బెజవాడ బేబక్కకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే 17వ ఫ్లోర్ నుంచి కిందపడి...

బిగ్‌బాస్ సీజన్ 7లో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఫన్ ని బాగా మిస్సయ్యారు. దాంతో బిగ్ బాస్ సీజన్ 8 లో బెజవాడ బేబక్కను దించారు. ఇక ఆమె తన మాటలతో, కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఆమె ఎం మాట్లాడినా అందులో వెటకారం బాగా ఉంటుంది. ఐతే ఆమె ఉండేది బెజవాడలో. అక్కడ ఎక్కువగా బేబమ్మలు, బేబక్కలు ఎక్కువ కాబట్టి వాళ్లకి కనెక్ట్ కావడం కోసమే బెజవాడ బేబక్కగా మారిందని బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చింది. అలాంటి బేబక్క ఇప్పుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి మరీ తానే చెప్పుకుంది. తన డ్రెస్ మొత్తానికి అంటిన సిమెంట్ ని మట్టిని చూపిస్తూ ఒక వీడియో చేసింది.  "మరి మాములుగా ఉండదండి మనతో. 17 వ ఫ్లోర్ లో పడిపోయాను. అక్కడ సిమెంట్ అంతా వేశారు. దాంతో నేను చూసుకోలేదు.. ఇంకొంచెం ఉంటే.. స్లిప్ అయ్యి 17 వ ఫ్లోర్ నుంచి కింద పడి డమేల్ అయ్యేదాన్ని. రేపటి నుంచి ఎవరు చేస్తారు మీకు వీడియోస్ చెప్పండి. కన్స్ట్రక్షన్ పేరు చెప్పను.. ఎందుకంటే వాళ్ళ తప్పు లేదు. బై ఫ్రెండ్స్ ..నేను బానే ఉన్నా" అంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇక తన యోగక్షేమాన్ని చెప్పాక నెటిజన్స్ "అట్లా ఎందుకు మాట్లాడుతారు మీరు ? మంచిగా ఉండాలి ఎప్పుడూ...మీరు సేఫ్ గా ఉన్నారు కదా." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బెజవాడ బేబక్కగా యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈమె అసలు పేరు మధు నెక్కంటి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈమెకు స్వయానా పెద్దనాన్న. బెజవాడ బేబక్క అమ్మ గారి అక్కనే రాఘవేంద్రరావు వివాహం చేసకున్నారు. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, ఆ తర్వాత అక్కడే కొన్ని షోస్ కి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే  మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా బేబక్క తనలోని టాలెంట్ మొత్తం చూపించింది. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్‌‌లో పలు సాంగ్స్ పాడింది. నరేష్-పవిత్ర లోకేష్ చేసిన 'మళ్లీపెళ్లి' సహా 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

ప్రేమించిన అమ్మాయితో కొడుకు జంప్.. నాన్న ఏం చేస్తాడు..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -23 లో......నర్మదని తీసుకొని వెళ్ళడానికి సాగర్, ధీరజ్ లు నర్మద ఇంటి ముందు వెయిట్ చేస్తుంటారు. అప్పుడే నర్మద పేరెంట్స్ తనని షాపింగ్ కి తీసుకొని వెళ్తారు. దాంతో మమ్మల్ని ఫాలో అవ్వండి అంటూ సాగర్ కి  నర్మద మెసేజ్ చేస్తుంది.. మరొకవైపు వేదవతి తన తమ్ముడు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎందుకో అల్లుల్లు ఇద్దరు తేడాగా ఉన్నారని అనగానే ఎందుకని వేదవతి అంటుంది. చిన్నోడికి కాలేజీ లో ప్రోగ్రాం ఉంటే.. నడిపోడు ఎందుకు బావ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్లు ఏదో చేయబోతున్నరని అతను అనగానే.. అలా ఏదైనా చేస్తే కుటుంబంలో గొడవలు అవుతాయని వేదవతి టెన్షన్ పడుతుంది. మరొక వైపు నర్మద వాళ్ల కుటుంబంతో కలిసి జ్యువలరీ షాపింగ్ కి వెళ్తారు. వాళ్ళ వెనకాలే సాగర్, ధీరజ్ లు వెళ్తారు. నర్మదకి  జ్యువలరీ తన పేరెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడికి ప్రేమ వస్తుంది. ధీరజ్ సాగర్ లని చూసి మీరేంటి ఇక్కడ అని వాళ్ళతో డౌట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేస్తారు. తాళిని నా దగ్గర ఉంచుకుంటానని నర్మద తాళి తీసుకుంటుంది. ఆ తర్వాతనే సాగర్ ని ఫోన్ చెయ్యమని నర్మద మెసేజ్ చేస్తుంది. సాగర్ ఫోన్ చెయ్యగానే లిఫ్ట్ చేసి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక ఆఫీస్ ల వర్క్ ఉంది.. మీరు వెళ్ళండి నేను వస్తానని నర్మద తన పేరెంట్స్ కి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ తన ఫ్రెండ్స్ అందరు జ్యూస్ తాగుతారు. వాళ్ళ దగ్గరే సాగర్, ధీరజ్ లు ఉంటారు. వీళ్ళు వెళ్లాక మనం నర్మదని తీసుకొని వెళదాం.. లేదంటే దీనికి డౌట్ వస్తుందని ధీరజ్ అంటాడు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్ లు నర్మదని  తీసుకొని వెళ్తుంటే రామరాజు కన్పిస్తాడు. ఏదో ఫోన్ మాట్లాడతాడు. వాళ్ళని ఎక్కడ చూస్తాడోనని భయపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నువ్వే కావాలి హీరోతో సీరియల్ నటి పెళ్లి!

టాలీవుడ్ లో పెళ్లిళ్ల జాతర జరుగుతోంది. రీసెంట్ గా నటుడు సుబ్బరాజు, హీరో అక్కినేని నాగ చైతన్య వంటి వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. ఇక ఇప్పుడు సింగర్ సాయి కిరణ్ కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఈయన  ఒకప్పటి టాలీవుడ్  సింగర్ రామకృష్ణ తనయుడు. ఆయన 'నువ్వేకావాలి' సినిమాలో నటించాడు. అలాగే ఆ సినిమాలోని  "అనగనగా ఆకాశం ఉంది" అనే పాట పాడి యూత్ ని మస్మోరైజ్ చేసిన నటుడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రేమించు, దేవి, మనసుంటే చాలు, ఎంత బావుందో, డార్లింగ్ డార్లింగ్  సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి సీరియల్స్ నటిస్తూ మెప్పిస్తున్నాడు.  ఇక సాయి కిరణ్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్, సోషల్ మీడియాలో సాయికిరణ్ కి మంచి హైప్ తెచ్చిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది "గుప్పెడంత మనసు" సీరియల్ . ఇందులో మహేంద్రగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సీరియ‌ల్స్ ఆర్టిస్టుల్లో ఇప్పుడు టాప్ యాక్ట‌ర్స్‌లో ఎవరైనా ఉన్నారు అంటే అది సాయికిర‌ణ్ మాత్రమే. గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు మౌన‌రాగం, ఇంటిగుట్టు, అభిలాష‌, కోయిల‌మ్మ‌, శివ‌లీల‌లు, వెంక‌టేశ్వ‌ర వైభ‌వంతో పాటు ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ సీరియ‌ల్స్‌లో సాయికిర‌ణ్ న‌టించాడు. కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించాడు. ప్రస్తుతం పడమటి సంధ్య రాగం అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలా వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు సాయి కిరణ్. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైములో రెండో  వివాహం చేసుకున్నాడు. అది కూడా చాలా సింపుల్ గా జరిగిపోయింది. కోయిలమ్మ సీరియల్ లో వదిన రోల్ లో చేసిన స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు.  మొదటి భార్య వైష్ణవితో మ్యూచువల్ డివోర్స్ తీసుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు తన సహనటిని పెళ్లి చేసుకున్నాడు.  తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. సాయి కిరణ్ ని పెళ్లి చేసుకున్న స్ర‌వంతి.. క‌ళ్యాణం క‌మ‌నీయం, నాగ‌పంచ‌మితో పాటు ప‌లు సీరియ‌ల్స్ నటించింది. కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో నటిస్తున్నప్పుడే సాయికిర‌ణ్, స్ర‌వంతి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడి  ప్రేమ‌గా మారినట్లు తెలుస్తోంది. సాయి కిరణ్.. గోపి, స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ, న‌క్ష‌త్రంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు కానీ అంతగా క్లిక్ కాలేదు. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే సాయికిరణ్ కి ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రోహిణి.. హౌస్ లో హీరో ఎవరు? విలన్ ఎవరు?

