్నావు.. ఆ కుబేర్ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావంటూ జ్యోత్స్న అడుగుతుంది. నాకు నిజం తెలిసింది అందుకే అని దాస్ అనగానే.. ఏం నిజమని జ్యోత్స్న అడుగుతుంది. మరొక వైపు కార్తీక్ బుక్స్ సర్దుతుంటే చిన్నప్పుడు తన ప్రాణం కాపాడి చైన్ తన దగ్గర పడిసుకుంటుంది దీప. ఆ చైన్ కార్తీక్ చూసి ఎక్కడున్నావ్.. అప్పుడు నా ప్రాణాలు కాపాడావ్ ఇప్పుడు ఎక్కడున్నావ్ ఎప్పటికైనా నిన్ను కలుస్తానని కార్తీక్ చైన్ చూసుకుంటూ అంటాడు. అప్పుడే దీప రావడం చూసి వెనకాల చైన్ దాస్తాడు. మీరు ఎందుకు అత్తయ్య వాళ్ళకి నిజం చెప్పారని దీప అడుగుతుంది. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్పాలని కార్తీక్ అంటాడు. ఏంటి బాబు చేతిలో ఎప్పటికైనా కలుస్తాను అంటున్నారని దీప అడుగగా.. ఏదో ఫ్రెండ్ అని చెప్తాడు. దీప వెళ్ళిపోయాక ఇప్పుడు నీకు చెప్పొచ్చు.. మళ్ళీ జ్యోత్స్న అప్పుడు కాపాడలేదు ఈ అమ్మాయి కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. అదంతా ఇప్పుడు ఎందుకు నా ప్రాణలు కాపాడిన అమ్మాయి ఎదురుపడితే తనే నా ప్రాణం కాపాడిందని అప్పుడు నీకు పరిచయం చేస్తాను. నా రక్తం ఇచ్చి నా ప్రాణం కాపాడవంటూ నిన్ను తనకి చూపిస్తానని కార్తీక్ అనుకుంటాడు.  మరొక వైపు అసలైన వారసురాలు నాకు తెలుసని దాస్ అంటాడు. చెప్పమని జ్యోత్స్న అనగానే.. ఎవరో కాదు కుబేర్ కూతురు దీప... కుబేర్ కి దీప దొరికిన కూతురు మాట ఎంత బలమైందో చూడు.. కాంచన తన కోడలిని తన ఇంటికి కొడలిని చేసుకుంటా అంది.. అలాగే చేసుకుంది చూసావా అని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా అన్నయ్య, వదినలకి చెప్తానని దాస్ అనగానే.. వద్దు నాన్న అంటూ జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితుంది. లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. నా అంతటా నేను నిజం చెప్పను.. అలా అని దీపకి అన్యాయం చెయ్యనని దాస్ వెళ్ళిపోతాడు. నిజం చెప్పనన్నాడు.‌ అన్యాయం చెయ్యను అనడం ఏంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : స్టెల్లా చుట్టూ చేరిన రాహుల్, సుభాష్.. కావ్య ముందు  ఓడినట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -582 లో.... కావ్య పై కోపంతో ఒక స్టార్ హోటల్ చెఫ్ ని ఇంట్లో కుక్ చెయ్యడానికి నెలకు లక్ష రూపాయలిచ్చి తీసుకొని వస్తాడు రాజ్. ఆ చెఫ్ పేరు స్టెల్లా.. తను ఇంటికి రాగానే అందరు తనని చూసి షాక్ అవుతారు. రాహుల్, ప్రకాష్ అయితే తన మీద మీద పడిపోతు పరిచయం చేసుకుంటారు. ఇంట్లో ఎవరికి ఏది కావాలన్న చిటికెలో చేస్తానని స్టెల్లా అంటుంది. ఆ తర్వాత అందరు తమకి నచ్చిన లిస్ట్ చెప్తుంటారు. నాకు ముగ్గురు అసిస్టెంట్స్ కావాలని స్టెల్లా అనగానే అందరు షాక్ అవుతారు. ఇక కావ్య ముందు ఏం అనలేక సరే మేం ముగ్గురం హెల్ప్ చేస్తామని రాజ్ అంటాడు. సరేనంటు రాహుల్, ప్రకాష్ అంటాడు. రాహుల్ ప్రకాష్ రాజ్ లు కూరగాయలు కట్ చేస్తు స్టెల్లా చెప్పినట్టు చేస్తుంటారు. అదంతా కావ్య, సీతారామయ్య ఇందిరాదేవి, సుభాష్ లు చూస్తూ నవ్వుకుంటారు. పెళ్ళాంకి సాయం చెయ్యడం తెలియదు గానీ చెఫ్ కి సాయం చెయ్యడం వచ్చు.. తిక్క బాగా కుదరిందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత స్టెల్లా అక్కడ నిల్చొని.. అది చెయ్యాలి ఇది చెయ్యాలని చెప్తుంది. మొత్తం వంట ముగ్గురే చేస్తుంటారు. ఇక వంట అయిపోయింది. మీరు సర్వ్ చేసుకొని తినండి అంటూ స్టెల్లా చెప్పగానే.. నీకు ఇంత జీతం ఇచ్చి రప్పించింది మేమ్ చేసుకోవడానికా అని రాజ్ అంటాడు. మరి నేను ఆలాగే చేస్తానని స్టెల్లా అంటుంది. కావ్య ముందు ఓడిపోయినట్లు అవుతుందని రాజ్ సైలెంట్ గా ఉంటాడు. ప్రకాష్ రాహుల్ లు స్టెల్లా చుట్టూ చేరి సెల్ఫీ లు తీసుకుంటు ఉంటారు. రాజ్ టేబుల్ పైకి భోజనం సర్వ్ చేస్తాడు. త్వరగా తినండి పది నిమిషల తర్వాత ఫుడ్ పాడవుతుంది. ఎందుకు అంటే నేను వాడిన ఇంగ్రీడియాంట్స్ అలాంటివని స్టెల్లా అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు ఇందిరదేవి సీతారామాయ్య ,సుభాష్ లకి కావ్య భోజనం వడ్డీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

