విష్ణుప్రియ ఫీలింగ్స్...పృథ్వీ అంటే వ్యామోహం, క్రష్..

  బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరంటే ఠక్కున విష్ణుప్రియ అని చెప్పేస్తారు. సండే రోజు ఎలిమినేషన్ అయిన విష్ణుప్రియ.. బజ్ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది. నేను ఎవర్నైనా ఇష్టపడితే బంగారంలా చూసుకుంటా. నాకు ఎవరైనా నచ్చారంటే ఇలాగే చూసుకుంటా. నాకు పృథ్వీ అనే వ్యక్తి చాలా నచ్చేశాడు. ఫ్రెండ్ కంటే ఎక్కువ. ధైర్యంగా ఈ మాట చెప్తున్నా.. అతను నాకు నచ్చాడు.. నాకు నచ్చితే ఇలాగే ఉంటా. ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటే అతనంటే నాకు వ్యామోహం, క్రష్. ఫ్రెండ్ కంటే ఎక్కువ.. లవర్ కంటే తక్కువ అని కూడా చెప్పలేను. నా హృదయానికి దగ్గరైన పర్సన్ పృథ్వీ. అతనంటే నాకు ఎంత ఇష్టం అంటే.. బయటకు వచ్చిన తరువాత పృథ్వీ గురించి పూర్తిగా తెలుసుకుని మేం ఇద్దరం కలిసి జర్నీ చేసి.. అన్నీ కుదిరితే ప్రేమిద్దామని అనుకున్నాను. అది అవ్వదని క్లారిటీ ఉంది. ఎందుకంటే.. అతనికి నా పర్సనాలిటీ ఇష్టం లేదు. వేరే పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. నాక్కూడా వేరే పర్సనాలిటీ ఉన్న అబ్బాయిలంటే ఇష్టం కానీ.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత పృథ్వీ నచ్చాడు. ఆ ఎడారిలో నా హీరో అంటే పృథ్వీనే. అతనిలో ఏది నచ్చిందంటే సర్వం ఇష్టమే. అతనికి నేనంటే ఇష్టం లేదని అన్నాడు. కానీ.. నాకు నచ్చాడంతే. అతనికి నచ్చానా లేదా అన్నది కాదు.. నాకు నచ్చితే నేను ఇలాగే ఉంటా. అతన్ని కూడా అడిగాను.. నీకు నచ్చేట్టుగా నేను ఏమైనా మార్చుకోవాలా? అని. నీకు నీ మీద క్లారిటీ ఉంటే ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు.  కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకోమన్నప్పుడు.. ఎవరెవరో సాంగ్ పాడినప్పటి నుంచి నాకు అతనిపై వ్యామోహం కలిగింది. ఇలాంటి వాడితో బయటకు వెళ్లిన తరువాత డేట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కానీ అతనికి నాలాంటి అమ్మాయి ఇష్టం లేదని. నాక్కూడా అలాంటి అబ్బాయి సెట్ కాడని క్లారిటీ ఉంది. కానీ ఆ వ్యక్తిని ఆస్వాదించి.. ఆ వ్యక్తితో అన్ని మూమెంట్స్ టైం స్పెండ్ చేయగలనో అన్నీ చేయాలనే క్రష్ ఉంది.  అతనికి ముద్దులు పెట్టానంటే.. నాకు తెలిసిన విష్ణు ప్రియ అందరికీ ముద్దులు పెడుతుంది. ఓవర్ అయ్యిందని అయితే నేను అనుకోను. అతను వద్దంటున్నా.. నేను కావాలని వెళ్తున్నట్టు అనిపించిందేమో. కానీ నేను ఫోర్స్ ఫుల్ చేయలేదు. రాత్రి పూట తను ఏడుస్తున్నాడని రెండుసార్లు ముద్దులుపెట్టాడు. తను వెరీ కిస్సీ.. వెరీ హగ్గీ పర్సన్. అందుకే ముద్దులు పెట్టా’ అంటూ నిస్సిగ్గుగా ఏ మాత్రం సిగ్గులేకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏవిధంగా అయితే దిగజారి ప్రవర్తించిందో.. బిగ్ బాస్ బయటకు వచ్చిన తరువాత కూడా తాను ఇలాగే ఉండబోతున్నానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది విష్ణు ప్రియ. ఏమాటకామాటే కానీ.. విష్ణు ప్రియ మాత్రం మిగతావాళ్లలా లోపల ఒకటి బయటకు మరొకటి మాట్లాడదు. లోపల ఏమున్నా ఇదిగో ఇలా సిగ్గులేకుండా కక్కేస్తుంటుంది.  

నిఖిల్ ని ఇరికించేసిన ప్రభాకర్.. అవినాష్ కామెడీతో ఫుల్ ఫన్!