నువ్వు విన్నర్‌లా వెళ్తున్నావమ్మా.. ఇవి హోస్ట్ నాగార్జున అన్న మాటలు.. ఫస్ట్ టైమ్ నాగార్జున నోటి వెంట ఓ లేడి కంటెస్టెంట్ కి ఇంత అప్రిష్యేషన్ రావడం.. రోహిణి ఎలిమినేట్ అయ్యి వస్తుంటే హౌస్ లోని వాళ్ళంతా నిల్చొని సలాం చేయడం ఏదైతే ఉందో.. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేషన్ అయ్యింది. ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. రోహిణి ఓడలేదు.. గెలిచింది.. విన్నర్ అయ్యిందని చెప్పడానికి తన ఆటే సాక్ష్యం. ఎలిమినేషన్ అయ్యాక స్టేజ్ మీదకి వచ్చిన రోహిణి.. తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యింది. అది చూసి.. విన్నర్ లా వెళ్తున్నావమ్మా అని నాగార్జున అనగా.. అవును సర్.. ట్రోఫీ ఒక్కటే రాలేదు.. మిగతాది అంతా గెలుచుకున్నాను.. నేను విన్నర్ అయ్యానంటూ రోహిణి భావోద్వేగానికి గురయ్యింది రోహిణి. ఆ తర్వాత హౌస్ లో హీరో ఎవరు? విలన్ ఎవరో చెప్పమంటూ నాగార్జున టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో నాకు బాగా కనెక్ట్ అయ్యింది అవినాష్. వైల్డ్ కార్డ్ గా వచ్చిన వారిలో నువ్వు అందరికంటే ఎక్కువగా ఆడావ్.. ప్రతీ దాన్లో నీ బెస్ట్ ఇచ్చావ్.. నువ్వు హీరో.. ఫైనల్ వీక్ కూడా బాగా ఆడు.. ఫైనలిస్ట్ కూడా అయ్యావ్.. కంగ్రాట్స్ అంటు అవినాష్ ని హీరోగా పెట్టింది రోహిణి.  ఆ తర్వాత గౌతమ్ ని హీరోగా పెట్టింది రోహిణి. ఫస్ట్ వీక్ ఏ బకెట్ తంతావని అనుకున్నాం కానీ బకెట్ దాకా ఎందుకు పోయానని.. ఆ తర్వాత వీక్ నుండి నువ్వు ఆడిన విధానం, తీరు హ్యాట్సాఫ్. సోలో సోలో అంటూనే ఫైనల్ కి వచ్చేశావ్.. సోలోగా ఉండకు.. అందరితో మాట్లాడమని గౌతమ్ తో రోహిణి అంటూ తనని హీరో లిస్ట్ లో పెట్టేసింది. ఆ తర్వాత ప్రేరణని హీరో లిస్ట్ లో పెడుతూ.. యూ ఆర్ ఏ హీరో.. బాయ్స్ తో పోటీపడి ఆడి గెలిచావని, లాస్ట్ వీక్ అయితే టూ మచ్ గా ఆడావని రోహిణి అనగా.. లవ్ యూ రోహిణి అని ప్రేరణ అంది‌.  విష్ణు చిన్న చిన్న మాటలు జోక్ అని అనుకుంటావ్. అవి అవతలి వాళ్ళకి హర్ట్ అవుతాయి చూసుకోమంటూ విష్ణుప్రియకి విలన్ లిస్ట్ లో పెట్టేసింది రోహిణి. నబీల్ యూ ఆర్ ఏ ఫైటర్.. ఎవరో తెలియని అబ్బాయి వచ్చి ఇంత బజ్ క్రియేట్ చేయడమనేది చిన్న విషయం కాదు. మనం గెలవాలి.. ఎలా గెలవాలనేది కూడా ఆలోచించుకోవాలి. జాగ్రత్తగా స్టెప్స్ వేసుకొని ఫైనల్ కి వెళ్లమంటూ నబీల్ తో రోహిణి అంది. తనని విలన్ లిస్ట్ లో పెట్టేసింది. నిఖిల్.. టాస్క్ ల వైజ్ అసలు ఆలోచించవ్ కానీ ఇంట్లోకి వచ్చాక బాగా ఆలోచిస్తావ్.. అసలు నువ్వు హీరో అంటూ నిఖిల్ ని విలన్ లిస్ట్ లో పెట్టేసింది రోహిణి‌. 

Karthika Deepam 2 : జ్యోత్స్న గ్రిప్ లోకి శివన్నారాయణ‌.. ఇక కార్తీక్, దీపలకి కష్టాలే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -222 లో.. జ్యోత్స్న త్వరగా కోలుకుంటుందని శివన్నారాయణ‌ స్వార్థంగా అలోచించి.. కార్తీక్ కాంచనలని తన ఇంటికి రమ్మని అడుగుతాడు. దీప, శౌర్యలని వద్దని అంటాడు. నా భార్య దీప, నా కూతురు శౌర్య అని దీప భుజంపై చెయ్యి వేసి మాట్లాడతాడు కార్తీక్. వాళ్ళను వదిలి పెట్టి రానని కార్తీక్ అనగానే.. దాంతో శివన్నారాయణ కోప్పడతాడు. నేను ఒక మెట్టు దిగి వచ్చాను.. అలా అని ఇలా పొగరుగా మాట్లాడుతున్నావని అంటాడు.    నువ్వేమంటావని శివన్నారాయణ కాంచనని అడుగగా.. నా కోడలు వాళ్లు వస్తేనే వస్తానంటుంది. అవసరమైతే మీరే మా ఇంటికి రండి అనగానే.. దీపపై శివన్నారాయణ కోప్పడతాడు. ఇంకొకసారి ఇక్కడికి రానని వెళ్ళిపోతాడు శివన్నారాయణ‌. ఎందుకు అలా మాట్లాడారని కాంచనతో దీప అంటుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళందరు దీప గ్రిప్ లో ఉన్నారని దీప గురించి నెగెటివ్ గా పారిజాతం, జ్యోత్స్న మాట్లాడతారు. నేను వాళ్లకి బుద్ది చెప్పాలనుకుంటున్నానని శివన్నారాయణని జ్యోత్స్న అడుగగా..  నీ ఇష్టమని శివన్నారాయణ‌ అంటాడు. ఆ తర్వాత ఇక దీప సంగతి చెప్తాను. బావ, దీపలని వేరు చేయాలని  పారిజాతంతో జ్యోత్స్న అంటుంది.    మరొకవైపు స్వప్న, కాశీలు కలిసి దీప, కార్తీక్ ల పేరు మీద ఫుడ్ కోర్ట్ పెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత దాస్ దగ్గరికి కాశీ వెళ్తాడు. నువ్వు వెతకాలనుకున్న అతను దొరికాడా అని అడుగుతాడు. కాశీకి అర్థం కాకుండా దాస్ మాట్లాడతాడు. మరొకవైపు దీప బాధపడుతుంటే కార్తీక్ వస్తాడు. ఎందుకు బాబు.. మీ తాతయ్య గారితో కలిసే ఛాన్స్ వస్తే ఇలా చేసారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చే పనిలో బిగ్ బాస్ బ్యూటీ!