prithvi remuneration: బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో‌ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ గతవారం నుండే మొదలైంది. పన్నెండు వారాల వరకు వరుసగా తెలుగు కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్.. పన్నెండో వారం యష్మీని ఎలిమినేషన్ చేసి షాకిచ్చాడు. ఇక పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజని ఎలిమినేషన్ చేయగా, ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీని ఎలిమినేట్ అయ్యాడు. కన్నడ బ్యాచ్ కి చెందిన  పృథ్వీ ఎక్కువగా విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడిపాడు. అందుకే ఇప్పటి వరకు హౌస్ లో సర్వైవ్ అయ్యాడని అందరికి తెలుసు. ఇక హౌస్ లో 91 (అంటే 13 వారాలు) రోజులున్న పృథ్వీరాజ్.. రోజుకు రూ. 18,572 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి రూ. 1లక్ష 30 వేలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ రూ.16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే 13 వారాలకు గాను పృథ్వీరాజ్ శెట్టి రూ.19 లక్షల 50 వేలు తీసుకున్నట్లు కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ, విష్ణుప్రియల లవ్ ట్రాక్ చూసిన ఆడియన్స్.. ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అనుకున్నారు. అయితే హౌస్ లో ప్రతీ ఒక్కరిని చిన్నచూపు చూడటం.. ఎవరికి కనీస మర్యాద ఇవ్వకపోవడం..ఫుల్ అగ్రెసివ్ గా ఆడటం.. రౌడీయిజం చేయడం.. ఇవన్నీ పృథ్వీ యొక్క ప్రత్యేకతలు.. ఇక గత వారం గౌతమ్ జరిగిన గొడవలో పృథ్వీ బొచ్చు విసిరేయడం పెద్ద చర్చనీయాంశమైంది.  

బేబక్కలో ఇన్ని వేరియేషన్సా...వామ్మో

బిగ్‌బాస్‌ 8 తెలుగు సీజన్‌ లో బెజవాడ బేబక్క అలరించింది. ఆమె సోషల్ మీడియాలో తన స్టైల్ మోడ్యులేషన్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. కరోనా టైంలో ఆమె రీల్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కంటే వెళ్లొచ్చాక ఇన్స్టాగ్రామ్ లో బేబక్క ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఐతే రీసెంట్ గా ఒక ఫండ్ రైజింగ్ షోలో ఆమె ఎంటర్టైన్ చేసింది. దానికి సంబందించిన ఒక సాంగ్స్ రిహార్సల్స్ చేస్తూ ఒక వీడియొని పోస్ట్ చేసింది. ఇందులో మరో సింగర్ విఖ్యాత్ సాయిరాంతో కలిసి పాటలు పాడింది. ఇక నెటిజన్స్ చూడండి బేబక్కకు మాములుగా కామెంట్స్ పెట్టలేదు. "బేబక్క సాంగ్ ని బ్లాస్ట్ చేసింది. ఎందుకు అంత రఫ్ గ పాడుతున్నారు స్మూత్ గా పాడొచ్చు కదా...బేబక్క నీ దగ్గర ఈ కలలు కూడా ఉన్నాయా...ఎం చేస్తున్నారు మేడం మీరు. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త కొత్త అవతారంతో బయపెట్టిస్తున్నారు.  అక్క నువ్వు సింగర్ ఐపోవచ్చు..బేస్ వాయిస్ మీరు. సూపర్ సింగర్ మీరు" అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. బెజవాడ బేబక్క  సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ గా , యూట్యూబ్‌ స్టార్‌గానే అందరికి తెలుసు . అంతే కాదు ఆమె ఒక యాక్టర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా.  బేబక్క తెలుగులో "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి  20 సినిమాల్లో ఆమె నటించింది.  

హౌస్‌లో  విష్ణుప్రియతో చాలా ఎంజాయ్ చేశా...అన్నీ సూపర్ హిట్

బిగ్ బాస్ సీజన్-8 లో‌ పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ‌విష్ణుప్రియ-పృథ్వీల మధ్య ఎలిమినేషన్ రౌండ్ సాగగా తను(విష్ణుప్రియ) సేఫ్ అయ్యింది. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చాక పృథ్వీకి ఓ టాస్కు ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో ముగ్గురు సూపర్ హిట్లు, ముగ్గురు సూపర్ ఫ్లాపులు చెప్పాలంటూ నాగార్జున అడిగారు. దీంతో ముందుగా నిఖిల్ సూపర్ హిట్ సర్.. టాస్కులు.. ఇంట్లో అన్నీ గుడ్ సో సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత నబీల్‌కి సూపర్ హిట్ ఇచ్చాడు. నబీల్ టాస్కులు, నామినేషన్స్ అన్నింట్లో చాలా ఇన్వాల్ మెంట్ ఉంది.. సో నబీల్‌కి కూడా సూపర్ హిట్ అంటూ చెప్పాడు. ఇక చివరి సూపర్ హిట్ విష్ణుప్రియకి ఇచ్చాడు. తను చాలా జోవియల్ అమ్మాయి.. హౌస్‌లో తనతో కలిసి చాలా ఎంజాయ్ చేశా.. తను కూడా సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు. ఇక ఇందులో భాగంగా మొదటగా సూపర్ ఫ్లాప్ రోహిణికి ఇచ్చాడు. మీరు ఇంకా నామినేషన్స్‌లోకి రావాలి.. మీరు అక్కడ ఉండాలా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి.. మీరు ఇప్పటివరకూ ఒక్కసారే నామినేషన్స్‌కి వచ్చారు అందుకే మీకు సూపర్ ఫ్లాప్ ఇస్తున్నానంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత అవినాష్ బ్రో.. సేమ్ రీజన్ ఒకసారే నామినేషన్‌కి వెళ్లారు.. ఎలిమినేట్ అయ్యారు.. షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు.. కనుక మీరు జనాల్లోకి వెళ్లి ప్రూ చేసుకోవాలంటూ పృథ్వీ అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ అందరూ బాగా ఆడండి.. కానీ నేను నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకి ఓటేస్తానంటూ పృథ్వీ అన్నాడు. ఇంతమందికి ఎలా వేస్తావయ్యా అంటూ నాగార్జున అడుగగా.. అవును సర్ నాలుగు మొబైల్స్ తీసుకొని ఓట్ చేస్తానంటూ పృథ్వీ చెప్పాడు.

