గడ్డం తీస్తేనే మూవీ రోల్ ఇస్తానన్న రామ్ చరణ్...అల్లు అర్జున్ తో నటిస్తా

బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్, పృద్వి ఇద్దరి మేల్ జోడి అద్భుతంగా ఉంటుంది. నిఖిల్ నల్ల కళ్లజోడుతో, పృద్వి గడ్డంతో వెనక జుట్టుతో కళ్లజోడుతో ఉంటాడు. వీళ్ళను కే బ్యాచ్ అని పిలుస్తారు. ఇక వీళ్లద్దరి ఫ్రెండ్ షిప్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. ఐతే వీళ్ళు ఒక షో ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో పృద్వి శెట్టి గురించి ఒక విషయం లీకైంది. "గడ్డం తీస్తేనే మూవీలో రోల్ ఇస్తానని రామ్ చరణ్ అంటే రోల్ ఏంటి అని అడిగావట ఏంటి" అంటూ హోస్ట్ తేజస్విని మాదివాడ అడిగేసరికి నవ్వేసాడు. దానికి నువ్వు నిజంగానే హీరో లాగా ఉన్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది తేజస్విని. "నాకు ఇండస్ట్రీ మీద ఇంటరెస్ట్ రావడానికి కారణం నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ " అని చెప్పుకొచ్చాడు పృద్వి శెట్టి. తర్వాత నిఖిల్ ని అడిగింది .."ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా" అని. "లేదు " అన్నాడు. "ప్యాచప్ లేదా బ్రేకప్" అని ఇంకో క్వశ్చన్ అడిగింది. ప్యాచప్ అని నిఖిల్ ఆన్సర్ ఇచ్చేసరికి ఎవరితో ప్యాచప్ చెప్పు అంటూ ఆతృతగా అడిగింది. 'హే వద్దులే ...నేను స్క్రాచ్ లోంచి వచ్చాను ఇప్పుడు ఇలా కాన్ఫిడెంట్ తో ఉన్నా. ఒకవేళా మళ్ళీ స్క్రాచ్ లో పడాల్సి వచ్చినా ఎలా లేవాలో నాకు బాగా తెలుసు..సరే నన్ను ఎవరైనా బ్లేమ్ చేస్తూ ఉంటూ వదిలేస్తా" అన్నాడు నిఖిల్. నిఖిల్ కి కావ్యకి మధ్య ఎం జరిగిందో అసలు విషయం తెలీదు కానీ ఇద్దరికీ షోస్ లో బాగా కోల్డ్ వార్ జరుగుతోంది. " నేను బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటే అల్లు అర్జున్ తో షేర్ చేసుకుంటా" అని చెప్పాడు నిఖిల్.

ఒక ముద్దును అప్పుగా ఇస్తారా..ఆదిత్య ఓంని అడిగిన ఆరియాన

కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే గుండె టక్కున ఆగిపోయేలా ఉంటాయి. ఇంతకు ఎదుటి వాళ్ళు ఎం అడిగార్రా నాయనా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నటుడు, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం పరిస్థితి కూడా అలాగే ఉంది. దావత్ ఇంటర్వ్యూకి వెళ్లిన హీరో ఆదిత్య ఓంని హోస్ట్ ఆరియానా ఒక విషయం అడిగింది. దానికి ఆయన గుండె పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ఆరియానా ఎం అడిగింది అంటే "నేను మీ దగ్గర నుంచి ఒక ముద్దును అప్పుగా తీసుకోవచ్చా...తర్వాత తిరిగిచ్చేస్తాను" అంటూ రొమాంటిక్ డైలాగ్ ని చెప్పేసరికి ఆదిత్య ఓం ఎదురు చూడని ఆ ప్రశ్నకు షాకై గుండె పట్టేసుకున్నాడు. ఐతే ఆరియానా తొందరపడి "మీరెలాగూ ఇవ్వడం లేదు ముద్దు నేనే వచ్చి తీసుకుంటా" అని సీట్ లోంచి లేచేసరికి ఆదిత్య ఓం చాలా భయపడిపోయి వద్దు అంటూ నోరెళ్లబెట్టేసాడు. కానీ ఆరియానా వెళ్లి అతని పక్కన కూర్చునేసరికి ఆదిత్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఫేక్..ఇక్కడ ఉండేది కమర్షియల్ రిలేషన్ షిప్స్ , కమర్షియల్ పార్టనర్ షిప్స్ అంటూ టాలీవుడ్ మీద ఒక పెద్ద డైలాగ్ వేసేశాడు. 2002లో లాహిరి లాహిరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ మూవీ  తర్వాత అతనికి చెప్పకోగదగ్గ హిట్ రాలేదు.  ఆయన తండ్రి ఐఏఎస్.. తల్లి సమాజ్‌వాదీ పార్టీలో కీలక నాయకురాలు. ఆదిత్య ఓంది ఎంత గొప్ప మనసు అంటే  తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిని దత్తత తీసుకుని అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