  బుల్లితెర ఆడియన్స్ కి ప్రియాంక సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌లో కమెడియన్‌గా ఎన్నో స్కిట్స్ చేసిన పింకీ.. బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్‌ ట్రాన్స్‌జెండర్‌‌గా మారిన సంగతి తెలిసిందే. సాయితేజగా ఒకప్పుడు జబర్దస్త్‌లో స్కిట్స్ చేసిన ఇతను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా ట్రాన్స్ఫర్మ్ అయ్యింది . అయితే తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం తల్లిదండ్రులకి కూడా చెప్పలేదు పింకీ. చాలా కాలం పాటు ఈ విషయాన్ని దాచే ఉంచింది. కానీ బిగ్‌బాస్‌ సీజన్ 5‌లో చెప్పి ఎమోషనల్ అయ్యింది. అలాంటి ప్రియాంక ఇప్పుడు తన బాడీని స్టిఫ్ గా మార్చుకునే పనిలో పడింది. జిమ్ కి వెళ్లి రకరకాల వర్కౌట్స్ చేస్తోంది.    ఈ మధ్య కాలంలో జెంట్స్ కంటే లేడీస్ అందులోనూ సెలెబ్రిటీస్ ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రియాంక సింగ్ కూడా చేస్తోంది అదే. ఇక ఈ జిమ్ వీడియో చూసిన సిరి హన్మంత్ "గో గర్ల్" అంటూ మెసేజ్ పెట్టింది. ఇక మిగతా నెటిజన్స్ ఐతే "ప్రియాంక ఇంకా ముందుకెళ్ళేలా చూసుకో..కష్టపడు..ముందు మంచి రోజులు ఉన్నాయి. మంచి పని చేస్తున్నావ్..గుడ్ వర్క్. ఎక్సర్సైజు నెమ్మదిగా చేయండి. అబ్బాయ్ లా చేయకండి...అమ్మయిగారు సూపర్..మీరు జిమ్ చేసి ఇండియాకి గోల్డ్ కప్ తెస్తావని నాకు తెలుసు..ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ బాడీని గుడ్ షేప్ లో ఉంచుకోవడం కోసం చాల కష్టపడుతున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

Eto Vellipoindi Manasu : కోడలు బుద్ది చెప్పడంతో మారిపోయిన సవతి తల్లి.. మంటల్లో పడ్డ ఆస్తి పేపర్లు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -273 లో.....రామలక్ష్మి శ్రీలతని పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. ఇప్పుడు శంకర్, లాయర్ ని తీసుకొని వచ్చి నిజం చెప్పించడం అనేది నిమిషంలో జరుగుతుంది కానీ అలా చెయ్యాలనుకోవడం లేదు.. మీలో మార్పు రావాలి. ఇప్పుడు డబ్బు కావాలా? అమ్మ కావాలా అంటే సందీప్ చూసారా ఎలా అన్నాడు.. డబ్బు కావాలన్నాడు కానీ సీతా సర్ మీ క్షేమం కోసం ఎలా చేస్తున్నాడు చూడండి. మీరు అనుకుంటున్న ఆస్తి సందీప్ కి వస్తే జల్సాలు చేస్తూ పాడు చేస్తాడు. అదే సీతా సర్ దగ్గరుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఏ నిర్ణయం అయినా మీరే తీసుకోండి అని రామలక్ష్మి అనగానే శ్రీలత ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన తల్లి బాగుండాలని అర్చన చేయమంటాడు. అక్కడ అత్తయ్య ఉంది తీసుకొని వస్తానని రామలక్ష్మి వెళ్తుంది. ఏం నిర్ణయం తీసుకున్నారని రామలక్ష్మి అనగానే.. నేను తప్పు చేసానని పశ్చతాపడుతుంది శ్రీలత. ఆ తర్వాత శ్రీలతని రామలక్ష్మి తీసుకొని వస్తుంది. ఇక విడాకులకి వారం రోజులు గడువు అడిగాను కదా ఇవ్వాలిటితో గడువు అయింది. కానీ నాకు విడాకులు ఇవ్వాలని లేదని సీతాకాంత్ అనగానే నాక్కూడా అని రామలక్ష్మి అంటుంది. ఇక శ్రీలత, రామలక్ష్మి లు సరదాగా మాట్లాడుకుంటుంటే.. సీతాకాంత్ చూసి మీరు కలిసి పోయారా అని అడుగుతాడు. అత్త కోడళ్ళ మధ్య సవాలక్ష ఉంటాయని రామలక్ష్మి అంటుంది.  ఆ తర్వాత రామలక్ష్మి ఆస్తుల పేపర్స్ సీతాకాంత్ కి ఇస్తుంది. సీతకాంత్ శ్రీలతకి ఇస్తుంటే తను వద్దని అంటుంది. అదేంటీ అత్తయ్య అంత ప్రేమగా ఇస్తుంటే వద్దని అంటున్నారని శ్రీవల్లి అనగానే.. శ్రీలత కోపంగా తన వైపు చూస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకొని సందీప్ పక్కకి వచ్చి అమ్మని ఫేస్ చెయ్యలేను.. ఇందాక డబ్బు కావాలా? అమ్మ కావాలా అంటే డబ్బే కావాలన్నం కదా అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఆస్తి పేపర్స్ తీసుకోకపోతే నా మీద ఒట్టే అని సీతాకాంత్ అనగానే.. శ్రీలత తీసుకుంటుండగా ఆ పేపర్స్ మంటల్లో పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Rohini Elimination: లేడి శివంగి రోహిణికి చరిత్రలో నిలిచిపోయే సెండాఫ్.. విన్నర్ లా బయటకొచ్చింది!

బిగ్ బాస్ హౌస్ నుంచి చాలామంది ఎలిమినేట్ అయ్యారు. కొంతమంది ఆడి ఓడారు.. ఇంకొంతమంది ఆడకుండానే ఓడారు. ఇంకొంతమంది ఆటే ఆడకుండా ఇంకా హౌస్‌లో కొనసాగుతున్నారు. కానీ ఎలిమినేట్ అయ్యి.. విన్నర్‌లా బయటకు వచ్చిన ఒకే ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎవరైనా ఉన్నారంటే అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణి మాత్రమే.  అవును.. సీజన్ 8 శివంగి రోహిణి గెలుపుతో బయటకు వచ్చింది. పద్నాల్గవ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా.. రోహిణిని షాకింగ్ ఎలిమినేషన్ చేశారు. ఈమె ఏమి ఆడుతుందని.. కిందనుంచి పైవరకూ హేళనగా చూసిన వాళ్లే.. ఆమె గెలుపు చూసి తల దించుకునేట్టుగా ఆడపులిలా ఆడింది రోహిణి. హౌస్‌లో మిగిలిన లేడీ కంటెస్టెంట్స్ ప్రేరణ, విష్ణు ప్రియలకంటే బాగా ఆడింది రోహిణి‌. ఆడి గెలిచింది కూడా. కానీ.. ఏం చేస్తాం.. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాకపోవడమే శాపంగా మారింది. ఆటలో తోపు అయినా.. ఓటింగ్‌లో గ్రాఫే లేకపోవడంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్‌లో రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.  హౌస్‌లో మిగిలిన టాప్-7 కంటెస్టెంట్స్ కటౌట్స్ గార్డెన్ ఏరియాలో పెట్టారు. అవినాష్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్లడంతో అతని కటౌట్‌ని తొలగించారు. మిగిలిన ఆరుగురిలో ఎవరి కటౌట్ అయితే కిందపడిపోతుందో.. వాళ్లు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పగా.. రోహిణి కటౌట్ పడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యిందని ప్రకటించారు నాగార్జున. అయితే రోహిణి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుంటే.. హౌస్‌లో ఉన్న వాళ్లంతా నిలబడి చప్పట్లు కొట్టడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. నువ్వు చాలామందికి ప్రేరణగా నిలిచావ్.. నువ్వు లేడీ సింగం. అమ్మాయిలు తలుచుకున్నా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏమైనా సాధించొచ్చని చెప్పావంటూ సెల్యూట్ చేశారు. నిఖిల్ అయితే తల ఎత్తి వెళ్లు రోహిణి అని అన్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు జీరో.. జీరో అని అన్న విష్ణు ప్రియ.. నువ్వు లేడీ శివంగి అని ఆకాశానికి ఎత్తేసింది. ఈ మాటతోనే రోహిణి గెలిచేసింది. ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన వాళ్లెవ్వరికీ ఇలాంటి సెండాఫ్ రాలేదని హౌస్‌లో వాళ్లు అనడంతో చాలా సంతోషంగా హౌస్ నుంచి బయటకు వెళ్లింది రోహిణి.