Prithvi Elimination: పృథ్వీ ఎలిమినేషన్ తో విష్ణుప్రియ ఎమోషనల్..

  బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి సండే ఫండే ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో చివరిగా మిగిలి పోయిన పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండంటూ నాగార్జున చెప్పారు. ఇక ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు ఉన్నాయి. వీటిలో ముందుగా నెం 1 అని రాసిన లిక్విడ్ వేయాలంటూ నాగ్ చెప్పారు. అది వెయ్యగానే అక్వేరియంలో వాటర్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. తర్వాత నెం. 2 లిక్విడ్ వేయాలి.. అది వేశాక ఆ నీళ్లు రెడ్‌లోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉన్నాయి. దీంతో పృథ్వీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు. విష్ణుకి ఓ హగ్గు ఇచ్చి అక్కడి నుంచి పృథ్వీ బయటికొచ్చాడు. అందరికీ హగ్గు ఇచ్చి బైబై చెప్పాడు పృథ్వీ. అయితే నిఖిల్, నబీల్, ప్రేరణ హగ్గు ఇచ్చినప్పుడు పృథ్వీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక గేటు దగ్గరికి వెళ్లగానే విష్ణు మరోసారి పృథ్వీకి హగ్గు ఇచ్చి ఐయామ్ సారీ అంటూ చెవిలో చెప్పింది. పృథ్వీ వెళ్లిపోయిన తర్వాత ఏడుస్తూ ఐ మిస్ యూ.. యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్.. పృథ్వీ అంటూ అరిచింది. స్టేజ్ మీదకి వచ్చీ రాగానే ఊహించావా ఎలిమినేషన్ గురించి అంటూ నాగార్జున అడిగారు. దీనికి లేదు సార్ కానీ ఐయామ్ ఫైన్.. నో రిగ్రెట్స్ అంటూ పృథ్వీ అన్నాడు. తర్వాత పృథ్వీ జర్నీ వీడియో ప్లే చేశారు నాగార్జున. ఇందులో పృథ్వీ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అన్నీ కవర్ చేశారు. ముఖ్యంగా విష్ణుప్రియతో నడిచిన లవ్ ట్రాక్‌ని పాటలేసి మరీ గట్టిగానే ఎడిట్ చేశారు. అలానే సోనియా, యష్మీ, నిఖిల్, నబీల్‌లతో పృథ్వీ బాండింగ్‌ని బాగా చూపించారు. జర్నీ వీడియోలో తన తండ్రి ఫొటో ఇదొక్కటే ఉందంటూ చెబుతున్న సీన్ చూసి పృథ్వీ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఫ్యామిలీ వీక్‌లో వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు జరిగిన ఎమోషనల్ సన్నివేశాలకి పృథ్వీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పృథ్వీ ఏడవడం చూసి నాగ్ కూడా కాస్త అవాక్కయ్యారు. జనరల్‌గా హౌస్‌లో ఇప్పటివరకూ పృథ్వీ ఒకే ఒక్కసారి ఏడ్చాడు. అది కూడా మెగా చీఫ్ అవకాశం కోల్పోయినప్పుడు మాత్రమే. ఇలా పృథ్వీ జర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది.  

టేస్టీ తేజ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. ఈ సీజన్ ముగియడానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలేని పొంది అవినాష్ ఫినాలేకి చేరుకున్నాడు. (Tasty Teja) ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ చివరల్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. దాదాపు 8 వారాల పాటు తేజ హౌజ్‌లో ఉన్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ ఎలిమినేట్‌ కావడంతో ఆయన ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడన్న చర్చ సాగుతోంది. టేస్టీ తేజ వారానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సీజన్‌కు గాను తేజకు బిగ్‌బాస్‌ రూ.16 లక్షల పారితోషం తీసుకున్నట్లు సమాచారం. తేజ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇక నేటి ఆదివారం ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేషన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Priyanka jain : తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జైన్!

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయినా బయట అయినా గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.  ప్రియాంక జైన్, శివ్ కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ‌‌అయితే కొన్ని నెలల క్రితం వీళ్ళు తిరుపతిలో చేసిన వ్లాగ్ వైరల్ అయ్యింది. ఆ వ్లాగ్ లో ఏం ఉందంటే.. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో కొలవాల్సిన చోట.. వీళ్ల రీల్స్ పిచ్చి చూపించారు. మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్?? అంటూ ఇద్దరూ షాక్ అయిన ఫొటోలతో తంబ్ నెయిల్ పెట్టి.. యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని మొత్తం చూపించింది ప్రియాంక జైన్. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఈ ప్రాంక్ వీడియో వ్యవహారం టీటీడీకి కూడా చేరింది. ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సభ్యులు చెప్పారు. ఇక ఇప్పుడు తాజాగా దాని మీద క్లారటీ ఇస్తూ శివ్ తో కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద మా క్లారిటీ అంటు వ్లాగ్ చేసింది. శివ్ మాట్లాడుతూ.. తిరుపతి అనేది పవిత్రమైన స్థలం.. నాకేమైనా బాధ అనిపించినా , లో అనిపించినా నేను తిరుపతి దేవస్థానానికి వెళ్తాను. అక్కడ ఫ్రాంక్ లాగా చేసాం.. ఎవరిని బాధపెట్టడానికి ఆ వీడియో చేయలేదు. అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం.. అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇంకెప్పుడు అలాంటి ఫ్రాంక్ చేయం .. మమ్మల్ని క్షమించండి అంటు శివ్, ప్రియాంక జైన్ ఇద్దరు ఆ వ్లాగ్ లో చెప్పారు.