  బిగ్‌బాస్ సీజన్-8 నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా ముందుగా అర్జున్ కళ్యాణ్- అనుమిత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ కొత్త సీరియల్ 'నువ్వుంటే నా జతగా' ప్రమోషన్స్ కోసం ఈ జంట హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఇక వీళ్లిద్దరినీ హౌస్‌మేట్స్ ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా హీరోయిన్‌తో అవినాష్ గట్టిగానే పులిహోర కలిపాడు. ఇక వీళ్ల సీరియల్ కథ గురించి కాసేపు ముచ్చట్లు పెట్టారు. అలానే హౌస్ విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక 'మా' పరివారం Vs బీబీ పరివారం మధ్య ఈ వారం జరిగే టాస్కుల్లో గెలిచి విన్నర్ ప్రైజ్ మనీని పెంచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా రూ.12489 రూపాయల టాస్కు ఒకటి పెట్టారు. ఇక ఈ టాస్కులో బీబీ పరివారం (హౌస్‌మేట్స్) గెలిస్తే ఆ 12వేల చిల్లర ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయని.. లేకపోతే కట్ అవుతాయంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో ప్రేరణ-నబీల్‌తో ఆడతామంటూ అర్జున్ కళ్యాణ్ జోడీ డిసైడ్ అయింది. తీరా టాస్కు ఏంటంటే ఒకరు డ్రమ్‌లో పడుకొని ఉంటే వేరొకరి దొర్లించుకొని వేరే ఎండ్‌కి తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న విలువైన వస్తువులను వాళ్లు పట్టుకొని మళ్లీ ఇటువైపు దొర్లించాలి. ఇలా ఎక్కువ విలువైన వస్తువులను ఎవరు తీసుకొస్తారో వాళ్లు విన్. ఇక ఈ టాస్కు కోసం కొత్త సీరియల్ హీరోయిన్ డ్రమ్‌లో పడుకుంది. అసలే అలవాటు లేని ఆటేమో ఒకసారి దొర్లించేసరికి దెబ్బకి బయటికొచ్చేసింది. ఇక ఈ గేమ్ అయ్యేసరికి కళ్లు తేలేసింది హీరోయిన్. ఈ టాస్కులో బీబీ పరివారం గెలిచి ప్రైజ్ మనీకి రూ.12 వేల చిల్లర యాడ్ చేసింది. అర్జున్ కళ్యాణ్ జోడీ వెళ్లిపోయిన తర్వాత అవినాష్ సరదాగా అందరూ దాగుడుమూతలు ఆడదామంటూ ప్లాన్ చేశాడు. దీంతో అందరూ దాక్కోగా అవినాష్ పట్టుకోవడానికి తిరిగాడు. ఇక మొత్తానికి అందర్నీ పట్టేసుకోవడంతో మొదట ఔట్ అయిన నబీల్ ఈసారి మిగిలిన వాళ్లని పట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి దొరక్కూడదని అందరూ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నారు. దీంతో ఎవరూ కనిపించక నబీల్ చాలాసేపు వెతుక్కున్నాడు. చివరికి ఒక్కొక్కరూ బయటికి రాగా నబీల్ ఔట్ చేశాడు. కానీ అవినాష్ బయటికి వద్దామంటే డోర్ లాక్ చేసి ఇరికించేశాడు బిగ్‌బాస్. ఏంట్రా ఇలా లాక్ చేశాడనుకొని అవినాష్ చాలా సేపు తలుపు తీయమని కెమెరాకి చెప్పుకున్నాడు. కానీ బిగ్‌బాస్ డోర్ మాత్రం తీయలేదు. పైగా లైట్స్ ఆపేసి, వింత వింత సౌండ్స్ చేసి గట్టిగానే అవినాష్‌ని భయపెట్టాడు. ముందు కాసేపు అవినాష్ కూడా కామెడీ చేసినా ఆ తర్వాత మాత్రం లోపల వస్తువులన్నీ గలగలలాడపోయాయ్. బిగ్‌బాస్ హార్రర్ సినిమా ఎఫెక్ట్స్ అన్నీ చూపించి అవినాష్‌ని భయపెట్టేశాడు. ఈ దెబ్బకి దండం పెట్టేసి ఇంకెప్పుడు ప్రాంక్‌లు చేయనంటూ అవినాష్ వేడుకున్నాడు. ఇక ఇదంతా టీవీలో చూసి తెగ నవ్వుకున్నారు హౌస్‌మేట్స్.  కాసేపటికి ప్రభాకర్, ఆమని కలిసి తమ టీవీ సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు' ప్రమోషన్స్ కోసం వచ్చారు. నిఖిల్‌తో మాట్లాడుతూ చెప్పు తమ్ముడు ప్రేమ పెళ్లా లేక అరెంజ్‌డ్ మ్యారేజా.. అంటూ ప్రభాకర్ అడిగితే లవ్ మ్యారేజ్‌యే ఇష్టమన్నా.. అంటూ నిఖిల్ సమాధానమిచ్చాడు. ఎందుకు.. అంటూ ప్రభాకర్ అడిగారు. దీనికి ఇష్టమంటే ఇష్టం దానికి రీజన్ అంటే ఏం లేదు.. ఇప్పుడు లవ్ అంటే ఆ పర్సన్‌తో మనం ట్రావెల్ చేస్తాం.. అర్థం చేసుకునే ఓ ఇది ఉంటుంది.. ఆల్రెడీ మనకి తెలుసు.. అందుకనే అంటూ నిఖిల్ చెప్పాడు. మరి పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదా అని ప్రభాకర్ అడిగితే నేను ప్రేమ పెళ్లి అయిన ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటానంటూ నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా అందరు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.  

తొలిరోజు ఓటింగ్ లో గౌతమ్ ప్రభంజనం.. చివరి స్థానంలో అవినాష్!

బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి చేరుకుంది. హౌస్ లో అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌ ఈ ఐదుగురు ఫినాలేకి చేశారు. వచ్చే ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్-8 విజేతను ప్రకటించడానికి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేయగా.. శుక్రవారం అర్థరాత్రితో విన్నర్‌ని తేల్చే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. ఈవారమే బిగ్ బాస్ ఓట్లు వేయడానికి చివరి వారం కావడంతో ఓట్లు భారీగా పడుతున్నాయి. తొలొరోజు ఓటింగ్ లో మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అయ్యింది. ఆ ఇద్దరే నిఖిల్, గౌతమ్. తొలిరోజు ఓటింగ్‌లో ఈ ఇద్దరూ.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే.. అన్ అఫీషియల్ పోల్స్‌లో మాత్రం.. నిఖిల్-గౌతమ్‌ ఇద్దరూ హోరా హోరీగా ఓటింగ్ సాధిస్తున్నారు. కొన్ని పోల్స్‌లో నిఖిల్ ముందుంటే.. మరికొన్ని పోల్స్‌లో గౌతమ్ ముందున్నాడు. మొత్తం ఓటింగ్‌లో 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుండటంతో.. మిగిలిన ముగ్గురూ రేస్‌లో నామమాత్రంగానే ఉన్నారు. నిఖిల్, గౌతమ్‌ల మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఏ పోల్ చూసినా కూడా.. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో విన్నర్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ప్రతి సీజన్‌లోనూ టాప్ 5 ఫైనలిస్ట్‌ల ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తరువాత.. తొలిరోజు ఓటింగ్ చూస్తే విన్నర్ ఎవరనేది క్లారిటీ వచ్చేసేది. కానీ.. గౌతమ్, నిఖిల్‌లు ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ జరగడంతో ఈ ఇద్దరు తొలిరోజు ఫైట్‌లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. తాజా పోల్స్ చూస్తే.. గౌతమ్ 37 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే.. నిఖిల్ 33 శాతం ఓట్లు సాధించాడు. ప్రేరణ 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే.. నబీల్ 11 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక అవినాష్ కేవలం 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు.  

బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న బ్రహ్మముడి కావ్య.. క్లూ ఇచ్చేసిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ కి ఉండే క్రేజే వేరు. అందులో కావ్య పాత్ర అందరికి సుపరిచితమే. అయితే కావ్య అసలు పేరు దీపిక రంగరాజు. తను  బ్రహ్మముడి సీరియల్ లో తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నటిస్తుంది.  తాజాగా కావ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మై డియర్ ఫ్రెండ్స్.. బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది.. హింట్ ఆల్‌రెడీ ఇచ్చాను.. గెస్ చేయండి చూద్దామంటూ కావ్య పోస్ట్ పెట్టింది. అయితే ఇది ఏమై ఉంటుందా అని కావ్య ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే కావ్య పెట్టిన పోస్ట్‌లో 'బిగ్' అనే పదాన్ని హైలెట్ చేసింది. అలానే ఆ క్యాప్షన్ చివరిలో కన్ను సింబల్ పెట్టింది. దీంతో తను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నానంటూ చెప్పకనే చెప్పిందన్నమాట. నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమతి హౌస్‌లోకి వచ్చి టాప్-5కి టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ రోజు ఎపిసోడ్‌లోనే బ్రహ్మముడి కావ్య.. అదేనండి దీపిక రంగరాజు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. సెలబ్రెటీ ఎంట్రీలో భాగంగా దీపిక హౌస్‌లోకి వచ్చి ఫైనలిస్టులతో ఓ ఆట ఆడబోతుంది. మాములుగానే దీపిక యమ ఫాస్ట్. ఇలా బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ అంటే ఏ రేంజ్ లో ఆడుతుందో  ఊహకి కూడా అందదు. స్టార్ మా పరివార్ షోలో దీపిక పంచులు ఇప్పటికి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ బ్రహ్మముడి కావ్య ఏ రేంజ్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందో చూడాలి మరి.  