Brahmamudi : కోమాలోకి వెళ్లిపోయిన ఇంటి పెద్ద.. ఆస్తిలో వాటాలు కావాలంటూ కోడలు పేచీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -587 లో.....సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా రాహుల్, రుద్రాణి తమకేం పట్టనట్లే ఉంటారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఏమైందంటూ అడుగుతాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి.. తన కండిషన్ బాగోలేదు.‌. అయన కోమాలోకి వెళ్ళిపోయాడనగానే అందరు షాక్ అవుతారు. పేషెంట్ ని అబ్జర్వేషన్ లో ఉంచాం.. ఎప్పుడైన రావచ్చు.. రోజులు పట్టొచ్చు.. నెలలు పట్టొచ్చు.. సంవత్సరాలు పట్టొచ్చని డాక్టర్ చెప్తాడు. ఇంతమంది ఇక్కడ ఎందుకు మీరు వెళ్ళండి నేనే ఉంటానని కళ్యాణ్ అనగానే ఇందిరాదేవి రానని అంటుంది. కానీ అందరు కలిసి బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తారు. మరొకవైపు సీతారామయ్య గురించి తెలిసి కనకం బాధపడుతుంటే.. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. జరిగింది చెప్పడంతో తను షాక్ అవుతాడు. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య ఫొటో పట్టుకొని బాధపడుతుంటే.. కావ్య వచ్చి దైర్యం చెప్పి భోజనానికి తీసుకొని వెళ్తుంది. అందరు భోజనం చేస్తుండగా.. ఇక ధాన్యలక్ష్మికి న్యాయం జరగదా అని రుద్రాణి అనగానే.. అందరు రుద్రాణిపై విరుచుకుపడతారు. నా గురించి ఎవరు ఆలోచించడం లేదని ధాన్యలక్ష్మి అనగానే.. కావ్య కోప్పడుతుంది. ఈ సిచువేషన్ లో కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారని కావ్య అనగానే.. నీకేం సంబంధమని మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. తను ఈ ఇంటికి పెద్ద కోడలు అని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మి అలా మాట్లాడడంతో అసలు మీ సమస్య ఏంటి అంటూ ఇందిరాదేవి వాళ్లపై అరుస్తుంది. తరువాయి భాగంలో నా వాటా నాకు కావాలని ధాన్యలక్ష్మి అనగానే.. ఈ గొడవ ఏంటి రేపు ఎవరి వాటా వాళ్ళకి రాసేస్తానని సుభాష్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నెంబర్ వన్ సీరియల్ గా కార్తీక దీపం ఈజ్ బ్యాక్.. టాప్-5 లో బ్రహ్మముడికి దక్కని చోటు!

  స్టార్ మా సీరియల్స్ లో ప్రతీవారం అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్లే సీరియల్ బ్రహ్మముడి. కానీ  గత రెండు వారాలుగా దీని టీఅర్పీ ఫుల్ గా పడిపోయింది. ఈవారం రేటింగ్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 11.20 టీఆర్పీ రేటింగ్ సాధిస్తే.. బ్రహ్మముడి సీరియల్ కేవలం 6.31 శాతం మాత్రమే రేటింగ్ సాధించి.. టాప్ 5లో కూడా లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే బ్రహ్మముడి మధ్యాహ్నానికి మారిందో అప్పుడే కార్తీకదీపం 2 సీరియల్ నెంబర్ 1 ప్లేస్‌లోకి వచ్చేసింది. కార్తీక దీపం 2 సీరియ‌ల్‌ 11.96 టీఆర్పీ రేటింతో నెంబర్ 1 స్థానంలో ఉంటే.. 11.20 రేటింగ్‌తో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు రెండో స్థానంలో ఉంది. అనూహ్యంగా చిన్ని సీరియల్.. 10.73 రేటింగ్‌తో మూడో స్థానంలోకి వచ్చింది. ఇంటింటి రామాయ‌ణం 10.21తో నాలుగో స్థానంలో ఉండగా.. గుండెనిండా గుడిగంటలు 9.88 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది. మగువ ఓ మగువ 9.32 రేటింగ్‌తో ఆరో స్థానంలో ఉంది. చిన్ని, ఇంటింటి రామాయణం సీరియల్స్ గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ని క్రమక్రమంగా వెనక్కి నెట్టుతున్నాయి. బ్రహ్మముడిని బీట్ చేయడం కష్టమే అనుకున్న తరుణంలో ఆ సీరియల్‌ టైమింగ్ మార్చి.. అసలు టాప్ 6లో కూడా లేకుండా చేసిన ఘనత స్టార్‌ మా ఛానల్‌కే దక్కింది. కానీ.. బ్రహ్మముడి సీరియల్ టైమ్‌లో ప్రసారం అవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌ టాప్ 2లోకి వచ్చేసింది. మొత్తానికి బ్రహ్మముడి సీరియల్‌కి పెద్ద బొక్కే పడింది.  

Vishnupriya elimination: విష్ణుప్రియ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

  14వ వారంతో చివరి నామినేషన్స్ ముగిశాయి. హౌస్‌లో మొత్తం ఏడుగురు ఉంటే.. వాళ్లలో అవినాష్ తప్ప మిగిలిన ఆరుగురు నేరుగా నామినేట్ అయ్యారు. అవినాష్ సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు దాంతో రోహిణి, విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఎవరు సేవ్ కావచ్చు.. ఎవరు ఎలిమినేట్ కావొచ్చు. అసలు ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ, రోహిణిలు నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే వీళ్లలో నిఖిల్, గౌతమ్‌లు టాప్ ఓటింగ్‌లో ఉండటంతో.. వీరు విన్నర్ రేస్‌లో పోటీపడబోతున్నారు. కాబట్టి.. ఈవారం ఎలిమినేషన్స్‌లో ఈ ఇద్దరూ లేనట్టే. ఇక ప్రేరణ, నబీల్‌లు కూడా తరువాతి స్థానాల్లో ఉండటంతో ఈ ఇద్దరూ డేంజర్ జోన్‌లో లేనట్టే. నిజానికి నబీల్ గత రెండు మూడు వారాలుగా ఆటలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నా కూడా.. అతనికి సొంత కమ్యునిటీ ఓట్లు, సోషల్ మీడియా క్రేజ్ పనిచేసి.. అతని ఈవారం డేంజర్ జోన్‌ నుంచి గట్టెక్కేసినట్టే. ఇక మిగిలింది రోహిణి, విష్ణు ప్రియ. ఈవారంలో ఎలిమినేట్ అయ్యేది ఈ ఇద్దరిలో ఒకరు. ఈ ఇద్దరిలో ఆట పరంగా చూస్తే రోహిణి ది బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విష్ణు ప్రియ.. పృథ్వీ మైకంలో పడి అసలు 14వ వారం వరకూ కూడా ఆటే ఆడలేదు. వీకెండ్ పెర్ఫామెన్స్ తప్పితే ఒక్కటంటే ఒక్క వారం కూడా విష్ణు బెస్ట్ అనిపించింది లేదు. ఎప్పుడు చూసినా.. ఆ పృథ్వీని రంజింపజేయడంతోనే సరిపోయింది ఈమెకి. కాస్త ఆటపై దృష్టిపెట్టమ్మా అని ఎవరైనా సలహా ఇస్తే.. నాకు పృథ్వీ తప్ప ఏమీ వద్దు.. నాకు ఎవరూ చెప్పొద్దు. ఇష్టం ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే మూసుకుని ఉండండి అన్నట్టుగానే చాలాసార్లు చెప్పుకొచ్చింది.  ఈవారం విష్ణుప్రియ కూడా లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లోనే ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆట పరంగా చూస్తే విష్ణు కంటే రోహిణి వంద రెట్లు బెస్ట్. కానీ చివరి వారంలో ఎలిమినేషన్స్ అనేవి అల్లాటప్పాగా జరగవు. ఓటింగ్ లెక్కలే కాదు.. చాలా లెక్కలు ఉంటాయి. ఎవర్ని ఉంచాలి.. ఎవర్ని పంపాలి అనేది.. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టే కాకుండా బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే.. చివరి వారంలో ఎలిమినేషన్ ఫైట్ చాలా టఫ్‌గా ఉంటుంది. మన దత్తపుత్రిక విష్ణుప్రియకి బిగ్ బాస్ సపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే జరిగితే రియల్ గేమర్ అండ్ ఎంటర్‌టైనర్ రోహిణి ఎలిమినేషన్ అవ్వాల్సిందే. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేషన్ గ్యారెంటీ.