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. తను ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -17 లో.....రామరాజు ముగ్గురు కొడుకులు మంచిగ రెడీ అయి ఫొటోస్ తీసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోస్ ఇచ్చి.. పెళ్లి సంబంధం చూడమని చెప్తాడు రామరాజు. ఆ తర్వాత చందు, సాగర్, ధీరజ్ లు ఇంటికి వస్తారు. ముగ్గురు ఒకే డ్రెస్ లో ఉండడం చూసి ప్రేమ ఎగతాళి చేస్తుంది. దాంతో ప్రేమపై ధీరజ్ గొడవకి దిగుతాడు. మరొకవైపు నర్మద టీ తాగుతుంటే.. తన పేరెంట్స్ కి పెళ్లివారు ఫోన్ చేసి ముహూర్తం ఖాయం చేసామని అనగానే.. నర్మద టెన్షన్ పడుతుంది. వెంటనే ఆ విషయం సాగర్ కి ఫోన్ చేసి కలవాలని చెప్తుంది. ఆ తర్వాత సాగర్ ని నర్మద కలిసి.. రేపు మీ వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి గురించి మాట్లాడమని నర్మద చెప్పి వెళ్తుంది. దాంతో సాగర్ టెన్షన్ పడుతాడు. మరొకవైపు కళ్యాణ్ ని ప్రేమ కలుస్తుంది. కళ్యాణ్ ఎలాగైనా ప్రేమ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటాడు. అందుకు ఎగ్జామ్స్ ఫీజు కట్టాలని బాధపడుతుంటే.. నేను ఇస్తానంటూ ఫీజు ఇస్తుంది. ఇక కళ్యాణ్ మాత్రం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బెట్టింగ్ కి సిద్ధం చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత సాగర్ ఆలోచిస్తుంటే.. ధీరజ్ ఏమైందని అడుగుతాడు. దాంతో నర్మద చెప్పింది చెప్పగానే ఆ విషయం నాన్నతో చెప్పమని అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. నాన్న రేపు ఒకరి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడలని సాగర్ అనగానే.. ఏంటి అంటూ రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్, నర్మద వాళ్ళింటికి వెళ్తారు. వాళ్ళ నాన్నతో నర్మద, సాగర్ ల ప్రేమ విషయం ధీరజ్ చెప్తాడు. దాంతో నర్మద వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మాటతీరు మార్చుకోకపోతే స్టేజ్ మీద ఉంటావ్.. నామినేషన్లోకి రండి మేడమ్!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ నాటి శనివారం ఎపిసోడ్ లో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లోని అందరికి బైబై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన తేజకి హగ్గు ఇచ్చి పలకరించాడు నాగార్జున. ఇక తేజ జర్నీ వీడియో ప్లే చేశారు. యష్మీ కిస్ ఇస్తానన్న సీన్, బస్తాల టాస్కులో తేజ ఇరగదీసిన తీరు, రోహిణి, అవినాష్‌లతో కలిసి చేసిన కామెడీ ఇలా జర్నీ వీడియోను బ్యూటిఫుల్‌గా ఎడిట్ చేశారు. ఇక హౌస్‌లోకి మీ పేరెంట్స్ రారు అన్నప్పుడు తేజ ఎమోషనల్ అయిన వీడియోలు.. తర్వాత వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు ఎమోషన్స్‌తో జర్నీ వీడియోను పూర్తి చేశారు. అమ్మ వచ్చిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు తేజ. ఇక స్టేజ్ మీద కూరగాయల ఫొటోలు పెట్టి ఏది ఎవరికి డెడికేట్ చేస్తావో చెప్పమన్నాడు నాగార్జున. అవినాష్ అన్నా.. ఆటల్లో సూపర్ మాట పరంగా కూడా ఎక్కడా తగ్గకు.. ఇంత టఫ్‌ కాంపిటేషన్‌లో కూడా గెలిచాడు.. చాలా హ్యాపీగా ఉంది.. నాకు కిచెన్‌లో ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేశాడు. సో అన్నకి ఉల్లిగడ్డలు ఇస్తున్నానంటూ తేజ చెప్పాడు. ఇక రోహిణి మేడమ్ గెలిచి మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను.. ఆవిడ గెలిచినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయ్.. మన టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఏడ్చా.. మళ్లీ రోహిణి గారు గెలిచాకే ఏడ్చా.. ఆవిడకి బంగాళదుంప ఇస్తున్నానంటూ తేజ అన్నాడు. కానీ నామినేషన్స్‌కి రాకపోవడమే మీకు మైనస్ మేడమ్.. వచ్చే వారం ప్లీజ్ రండి అంటూ తేజ అన్నాడు. ఆటల్లో కూడా పర్సనాలిటీని చూసుకోండి.. ఎందుకంటే అక్కడ కూడా ఫెయిర్‌గా ఆడటం ముఖ్యమంటూ విష్ణుప్రియకి కాకరకాయ ఇచ్చాడు తేజ. అయితే దీనికి కూడా విష్ణుప్రియ తనకి అనుకూలంగా చెప్పుకుంటూ చేదుగా ఉన్నా కాకరకాయ మంచిదంటూ చెప్పింది. ఆ తర్వాత పృథ్వీలో కూడా ఫన్ యాంగిల్ ఉంది.. కానీ మాకు అగ్రెషన్ ఏంగిల్‌యే ఎక్కువ చూపించాడు. విష్ణుప్రియని మధ్యలో వదిలేసినట్లు గేమ్స్ కూడా వదిలేయకంటూ పృథ్వీకి పచ్చి మిర్చి ఇచ్చాడు. ఆ తర్వాత మా వోడు గౌతమ్‌కి క్యాబేజ్ ఇస్తా సర్.. ఎందుకంటే పొర తీస్తే వస్తానే ఉంటుంది క్యాబేజ్‌కి అలానే గౌతమ్‌లో ఎంత తీసినా కొత్త యాంగిల్ ఉంటుంది.. మనోడు ఖచ్చితంగా టాప్-2లో ఉంటాడని నా గట్ ఫీలింగ్ అంటూ తేజ అన్నాడు. నువ్వు మాటతీరు మార్చుకోలేకపోతే వచ్చే వారం నాగార్జున సర్ పక్కన నువ్వుంటావ్.. సీరియస్‌గా చెబుతున్నానంటూ ప్రేరణకి బెండకాయ ఇచ్చాడు. నువ్వు కన్ఫ్యూజన్‌లో ఉన్నావ్.. వైల్డ్ కార్డ్స్ రాకముందు టాప్-3లో ఉండేవాడివి కానీ ఇప్పుడు టాప్ -5లోనే ఉన్నావ్ .. ఏమైందో చూసుకొని సరిచూసుకోమంటూ నబీల్‌కి టమాటా డెడికేట్ చేశాడు. ఎమోషనల్‌గా వీక్.. చాలా డౌన్ అయ్యావ్.. నువ్వు పుషప్ చేసుకొని ఇంకా ముదుకు రావాలంటూ నిఖిల్ కి సొరకాయ డెడికేట్ చేశాడు తేజ. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి డెడికేట్ చేసి అందరికి బై చెప్పి వచ్చేశాడు. 