కడుపొచ్చింది అని చెప్పి నామినేషన్స్ లో పెట్టడం కరెక్ట్ కాదు : ఆదిరెడ్డి

ఇక ఇష్మార్ట్ జోడి సీజన్ 3 లో లాస్ట్ వీక్ వెడ్డింగ్ థీమ్ ఇచ్చాడు. ఇక ఈ వారం స్కూల్ థీమ్ తో జోడీస్ రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజయింది. ఇక ఇందులో కంటెస్టెంట్స్ అంతా కూడా స్కూల్ డ్రెస్సుల్లో వచ్చారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ ని స్టార్ట్ చేసాడు హోస్ట్ ఓంకార్. ఐతే ఆదిరెడ్డి - కవితను స్టేజి మీద నిలబెట్టారు. వాళ్ళ మీద రెడ్ ఇన్క్ ని జల్లారు జోర్దార్ సుజాత - రాకేష్ జోడి అలాగే అనిల్ గీలా - ఆమని జోడి. వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే "కవిత ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి గేమ్స్ లో ఇబ్బంది అవుతుందేమో అని" ఆ రెండు జోడీలు చెప్పాయి. దాంతో ఆదిరెడ్డి ఇలా అన్నాడు "కన్సీవ్ అని చెప్పి నామినేట్ చేస్తే కవిత ఒప్పుకోదు.  అది కరెక్ట్ రీజన్ కాదు అని నా ఉద్దేశం. కన్సీవ్, కడుపు అని చెప్పడం కరెక్ట్ కాదు. కడుపు వచ్చిన తర్వాత కూడా ఆడతానని ధైర్యంగా వచ్చినప్పుడు కవితను మెచ్చుకోవాలి కానీ నామినేషన్ ని రీజన్ గా చెప్పడం కరెక్ట్ కాదు" అని అన్నాడు ఆదిరెడ్డి. ఇక ఈ ఎపిసోడ్ లోకి సెక్సీ బాంబు చొక్కారపు స్రవంతి స్కూల్ స్టూడెంట్స్ డాన్స్ నేర్పే టీచర్ గా తీసుకొచ్చాడు ఓంకార్. "మా ఇంటి ముందుంది పెట్రోల్ బ్యాంకు...ఓంకార్ గారు హ్యాండ్ సం హన్కు" అంటూ తెగ ఫ్లర్ట్ చేసేసింది. ఇక ఆయన్ని ఒక గులాబీతో ఆయన్ని గిలిగింతలు పెట్టింది. కాసేపు స్టూడెంట్స్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది.

సుమ కనకాల భర్తకు లైన్ వేస్తున్న సౌమ్య..ఏకె 47 అని ఆదిని పెళ్లి చేసుకున్నా..కానీ

న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన దావత్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సౌమ్య రావు ఐతే ఆదిని ఫుల్ గా తన స్పెషల్ తెలుగు భాషతో ఆడేసుకుంది. సౌమ్య స్టేజి మీదకు రాగానే నాటి నరేష్ వచ్చాడు. తర్వాత ఆదిని ఒక రేంజ్ లో ఆడుకుంది సౌమ్య.  "ఆదితో పెళ్ళై ఆరేళ్ళు అయ్యింది..ఆదికి కడుపొచ్చింది .. నాకు కడుపెక్కడిది ..నీకు అందరి దాహం గురించి తెలుసు. నా గురించి మాత్రం తెలీదు. ఎప్పుడూ బయట పని చేస్తాడు..ఇంట్లో నా పని చూడడు... నా మొగాడు,నా మొగుడు ఇంట్లో పని చేయడు. నన్ను పట్టించుకోవడం లేదు." అనేసరికి ఆది ఫుల్ జోష్ తో డైలాగ్ చెప్పేసాడు. "ఏమే రేపటి నుంచి మునక్కాకాయలు వంటి  అరుదుగా దొరికేవన్నీ చేసి పెట్టు... తింటాను" అన్నాడు ఆది.. "ఎదురుగా కనిపించే నన్ను వదిలేస్తావు. అవన్నీ తింటావు.." అనేసరికి.."ఏంటే తాలింపులో కరివేపాకులా నన్ను తగులుకున్నావ్" అని ఆది అడిగేసరికి " నువ్వు కొత్తిమీరగాడివి కదా అందుకే నేను కరివేపాకులా కనిపిస్తాను నీకు" అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. తర్వాత ఆది పక్కకు వచ్చిన  రీతూ చౌదరి, ఆరియానా అతని  భుజం మీద చేతులు వేసేసరికి "ఎవరండీ మీరు  పంది మీద పురుగుల్లా వాలారు మా అయన మీద" అంటూ తిట్టింది సౌమ్య. "ఏకె 47 అని చెప్పారని పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లయ్యాక తెలిసింది అసలు ఏకె 47 కాదు" అంటూ ఆది పరువు తీసేసింది సౌమ్య. "అలా అన్ని విషయాలు చెప్పకు వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు" అంటూ సుమ రాజీవ్ కనకాలను చూపిస్తూ చెప్పేసరికి .."బబుల్ గం తినేంత పెద్ద కొడుకు ఉన్నాడంటే నమ్మొచ్చు కానీ రాజీవ్ కనకాల  చాలా యంగ్ గా ఉన్నారు" అని సౌమ్య అనేసరికి "ఏంటి మా ఆయనకు లైన్ వేస్తున్నావ్ వెళ్ళు" అంటూ పంపేసింది.