నిఖిల్ ఓట్ అప్పీల్ లో సోనియాకి కౌంటర్..!

బిగ్ బాస్ సీజన్-8 ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ వారమంతా ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. అందులో మొదట ప్రేరణ ఓట్ అప్పీల్ కు అర్హత సాధించగా, ఆ తర్వాత నబీల్, విష్ణుప్రియ చేసుకున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్, నిఖిల్ ల మధ్య జరిగిన రంగు పడుద్ది టాస్క్ లో నిఖిల్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని గెలుచుకున్నాడు. ఇందులో నిఖిల్ ఏం మాట్లాడాడో ఓసారి చూసేద్దాం. హాయ్ అందరికీ నేను మీ నిఖిల్.. ముందుగా ఇన్ని వారాలు నాకు ఓట్లేసి ఈ హౌస్‌లో ఉంచిన మీకు థాంక్యూ.. ఇంకొక రెండు వారాలే ఉంది.. చాలా కష్టపడ్డాను.. మీరు కూడా నన్ను సేవ్ చేయానికి కష్టపడ్డారు.. నాకు విన్నర్ కావాలని చాలా కోరికగా ఉంది.. దానికి ఎంతవరకూ కష్టపడాలో అంతా నేను కష్టపడతాను.. ఇన్ని రోజులు నిఖిల్‌ని స్వీకరించినవాళ్లు మీరు.. ఈ ఒక్కసారి నిఖిల్‌ని గెలిపించండి.. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.. నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చి నిల్చోబెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను.. తెలుసో తెలీకో కొన్ని తప్పులు చేశాను.. దాన్ని మీరు క్షమించి నన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చారు.. థాంక్యూ.. అంటూ చెప్పాడు. ఇంకా రెండు వారాలే ఉంది.. మీ ఓటుతోనే నిఖిల్ గెలువగలుగుతాడు. నిఖిల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు.. ఉంటాడంటూ మొన్న సోనియా అన్న మాటలకి కూడా నిఖిల్ ఇండైరెక్ట్ కౌంటర్లు వేశాడు. నేను ఒకేలా ఉంటాననే నమ్మకం నాకు ఉంది.. మీ ప్రేమ కూడా అలాగే ఉంటుందని నాకు గట్టి నమ్మకం ఉంది.. మీ ప్రేమ, సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి.. దాని వల్లే నిఖిల్ ఇక్కడ ఉన్నాడు.. ఈ షోను గెలవాలంటే మీ ఓటు నాకు కావాలి.. చిన్న చిన్న తప్పుల్ని బిడ్డగా చేశాను అనుకొని క్షమించండి.. అలానే మీ ఇంటి బిడ్డగా నేను కోరుకుంటున్నాను.. నాకు విన్నర్ కావాలని ఉంది.. ఈ నిఖిల్ ఎప్పుడూ మీ ఇంటి బిడ్డే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను గెలిపించాలంటూ నిఖిల్ కోరాడు

ఓట్ అప్పీల్ లో గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్రంగా మారిన గొడవ.. అర్హత మాత్రం అతడికే!

హౌస్‌లో గత వారం గోల్డెన్ టికెట్ గెలిచినవారికి ఈ వారం ఓ ప్రయోజనం కల్పించాడు బిగ్‌బాస్. లాస్ట్ వీకెండ్‌లో గోల్డెన్ టికెట్ వచ్చినందుకు గౌతమ్, నిఖిల్, రోహిణి మీకు ఇప్పుడు ఒక ప్రయోజనం లభిస్తుంది.. అదేంటంటే మీ ముగ్గురిలో నుంచి ఒకరికి మాత్రమే ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవడానికి మీకు 8 రాసి ఉన్న ఒక కేక్ ఇస్తాం.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి కేకును కట్ చేస్తూ 8న కింద పడకుండా చూడటం.. ఎవరు కేక్ కట్ చేస్తున్నప్పుడు 8 నెంబర్ కిందపడిపోతుందో వాళ్లు ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.. ఈ ఛాలెంజ్‌కి విష్ణుపియ సంచాలక్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ ఛాలెంజ్ మొదలుకాగానే గౌతమ్-నిఖిల్ చాలా బాగా ఆడారు. రోహిణి ఎక్కడ 8 పడిపోతుందో అన్నట్లు చాలా టెన్షన్ పడింది. ఇక చివరికి వచ్చేసరికి గౌతమ్ ఇంకా నైస్‌గా కేకును కట్ చేయడంతో ఆ తర్వాత వచ్చిన రోహిణి కట్ చేయబోయి 8 పడేసింది. దీంతో ఈ ఛాలెంజ్ నుంచి రోహిణి ఔట్ అయింది. దీంతో తదుపరి ఛాలెంజ్‌కి నిఖిల్-గౌతమ్ వెళ్లిపోయారు. తర్వాత నిఖిల్-గౌతమ్‌కి మరో ఫిజికల్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. నిఖిల్-గౌతమ్.. మీ ఇద్దరిలో ఒకరికి ఓట్ అప్పీల్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఇస్తున్న చివరి ఛాలెంజ్ రంగుపడుద్ది.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయవల్సందల్లా మీ ప్రత్యర్థి టీ షర్ట్‌పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవడం.. ఈ ఛాలెంజ్ మూడు రౌండ్స్‌లో జరుగుతుంది.. అన్ని రౌండ్స్ పూర్తయ్యేసరికి టీ షర్ట్ పైన తక్కువ రంగు ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజ్‌ని గెలిచి ఆడియన్స్‌తో కనెక్ట్ అయి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశంతో పాటు తాము గెలిచే అవకాశాన్ని ఎక్కువ చేసుకున్నట్లే.. ప్రేరణ సంచాలక్ అంటూ అనౌన్స్ చేశాడు. బజర్ మోగిన వెంటనే గౌతమ్-నిఖిల్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కలర్స్ పూసుకున్నారు. అయితే మధ్యలో గౌతమ్ తన కలర్ తనే టీ షర్ట్‌పై రాసుకున్నడు. దీనిపై ప్రేరణ అభ్యంతరం చెప్పింది. దీంతో గౌతమ్ ఆపేశాడు. ఇక మొదటి రౌండ్ ముగిసేసరికి ఎక్కువ కలర్ నిఖిల షర్ట్‌పైనే ఉంది. కానీ ప్రేరణ తన కన్నడ బ్యాచ్ కాబట్టి నిఖిల్ విన్నర్ అంటూ చెప్పేసింది. ఇది చూసి మిగిలిన కంటెస్టెంట్ల్ ఏంటి అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. గౌతమ్ కూడా అదేంటి నాకు తక్కువ ఉంది కదా అంటూ గొడవ పడ్డాడు. దీంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా ఈ రౌండ్ టైగా ఇస్తున్నా.. అంటూ ప్రేరణ అంది. కానీ దీనికి బిగ్‌బాస్ ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక గట్టిగా చూస్తే కంపేరిటివ్‌లీ తక్కువ ఉన్నది గౌతమ్ దాంట్లో.. సో గౌతమ్ ఈ రౌండ్ విన్నర్ అంటూ ప్రేరణ చెప్పింది. రెండో రౌండ్‌లో ఇద్దరూ చాలా గట్టిగా ఆడారు. ముఖ్యంగా గౌతమ్ కాలు పట్టుకొని నిఖిల్ లాగిపడేశాడు. దీంతో గౌతమ్ కూడా ఫిజికల్ అయి రంగు రాయడానికి చాలా ట్రై చేశాడు. దీంతో గౌతమ్ నువ్వు కొడుతున్నావ్.. అంటూ రౌండ్ ముగిసిన వెంటనే నిఖిల్ ఆరోపించాడు. దీనికి నేను కావాలని కొట్టలేదు.. నువ్వు తోశావ్‌గా.. నువ్వు పడేసి కాలు లాక్కొని వెళ్లిపోయావ్.. అది ఏం కాదా.. నేను రాయబోతుంటే నీకు తగిలింది.. కావాలని కొట్టా అంటావా అంటూ గౌతమ్ కూడా రెయిజ్ అయ్యాడు. దీనికి నిఖిల్ నువ్వు అన్నీ అలానే చెబుతున్నావ్.. ఫస్ట్ రౌండ్‌లో ఎవరు చేసింది.. అడుగు సంచాలక్‌ని అంటూ నిఖిల్ అరిచాడు. ఈ వాదనలో గౌతమ్‌ని పక్కకెళ్లి కూసో బే.. అంటూ నిఖిల్ నోరుజారాడు. దీంతో బే అని ఎవడ్ని అంటున్నావ్.. మొన్న ఒక్క మాట అంటేనే సీరియస్ అయినవ్ కదా.. మరి బే అని ఎవడ్ని అంటున్నావ్.. అంటూ గౌతమ్ అడిగాడు. ముఖం మీద కొడతాడు మళ్లీ సారీ అంట.. అంటూ నిఖిల్ తిట్టుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఫస్ట్ రౌండ్‌లో ఎవరు పడేసింది.. ఆడే విధానం తెలీదంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నీకు తెలీదు ఫస్ట్ నుంచి చూస్తున్నా.. ఎక్కువ తక్కువ మాట్లాడకంటూ గౌతమ్ రెయిజ్ చేయ్యాడు. మరి నువ్వేంది ముఖం మీద కొడుతున్నావంటూ నిఖిల్ అడుగగా.. నేను కావాలని కొడతానా అంటూ గౌతమ్ అడిగాడు. నువ్వు కొట్టినా కొడతావ్ అనిపించిందంటూ నిఖిల్ అన్నాడు. ఇంతలో ప్రేరణ మధ్యలో వస్తుంటే ఇది నా పర్సనల్.. నువ్వు మాట్లాడకు అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు. ఇక సెకండ్ రౌండ్ విన్నర్ నిఖిల్ అంటూ ప్రేరణ ప్రకటించింది. ఇక ఆ తర్వాత మూడో రౌండ్ లో నిఖిల్ గెలిచాడు. మూడు రౌండ్లలో రెండింట్లో గెలిచిన నిఖిల్ ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు.