Karthika Deepam 2 : గతం చెప్పేసిన కార్తీక్.. ఆ నిజాన్ని దాస్ చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -216 లో......దీపలో ఉందేంటి నాలో లేదేంటని  కార్తీక్ తో జ్యోత్స్న అనగానే.. గుణం, మంచితనం అని దీప గురించి గొప్పగా మాట్లాడతాడు. నీకోసం నా ప్రాణం అయిన ఇస్తాను బావ అని జ్యోత్స్న అనగానే.. నువ్వు ఇస్తావా.. చిన్నప్పుడు నేను కొలను లో పడిపోతే నువ్వు వదిలేసి వెళ్ళావ్ కానీ ఒక అమ్మాయి వచ్చి ప్రాణం కాపాడిందని కార్తీక్ చెప్తాడు. ఆ దీపని ఇక అడ్డు తొలిగించే పనిలో ఉంటానని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు అనసూయ కుబేర్ ఫోటో చూస్తూ.. నీకు దీప దొరికిందని దాస్ కి చెప్పాను.. ఎవరికి చెప్పొద్దూ అన్నావు కానీ చెప్పాను తమ్ముడు అని అనసూయ ఏడుస్తుంది. ఈ విషయం దీపకి తెలియొద్దని అనసూయ అనుకుంటుంది. ఏ విషయమంటూ కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన, దీప ఇద్దరు వస్తారు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని కార్తీక్ అంటాడు. దీప వాళ్ళ నాన్న చనిపోయింది నా వాళ్లే అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అవును నేను లండన్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని వెళ్లినప్పుడు మా కార్ తాకి పడొపోయాడు. దీప దీప అన్నాడని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు.  దీప అసలు నిజం తెలుసుకుంది. ఎలాగైనా దీపకి సాయం చెయ్యాలనుకున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత దీప అమ్మ నాన్న బతికే ఉన్నారని అనసూయ అంటుంది. ఏంటని దీప అనగానే అనసూయ డైవర్ట్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఉంటారని ఉదేశ్యలో అన్నానని అనసూయ అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి కోపంగా వెళ్తుంది.. అప్పుడే దాస్ పారిజాతం ఇంటికి వెళ్తాడు. ఎందుకు వచ్చావని శివన్నారయణ కోప్పడతాడు. దశరథ్ అన్న సుమిత్ర వదిన కోసం అని దాస్ అంటాడు. వాళ్లు లేరు అనగానే దాస్ వెళ్లిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దమ్మున్న ప్లేయర్, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ లో నాగార్జున వచ్చీ రాగానే అవినాష్ ఈజ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్స్ కి బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇచ్చాడు నాగార్జున. మొదటగా నిఖిల్ ని అడుగగా టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు.  గౌతమ్ ని అడుగగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగ్గా ప్రవర్తించలేదని ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడిన వీడియోని ప్లే చేసి చూపించాడు. పృథ్వీ ఫౌల్  గేమ్ ఆడాడంటూ అందుకే అతనికి బ్లాక్ టికెట్ ఇచ్చింది రోహిణి. నబీల్, విష్ణుప్రియ, తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు అవినాష్. గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలని ప్రేరణ అంది. ఇక తనకి మద్దతుగా నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ చేతులు లేపారు. అప్పటి వరకు అందరికి బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటు పోయిన నాగార్జున.. గౌతమ్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అవినాష్, రోహిణి, నిఖిల్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు.  ఆ తర్వాత హౌస్ లో దమ్మున్న కంటెస్టెంట్? దుమ్ముదుమ్మయిపోయే కంటెస్టెంట్ ఎవరని అడిగాడు నాగార్జున. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని రోహిణి అంది. ఎంటర్‌టైనర్స్ కూడా గెలుస్తారని నిరూపించాడంటు అవినాష్ కి తేజ దుమ్మున్న ప్లేయర్ ఇవ్వగా విష్ణుప్రియ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ చెప్పారు. అలాగే తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పారు. రోహిణి దమ్మున్న ప్లేయర్, ప్రేరణ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని గౌతమ్ చెప్పాడు. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ అతడికి దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని అవినాష్ చెప్పాడు . నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని ప్రేరణ, నిఖిల్ చెప్పారు.