అనామిక, నందగోపాల్  మంతనాలు.. కావ్య కనిపెట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -607 లో.....రుద్రాణి హాల్లో కూర్చొని.. పనిమనిషి శాంతని కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడే ఇచ్చాను కదా అని శాంత అనగానే.. నాకు మళ్ళీ కావాలని రుద్రాణి అంటుంది. అయితే ఇక మళ్ళీ అడగొద్దు.. ఇంట్లో ఎవరికి అయిన కాఫీ, టీలు రోజుకి రెండు సార్లు ఇవ్వద్దని కావ్య చెప్పిందని శాంత అంటుంది. కోపంగా సరే తీసుకొని రా అని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి కాఫీ తాగుతూ బయటకు చూస్తుంది‌. అక్కడ రాజ్, కావ్యలు డ్రైవర్ తో కార్లన్ని తీసుకొని వెళ్ళమనడం చూస్తుంది. అప్పుడే రుద్రాణి దగ్గరికి వస్తాడు రాహుల్. ఇది మంచి ఛాన్స్ ఇంట్లో గొడవ చెయ్యొచ్చని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాణి. మరొకవైపు రాజ్ , కావ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. జగదీష్ చంద్ర గారి ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్‌మెంట్ కి అయిదు కోట్లు కావాలని రాజ్ టెన్షన్ పడుతుంటే.. అప్పుడే జగదీష్ చంద్ర వస్తాడు. కావ్య గారు ఫోన్ చేసి అయిదు కోట్లు అడ్వాన్స్ ఇవ్వడానికి రమ్మని చెప్పారు. ఇదిగోండి అయిదు కోట్ల చెక్కు అని ఇవ్వగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను వెళ్ళిపోయాక ఎంత మంచి పని చేసావంటూ కావ్యని ఎత్తుకొని తిరుగుతాడు రాజ్. అప్పుడే శృతి వస్తుంది. తనని చూసి కావ్యని కింద పడేస్తాడు. పర్మిషన్ తీసుకొని రావాలి అని తెలియదా అని తనని రాజ్ కోప్పడి వెళ్ళిపోతాడు. ఏంటి మేడమ్ మిమ్మల్ని ఆఫీస్ కి రానిచ్చారు.. పొగిడారు.. ఇప్పుడు ఎత్తుకొని తిరుగుతున్నారని శృతి అనగానే.. కావ్య సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏదో వర్క్ ఉంది అంటూ సుభాష్ ఒక కార్ ని తీసుకొని వెళ్తాడు. ఇదే కరెక్ట్ టైమ్ అంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. మనం బయటకు వెళదాం పదా అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసరికి కార్ ఉండదు. దాంతో ధాన్యలక్ష్మి డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. డ్రైవర్ తో ధాన్యలక్ష్మి కోపంగా మాట్లాడేసరికి.. అతను కూడా అలాగే మాట్లాడతాడు. కావ్య మేడమ్ కార్ లు అన్ని తీసుకొని వెళ్ళమందని చెప్తాడు. దాంతో  ధాన్యలక్ష్మిని ఇంకా రెచ్చగొడుతుంది రుద్రాణి. లోపలికి వెళ్లి అపర్ణని పిలిచి.. నీ కోడలు ఇంట్లో కార్లు లేకుండా చేసింది.. మేము ఇప్పుడు ఆటోలో వెళ్లాలా ఎందుకు ఇలా చేసిందో కనుక్కోమని ధాన్యలక్ష్మి అంటుంది. తర్వాత కావ్యకి ఫోన్ చేస్తుంది అపర్ణ. బిజీ ఉన్నా అత్తయ్య అని కావ్య అనగానే.. అపర్ణ సరే అంటుంది. నా కోడలు బిజీగా ఉందని అపర్ణ చెప్పడంతో.. వాళ్లు ఇంకా కోప్పడతారు. తరువాయి భాగంలో అనామిక, నందగోపాల్ మాట్లాడుకుంటారు. మరొకవైపు రాజ్ తన పోలీస్‌ ఫ్రెండ్ కి కాల్ చేసి నందగోపాల్ ఫారెన్ వెళ్ళలేదని చెప్పగానే.. సరే నా భార్య నేను వాడిని ట్రేస్ అవుట్ చేస్తామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీతాకాంత్ ఆస్తుల కోసం భద్రం కుట్ర.. వాళ్ళని వాడుకొని సాధిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -293 లో..... భద్రం రియల్ ఎస్టేట్ లో మోసం చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తాడు. ఒకతను భద్రం దగ్గరికి వచ్చి ఇలా మోసం చేస్తావా అంటూ అడుగుతాడు. దాంతో అతడిని చంపేస్తానంటూ భద్రం బెదిరిస్తాడు. నిన్ను కూడా ఎదురించే వాళ్లు వస్తారంటూ అతను వెళ్ళిపోతాడు. అప్పుడే భద్రం దగ్గరికి శివ మరియి సందీప్ ఫ్రెండ్ వస్తారు. సీతాకాంత్ తెలుసు కదా వాళ్ళ కుటుంబంలో ఏదో గొడవలు వచ్చాయంటూ చెప్తాడు. నేను చెప్పినట్టు చేయమని భద్రానికి శివ చెప్తాడు ఆ తర్వాత ఎన్నో సార్లు సీతాకాంత్ ని ట్రాప్ చేయాలని చూసా కానీ వీలవ్వలేదు.. ఇప్పుడు వీళ్లని వాడుకొని ఆస్తులన్నీ లాక్కుంటానని భద్రం అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి లు రూమ్ కోసం వెతుకుతారు. అప్పుడే ఒక టూలెట్ బోర్డు కన్పించడంతో లోపలికి వెళ్తారు. అక్కడ ఒక ముసలావిడ కష్టపడుతుంటే.. తనకి ఇద్దరు సాయం చేస్తారు. ఆ తర్వాత ముసలావిడ వాళ్ళకి రూమ్ చూపిస్తుంది. ఇద్దరు కలిసి రూమ్ ని క్లీన్ చేస్తరు. మరొకవైపు సందీప్ ధన ఇద్దరు ఫుల్ గా తాగుతుంటారు. మనం దురదృష్టవంతులం ఇంత ఆస్తులున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అనుకుంటారు. వెయిటర్ ని పిలిచి ఇంకా తీసుకొని రా అంటాడు. మీరు డబ్బు ఇవ్వలేదు. ఇస్తేనే ఇంకా మీకు మందు ఇవ్వమన్నాడని అతను అనగానే అతనిపై ఇద్దరు కోప్పడతారు. అప్పుడే అక్కడికి భద్రం శివలు వస్తారు. శివకి డబ్బు ఇచ్చి భద్రం పంపిస్తాడు. శివ వచ్చి నేను బిల్ పే చేస్తాననగానే ..అరేయ్ డబ్బు నన్నే అడిగేవాడివి ఎలా డబ్బు కడతానంటున్నావని సందీప్ అంటాడు. మా ఆస్తుల విషయం మా తోబుట్టువులు అడ్డుపడుతుంటే ఒకతను సాయం చేసాడని భద్రం గురించి వాళ్ళకి చెప్తాడు. అలా చెప్పగానే మేము అలాంటి ప్రాబ్లమ్ లోనే ఉన్నాం. మాకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయమని సర్ కి చెప్పమని సందీప్ అంటాడు. అవునా సర్ ఇక్కడికి వస్తానన్నాడంటూ అదిగో సర్ వచ్చాడని భద్రాన్ని చూపిస్తాడు శివ. ఆ తర్వాత సందీప్ జరిగింది మొత్తం భద్రానికి చెప్తాడు. నేను చూసుకుంటానని భద్రం చెప్తాడు. వీళ్ళని నమ్మించానని భద్రం అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీపే అసలైన వారసురాలనే విషయం చెప్తానన్న దాస్.. అతని కాళ్ళు పట్టుకున్న జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -242 లో..... ఏదో చేస్తానని వచ్చావ్.. ఏమైందని జ్యోత్స్నతో పారిజాతం అనగానే బావని చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో.. అది చూసి ఏం చెయ్యగలనని జ్యోత్స్న అంటుంది. సరే పదా అని ఇద్దరు వెళ్తుంటే.. కాశీ పిలిచి టిఫిన్ తిన్నారు కదా డబ్బులు ఇవ్వండి అంటాడు. దాంతో జ్యోత్స్న కొంత ఎక్కువ డబ్బులు ఇస్తూ ఇది నా స్థాయి అంటుంది. దాంతో దీప వెనక్కి పిలిచి రోజుకి ఇద్దరికి నేను టిఫిన్ ఫ్రీగా పెట్టాలనుకుంటున్నా అందుకే మీ డబ్బు మీకు ఇస్తున్నానంటూ తిరిగి ఇచ్చేస్తుంది. దాంతో పాటు ఇచ్చింది ఇచ్చినట్టు ఇవ్వకూడదు కదా అందుకే ఈ పదకొండు రూపాయలని దీప ఇవ్వగానే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇంటికి రాగానే.. ఎక్కడికి వెళ్లారని సుమిత్ర అడుగుతుంది. మీ అల్లుడు పరువు తీసున్నాడని అంటుంది. అప్పుడే శివన్నారాయణ‌ వస్తాడు. అతనికి కార్తీక్, దీప ఇద్దరు టిఫిన్ సెంటర్ పెట్టిన ఫోటో చూపిస్తాడు. ఆ తర్వాత దశరత్ ని శివన్నారాయణ‌ పిలిచి ఫోటో చూపిస్తూ.. నీ అల్లుడు లేకుంటే మనం ఏమైపోతామో అన్నావు కదా.. నీ అల్లుడు ఆలోచన విధానం ఇది అంటూ కార్తీక్ ని తక్కువ చేసి మాట్లాడతాడు శివన్నారాయణ‌. మరొక వైపు దీప డబ్బు లెక్కపెడుతుంటే డబ్బులు చాలానే వచ్చాయని కార్తీక్ అంటాడు. రేపటి నుండి మీరు టిఫిన్ సెంటర్ కి రాకండి అని దీప అనగానే కార్తీక్ వస్తానని అంటాడు. మీ స్థాయి ఇది కాదని దీప అంటుంటే.. నీది నాది ఒకే స్థాయి అంటూ కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ ని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అయినట్లు ఉహించుకుంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. నాన్న ఫోన్ లేదు కదా ఫోన్ కొనుక్కో అంటుంది అమ్మ ఫోన్ ఉంది కదా అది సరిపోతుందని కార్తీక్ అంటాడు. ఇద్దరికి ఒకే ఫోన్ ఆ అని శౌర్య అనగానే.. ఇద్దరం ఒకటే.. ఒకటి సరిపోతుందని కార్తీక్ అంటాడు. ముగ్గురం ఒకటే అని శౌర్య అంటుంది. మరొకవైప దీప మాటలు గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే దాస్ ఇంటికి రావడం చూసి.. ఎవరు చూడకుండా తన దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్ర వదినకు దీపే అసలైన వారసురాలని చెప్తానని దాస్ అంటాడు. వద్దని దాస్ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. అది పారిజాతం చూసి నేను చూస్తుంది నిజమేనా.. వాళ్లేం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నర్మద ప్లాన్ సక్సెస్.. ఎదురింట్లో పెళ్ళి అనగానే అందరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -43 లో......