ప్రేరణకి రోజా పూవు ఇచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓంకార్!

నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు ముగిసాయి. హౌస్ మేట్స్ అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో ఓ మాస్ సాంగ్ కు ఓంకార్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఓంకార్ ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఫుల్ జోష్ వచ్చింది. ఇక అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఓంకార్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. నా దగ్గర 7 రోజా పువ్వులు ఉన్నాయ్.. నేను అందరినీ ఒక్కో ప్రశ్న అడుగుతా.. నన్ను ఇంప్రెస్ చేసే ఆన్సర్ ఇచ్చినవాళ్లకి ఒక రోజ్ ఇస్తా అంటూ ఓంకార్ చెప్పాడు. ఇక ముందుగా గౌతమ్‌ని లేపి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి సాంగ్ ద్వారా ఐ లవ్యూ ప్రపోజ్ చేయాలి అంటూ ఓంకార్ చెప్పాడు. దీంతో ఇళయరాజా కంపోజ్ చేసిన "ప్రియతమా నీవచట కుశలమా" సాంగ్ పాడాడు గౌతమ్. బాగానే పాడటంతో రోజా పువ్వు ఇచ్చేశాడు ఓంకార్. తర్వాత ఐ లవ్యూని యానిమల్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటూ రోహిణికి వింత టాస్కు ఇచ్చాడు. పాపం రోహిణి ఏదో కష్టపడి కోతిలా యాక్ట్ చేసింది.. ఆ కష్టానికి ఓ పువ్వు ఇచ్చేశాడు ఓంకార్. ఇక నబీల్‌కి నీ పార్టనర్‌తో కలిసి ఒక దొంగతనం చేయాలంటే ఏం దొంగతనం చేస్తారంటూ ఓంకార్ అడిగాడు. దీనికి నేను నా పార్టనర్‌తో ఇస్మార్ట్ జోడీ షోకి వెళ్లి ప్రేక్షకుల మనసులు దోచేస్తా అంటూ నబీల్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ సమాధానానికి ఓంకార్ అన్నయ్య ఫిదా అయిపోయాడు. నెక్స్ట్ విష్ణుప్రియకి కూడా ఓ వింత ప్రశ్న ఇచ్చాడు ఓంకార్. నీ పార్టనర్ ఓ వెజిటెబుల్‌గా మారాలంటే ఎలా మారాలనుకుంటున్నావని అడిగితే.. బెండకాయ అని విష్ణుప్రియ అంది. ఎందుకంటే తనే నా గుండెకాయ అంటూ నవ్వించింది విష్ణు.  దాంతో తనకి ఓ గులాబీ ఇచ్చాడు ఓంకార్.చివరిగా ప్రేరణని ఓ కొశ్చన్ అడిగాడు ఓంకార్. నీకు టైమ్ ట్రావెల్ చేసే ఛాన్స్ ఇస్తే ఫ్యూచర్‌కి వెళ్లి మీ పార్టనర్ భవిష్యత్తుని తెలుసుకుంటారా.. పాస్ట్‌టెన్స్‌లోకి వెళ్లి మీ మిస్టేక్స్ ఏమైనా కరెక్ట్ చేసుకుంటారా అంటూ ఓంకార్ అడిగాడు. దీనికి భవిష్యత్తులోకి ఎంత వెళ్లినా.. మా ఆయనతో నేనే ఉంటానంటూ ప్రేరణ అనగానే ఓంకార్ క్లాప్స్ కొట్టాడు. రోజా పువ్వు ఇచ్చి మీ భర్త శ్రీపద్‌తో మీరు త్వరలోనే ఇస్మార్ట్ జోడి-3కి రావాలంటూ ఓంకార్ చెప్పాడు.