Illu illalu pillalu : చెంచలమ్మ చెప్పిందని అలా చేసి‌న రామరాజు.. తన కొడుకుని చూస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -24 లో.....సాగర్, ధీరజ్ లు నర్మదా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక అక్కడే ఉన్న ప్రేమ.. వీళ్ళేదో చేస్తున్నారని భావించి అదేంటో కనిపెట్టాలి అనుకుంటుంది. కానీ తన ఫ్రెండ్స్ వెళదామనడంతో ప్రేమ వెళ్ళిపోతుంది. మరొకవైపు నర్మదని తీసుకొని సాగర్, ధీరజ్ లు వెళ్ళిపోతారు. మరొకవైపు రామరాజు ఇంటికి వస్తాడు. వేదవతికి సాగర్ కి పెళ్లి సంబంధమంటూ ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాడు. అమ్మాయి బాగుందని వేదవతి అంటుంది. మరొకవైపు చెంచలమ్మ తన ఊళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంటుంది. సాగర్, ధీరజ్ లు ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నామని బాధపడుతుంటే.. ధీరజ్ కి కోపం వచ్చి కార్ ఆపుతాడు. ఇక మీరు పెళ్లి చేసుకోకండి అని ధీరజ్ అనగా.. వాళ్లు బాధ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్లు వెళ్తుంటే అప్పుడే అటుగా రామరాజు వెళ్తుంటాడు. అదే సమయంలో రామరాజుకి ఫోన్ వస్తుంది. చెంచలమ్మ రామరాజుకి ఫోన్ చేసి బియ్యం కావాలని అంటుంది. సాగర్, ధీరజ్ నర్మద ఉన్న కార్ ముందు ఉండి రామరాజు ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడ వాళ్ళని చూస్తాడోనని భయపడతారు కానీ చూడడు. ఆ తర్వాత ధీరజ్ వాళ్లకి పెళ్లి చెయ్యడానికి పక్క ఊరు గుడికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి ధీరజ్ ఫ్రెండ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తారు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్ పెళ్లి జరిగే దగ్గరికి చెంచలమ్మకి బియ్యం తీసుకొని వస్తాడు రామరాజు. అతడిని సాగర్ వాళ్లు చూసి టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కోడలిని నమ్మించే పనిలో సవతి తల్లి.. ఆమె కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -274 లో..... సీతాకాంత్ ఆస్తి పేపర్స్ శ్రీలతకి ఇస్తుండగా.. అప్పుడే పేపర్స్ మంటలో పడిపోతాయ్. దాంతో అందరు షాక్ అవుతారు. అప్పుడే ఒకతను వచ్చి గుడిలో తప్పు జరుగుతుంటే ఎలా చూస్తూ ఉంటాడు. ఆ దేవుడు అందుకే ఇలా ఆ ఆస్తులు తన పేరున ఉంటే తను ఉండదని అతను అనగానే.. మా అమ్మకి ఏం కాకూడదు. ఆస్తులు ఎప్పటికి తన పేరున రాయనని సీతాకాంత్ అంటాడు. దాంతో శ్రీవల్లి, సందీప్ లు షాక్ అవుతారు. ఆ తర్వాత శ్రీలతతో.. శ్రీవల్లి, సందీప్ లు మాట్లాడతారు. ఏంటి అత్తయ్య అలా మారిపోయారని శ్రీవల్లి అనగానే.. అమ్మ నేను తప్పు చేసాను.. ఆ సిచువేషన్ డబ్బు కావాలా అమ్మ కావాలా అన్నప్పుడు డబ్బు అన్నాను.. ఒకవేళ నేను అలా అనకుంటే నీ గురించి కూడా తెలిసేదని అందుకే అలా చెప్పానని సందీప్ అంటాడు. ఆ తర్వాత నేను ఎందుకు మారిపోయాను.. మారిపోలేదు అలా నటించానని శ్రీలత అనగానే.. సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లతో మంచిగా ఉంటూనే వాళ్ళని మోసం చెయ్యాలని శ్రీలత అంటుంది. మరొకవైపు సీతాకాంత్ తన గదిని అందంగా డెకరేషన్ చేస్తాడు. రామలక్ష్మి రాగానే తన ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసి తనకి దగ్గర అవుతాడు. మరుసటి రోజు ఉదయం శ్రీలత పూజ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అత్తయ్య మీరు పూజ చేసారా అని ఆశ్చర్యపడుతుంది. తను మారిపోయిందని రామలక్ష్మిని నమ్మిస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అవుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వెళ్లి తనని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: కార్తిక్ కోసం ప్రేమగా వండిన దీప.. పరుగులు పెట్టించిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-223లో.. మీతో నేను గెలవలేకపోతున్నాను కార్తీక్ బాబు.. నేను ఆలోచించేది రెండు కుటుంబాలు కలవాలని. మీరు, మీ అమ్మగారు బాధపడకూడదని.. కానీ మీరు నా మాటే వినడం లేదని అని మనసులో అనుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయతో కలిసి కాంచన ప్లాన్ వేస్తుంది. దీప ఆలోచనలు వదిలేసి మామూలుగా అవ్వాలంటే వంట చేయించాలి.. కార్తీక్ ఇష్టాలు తెలుసుకునేలా చెయ్యాలని. అనుకున్నట్లే దీపను పిలిచి.. ఈరోజు కార్తీక్‌కి ఏమి ఇష్టమో అదే చెయ్.. వాడికి ఏమిష్టమో వాడినే అడిగి తెలుసుకోమని దీపకి చెప్తుంది కాంచన. దాంతో దీప కార్తీక్ గదికి వెళ్తుంది.  అప్పటికి కార్తీక్, శౌర్యతో వైకుంఠపాళి ఆడుతుంటాడు. ఏం వండమంటారని కార్తీక్‌ని దీప అడుగగా..గుత్తివంకాయ కూర ఇష్టమని కార్తీక్ చెప్పడంతో అదే వండుతానంటుంది. అయితే ఆమె అడగటం, అతడు చెప్పడం అంతా కాంచన, అనసూయలు చాటుగా చూస్తారు. దీపా నువ్వు నా ఇష్టాల గురించి తెలుసుకుంటున్నావంటే.. నీ మనసు మారుతుంది. త్వరలోనే నువ్వు పూర్తిగా మారితే నా జీవితం నవవసంతంగా మారుతుంది.. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా దీపా అని తనలో తానే మురిసిపోతాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న అందంగా రెడీ అవుతుంది. తలకు తగిలిన గాయానికి కూడా మేకప్ వేసుకుని.. కవర్ చేసేస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఎక్కడికి నేను కూడా వస్తాననగా.. జ్యోత్స్న వద్దని చెప్తుంది. అసలు ఆ రోజు సైదులు గాడ్ని చంపేటప్పుడు వారసురాల్ని ఏం చేశాడో వివరంగా తెలుసుకోవాలి కదా అంటూ పారిజాతాన్ని జ్యోత్స్న తిడుతుంది. ఏంటే నిన్న కూడా ఇదే విషయం గురించి తిట్టావ్.. ఎంతకు అంత భయపడుతున్నావ్.. వారసురాలు రాదు. దొరకదు.. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావంటూ గట్టిగానే పారిజాతం అడుగుతుంది. ఏం లేదులే  అంటూ మాట మార్చేస్తుంది జ్యోత్స్న. ఇక ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావని జ్యోత్స్నని పారిజాతం అడిగితే.. ఇప్పటి దాకా జరిగింది ఓ లెక్కా.. ఇక మీదట జరిగేదే అసలు లెక్క.. నేను చూపించేది టీజర్ కాదు.. సినిమా రిలీజ్ కాబోతుంది. వెయిట్ అండ్ సీ అనేసి జ్యోత్స్న వివరంగా చెప్పకుండానే ఆఫీస్‌కి వెళ్తుంది. కార్తీక్ ఇంటికి కాశీ, స్వప్నలు వస్తారు. దీప వంట చేస్తూ ఉంటే హాల్లో అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీప వచ్చి.. కార్తీక్ బాబు మీకిష్టమైన గుత్తివంకాయ కూర రెడీ అంటుంది. కార్తీక్, కాంచనలు చెప్పడంతో తినడానికి కాశీ, స్వప్నలు కూడా కూర్చుంటారు. దీప కూడా కూర్చుని అందరికీ వడ్డిస్తూ తింటూ ఉంటుంది. నాకు ఈ కూర చాలా ఇష్టం.. బాగా లాగిస్తానని సంబరంగా అన్నం పెట్టించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ మోగుతుంది. తినేటప్పుడు ఫోన్ ఎందుకురా అని కాంచన, స్వప్న ఇద్దరూ కార్తీక్‌తో అంటారు కానీ వినకుండా లిఫ్ట్ చేస్తాడు. హలో ప్రభాకర్ చెప్పమని అంటాడు కార్తీక్. మేడమ్ గారు అర్జెంట్‌గా ఆఫీస్‌కి రమ్మంటున్నారు సర్ అని అంటాడు. ఆ క్యాబిన్‌లో జ్యోత్స్న కూర్చుని పొగరుగా ప్రభాకర్ ఫోన్‌లో కార్తీక్ మాటలు వింటూనే ఉంటుంది. నాకు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు.. రావడానికి టైమ్ పడుతుందని చెప్పమని కార్తీక్ అనగా.. వెంటనే ప్రభాకర్.. జ్యో వైపు చూస్తాడు. నో.. ఇప్పుడే రమ్మని చెప్పమని ప్రభాకర్‌కి సైగ చేస్తుంది జ్యోత్స్న. సారీ సర్ మేడమ్ గారు మిమ్మల్ని అర్జెంట్‌గా రమ్మంటున్నారు. మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయిన మేడమే మీ ఇంటికి వస్తారట అని అంటాడు. అంత అర్జెంటా అని కార్తీక్ అనగా... వెంటనే జ్యోత్స్న వైపు తిరుగుతాడు. అవునన్నట్లుగా తలాడిస్తుంది జ్యోత్స్న. అవును సర్.. మేడమ్ గారికి ఏమని చెప్పమంటారని ప్రభాకర్ అంటాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: వంటగదిలో పడుకున్న కోడలు.. కావ్యపై రాజ్ లో మానవత్వం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-588 లో.. ధాన్యలక్ష్మి ఆస్తిని వాటాలు చేయమనడంతో సుభాష్ పంచేద్దామని అంటాడు. ఇక ఇందిరాదేవి అందరిని తిట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి కోసం కావ్య ప్లేట్ లో అన్నం తీసుకెళ్తుండగా.. అపర్ణ చూసి అత్తయ్య కోసమా అని అడుగుతుంది. అవునని చెప్తూ తన  గదికి ఇద్దరు వెళ్ళగా అక్కడ ఇందిరాదేవి ఉండదు. ఇక ఇల్లంతా చూస్తారు. ఇక అపర్ణ కంగారుపడుతుంటే‌‌.. అమ్మమ్మ గారు ఎక్కడికెళ్ళారో నాకు తెలుసంటు హాస్పిటల్ కి వెళ్తుంది కావ్య. కోమాలో ఉన్న సీతారామయ్య ముందు ఇందిరాదేవీ కన్నీళ్లు పెట్టుకుంటు.. చూశావా బావా ఏం జరుగుతుందో.. మహా వృక్షం లాంటి నువ్వు మంచాన్న పడ్డాక.. అందరి నోళ్లు లెగుస్తున్నాయంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక అది గమనించి కళ్యాణ్.. లోపలికి వచ్చి ఇందిరాదేవిని పలకరించి ఓదార్చే పనిలో పడతాడు. ఇంతలో అపర్ణాదేవికి క్యారేజ్ పట్టుకుని వస్తుంది కావ్య. బతిమలాడి, బుజ్జిగించి చాలా సేపు సర్దిచెబుతుంది కావ్య. ఇక తను వినకపోవడంతో.. కవిగారు తాతయ్యగారి బెడ్ పక్కనే మరో బెడ్ ఏర్పాటు చేయండని కావ్య కోపంగా అంటుంది. అదేంటి వదినా అని కళ్యాణ్ అనగా.. అమ్మమ్మగారు చూడండి తాతయ్యగారు పక్కనే మరో బెడ్ వేయించి అక్కడ నేను పడుకుంటాను.. ఇక చూడండి మీరు రెండు రెండు సార్లు ఏడవాల్సి ఉంటుందంటూ ఇందిరాదేవిని నవ్వించే ప్రయత్నం చేసి.. తర్వాత తినిపించి.. ఇందిరా దేవిని ఇంటికి పదమంటుంది. ఇందిరాదేవి ఆసుపత్రి నుంచి బయలుదేర్తుంది. ఇక ఆ తర్వాత కవి, కళావతి మంచి చెడు మాట్లాడుకోవడం హైలైట్‌గా నిలిచింది. కవిగారు.. తాతయ్యగారు పరిస్థితి గురించి డాక్టర్స్‌తో మాట్లాడారా అని కావ్య అడుగగా.. మాట్లాడాను వదిన అంటాడు కళ్యాణ్.  అడిగాను వదినా.. ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు. తాతయ్యగారు కోమాలోంచి బయటికి వచ్చాకే ట్రీట్‌మెంట్ చేస్తారట.. అంత వరకూ అలా ఉండాల్సిందేనంటున్నారని కళ్యాణ్ అంటాడు. చాలా బాధగా ఉంది కవిగారు.. నిస్సహాయస్థితిలో అమ్మమ్మగారిని చూడలేపోతున్నానని కావ్య అంటుంది కావ్య. మాటల మధ్యలోనే అప్పూకి పోలీస్ జాబ్ వచ్చిందని, ట్రైనింగ్‌కి పంపించానని, తాతయ్యగారి ఆరోగ్య పరిస్థితి గురించి చెబితే ఆగిపోతుందని చెప్పలేదంటూ నిజం చెబుతాడు కళ్యాణ్. మంచి పని చేశారు కవిగారని కావ్య అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మి, ప్రకాష్ మాట్లాడుకుంటారు. మన కళ్యాణ్ కోసం డాక్యుమెంట్స్ సిద్ధం చేయించాను.. మావయ్యగారి పరిస్థితి చూస్తే రేపో మాపో అన్నట్లు ఉంది కదా.. ముందు జాగ్రత్తగా అత్తయ్యతో మాట్లాడతానని ధాన్యలక్ష్మి అనగానే.. తనని ప్రకాష్ తిడతాడు.  ఆ తర్వాత డాక్యుమెంట్స్ లాక్కుని చింపి పడేస్తాడు. ఆ తర్వాత కావ్య వంటగదిలో నేలమీద పడుకుంటుంది. అప్పుడే అపర్ణ చూస్తుంది. రాజ్‌ ని పిలిచి అపర్ణ ఫైర్ అవుతుంది. ఎందుకు ఉంది అంటే పంపించేద్దాం అంటావా.. తెలివిగా మాట్లాడుతున్నావా రాజ్.. ఈ ఇంటికి నీ భార్య తిరిగి వచ్చింది ఆ విషయం తెలుసా నీకు అని అపర్ణ అనగా.. కళ్లెదురుగా కనిపిస్తూ ఉంది కదా రాజ్ అంటాడు. కనిపిస్తే ఇంత రాత్రి అయిన నీ గదికి రాకపోతే ఎక్కడికి వెళ్లింది ఎందుకు వెళ్లిందని అడగాల్సిన అవసరం లేదా అని అపర్ణ అడుగగా.. ఎవరిని అడగాలి..  ఆమెను నేను రమ్మనలేదు. వస్తే పొమ్మనలేదని రాజ్ అంటాడు. కావ్య నేల మీద పడుకుంది తెలుసా అని కిందకు చూపిస్తుంది. ఇక్కడ పడుకుందా? అని రాజ్ షాక్ అయ్యి ఆవేశంగా కావ్యవైపు చూస్తూ.. హేయ్ అంత మానవత్వం లేని మనుషులు ఏమైనా ఉన్నారనుకున్నావా.. ఈ ఇంట్లో.. అరే వంటింట్లో నేల మీద పడుకోమని ఎవరు చెప్పారు నీకు  అని రాజ్ కోపంగా అంటాడు. మరి ఎక్కడుండాలని అపర్ణ అంటుంది. ఎక్కడ అంటే మరి అది.. హా.. అది అంటూ రాజ్ నసుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జానీ మాస్టర్‌ పై డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ వేటు ...

  టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ముందస్తు  సమాచారం ఇవ్వకుండా డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఐతే దేనికి అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసిందే. అసోసియేషన్ నుంచి తొలగించినట్లు జానీ మాస్టర్‌‌పై ఒక ప్రచారం జరుగుతోంది. ఐతే  తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ అంటున్నారు. శంకర్ పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని ఆ విషయంలో  కోట్ల రూపాయలు స్కామ్ చేశారని అంటున్నారు అలాగే డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డానంటూ చేస్తున్న ప్రచారం పైన కూడా తానూ ప్రశ్నిస్తున్నందుకు తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంలో ఫైట్ చేస్తానని చెప్తున్నారు జానీ మాస్టర్. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై రీసెంట్ గానే విడుదల అయ్యారు. ఐతే ఇప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ఎన్నికయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఈ పదవి కేవలం 11 నెలలు మాత్రమే వుంటుంది..

Vishnupriya Remuneration: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ సండే రోజు ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి పన్నెండవ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ.. హౌస్ లో ఒక్క టాస్క్ కూడా సరిగ్గా ఆడింది లేదు. గెలిచింది లేదు. ఎంతసేపు పృథ్వీతో కలిసి తిరగడమే సరిపోయింది‌  ఇక ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ రన్నరప్ అని, తను విన్నర్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిన విష్ణుప్రియ.. బజ్ ఇంటర్వ్యూలో కూడా పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి నోరు విప్పింది. హౌస్‌లో 3 నెలలకు పైగా ఉన్న విష్ణుప్రియ.. ఇందుకు గానూ రోజుకి రూ. 57,142, వారానికి 4 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది‌. అలా 99 రోజులకు గానూ విష్ణుప్రియ సుమారు 57 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే విష్ణుప్రియ అందుకుందని చెప్పవచ్చు. సాధారణంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ లభించింది. ఒక్క సీజన్‌లో మాత్రమే ప్రస్తుతం రూ. 54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. దీనిని బట్టి చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే అధికంగా ఉందని తెలుస్తోంది. పద్నాలుగు వారాలు పృథ్వీతో కలసి టైమ్ పాస్ చేసిన విష్ణుప్రియ.. నిన్నటి సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయినందుకు ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్-8 కి పట్టిన దరిద్రం పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Vishnupriya Buzz: తల్లి ప్రమాణంగా నేను అలా చెప్పలేదు: విష్ణుప్రియ!

  బిగ్ బాస్ సీజన్-8 లో శనివారం నాటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేషన్ అయ్యింది. ఇక సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది విష్ణుప్రియ. పద్నాలుగు వారాలు హౌస్ లో ఏం చేశావని యాంకర్ అడుగగా.. డైమండ్స్ ఆర్ మేడ్ ఇన్ ప్రెజర్ అన్నారంటూ విష్ణుప్రియ అంది. వహ్.. ఈ కొటేషన్ ఆటో వెనకాల రాస్కోమని యాంకర్ అన్నాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటి? అందరు తెలుసుకోవాలనుకుంటున్నారని యాంకర్ అడుగగా.. కొంచెం ఇన్ ఫాక్చువేషన్.. కొంచెం క్రష్ అని విష్ణుప్రియ అంది. క్రష్ అంటే అని యాంకర్ అనగా.‌ క్రష్ చేద్దామని అనుకున్నానంటూ విష్ణుప్రియ అంది. పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు.. ' పృథ్వీని కన్నందుకు థాంక్స్' అని చెప్పావ్ కానీ ఆమె నిన్ను కూతురులాగా చూసిందని యాంకర్ అనగా.. పెళ్ళి తర్వాత ఎవరైనా కూతురులాగే చూసుకుంటారు కదా అని విష్ణుప్రియ అంది.  ఏదన్న ఒక్క టాస్క్ చెప్పు బెస్ట్ ఇచ్చానని యాంకర్ అనగా‌‌.. బస్తాల టాస్క్ ఆడాను కదా అని విష్ణుప్రియ అంది. అందరు కలిసి ఆడిన ఆట గురించి కాదు.. నువ్వు ఆడింది చెప్పమని యాంకర్ అనగా.. బిత్తెరపోయింది విష్ణుప్రియ. బజ్ లోకి వచ్చిన సీత, హరితేజ మాకొక మాట చెప్పారని యాంకర్ అనగా.. తల్లి ప్రమాణంగా నేను అలా అనలేదంటూ విష్ణుప్రియ అంది. అసలు ఆ మాటేంటి? విష్ణుప్రియ గురించి సీత, హరితేజ చెప్పిన విషయమేంటో తెలియాలంటే బజ్ ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.  

Vishnupriya Elimination: నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్.. కానీ ఆ విజన్ రాంగ్!

  బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా నిఖిల్‌ని సెకండ్ ఫైనలిస్ట్‌గా నాగార్జున ప్రకటించాడు. దాంతో నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్, ప్రేరణలు ఫైనలిస్ట్‌లు అయిపోయారు. అయితే ఇక చివరిగా మిగిలిన నబీల్- విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరగింది. నబీల్ చివరి ఫైనలిస్ట్ అయ్యాడని విష్ణుప్రియ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. విష్ణు ఎలిమినేట్ అయిన తర్వాత ఏమాత్రం ఎమోషనల్ అవ్వలేదు. నేను అడిగిన ఓట్ అప్పీల్‌కి ఓట్లన్నీ ఆపేసినట్లున్నారు.. జనాలంటూ జోకులేసుకుంటూ బయటికొచ్చేసింది. ఇక వచ్చేముందు విష్ణుప్రియకి హగ్గు ఇచ్చి గౌతమ్ ఓ మాట చెప్పాడు. బయటికొచ్చాక కలుద్దాం.. నేనేంటో అర్థం కాలేదన్నావ్ కదా.. నన్ను బాగా అర్థం చేసుకుందువు గానీ అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి వామ్మో నాకు అంత టైమ్ లేదు అంటూ విష్ణు అంది. దీంతో నా గురించి తెలియాలంటే మీ చెల్లిని అడుగమన్నాడు గౌతమ్. ఇక స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యింది విష్ణుప్రియ. విష్ణు వెళ్లేముందు స్టేజ్‌పై సూర్య మండలం ఫొటో పెట్టించారు నాగార్జున. సూర్యడు విన్నర్ ట్రోఫీ అనుకుంటే దానికి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ల ఫొటోలు ఆ గ్రహం మీద పెట్టు అంటూ నాగ్ టాస్క్ ఇచ్చారు. దీంతో ట్రోఫీకి దూరంగా ఉన్న గ్రహంపై గౌతమ్ ఫొటో పెట్టింది విష్ణు. ఇప్పటికీ నీ ఆట ఏంటో నాకు తెలీదు.. ఇంటికెళ్లాక ఎపిసోడ్స్ అన్నీ చూస్తా.. నువ్వు ఏం ఆడావో చూస్తానంటూ గౌతమ్‌తో అంది విష్ణు. ఇక ఆ తర్వాత నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అంటూ అవినాష్‌కి 4వ ప్లేస్ ఇచ్చింది విష్ణుప్రియ. తర్వాత నా తమ్ముడు నబీల్‌కి మూడో ప్లేస్ అని, ప్రేరణ విన్ అవుతుందని నేను అనుకుంటున్నా.. ఈ సీజన్ ఒక అమ్మాయి విన్ అవ్వాలని నాకు కోరికగా ఉంది.. కానీ ప్రస్తుతానికి నా గట్స్ తనని సెకెండ్ ప్లేస్‌లో పెట్టమంటున్నాయంటూ ప్రేరణకి విన్నర్ ట్రోఫీకి దగ్గరగా సెకెండ్ ప్లేస్‌లో పెట్టింది. ఇక నిఖిల్ గురించి చెబుతూ.. నాకు ఫస్ట్ వచ్చిన విజన్ నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్.. కానీ ఆ విజన్ రాంగ్.. విన్నర్‌కి క్లోజ్‌గా ఉన్నది నిఖిల్ అంటూ చెప్పింది విష్ణుప్రియ. ఇప్పటివరకూ ఈ పిచ్చి పిల్లని నత్తి బుర్ర ఉన్న నన్ను.. 14 వారాలు భరించి ఓట్లేసి ఇంత దూరం వరకూ తీసుకొచ్చినందుకు మీకు  స్పెషల్ థాంక్స్ అంటూ ఆడియన్స్ కి బైబై చెప్పేసింది విష్ణుప్రియ.  

నాకు ప్రైజ్ మనీ వస్తే గంగవ్వకి పది లక్షలు ఇస్తాను.. నాగార్జున ముందు గౌతమ్ ప్రామిస్!

  బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌లో అందమా అందమా అంటూ రొమాంటిక్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఇక వచ్చీ రాగానే హౌస్‌మేట్స్ అందరినీ 'ప్రైజ్ మనీ ఎంత' అంటూ కొశ్చన్ చేశారు. దీనికి రూ.54 లక్షల 30 వేలు అంటూ అందరూ చెప్పారు. అయితే అది ఫిక్స్ కాదు.. యాడ్ అవ్వొచ్చు తగ్గొచ్చు.. ఒకరు ఈరోజు వెళ్లిపోతారు.. మిగిలిన టాప్-5 ఎలా ఆడతారో దాన్ని బట్టే ప్రైజ్ మనీ టోటల్ ఫిక్స్ అవుతుందంటూ నాగార్జున చెప్పాడు. ఇక అది కాకుండా ముందుగా చెప్పినట్లు ఓ కారు కూడా ఫిక్స్ అంటూ నాగార్జున చెప్పారు. ప్రైజ్ మనీ మీకు వస్తే ఏం చేస్తారనేది ఒక్కొక్కరు చెప్పాలంటూ నాగార్జున అడుగగా.. ముందుగా అవినాష్ నిల్చొని తానే విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తాడో చెప్పాడు.ఈ ప్రైజ్ మనీతో మా అన్నయ్య కూతురు పెళ్లి చేద్దామనుకుంటున్నా.. అన్నకి ముగ్గురు కూతుళ్లు.. పెద్దమ్మాయ్ పెళ్లి చేద్దామనుకుంటున్నానంటూ అవినాష్ చెప్పాడు. మరి రోహిణికి కారు కొనేసి ఇస్తా అని మాట ఇచ్చావ్ కదా అంటూ నాగార్జున అన్నాడు. అవును సర్ అది కూడా కొంటా అంటూ అవినాష్ అన్నాడు. ఇక ప్రేరణ అయితే.. నా పేరెంట్స్‌కి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా.. హౌస్ లోన్, కారు లోన్ అన్నీ.. మిగిలినవి ఇన్వెస్ట్ చేస్తా సార్.. అంటూ చెప్పింది. నబీల్ లేచి నా కల సినిమా.. నాకు తోచిన డబ్బుతో సినిమా తీసుకుంటా.. మంచి సినిమా తీస్తా సార్.. కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తానంటూ సమాధానమిచ్చాడు. ఇక విష్ణుని అడగ్గా.. మణిబాబుకి (మణికంఠ) నానో కారు.. అభయ్‌కి ఫారెన్ టూర్.. గంగవ్వకి ఐదు లక్షలు.. ఇలా అందరికి కొంచెం కొంచెం పంచేస్తా.. అలా ప్రైజ్ మనీలో 70 పర్సంట్ అందరికి ఇచ్చేస్తా.. పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. నిఖిల్‌కి ప్లాటినమ్ ఇయర్ రింగ్స్.. ప్రేరణకి డైమండ్ నెక్లెస్.. అవినాష్‌కి తాడులు అంటూ పెద్ద లిస్టే చెప్పింది విష్ణుప్రియ. ఇదంతా విని నాగార్జున  ఆశ్చర్యపోయాడు‌.  నిఖిల్ అయితే నేనే విన్నర్ అయితే ప్రైజ్ మనీతో అప్పులు తీర్చేస్తా సర్.. అలానే ఇప్పటివరకూ మాకు సొంతిల్లు లేదు .. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. కనుక అమ్మ వాళ్లకి ఇల్లు కట్టిస్తానంటూ నిఖిల్ చెప్పాడు. చివరిగా గౌతమ్‌ని అడగ్గా లాస్ట్ సీజన్‌లో కూడా చెప్పా సర్.. అమ్మ రిటైర్ అవుతున్నారని.. కనుక తనకి సేవింగ్స్‌లా ఉండాలని ఇందులో 50 పర్సంట్ అమ్మకి ఉపయోగిస్తా.. ఇక రూ.10 లక్షలు గంగవ్వకి ఇస్తా.. వాళ్ల కూతురికి ఇల్లు కట్టాలని గంగవ్వ కోరిక.. కనుక ఆ ఇంటి కోసం వాడుకునేందుకు ఆమెకి ఇస్తానంటూ గౌతమ్ చెప్పాడు. ఇది విని నాగార్జున ఆశ్చర్యపోయాడు‌.  