Eto Vellipoindi Manasu : మాణిక్యం కొత్త ప్లాన్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -267 లో.....సీతాకాంత్ కావాలని చెయ్ కోసుకొని రామలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటుంది. తన తల్లి చిన్నప్పటి నుండి తనకి ఎంతగా ప్రేమ పంచిందో చెప్తాడు. అంటే మీరు కావాలని ఇలా చేసుకొని నీ తల్లి గురించి నాకు చెప్పాలని ట్రై చేస్తున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు సందీప్ కి శంకర్ ఫోన్ చేస్తాడు. సందీప్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసుకొని సందీప్ బయటకు వస్తాడు. ఇప్పుడు డబ్బులు లేవని సందీప్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో శంకర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏం అంటుండు సందీప్.. నువ్వు ఇప్పుడు ఎంత అన్న కూడా వాడు ఒక్కరూపాయి ఇవ్వలేడు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇరవై కాదు అరవై లక్షలు వస్తాయని మాణిక్యం అనగానే.. అతను సరే అంటాడు. మరోవైపు శ్రీలత , శ్రీవల్లి లు ఏదో ప్లాన్ చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ డల్ గా ఉంటాడు. తన చెయ్యి పట్టుకొని నందిని అడ్వాంటేజ్ తీసుకొవాలనుకుంటుంది కానీ ఆ ఛాన్స్ సీతాకాంత్ ఇవ్వడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి సర్ కి ఫైల్ ఇవ్వు.. సీఈఓ కదా చూస్తాడని నందినితో అంటుంది. రామలక్ష్మి ఏదో సర్దుతుంటే నెక్లెస్ కిందకి పడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. కొన్ని కొన్ని పడిపోకుండా పట్టుకోవాలని సీతాకాంత్ అంటాడు. మీ చేత్తో మీరే నెక్లెస్ పెట్టండి అని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ పెడతాడు. ఆ తర్వాత సందీప్ కి శంకర్ ఫోన్ చేసి.. మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్న అంటాడు. దాంతో సందీప్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Tasty Teja elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. బుగ్గ మీద కిస్ ఇచ్చిన రోహిణి!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లో ఎవరి పర్ఫామెన్స్ ఏంటో చెప్తూ దమ్ము, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటూ అడిగాడు నాగార్జున.  హౌస్ లో బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇవ్వమని చెప్పగా .. నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చారు. అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్‌లో ఉన్నా ఏం సంబంధం లేదని ముందే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్నవాళ్లంతా నిల్చోండి అంటూ నాగార్జున చెప్పగానే అవినాష్-రోహిణి తప్ప మిగిలిన వాళ్లంతా నిల్చున్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెప్పేందుకు స్టేజ్ మీద ఉన్న ప్రింటర్ బటన్ క్లిక్ చేశారు నాగార్జున. అందులో నుంచి టేస్టీ తేజ ఫొటో వచ్చింది. దీంతో తేజ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున అనౌన్స్ చేశాడు. తేజ ఎలిమినేట్ అవ్వగానే కాస్త ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే సార్ ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అంటూ నాగార్జునకి చెప్పి హౌస్‌మేట్స్ అందరికీ బైబై చెప్పాడు. నేను సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌లో మా అమ్మని తీసుకురాలేకపోయా.. కానీ ఈ సీజన్‌లో అది నెరవేర్చా అందుకు చాలా హ్యాపీగా ఉంది.. ఆ తర్వాత మరో రెండు వారాలు ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఆస్వాదించాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. చాలా హ్యాపీగా హౌస్ నుంచి వెళ్తున్నా అంటూ తేజ అన్నాడు.  ఇక తేజ ఎలిమినేట్ కావడంతో అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిణి కూడా బాధపడంది. మిగిలిన వాళ్లందరికీ కూడా హగ్గు ఇచ్చి తేజ గార్డెన్ ఏరియాకి వచ్చేశాడు. ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత టేస్టీ తేజకి రోహిణి బుగ్గ మీద ఓ ముద్దు పెట్టింది. కిస్ ఇచ్చినప్పుడు తేజ తెగ మురిసిపోయాడు. అలానే అవినాష్ కూడా ఓ కిస్ ఇచ్చి బైబై చెప్పేశాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కూడా తేజకి గుడ్ బై చెప్పారు. ఇక వెళ్లేమందు అందరూ బాగా ఆడాలని.. అందరినీ ఫినాలేకి వచ్చి చూస్తానంటూ తేజ చెప్పుకొచ్చాడు. మరోసారి సీజన్-8కి అవకాశమిచ్చి ఇంతవరకూ తీసుకొచ్చిన ఆడియన్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్పాడు.

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. మామకి విడాకుల నోటీసు పంపించిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -581 లో.....కావ్య భోజనం తీసుకొని రావడంతో కావ్యకి టిప్పు ఇస్తుంటాడు రాజ్. నేనేం పరాయి వాళ్లకి భోజనం వండుకొచ్చానా.. నా వాళ్ళకే కదా అని కావ్య తనపై కోప్పడుతుంది. ఇక నుండి మా వాళ్ళకి భోజనం తీసుకొని రావాల్సిన అవసరం ఇక నీకు లేదు. నేనే ఒక చెఫ్ మాట్లాడాను. రేపటి నుండి వస్తుంది తనకి నెలకు లక్ష రూపాయలని రాజ్ చెప్తాడు. రాజ్ ఆ షెఫ్ గురించి గొప్పగా చెప్తుంటే.. అది ఎవతో రానివ్వు దాని వయ్యారం ఏంటో తేలుస్తానని ఇందిరాదేవి అంటుంది.  మరొకవైపు కళ్యాణ్ , అప్పు లు భోజనం చేస్తుంటారు. అప్పు వంక కళ్యాణ్ ప్రేమగా చూస్తుంటే.. ఎందుకు అలా చూస్తున్నావంటూ అడుగుతుంది. అన్నీ వదులుకొని నా కోసం వచ్చావ్.. నా కష్టసుఖాలలో తోడుంటున్నావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ రుద్రాణిలు మాట్లాడుకుంటారు. ఆ కావ్యని ఎన్ని రకాలుగా ఆపాలని చుసినా వస్తూనే ఉందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్యలు భోజనం చేస్తుంటే.. రాజ్ నీక్కూడా కావ్య భోజనం తీసుకొని వచ్చింది. వచ్చి భోజనం చెయ్ అంటాడు. అవసరం లేదని రాజ్ అంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజ్ వచ్చి భోజనం పెట్టుకుంటాడు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వస్తారు. వాళ్ళని చూసి తినడం మానేస్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. వాళ్లేం మాట్లాడుకుంటన్నారని రాజ్ వింటుంటాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రాజ్ ఏర్పాట్లు చేసిన షెఫ్ వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో అమ్మ నీకు విడాకుల నోటిస్ పంపిందని సుభాష్ కి రాజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఇదంతా నీ వళ్లేనే అని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దెయ్యాలను చూడడానికి చంద్రగిరి కోటకు వెళ్లిన గీతూ