వాళ్ళ ఇంటికి వెళ్లి నరకాలనిపిస్తుంది అంటున్న జానులిరి

ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ జానులిరి గురించి ఈ మధ్యలో మనం బాగా వింటూ ఉన్నాం. ఎందుకంటే ఈ షో టైటిల్ విన్నర్ ఆమె. అలాగే ఆమెకు శేఖర్ మాష్టర్ ఇచ్చే కామెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఐతే ఈ షో నుంచి ఆమెను తీసేయాలని కూడా అంటూ ఉంటారు. ఐనా ఆ కామెంట్స్ ని పట్టించుకోకుండా ఆమె ఈ షోలో కష్టపడి విన్నర్ అయ్యింది. అలాంటి జాను కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఇలా ఆన్సర్ ఇచ్చింది. "నా వీడియోస్ కి బాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఆ కామెంట్ పెట్టినవాడు కనిపిస్తే గనక ఇంటికి పొయ్యి నరకాలనిపిస్తుంది. ఢీ షోలో కంటెస్టెంట్ గా మా మాస్టర్ మొదట నన్ను ఒద్దు అన్నారు. ఎందుకంటే నేనొక ఫోక్ డాన్సర్ ని కదా అన్ని రకాల స్టైల్స్ లో డాన్స్ చేస్తానా లేదా అని ఆయన భయపడ్డారు. కానీ తర్వాత నేను అన్ని రకాల డాన్సులు చేసేసరికి నామీద ఆయనకు నమ్మకం పెరిగింది. తెలియని వయసులో పెళ్లి చేసేసుకోవాలని అనిపించి పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్నారు. నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అనుకుంటే మా అబ్బాయి లిరికి మంచి లైఫ్ ఇచ్చి పోవాలి అంతే. మా అభి మాష్టర్ కోరియోగ్రఫీ తర్వాత శోభిత, చిట్టి, పండు మాష్టర్ కోరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏడుపు వీడియోస్ చేయను నేను. మనసులో ఎంతో పెయిన్ ఉంది అందుకే బాధతో ఏడుపు వీడియోస్ చేస్తాను. నేను సారీ చెప్పాల్సి వస్తే మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే లడ్డు అక్కకి చెప్తాను. డాన్స్ లో ప్రత్యేకంగా ఎవరూ నాకు ఇన్స్పిరేషన్ అంటూ లేరు. హీరోయిన్ శ్రేయా గారిని చూస్తూ ఉండేదాన్ని. ఆమె డాన్స్ చూస్తే నాకూ చేయాలనిపించేది అలా నేర్చుకున్నా. ముందు నేను వెల్కమ్ డాన్స్ నుంచి మొదలుపెట్టి ఫోక్ సాంగ్స్ వరకు చేశా ఆ తర్వాత ఢీలో నాకు ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం." అని చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : నర్మద, సాగర్ ల ప్రేమ పెళ్ళికి రామరాజు ఆశీస్సులు.. అసలు నిజం అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -22 లో... సాగర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో నర్మద డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. దాంతో కంగారుగా సాగర్ బయటకు వచ్చి.. నర్మదతో మాట్లాడతాడు. ఇప్పుడైనా వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. మీ వాళ్ళని తీసుకొని వచ్చి మా వాళ్ళతో మాట్లాడమంటే నీకు అర్థం కాదా అని నర్మద కోప్పడుతుంటే.. మా నాన్న అంటే భయమని సాగర్ అంటాడు. అంత భయపడేవాడివి ఎందుకు ప్రేమించావు.. నువ్వు నాతో టైమ్ పాస్ చేసావని నర్మద అనగానే సాగర్ కోప్పడతాడు.. రేపు పెళ్లి చేసుకుందాం నువ్వు రెడీనా అని అనగానే.. నాకు ఇష్టమేనని నర్మద అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సాగర్ బట్టలు సర్దుకుంటాడు. అప్పుడే ధీరజ్ వెళ్లి మాట్లాడుతాడు. ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు. సాగర్ మిల్ కి పోదామని అనగానే ఈ రోజు రావట్లేదు నాన్న అంటాడు. ఎందుకని రామరాజు అనగానే నేనే కాలేజీకి తీసుకొని వెళ్తున్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత సాగర్ రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఎందుకని రామరాజు అనగానే.. నేను వెళ్లే పని సక్సెస్ అవ్వాలనగానే సక్సెస్ అవుతుందని రామరాజు అంటాడు. ఆ తర్వాత సాగర్ వేదవతిని హగ్ చేసుకుంటాడు. ఏం జరిగిందని వేదవతి అడుగుతుంది. ఏం లేదని సాగర్, ధీరజ్ లు చెప్తారు. ఆ తర్వాత సాగర్, ధీరజ్ లు నర్మద ఇంటి ముందు వెయిట్ చేస్తుంటారు. మరొకవైపు నర్మదని తన పేరెంట్స్ షాపింగ్ కి వెళదామని బలవంతపెడతారు. దాంతో నర్మద వెళ్తుంటుంది. అది చూసి సాగర్, ధీరజ్ వాళ్లు ఎక్కడికి వెళ్తుందంటూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో నర్మద పేరెంట్స్ షాపింగ్ చేస్తారు. తాళి తీసుకుంటారు. ఇది నా దగ్గర ఉంచుకుంటానని తాళి తీసుకుంటుంది నర్మద. మరొకవైపు తన వెనకాలే ధీరజ్, సాగర్ ఉంటారు. అక్కడ ప్రేమ ఉంటుంది. వాళ్ళని చూసి మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని ధీరజ్ తో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లికి ప్రేమ విలువ తెలియజెప్పిన కోడలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -272 లో....రామలక్ష్మి ప్లాన్ ప్రకారం అందరిని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ సిరి మోకాళ్ళపై నడుస్తుంటే.. ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతుంది. జాతకం లో దోషాలు ఉంటే మొక్కుకొని అలా  చేస్తే బాగుంటారని పంతులు చెప్పగానే.. మా అమ్మ కోసం నేనే చేస్తానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన తల్లి శ్రీలత బాగుండాలని మోకాళ్ళ పై నడుస్తాడు. ఆ బాధని చూడలేని రామలక్ష్మి.. చూసావా ఇప్పటికైనా మీ కొడుకు ప్రేమని అర్థం చేసుకోండి అని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. అయినా కూడా శ్రీలత నాకేంటి అన్నట్టు మాట్లాడుతుంది. సీతా ఎప్పుడు కూడా నా కొడుకు కాలేడని శ్రీలత అంటుంది. నువ్వు సొంత కొడుకువే కదా మరి నువ్వు ఎందుకు మీ అమ్మ గురించి అలా చెయ్యడం లేదని సందీప్ తో రామలక్ష్మి అంటుంది. దాంతో రామలక్ష్మి మాటలు తట్టుకోలేక సందీప్ వెళ్లి మోకాళ్ళపై ప్రదక్షిణలు చేస్తాడు. ఇక వీళ్ళు మారేలా లేరని మాణిక్యానికి ఫోన్ చేసి లాయర్ ఇంకా శంకర్ ని తీసుకొని రమ్మని చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ ప్రదక్షిణలు చేస్తుంటాడు కానీ సందీప్ మాత్రం ప్రదక్షిణ ఆపేస్తాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి శంకర్ ఇంకా లాయర్ ని చూపిస్తుంది. దాంతో సందీప్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు చెప్పండి వాళ్ళు వచ్చి మీ అన్నయ్యకి చెప్తే పరిస్థితి ఏంటి? మీకు డబ్బు కావాలా అమ్మ కావాలా అని రామలక్ష్మి అనగానే.. నాకు డబ్బు కావాలని సందీప్ శ్రీవల్లి అంటారు. దాంతో శ్రీలత షాక్ అవుతుంది. సందీప్, శ్రీవల్లిని పంపిస్తుంది రామలక్ష్మి. అక్కడ నుండి లాయర్ , శంకర్ లని పంపిస్తుంది. శ్రీలత ని పక్కకి తీసుకొని వెళ్లి.. ఇప్పటికైన అర్థమైందా ఎవరి ప్రేమ ఇలాంటిందోనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: దీపని చంపడానికి జ్యోత్స్న కొత్త నాటకం.. శివన్నారాయణ‌నే పావుగా వాడుకుందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-221 లో..   కార్తీక్ ఫోన్ నుండి పారిజాతానికి కాల్ చేస్తాడు. ఇక కాంచన మాట్లాడుతుంది. జ్యోత్స్నకి ఎలా ఉందని కాంచన అడుగగా..