ప్రేమ దగ్గరికి భద్రవతి వెళ్తుంది. ఏటి నా కోడలికి కోపం వచ్చిందా.. నీకు చెప్పకుండా ఇదంతా చేస్తన్నందుకు కోపం వచ్చిందా అని భద్రవతి అడుగుతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని భద్రవతి అడుగుతుంది. నిన్ను చిన్నప్పటి నుండి మేనకోడలులాగా ఎప్పుడు చూడాలేదు.. కూతురులా చూసుకున్నాను.. వేదవతిని ఇంతే ప్రేమగా చూసుకున్నాను కానీ చివరికి పెళ్లి టైమ్ కి లేచిపోయింది. దానికి పెళ్లి చెయ్యలేదన్న బాధ ఉంది కానీ నీ పెళ్లి నా చేతుల మీదుగా చేస్తున్నానంటూ ప్రేమతో భద్రవతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ తో లేచిపోతే అంటూ ప్రేమ భయపడుతుంది. మరొకవైపు నర్మద గదిలోకి వస్తుంది. సాగర్ వస్తుంటే నాకు తల నొప్పిగా ఉందని అనడంతో సాగర్ టాబ్లెట్ ఇస్తాడు కానీ నర్మద టాబ్లెట్ వేసుకోదు. రామరాజు వేదవతిల మాటలు గుర్తుచేసుకుంటుంది. మాటి మాటికి తలనొప్పి తగ్గిందా అంటూ సాగర్ అడుగుతాడు. లేదని నర్మద అంటుంది. సారీ సాగర్ బాధపెడుతున్నానని అంటుంది. మరుసటిరోజు ఉదయం సాగర్ లేచేసరికి నర్మద వేసుకోకుండా పడేసిన టాబ్లెట్ కనిపిస్తుంది. అప్పుడే నర్మద టీ తీసుకొని వస్తుంది. తలనొప్పి తగ్గిందా టాబ్లెట్ వేసుకున్నావా అని సాగర్ అడుగగా.. తగ్గిందని నర్మద అంటుంది. ఆ తర్వాత తులసి పూజ చెయ్యడానికి నర్మద వెళ్తుంటే.. నేను చేస్తానంటూ వేదవతి అంటుంది. నేను చేసాక చేసుకోమని వేదవతి చెప్తుంది. మరొకవైపు ప్రేమ పెళ్లి పనులు మొదలవుతాయి. ఎదురింట్లో ఏం జరుగుతుందని అందరు ఆశ్చర్యం గా చూస్తారు. తిరుపతి వెళ్లి కనుక్కోమని వేదవతి అంటుంది. తిరుపతి వెళ్లి ఏం జరుగుతుంది అని అడుగగా.. నా మేనకోడలు పెళ్లి అని భద్రవతి చెప్తుంది. అది విని వేదవతి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ప్రేమ హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే.. వేదవతి చూస్తుంటుంది. తను చూడకుండా భద్రవతి అడ్డుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ప్రేరణ అసలు రంగు బయట పడింది.. బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడిందన్నమాట

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో సీరియల్ యాక్టర్స్ అలాగే బిగ్ బాస్ 8  కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక ఇందులో ప్రేరణ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఐతే ప్రేరణ బిగ్ బాస్ లో అన్ని రకాల పనులు చేసింది కానీ ఇంట్లో మాత్రం అలాంటివి ఏమీ చేయదట. ఆ విషయాన్ని స్వయంగా ఆమె భర్త శ్రీపద్ ఈ స్టేజి మీద చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ మాస్క్ తో ఆడిందా అంటూ శ్రీముఖి అసలు విషయాలను లీక్ చేసేసింది. ఇంతకు శ్రీపద్ ఎం చెప్పాడంటే " నేను ఉదయం 7 గంటలు లేస్తే ప్రేరణ లేచేది 11 కి లేస్తుంది. నిద్ర లేస్తుంది కానీ దుప్పట్లు దిండ్లు సర్దనే సర్దదు..అలా వెళ్ళిపోతుంది. ఎవరైనా లేచాక ఎం చేస్తారు స్నానం చేసి ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు కానీ ప్రేరణ నాలుగు రోజులు అసలు స్నానమే చేయదు. ఈ రోజు షోకి వస్తుంది కాబట్టి చేసింది. అందుకే నేను కూడా ఈ షోకి వచ్చాను. మంచిగా డిన్నర్ ఏదైనా వండిపెడతావా అని అడుగుతాను. 8 గంటలకు ఆకలి వేస్తూ ఉంటుంది. ఇక తాను కిచెన్ లోకి వచ్చేసరికి ఏడున్నర ఐపోతుంది. ఇక అప్పుడు మొదలు పెడితే రాత్రి పది గంటలు దాటేస్తుంది డిన్నర్ ప్రిపరేషన్. ఒక్క రోజు మ్యాగీ చేసింది అంతే" అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. ఇక అందరూ కూడా ప్రేరణతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా అంటూ శ్రీపద్ కె ఓట్లేశారు. ఇక ఫైనల్ గా వాళ్ళ పెళ్లి ఎవరూ చూడలేదు కాబట్టి శ్రీముఖి ఇద్దరి చేత దండాలు మార్పించి లవ్ ప్రొపోజల్ చేసుకునే స్పేస్ ని క్రియేట్ చేసింది.