Rohini Remuneration : బిగ్ బాస్ లో రోహిణి రెమ్యునరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్‌ సీజన్-8 లో లేడీ కంటెస్టెంట్స్ లలో మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే రోహిణి అని చెప్పేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీలని ఓడించి మెగా చీఫ్ అయింది రోహిణి. (Bigg Boss Rohini) వైల్డ్ కార్ట్ గా ఎంట్రీ ఇచ్చింది రోహిణి. తను ఎంటర్‌టైన్ చేస్తూ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రోహిణి కమెడియన్ కాదంటు ప్రతీ టాస్క్ లో ఆడపులిలా ఆడింది. దాదాపుగా విన్నర్ గెలుచుకునేంత అభిమానాన్ని అందుకున్న ఈ రౌడీ రోహిణి.. అక్టోబర్ 6న బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అలా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో 9 వారాలు (63 రోజులు, 2 నెలలకుపైగా) రోహిణి ఉంది. అయితే, ఈ సీజన్‌లో పాల్గొనేందుకు రోహిణి వారానికి రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇలా చూస్తే 9 వారాలకు బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా రోహిణి రూ. 18 లక్షల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అయితే, 2 లక్షలు మాత్రమే కాకుండా రోహిణి బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్-8లో  తొమ్మిది వారాలున్న రోహిణి మొత్తంగా ముప్పై ఆరు(36)లక్షలు సంపాదించిందని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో లేడీ కంటెస్టెంట్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. ఇంతకు ముందు.. ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వస్తుంటే మాత్రం రోహిణిలా ఆడాలి అనేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆమె శరీరాన్ని చూసి హేళనగా నవ్వారు. ఇదేం ఆడుతుందంటూ జీరోని చేశారు. కామెడీ తప్ప ఏమీ లేదంటూ చులకన చేసి మాట్లాడారు. కానీ వాళ్లే చివరికి సలామ్ కొట్టేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది రోహిణి. ఇప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన వాళ్ళకి కూడా ఈ స్థాయిలో గుర్తింపు రాలేదు. 

గీతూ రాయల్ కి బిగ్ బాస్ ట్రోఫీ.. నాగార్జున ఇచ్చే ట్రోఫీ ఒక్క ఎపిసోడ్ కే అంటూ కామెంట్స్!

  గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ గా గేమ్ బాగా ఆడింది. అన్ని రకాల టాస్కులు ఆడింది. గీతూ ఆట తీరు చూసి తానే ఫైనల్ విన్నర్ అనుకున్నారు అంతా  కానీ అనూహ్యంగా ఎలిమినేట్ ఐపోయి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాలేదు సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. అలాంటి టైములో ఒక రోజు ఆమె కోసం ఒక అభిమాని వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్లారని గీతుకి వాళ్ళ అమ్మ చెప్పింది. ఐతే ఆ గిఫ్ట్ ని అలాగే ఆ ఇచ్చిన వారి చేతులతోనే ఓపెన్ చేయించి తీసుకోవాలని  అలాగే ఉంచుకుందట. ఐతే రీసెంట్ గా ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు గీతూ ఇంటికి వచ్చారు. వాళ్ళను చూసాకా గీతూ అల్తాఫ్ అంటూ పేరు చెప్పి గుర్తు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లింది.    ఐతే బిగ్ బాస్ ఎలిమినేట్ ఐన టైములో ఇచ్చిన గిఫ్ట్ ని ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పి దాన్ని తెచ్చి తన అభిమానితో ఓపెన్ చేయించి ఏమిటా అని చూసింది. తీరా చూస్తే అది బిగ్ బాస్ ట్రోఫీ.. అచ్చంగా అలాగే ఉండేసరికి ఎగిరి గంతులేసినంత పని చేసింది. ఆ ట్రోఫీని అభిమాని చేతుల మీదగా అందుకుంటూ "నాగార్జున గారు ఇచ్చే ట్రోఫీ ఒక్క ఎపిసోడ్ కి..అభిమాని ఇచ్చే ట్రోఫీ జీవితం జీవితానికి" అంటూ తనివితీరా ఆ బిగ్ బాస్ ట్రోఫీని చూసి మురిసిపోయింది. ఇక ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి "ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేము.." అంటూ తన అభిమానికి థ్యాంక్స్ చెప్పింది. ఇక గీతూ మోటివేషనల్ వీడియోస్ చేస్తూ అలాగే బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.  

త్వరలో మీ అందరికి బిగ్ సర్ప్రైజ్ అంటున్న సిరి - శ్రీహాన్

  శ్రీహాన్ - సిరి హన్మంత్ అంటే బుల్లితెర మీద తెలియని వారంటూ ఎవరూ లేరు. యూట్యూబ్‌, షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు.  బిగ్‌బిస్ సీజ‌న్ 5లో సిరి, సీజ‌న్ 6లో శ్రీహాన్‌ పార్టిసిపేట్ చేశారు. ఐతే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు వచ్చినంత గుర్తింపు  వెళ్లి వచ్చాక తగ్గిందనే చెప్పాలి.  వీళ్ళు రియల్ లైఫ్ లో లవర్స్ గా ఉన్నారు. ఐతే ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్ళెప్పుడు అని అడిగితే మాత్రం దాటేస్తూ ఉంటారు. ఐతే వీళ్ళు అసలెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ఆస‌క్తి చాలా మందిలో ఉంది. ఐతే  త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చారు.  అలాగే వీళ్ళు పెళ్లికాక ముందేనుంచే  ఒక బాబును కూడా పెంచుకుంటున్నారు. చూస్తే వీళ్లకు ఎప్పుడో పెళ్ళైపోయి ఒక బాబు ఉన్నాడేమో అనుకుంటారు. కానీ కాదు. ఇక ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ తాజాగా.. ఒక అనౌన్స్మెంట్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పారు.    "సో గైస్..ఇంతటితో మీ అందరి వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం.. వైజాగ్‌లో జరగబోయే ఒక సర్ప్రైజ్ గురించి చెప్పే  సమయం దాదాపు వచ్చేసింది! అదేంటో  కొద్ది రోజుల్లోనే మేము రివీల్ చేయబోతున్నాం.. అప్పటి వరకు వేచి ఉండండి .." అంటూ పోస్ట్ పెట్టారు.    ఐతే వీళ్ళ పెళ్లి విషయం చెప్పబోతున్నారా..లేదంటే ఏదైనా మూవీ న్యూస్ చెప్పబోతున్నారు..ఏదైనా షోలో చేస్తున్నారా..దాని గురించి చెప్పాలనుకుంటున్నారా.. అనేదే ఇప్పుడు సస్పెన్స్. ఇంతకు వాళ్ళు ఎం రివీల్ చేస్తారో కొద్దీ రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఐతే ప్రియాంక జైన్, సుష్మ కిరణ్, కీర్తి భట్ వాళ్ళు కూడా  వెయిటింగ్ , కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పెట్టడాన్ని బట్టి చూస్తుంటే నిజంగా పెళ్ళేనేమో అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.  

వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ కాదు.. కప్ గెలిచినంత హై ఫీల్ ఉంది : రోహిణి