గీతూ మోటివేషనల్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక ఇంకా ఫేమస్ అయ్యింది. అలాంటి గీతూ దెయ్యాలు సంబంధించి ఒక విషయం చెప్పింది. చిట్ చాట్ విత్ బిగ్ బాస్ టీం 2 పేరుతో వచ్చిన ఒక చాటింగ్ లో ఈ దెయ్యాల విషయాలను షేర్ చేసుకుంది. " నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకు స్కూల్ లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు దెయ్యాలని చూడాలనిపించింది. కోటలో దెయ్యాలు ఉంటాయని అప్పట్లో ఎవరో చెప్పారు అందుకే చూద్దామనిపించింది. అందుకే 4 గంటల తర్వాత దెయ్యాలుంటాయంట చూసి వెళదాం ఎవరికీ చెప్పొద్దూ మనం అని అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆరోజు రాత్రి 7 గంటల వరకు అక్కడే దెయ్యాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైంకి కోట మొత్తం ఒక్కసారిగా చీకటైపోయింది. చుట్టూ అక్కడ ఎవరూ కూడా లేరు. మాకేమో టెన్షన్ వచ్చేసింది. భయమేసేసింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. నిజంగానే దెయ్యాలు వచ్చేస్తాయేమొ అని భయపడ్డాం. ఫుల్ గా చెమట్లు పట్టేసాయి. ఈలోపు స్కూల్ వాళ్ళు గీతూ గీతూ అని అరుస్తూ పిలిచారు. ఎలాగో భయంతోనే మా వాళ్ళను వెతుక్కుంటూ నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చాము.. అప్పుడు అక్కడున్న వాచ్ మ్యాన్ ని అడిగితే అదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటూ పంపించారు. ఆ దెయ్యాల దెబ్బతో నాకు వారం రోజులు జ్వరం వచ్చేసింది. ఏదో దెయ్యాలను చూద్దామని ట్రై చేయబోయి జ్వరం తెచ్చుకున్నా. అప్పటి నుంచి దెయ్యాల జోలికి పోవడం లేదు. అప్పటి నుంచి దెయ్యాలంటే చాలా భయం నాకు" అని చెప్పింది గీతూ.  

Tasty Teja Elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. కన్నడ బ్యాచ్ కి బయాజ్డ్ బిగ్ బాస్!

  బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఈ సీజన్ లో ప్రతీ వారం తెలుగు కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేషన్ అవుతూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ గతవారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. మరి ఈ వారం లీస్ట్ లో‌ ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడా లేదా అనేది క్యూరియాసిటిగా మారింది. కన్నడ బ్యాచ్ కి బిగ్ బాస్ బయాజ్ గా ఉంటూ వారిని ప్రతీవారం సేవ్ చేస్తూ వస్తున్నాడు. మరి ఈ వారం కూడా వారిని హౌస్ లో ఉంచి టేస్టి తేజని ఎలిమినేట్ చేస్తాడా లేదా అంటు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కమెడీయన్లు చీప్ గా చూసే పృథ్వీ లాంటి వారికి విష్ణుప్రియ సపోర్ట్ గా ఉండటం.. నిఖిల్ బ్యాక్ బిచ్చింగ్ కి మిగిలిన వాళ్ళు తోడవడంతో జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. అవినాష్ ప్రతీ వారం అటు టాస్క్ లలో ఇటు ఎంటర్‌టైన్మెంట్ లో వందకి వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. ‌కానీ బయట జనాలేమో గేమ్ చూడకుండా ఓట్లు వేస్తున్నారు. ‌ముఖ్యంగా విష్ణుప్రియ లాంటి వరెస్ట్ కంటెస్టెంట్ ని ఇంకా ఎందుకు సేవ్ చేస్తూ వస్తున్నారో అర్థం కావడం లేదు.‌ ఇది బిగ్ బాస్ షోనా లేక బయాజ్డ్ షోనా అంటు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో డస్ట్ బిన్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో విష్ణుప్రియ వల్ల కూడా అంతే యూజ్ అని ఒకరు, హౌస్ లో గ్రూప్ గా ఆడే వారికేమో ఓటింగ్ ఉంది. కానీ ఇండివిడ్యువల్ గా ఆడుతూ జెన్యున్ కంటెస్టెంట్స్ కి సరైన ఓటింగ్ లేదు. అయితే గౌతమ్ ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని బయటపెట్టాడు. బిగ్‌ బాస్ ఆదేశాల ప్రకారం హోస్ట్ నాగార్జున కూడా కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని సపోర్ట్ చేశాడు. కానీ అది తప్పు అని ఆడియన్స్ కి తెలుసు. నబీల్ విన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అతడి గేమ్ రోజురోజుకి పడిపోయింది. అయిన సరే ఓటింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే హౌస్ లో గేమ్ ని బట్టి కాకుండా ఫస్ట్ పది వారాల్లో ఆట చూసి ఓటింగ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్లో ఉన్నవారిలో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ డేంజర్ జోన్ లో‌ ఉన్నారు.

Avinash in Finale : ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్ అవినాష్..