Illu illalu pillalu : అన్నకి పెళ్ళి కాకుండా తమ్ముడికి శోభనం.. మామ మాటలకి కోడలు షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -42 లో..... నర్మద, సాగర్ లకి శోభనం ఏర్పాట్లు చేస్తారు. మరొకవైపు ప్రేమని చూసి వెళ్ళినవాళ్ళు భద్రవతితో ఫోన్ లో మాట్లాడతారు. అప్పుడే సేనాపతి వచ్చి.‌. ఎవరు ఫోన్ లో..  ఏం అంటున్నారంటూ అడుగుతాడు. అమ్మాయిని రెండు రోజుల్లో పెళ్లి చేసుకొని.. వారం రోజుల్లో అమెరికా తీసుకొని వెళ్తానంటున్నారని చెప్తుంది. రెండు రోజుల్లో పెళ్లా అని ప్రేమ షాక్ అవుతుంది. రెండు రోజుల్లో చేసేద్దామని విశ్వ అంటాడు. నా మేనకోడలు పెళ్లి అంటే గ్రాండ్ గా చెయ్యాలనుకుంటున్నా కానీ రెండు రోజుల్లో ఎలా అని భద్రవతి అంటుంది. నేను చూసుకుంటానని విశ్వ అంటాడు. దాంతో ప్రేమ కోపంగా లోపలికి వెళ్తుంది. హడావిడిగా ఎందుకు పెళ్లి అని భద్రవతి వాళ్ళ అమ్మ అంటుంది. ప్రేమకి పెళ్లి ఇష్టం లేక కాదు చెప్పకుండా చేస్తున్నామని కోపమని భద్రవతి అంటుంది. మరొకవైపు నర్మద గదిలోకి వెళ్తుంటే.. కామాక్షి ఆడపడుచు కట్నం ఇవ్వకుండా పంపించానంటుంది. దాంతో నర్మద రింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నర్మద గదిలోకి వెళ్తుంది. నర్మద, సాగర్ లు ప్రేమగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే కామాక్షి ఫోన్ చేస్తుంది. అది వినబడకపోతే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. రింగ్ తులమన్నావ్ అర్థతులమే ఉందని.. రేపు నాకు కొనివ్వాలని అంటుంది‌. దాంతో సరేనని నర్మద గదిలోపలికి వెళ్తుంటే.. అప్పుడే రామరాజు, వేదవతి లు మాట్లాడుకోవడం నర్మద వింటుంది. పెద్దోడికి పెళ్లి కాకుండా ఇలా నడిపోడికి శోభనమంటే వాడు బాధపడుతాడని రామరాజు అంటాడు. మరి వెళ్లి అపనా అని వేధవతి అనగానే.. నువ్వే పంపించి నువ్వే ఆపుతావా అని రామరాజు అంటాడు. ఆ మాటలన్నీ నార్మద వింటుంది. మరొకవైపు భద్రవతి ప్రేమ దగ్గరికి వస్తుంది. తరువాయి భాగంలో ప్రేమకి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపల కొత్త బిజినెస్.. జ్యోత్స్నలో మొదలైన కుళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -241 లో.... దీప టిఫిన్ సెంటర్ పెడుతుంది. పూజ చేస్తుంది. దానికి అందరు వస్తారు. టిఫిన్ సెంటర్ ఎవరి పేరునోనని చెప్పకుండా సర్ ప్రైజ్ అంటుంది. తీరా చూస్తే కార్తీక్ పేరు ఉంటుంది. అది చూసి మా అక్కకి బావ అంటే ఎంత ఇష్టమో టిఫిన్ సెంటర్ పేరు కూడా బావ పేరు పెట్టిందని కాశీ అంటాడు. కార్తీక్ ఉంటే బాగుండు వాడికి ఇష్టం లేకుండా ఇది చేస్తున్నామని అనుకుంటుండగా అప్పుడే కార్తీక్ మాస్ లుక్ లో ఎంట్రీ ఇస్తాడు. భుజాన వాటర్ టిన్ తో, లుంగీలో ఎంట్రీ ఇస్తాడు కార్తీక్ . ఆ తర్వాత కార్తీక్  వాటర్ టిన్ తీసుకొని వస్తుంటే.‌ అది చూసి అందరు షాక్ అవుతారు. మీరు వచ్చినందుకు చాలా థాంక్స్ అని దీప అనగానే.‌. టిఫిన్ సెంటర్ నా పేరు నా పెట్టినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానని కార్తీక్ అంటాడు. అమ్మ నువ్వు మొదట బోణి చెయ్ అంటూ తనకి కార్తీక్ ముందుగా టిఫిన్ ఇస్తాడు. ఆ తర్వాత అందరికి టిఫిన్ ఇస్తాడు‌. అందరూ బాగుందని అంటారు. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామంటూ కాశీ ఫోటో తీస్తాడు. మరొకవైపు జ్యోత్స్న డిజైన్స్ వేస్తుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పగానే పారిజాతం చూస్తుంది. కాశీ గాడు ఫోటో పంపాడని కార్తీక్, దీప లతో టిఫిన్ సెంటర్ దగ్గరున్న ఫోటోని పంపిస్తాడు. అది చూసి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అక్కడికి టిఫిన్ చెయ్యడానికి వెళదామంటూ పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది. ఇక జ్యోత్స్న ఎప్పటిలాగే కార్తీక్ ని ఆ  స్టైల్ లో చూసి రెస్టారెంట్ ఓనర్ ని టిఫిన్ సెంటర్ ఓనర్ లాగా చేసావ్ కదనే అని దీపను తిడుతుంది. పారిజాతం ఫోటో తీసుకుంటుంటే.. ఇంకా బాగా తీసుకోమంటూ కార్తీక్ స్టిల్స్ ఇస్తుంటాడు. ఏదో చేస్తానని వచ్చావ్ కదా అని జ్యోత్స్నతో పారిజాతం అనగానే.. బావ చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో.. ఏం చెయ్యాలి ఇక అంటూ జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి చేసిన మోసాన్ని తల్చుకొని ఏడ్చేసిన కొడుకు.. భార్యతో కొత్త ప్రయాణం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -292 లో..... శ్రీలత చేసిన మోసాన్ని సీతాకాంత్ గుర్తుచేసుకుంటూ బాధపడతాడు. అంత నమ్మిన తల్లి అతన్ని మోసం చేసిందన్న జాలి చూపించడం భరించలేకపోతున్నాను రామలక్ష్మి అని సీతాకాంత్ బాధపడుతాడు. మీరేం బాధ పడకండి అని రామలక్ష్మి ధైర్యం చెప్తుంది. తన ఒళ్ళో తల పెట్టి పడుకుంటాడు. ఇక నీ చెయ్యి ఎప్పుడు వదలను రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లో కన్పించక పోయేసరికి సుజాత మాణిక్యం దగ్గరికి వచ్చి నిద్ర లేపుతుంది. వాళ్లు ఇంట్లో ఎక్కడ లేరనగానే అల్లుడు గారు తన తల్లి చేసిన మోసాన్నీ తట్టుకోలేక మన ముందు ఉండలేక వెళ్లిపోయి ఉంటాడు. అయిన తన వెంట రామలక్ష్మి ఉంది కదా ఎందుకు భయమని మాణిక్యం రిలాక్స్ గా ఉంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు నడుస్తూ వెళ్తారు. మన జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నాం. పాత విషయాలు పట్టించుకోకుండా మనసులో ఉంచుకోకుండా హ్యాపీగా ఉండాలని రామలక్ష్మి అంటుంది. అటుగా వాళ్లు వెళ్తుంటే.. దారిలో ఒకతను టీ షర్ట్స్ అమ్ముతుంటాడు. తనకి గిరాకీ అవ్వదు.. నేను అమ్మేలా చేస్తాను అనడంతో అలా చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఇస్తానని అతను అంటాడు. దాంతో సీతాకాంత్ తన బిజినెస్ మైండ్ తో అవి అమ్ముడు పోయేలా ఆఫర్ పెడతాడు. దాంతో పాటు రామలక్ష్మి కస్టమర్స్ ని పిలుస్తూ ఉంటుంది. దాంతో టీ షర్ట్స్ అమ్ముడుపోతాయి.   