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేషన్ అయ్యింది. తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయిన రోహిణి.. అవినాష్, ప్రేరణ, గౌతమ్ లని హీరో లిస్ట్ లో పెట్టింది.  విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ లని విలన్ లిస్ట్ లో పెట్టేసింది. ఇక హౌస్ నుండి బయటకొచ్చాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. నిజంగా నీ పర్ఫామెన్స్ కి హ్యాట్సాఫ్ రోహిణి అని అంబటి అర్జున్ అనగా థాంక్స్ అని రోహిణి అంది. సీజన్-3 కి ఈ సీజన్ లో మీ పర్ఫామెన్స్  ఎలా ఉందని అనుకుంటున్నారంటూ యాంకర్ అడుగగా.. చాలా సాటిస్ఫై ఉంది. ఇన్ని వీక్స్ చాలా బాగా ఆడాననే ప్రౌడ్ మూమెంట్ అయితే ఉందని రోహిణి అంది. నువ్వు అసలు ఆడలేవంటూ చాలా మాటలన్నారని యాంకర్ అడుగగా.. చాలా హర్టింగ్ అనిపించిందని రోహిణి అంది‌. పృథ్వీ మీదే ఆడి గెలవడమేది మీరు ఎలా ఫీల్ అయ్యారని యాంకర్ అడుగగా.. ఆ ఫీలింగ్  కప్పు గెలిచినంత ఆనందం రాదేమో.. ఆ  ఒక్క మూమెంట్ కి ఐ వాజ్ టూ హై అని రోహిణి అంది. ఓట్ అప్పీల్ చేసుకుంటే మీరు ఈ వారం సేవ్ అయ్యేవారా అని యాంకర్ అనగా.. అలా అని ఏం అనుకోనని రోహిణి అంది. విష్ణు మీద నీ అభిప్రాయం ఏంటి? విష్ణుప్రియ, పృథ్వీల గురించి ఏం అనుకుంటున్నారని యాంకర్ అనగా.. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకొని ఉంటున్నారు కానీ వారి మధ్య కనెక్షన్ ఉందని రోహిణి అంది‌. నిఖిల్, పృథ్వీ, యష్మీలది గ్రూప్ గేమా అని యాంకర్ అడుగగా. గ్రూప్ గేమ్ అని అనను.. కానీ ఫ్రెండ్స్ అని రోహిణి అంది. నామినేషన్ లో ఒక్కసారి కూడా అవినాష్, తేజలని నామినేట్ చేయలేదు ఎందుకని యాంకర్ అడుగగా.. వాళ్ళు నాకు క్లోజ్ కాబట్టి చిన్న చిన్న తప్పులు కూడా పెద్దగా అనిపించలేదని రోహిణి అంది. అంత పెద్ద మిస్టేక్ చేసినట్టుగా కూడా ఎక్కడా లేదు. గౌతమ్ నిజంగానే సోలో బాయ్ ఆ అని యాంకర్ అనగా‌‌.. కొన్నిసార్లు ఎందుకో మాతో కలిసి ఉండడని అనిపిస్తుందంటూ రోహిణి చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో రోహిణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 

ఫుడ్ రివెంజ్ అంటే ఏంటో తెలుసా..?

  నిజంగా ఫుడ్ రివెంజ్ అనేది కొత్త మాట. రివెంజ్ అంటేనే ప్రతీకారం కదా. మరి అలాంటి ఫుడ్ మనుషుల మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనుకుంటున్నారు కదా. తీర్చుకుంటుంది. అదేంటో చూద్దాం.    బ్రహ్మముడి కావ్య తెలుసు కదా మీ అందరికీ. చాలా చబ్బీగా బుగ్గల బూరెలతో అందంగా, క్యూట్ గా ఉంటుంది. అలాంటి కావ్య అలియాస్ దీపికా రంగరాజు ఒక కొత్త కాన్సెప్ట్ ని కనిపెట్టింది. రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి అలియాస్ షర్మిత ఫుడ్ ని తెచ్చుకుని తింటూ వాటర్ తాగుతూ ఉన్న వీడియో అది.    ఇక కావ్య ఆమె పక్కకు వెళ్లి "షర్మిత అక్కా మీరొక్కరే  ఇంత ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. ఐనా కూడా మీరు ఎలా ఇలా సన్నగా ఉన్నారు..మన ఆడియన్స్ కి చెప్పండి" అని అడిగింది. దాంతో షర్మిత "ముందు నువ్వు దిష్టి పెట్టొద్దు" అని షర్మిత అనేసరికి "సరే సన్నగా ఉండడానికి సీక్రెట్ చెప్పు  అని అడిగింది. " ఐతే ముందు నేను ఫుడ్ వేస్ట్ చేయను..అలాగే జెనెటికల్లీ ఎంత తిన్నా సన్నగానే ఉంటా..హైదరాబాద్ నుంచి బెంగుళూరు..బెంగుళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటా " అని చెప్పింది.    దాంతో కావ్య కూడా "నేను చెన్నై నుంచి హైదరాబాద్..హైదరాబాద్ తో చెన్నై వెళ్తున్నా..వర్కౌట్స్ చేస్తున్నా..జిమ్ చేస్తున్నా...ఐనా చబ్బీగానే ఉంటున్నా. ఐతే ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఉంటె ఫుడ్ మన మీద రివెంజ్ తీర్చుకోకుండా వెయిట్ లాస్ లో ఉంచేలా చూస్తుంది. నేను ఫుడ్ ని ఎక్కువగా వేస్ట్ చేస్తున్న కాబట్టి ఎక్కువగా నా మీద రివెంజ్ తీర్చుకుంటూ నన్ను బాగా చబ్బీగా, వెయిట్ గెయిన్ చేసేస్తోంది. ఫుడ్ ని లైట్ గా స్మెల్ చేస్తేనే నేను చబ్బీ ఐపోతున్నా. అందుకే నేను ఫుడ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నాం ..." అంటూ కామెడీ చేస్తూ బైబై చెప్పేసింది.    ఇక నెటిజన్స్ ఐతే "కావ్య నువ్వు చబ్బీ గానే బాగుంటావు..ఇలాంటి బ్రిలియంట్ థాట్స్ అసలు నీకు ఎలా వస్తాయి" అని కామెంట్స్ చేస్తున్నారు.  

బిగ్ బాస్ 9 కి రీతూ చౌదరి.. అందుకేనా ఈ శారీ అందాలు!

  రీతూ చౌదరి బుల్లితెర మీదే కాదు సోషల్ మీడియాని హీట్ పుట్టించడంలో కూడా ముందుంటుంది. జబర్దస్త్‌తో పేరు తెచ్చుకున్న లేడీ  కమెడియన్స్ లిస్టులో రీతూ కూడా ఒకటి. జబర్దస్త్‌ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది. తర్వాత కవర్ సాంగ్స్ చేసింది. సోషల్ మీడియాలో అందాలతో రచ్చ అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అలాగే యాంకర్ గా కూడా రీతుకి మంచి పేరుంది. రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో కలిసి చేసిన స్కిట్స్, కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.  ఐతే ఈ మధ్య కాలంలో రీతూ ఇంకా అందాల జాతరతో ఆడియన్స్ మనసులను కొల్లగొడుతోంది. ఐతే ఇదంతా బిగ్ బాస్ కోసమేనేమో అంటూ కొంతమంది అంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో... ఎంతగా, ఎవరు హైప్ అవుతారో, ఎంతలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారో అలాంటి వాళ్లకు బిగ్ బాస్ రెడ్ కార్పెట్ వేస్తుందని మనకి తెలుసు.   ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ సీజన్ కి నిజానికి రీతూ చౌదరిని తీసుకుంటారు అనుకున్నారు కానీ బాడ్ లక్ ఆమెకు అవకాశం రాలేదు. ఐతే ఇప్పుడు అందాల డోస్ పెంచడంతో పాటు రకరకాల ఫోజుల్లో కనిపిస్తోంది..రకరకాల చీరలు , డ్రెస్సుల్లో వీడియో షూట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఇక ఈమె వీడియో పోస్ట్ చేసిందంటే చాలు ఫైర్ ఎమోజిస్ తప్ప వేరే ఏవీ కనిపించవు. ఇక ఇప్పుడు అలాంటి శారీ వీడియో పెట్టి కళ్ళజోడు పెట్టి మరీ ఫోజిచ్చేసరికి ఒక నెటిజన్  "నువ్వు బిగ్ బాస్ 9 కి కచ్చితంగా వెళ్తావు...అంటే ఇంకో నెటిజన్ ఐతే హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎలాగో రీతూ మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి రాబోయే బిగ్ బాస్ 9 లో తీసుకుంటారేమో చూడాలి.