  బిగ్ బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ లో టేస్టీ తేజ వాళ్ళ అమ్మ రావడం కోసం యావత్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు అవినాష్ గెలవాలని అందరు ఎదురుచూశారు. అదేవిధంగా తను నామినేషన్ లో నుండి సేవ్ అవ్వాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.. ఆటల్లో , పాటల్లో, కామెడీ చేయడంలో ఎందులోను తగ్గడం లేదు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తమ బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. ఏ గేమ్ పెట్టినా గెలిచే వస్తున్నారు. తమ వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ కసిగా గేమ్ ఆడుతున్నారు. దేనిలో తగ్గడంలేదు. ఎక్కడ రాజీ పడటం లేదు.. ప్రతీ గేమ్ లో కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ ఆడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా టికెట్ టు ఫినాలేకి  నాల్గవ కంటెస్టెంట్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అదేంటంటే.. ఇప్పటికే సెలెక్ట్ అయిన నిఖిల్, అవినాష్, రోహిణిలని .. గౌతమ్, పృథ్వీ, తేజలలో నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు బిగ్ బాస్. దాంతో ముగ్గరు కలిసి ఏకాభిప్రాయంతో తేజని సెలెక్ట్ చేసుకున్నారు. తేజ, అవినాష్, రోహిణి,  నలుగురు కలిసి టికెట్ టు ఫినాలేలో మొదటి టాస్క్ ఆడారు. గంట పట్టు ఫోటో కనిపెట్టు టాస్క్ లో భాగంగా డిస్ ప్లేలో చూపించిన ఫోటోని చూసి అది హౌస్ లో ఏదో చెప్పాలి. ఇందులో తేజ ఒక్క పాయింటే గెలిచి నాల్లో స్థానంంలో ఉండి. టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక నిఖిల్, రోహిణి, అవినాష్ చివరి గేమ్ ఆడారు. ' బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ ' అనే అక్షరాలని యాక్టివిటి ఏరియాలో ఒక టేబుల్ పై అమర్చి ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో స్టాండ్ మీద ఉన్న ఫైనలిస్ట్ అనే పేరు ఉన్న క్యూబిక్స్ ని బాల్స్ సహాయంతో పడేయాలి. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి అటు ఇటు ఊగే స్టాండ్ మీద పెట్టి తాడు సహాయంతో బ్యాలెన్స్ చేయాలి. అలా చేసిన వారే టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఇందులో మొదటగా నిఖిల్ యాక్టివిటి ఏరియాలో సరైన క్రమంలో  పెట్టేసి గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడ క్యూబ్స్ ని పడేసి ఫైనల్ స్టాండ్ దగ్గరికి వచ్చాడు. సెకెంఢ్ అవినాష్ వచ్చాడు‌. కానీ ఊగే స్టాండ్ మీద క్యూబ్స్ ని పెట్టి తాడుతో బ్యాలెన్స్ చేయడంలో అవినాష్ గెలుపొందాడు. నిఖిల్ ఓడిపోయాడు. ఇదిదా సరైన గేమ్ అంటే అంటు నిరూపించాడు అవినాష్. హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉంటే అందులో ఆరుగురు నిఖిల్ కి సపోర్ట్ చేయగా ఒక్క తేజ మాత్రమే అవినాష్ కి సపోర్ట్ ఇచ్చాడు. అయినా సరే అవినాష్ బెస్ట్ ఇచ్చాడు.. గెలిచాడు. కెజిఎఫ్ సినిమాలోని రణరణ ధీర అంటూ సాంగ్ వేసేసరికి అవినాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక శ్రీముఖి చేతుల మీదుగా టికెట్ ను అందుకున్నాడు అవినాష్. ఇక ఆ టికెట్ ని తన భార్య అను ఫోటోకి చూపిస్తూ మురిసిపోయాడు అవినాష్. లవ్ యూ అనూ..‌ఇది నీకే అనూ అంటు తన ఫొటో దగ్గరే పెట్టాడు అవినాష్. ఇది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్ అంటూ అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.  

Sreemukhi Biggboss8: నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు.. ఇంకా రెండు వారాలే ఉంది

  బిగ్ బాస్ సీజన్-8 లో టికెట్ టు ఫినాలే కోసం జరిగిన అన్ని టాస్క్ లలో టాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అవినాష్. ఇక అతను డైరెక్ట్ ఫినాలేకి చేరుకున్నాడు.  నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి హౌస్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఆడించింది. ఇక హౌస్ లో విష్ణుప్రియ చేసే పత్తాపరం గురించి తనకి అర్థమయ్యేలా శ్రీముఖి ఓ పక్కకి తీసుకొని వెళ్ళి మరీ చెప్పింది. " ఇన్ని వారాలు గడిచిపోయింది. ఇక చాలు ఇంకా రెండు వారాలే ఉంది. ఇక పృథ్వీని విడిచిపెట్టు.. నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు. తన గేమ్ తను ఆడతాడు. అసలు నువ్వంటే ఫ్రెండ్ మాత్రమే అని చెప్పినా,  ఇష్టం లేదని అంత క్లారిటీగా ఉన్నా నువ్వు తనతో ఉండటం మానేయ్.. మిగిలిన హౌస్ మేట్స్ తో టైమ్ స్పెండ్ చెయ్ అని శ్రీముఖి అనగానే..తెలుసు కదా నాకు పృథ్వీ అంటే ఎంత కేరింగో అంటూ అదే సోది చెప్పుకొచ్చింది నత్తి బుర్ర విష్ణుప్రియ. హౌస్ లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఆడించడానికి వచ్చిన శ్రీముఖికి బిగ్ బాస్ ఓ స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు. అదేంటంటే.. అమ్మా కళామతల్లి ముద్దుబిడ్డ.. ఇక నీ ఆట నువ్వు ఆడు.. ఇన్ని రోజులు నువ్వు చేసిన పత్తాపారం బాగా సాగింది. మనకి ఫుల్ టీఆర్పీ కూడా వచ్చింది. ఇక హౌస్ లో ఎంటర్‌టైనర్స్ గా ఉన్నా అవినాష్, రోహిణి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటూ ఆడుతూ .. మెగా ఛీఫ్ లు అయ్యారు. నువ్వు ఇంకా ఆ పృథ్వీ చుట్టూ తిరగడం మానేయాలని బిగ్ బాస్ మామ చెప్పాడు. ఇదే స్క్రిప్ట్ ని విష్ణుప్రియని పక్కకి తీసుకొచ్చి మరీ చెప్పింది శ్రీముఖి. ఇక హౌస్ లో ఓ వైపు గేమ్స్ ఆడిస్తూ మరోవైపు వీరిద్దరికి జ్ఞానోపదేశం చేస్తోంది శ్రీముఖి. ఇక చాలు ఎవరి గేమ్ వారు ఆడండి. తనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నువ్వు క్లియర్ గా ఆమెకి చెప్పాలి కదా అంటూ పృథ్వీ అనగానే.. తనకు నేను చెప్పాను. ఫ్రెండ్ వరకే.. నా కోసం నువ్వు నీ గేమ్ ఆడకుండా ఉండకు అని చెప్పానంటూ పృథ్వీ అన్నాడు. విష్ణుప్రియకి వాళ్ళ నాన్న హౌస్ లోకి వచ్చి మరీ చెప్పాడు. మారలేదు.. యాంకర్ రవి చెప్పాడు మారలేదు. విష్వక్సేన్ వచ్చి చెప్పాడు మారలేదు. మానస్ చెప్పాడు మారలేదు. పునర్నవి చెప్పింది మారలేదు. ఇంకా తను మారదు అని తెలిసినా బిగ్ బాస్ మామ మాత్రం తనని సేవ్ చేస్తూ వస్తున్నాడు. టాప్-2 కి తీసుకొచ్చి విష్ణుప్రియకి సెకెంఢ్ ఇచ్చి నిఖిల్, గౌతమ్, నబీల్ లలో ఎవరికో ఒకరిని విన్నర్ చేసేలా ప్లాన్ చేసినట్టున్నాడు బిగ్ బాస్.