అతను ఫిఫ్టీ పర్సెంట్ లాభాన్ని సీతాకాంత్, రామలక్ష్మిలకి ఇస్తాడు. ప్రస్తుతం మనం బ్రతకడానికి డబ్బు వచ్చిందని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పుల వాళ్లు వచ్చి సందీప్ ని ఏమైనా అంటారేమో అని సందీప్ భయపడుతాడు. ఆ రామలక్ష్మి ని ఎదరుకునే కరెక్ట్ పర్సన్ ని తీసుకొని రావాలని ధన, శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే భద్రం ఒక దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తను అందరిని మోసం చేసి ల్యాండ్ అమ్ముతాడు. వాళ్లు తిరగబడితే అతన్ని చంపుతానంటూ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Brahmamudi : డబ్బుల కోసం కార్లని పంపించేయాలనుకున్న కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీ కనిపెడతారా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -606 లో.... కావ్య, రాజ్ లు ఎందుకో టెన్షన్ పడుతున్నారని, అదేంటో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. ఇంత డబ్బు ఉండి అయిదు లక్షల హాస్పిటల్ బిల్ కట్టలేదని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. ఆస్తులు, డబ్బు అన్నీ కూడా వాళ్ళ పేరున చేసుకొని ఉంటారు లేక డబ్బు లేకపోవచ్చని రుద్రాణి అన్ని యాంగిల్స్ లో ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఇంత ఆస్తులున్నాయి.. డబ్బు ఎందుకు ఉండదని ధాన్యలక్ష్మి అనగానే ఒక్కోసారి ఎన్ని ఆస్తులున్నా ఇలా జరుగుతుందని రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ తన ఫ్రెండ్స్ ని అయిదు లక్షలు అప్పు అడుగుతాడు. వాళ్ళు లేవని అనడంతో రాజ్ ఫీల్ అవుతాడు. అప్పుడే కావ్య తన నగలు తీసుకొని వచ్చి.. ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రండి అనగానే ఇంట్లో ప్రాబ్లమ్ అవుతుందని రాజ్ అంటాడు. ఏం ప్రాబ్లమ్ అయిన నేను చూసుకుంటానని కావ్య అంటుంది. రాజ్ తన వంక ప్రేమగా చూసేసరికి.. ఏంటి నన్ను హగ్ చేసుకోవలనిపిస్తుందా అని కావ్య అనగానే.‌. నా మనసులో మాట ఎలా కనిపెట్టిందని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి బిల్ కట్టలేదు అంటాడు. అదంతా అప్పు వింటుంది. కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తాడు. బిల్ కట్టాడని కళ్యాణ్ అంటాడు. అప్పుడే నర్సు వచ్చి బిల్ పే చేశారని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పుతో కళ్యాణ్ మాట్లాడతాడు. ఏం జరిగింది చెప్పకుంటే నా పైన ఒట్టేనని అనగానే.. సీతారామయ్య గురించి చెప్తాడు కళ్యాణ్. నేను వస్తానని అప్పు అనగానే‌.. నువ్వు దేని కోసం వెళ్ళావో అది సాధించుకొని రా అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ కి కార్ కాంట్రాక్టు బిల్ వస్తుంది. అది చూసి టెన్షన్ పడతాడు. కావ్య వస్తుంది ఏమైందని అనగానే బిల్ మూడు లక్షలు వచ్చిందని. ఇప్పుడేం చెయ్యాలని అంటాడు. కార్లని పంపించిస్తే ఇక బిల్ కట్టే అవసరం ఉండదు కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తెలుగు,కన్నడ ఆర్టిస్టుల మధ్య గొడవ 

  ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే 'దావత్'(daawath)ప్రోగ్రాం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే.సుమ(suma)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాంని మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా డిసెంబర్ 31 కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ప్రముఖ సినీ నటులు బ్రహ్మాజీ,రాజీవ్ కనకాల,సమీర్,హైపర్ ఆది తో పాటు పలు జబర్దస్త్ ఆర్టిస్ట్ లు, సీరియల్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.వీళ్ళలో కన్నడ పరిశ్రమకి చెందిన నటీమణులు కూడా ఉన్నారు. కన్నడ లేడీ ఆర్టిస్ట్ మాట్లాడుతు నా మాతృ భాష కన్నడ అయినా కూడా ఇక్కడి దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప విషయం అని చెప్పగానే ఒక తెలుగు ఆర్టిస్ట్ ఆమె చెప్పిన మాటలపై మాట్లాడుతు నువ్వు మాట్లాడే పది మాటల్లో ఎనిమిది బూతులు వస్తాయి అనగానే మీరు కన్నడ వచ్చి నేర్చుకొని నటించవచ్చుగా అని సదరు లేడీ ఆర్టిస్ట్ అనగానే   నాకు ఆ భాష రానప్పుడు నేను కన్నడ వెళ్ళనని చెప్పాడు.అలాంటాప్పుడు నన్ను షో కి పిలవకండి మీ తెలుగు వాళ్ళని మాత్రమే పిలుచుకోండి అని ఆమె అంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.      