దీప, కార్తీక్ ల గురించి పారిజాతం మాట్లాడుతుంది. జ్యోత్స్న బానే ఉందంట కదా అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు జ్యోత్స్న ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటుంది. జ్యోత్స్న ఒంటరిగా ఉండటం చూసిన శివన్నారాయణ‌ తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఇంత ఆస్తి కూడబెట్టింది నీకోసమే అమ్మా.. అలాంటిది నువ్వే సంతోషంగా లేకపోతే మా ఆశలకు విలువేముంది.. నేను నీకోసమే మీ బావతో పెళ్లికి ఒప్పుకున్నాను కానీ వాడే మనల్ని మోసం చేశాడని శివన్నారాయణ అంటాడు. మనం దేన్ని సరిచేయలేం తాతా.. అయినా నేనేం నాకు బావ కావాలని అడగలేదు కదా తాతా అని జ్యోత్స్న అంటుంది. సరే నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శివన్నారాయణ అంటాడు. అయితే అటుగా వెళ్తున్న పారిజాతం.. ఆగి వారి మాటలను దూరంగా వినడం మొదలుపెడుతుంది. ఏమో తాతా.. నేను డిజైన్ చేసుకున్న లైఫ్ పాడైందని అర్థమయ్యాక.. నాకు ఏదో ఒంటరైపోయిన ఫీలింగ్.. నా చుట్టూ ఎవరూ లేరు.. నాకోసం ఎవరూ లేరు అనిపిస్తోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనిపిస్తోందంటూ జ్యోత్స్న కన్నీళ్లతో చెప్తుంది. పోనీ నీ చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి అనుకుంటున్నావ్.. ఎలా ఉంటుంటే బాగుంటుంది అనుకుంటున్నావని శివన్నారాయణ అడుగగా.. ఇది వరకూ నువ్వు, నేను, గ్రానీ, అత్తా బావా, మావయ్యా, అమ్మా, నాన్నా అంతా ఉండేవాళ్లు.. ఎప్పుడు ఏదో ఒక సందడి.. ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ అంటు జ్యోత్స్న చెప్తుంటే పారిజాతం కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆ సందడి ఆ సంతోషం మన ఇంటికి వదిలి దూరంగా పోయింది తాతా.. నువ్వు మళ్లీ తీసుకుని రాగలవా.. కానీ అడగను తాతయ్య అది జరగదని నాకు తెలుసని జ్యోత్స్న కన్నీళ్లతో వెళ్లిపోతుంది. బాగా ఆలోచించిన శివన్నారాయణ‌.. కాంచన దగ్గరికి వస్తాడు. నా కోసం ఒక పని చెయ్యాలి కాంచనా.. నా మనవరాలు మీ అందరి కోసం బాగా బెంగ పెట్టుకుంది.. వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అని శివన్నారాయణ‌ అంటాడు. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు తాతా? మీకు మళ్లీ కోపాలు గుర్తొచ్చే వరకా? ఆ రోజు నేను మీ గుమ్మం ముందు నిలబడి మా అమ్మను క్షమించమని అడిగాను.. విల్లేదని అన్నారంటూ కార్తీక్ జరిగినవన్నీ గుర్తుచేస్తాడు. ఇక కార్తీక్ ని కాంచన ఆపి.. వస్తాం నాన్న అని అంటుంది. అందరు అంటే మీరిద్దరే అని శివన్నారాయణ‌ అనగానే.. ఏంటి తాతా నువ్వు మాట్లాడేది? అసలు దీప ఏం తప్పు చేసింది.. ఈ దీపే ఒకప్పుడు నీ కోడల్ని కాపాడింది. నిన్న కాక మొన్న నీ మనవరాలిని కాపాడిందంటూ ప్రతిదీ గుర్తు చేస్తాడు. అయితే శివనారాయణ తగ్గకుండా కోపంగా మాటలు అంటాడు. నాకు పెళ్లి అయ్యింది. దీప నా భార్య.. శౌర్య నా కూతురు అంటూ దీపను భుజానికి హత్తుకుని శివన్నారాయణతో కార్తీక్ మాట్లాడుతుంటాడు. అప్పటిదాకా భయం భయంగా.. దీపను పంపేస్తారా అని చూస్తున్న అనసూయ చాలా సంతోషిస్తుంది. శివనారయాణ మాత్రం రగిలిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: హాస్పిటల్ బెడ్ పై పెద్దాయన.. ఎస్సై ట్రైనింగ్ కి అప్పు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్- 586 లో.. సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా.. అందరు బయట ఉంటారు. కావ్యని లోపలికి రమ్మని పిలుస్తాడు సీతారామయ్య. తను రాగానే..  అమ్మా కావ్యా అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడటం మొదలుపెడతాడు సీతారామయ్య. తాతయ్యా మీకు ఆక్సిజన్ అందకపోతే మళ్లీ ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది. పర్వాలేదమ్మా.. కూర్చో.. నేను మళ్లీ నీతో మాట్లాడతానో లేదో ఏం చెప్పినా ఇప్పుడే చెప్పనివ్వు అమ్మా అని సీతారామయ్య అంటాడు. అలా మాట్లాడకండి తాతయ్యా.. మీకు ఏదైనా అయితే మీ చిట్టీ (ఇందిరా దేవి) ఏమైపోతుంది? ఇప్పటికే ఈ బావ కోసం గుండె గుప్పెట్లో పెట్టుకుని బయట ఏడుస్తూ కూర్చుందని కావ్య అంటుంది. మేము ఆకలిగా ఉన్నామని తెలిసి వాడు మాట్లాడకపోయినా అన్నం తెచ్చి పెట్టిన దానివి.. నేను లేకపోయినా నువ్వు చిట్టీని చూసుకోగలవు కదమ్మా అని సీతారామయ్య అనగా.. మీరు అలా మాట్లాడకండి తాతయ్యా. మీరు మీ చిట్టి కోసమే కాదు.. ఈ మనవరాలి కోసం మీ మనవడి కోసం క్షేమంగా తిరిగి వస్తారని కావ్య అంటుంది. అమ్మా.. నేను ఇప్పుడు చెప్పే మాటలు బాగా విను.. ఇప్పటి నుంచి ప్రతి రోజు నీకో పరీక్షలా ఉండొచ్చు.. రాజ్ నీ విషయంలో కాస్త దురసుగా ప్రవర్తించొచ్చు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు ఇల్లు దాటిన రోజు ఇల్లు చీకటి అయిపోతుంది. ఎవరికి వారు అయిపోతారు. ఇల్లు ముక్కలైపోతుంది. అలా జరగకుండా చేస్తానని నాకు మాటివ్వమ్మా అని సీతారామయ్య అంటాడు. ఇంతపెద్ద బాధ్యతను నేను ఎలా మోయగలను తాతయ్యా అని కావ్య అంటుంది. చేయగలవమ్మా.. నీ సహనమే నీకు శ్రీరామరక్ష.. ఇదే నా ఆఖరి కోరిక అనుకోమ్మా అని సీతారామయ్య అనగానే.. సరేనని కావ్య మాటిస్తుంది. ఇంతలో సీతారామయ్యకి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో నర్స్ వచ్చి కావ్యని బయటికి పంపిస్తుంది. ఇక కావ్య బయటకు రాగానే ఏం అన్నాడని రుద్రాణి అడుగుతుంది.  లోపల తాతయ్యగారు నాతో చెప్పింది చెప్పినట్లుగా చెబుతున్నాను. కొంత మందికి నచ్చకపోవచ్చు.. అయినా చెబుతున్నాను.. తాతయ్యగారు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చే దాకా కుటుంబంలో గొడవలు పడకూడదు అని అన్నారు.. ఆయన తిరిగి వచ్చాక ఎవరికి ఎలా న్యాయం చెయ్యాలో అలా చేస్తాను అని అన్నారని కావ్య అంటుంది. ఇక ఇందిరాదేవి అయితే.. బావా అంటూ ఐసీయూ గేట్ నుంచి లోపలికి చూస్తూ ఏడ్చే సీన్ మాత్రం మనసుల్ని మెలిపెట్టేస్తుంది.  మరోవైపు కళ్యాణ్ ఇంటికి ఓ పోస్ట్ వస్తుంది. అది చూసి కళ్యాణ్ సంబరపడి.. అప్పుని పిలిచి ఇస్తాడు. వావ్ కూచీ.. నేను గెలిచాను.. పోలీస్ అయ్యాను.. ట్రైనింగ్‌కి లెటర్ వచ్చేసిందని అప్పు అంటుంది. అవును నా పొట్టీ పోలీస్ అయ్యిందని కళ్యాణ్ అంటాడు. అవునురా భయ్.. ఇక నుంచి నేను నీ పోలీస్ పెళ్లాన్ని.. నువ్వు నా పాటల మొగుడివి అంటూ గుండెలపై వాలిపోతుంది అప్పు. పొట్టీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం మనం ఎంతో ఎదురు చూశాం.. ఈ విషయం వెంటనే తాతయ్య వాళ్లకు చెప్పాలి.. తాతయ్య అయితే చాలా సంతోషిస్తారని అంటాడు కళ్యాణ్. ఇంతలో ఆ లెటర్ లో ట్రైనింగ్ ఈ రోజే అని ఉండటంతో.. తొందరగా బ్యాగ్ తెచ్చుకో , నేను మా ఫ్రెండ్ కి చెప్పి టికెట్ బుక్ చేస్తా అని అంటాడు కళ్యాణ్. ఇంతలో కావ్య ఫోన్ చేసి.. తాతయ్య గారిని హాస్పిటల్ లో జాయిన్ చేశామని జరిగిందంతా చెప్తుంది. సరే వదినా వస్తామని చెప్పి కళ్యాణ్ ఫోట్ కట్ చేస్తాడు. ఇంతలో అప్పు రెడీ అయి వస్తుంది. సారీ అప్పు నేను రావడం లేదు.. లిరిక్ రైటర్ రమ్మన్నాడు.. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలని కళ్యాణ్ అనగా.. కాబోయే ఎస్సై ని నాకేం భయం.. నేను వెళ్తానని అప్పు వెళ్తుంది. సారీ అప్పూ.. తాతయ్యకు బాలేదని తెలిస్తే నువ్వు ఆగిపోతావ్.. నువ్వు ఆగిపోకూడదు.. అందుకే చెప్పడం లేదని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.