కార్తీక దీపం ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..  లుంగీలో టిఫిన్ సెంటర్ దగ్గర కార్తీక్ బాబు!

  ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే.. అన్నట్టుగా మన కార్తీకదీపం-2 సీరియల్ లో కథ ముందుకు సాగుతుంది. ట్రెండీ లుక్ నుండి టవల్, లుంగీ గెటప్ లోకి కార్తీక్ వచ్చేశాడు. మొన్నటి ఎపిసోడ్ లో ఓ ధనవంతురాలి దగ్గర పనికి చేరిన కార్తీక్ బాబు కొత్త అవతారమెత్తాడు.  స్టార్ మా టీవీ సీరియళ్ళలో కార్తీకదీపం-2 కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వారిలో ఎక్కువగా కార్తీక్ బాబుకి వంటలక్క అభిమానులే. వీరిద్దరి హ్యాపీగా ఉంటే చూడాలనే అభిమానులు ఎప్పుడు చూస్తుంటారు. అయితే దర్శకుడు మొదటి సీజన్ కంటే కార్తీకదీపం-2 లోనే దీప,కార్తీక్ లకి ఎక్కువ కష్టాలు చూపిస్తున్నాడు. రీసెంట్ గా దీప మెడలో కార్తీక్ తాళి కడితే టీవీలకి హారతులు ఇస్తూ అభిమానులు వీడియోలు పెట్టారు. ఓ కంపెనీ సీఈఓగా కార్తీక్ ఉన్నప్పుడు కారు, బంగ్లా, సూట్ అంటు రిచ్ గా చూపించిన దర్శకుడు.. ఇక రోడ్డుమీద కట్టుబట్టలతో చూపిస్తున్నాడు. వారి దారిద్ర్యాన్ని మరీ దారణంగా చూపిస్తున్నాడు దర్శకుడు దీనిపై ఓ రేంజ్ లో తిడుతున్నారు అభిమానులు. మా కార్తీక్, దీపల కష్టాలను తీసేయండి. బాగుండేలా తీయండి అంటు నెటిజన్లు ప్రతీ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన కార్తీకదీపం-2 ప్రోమో అప్పుడే లక్ష న్యూస్ ని దాటేసింది. ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే.. కార్తీక్ టిఫిన్ సెంటర్ ని దీప పూజ చేసి మొదలెడుతుంది. మరోవైపు కార్తీక్ రాలేదని బాధగా ఉండగా.. అప్పుడే కార్తీక్ బాబు చెక్స్ షర్ట్, మెడలో టవల్, లుంగీతో ఓ వాటర్ క్యాన్ భుజాన వేసుకొని వస్తాడు‌. ఇది చూసి అందరు షాక్ అవుతారు‌. ఇక అప్పుడే జ్యోత్స్న వచ్చేస్తుంది. సూపర్ బావ.. సీఈఓ నుండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టే స్థాయికి వచ్చావని తక్కువ చేసి మాట్లాడగా.. కొన్నిటి విలువ చూసే వాళ్ళకి తెలియదు జ్యోత్స్న.. వాటి విలువ బ్రతికే వాళ్ళకే తెలుస్తుందంటు కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఇక బావ కళ్ళలో సంతోషం చూసి ఈర్ష్యతో కుళ్ళుకుంటుంది జ్యోత్స్న. ఇక ఈ ప్రోమో కింద చాలా కామెంట్లు వస్తున్నాయి. మున్ముందు కార్తీక్, దీపలకి కాలం కలిసిరావాలని, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారంటూ ఒకరు కామెంట్ చేయగా, గుంటూరు కారంలో మహేష్ బాబుని చూసి దర్శకుడు ఇన్ స్పైర్ అయ్యాడేమోనని మరొకరు కామెంట్ చేశారు. ఇలా భిన్నమైన కామెంట్లు చేయడంతో ఈ ప్రోమో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

కన్నడ వర్సెస్ తెలుగు వివాదంపై నూకరాజు...టీఆర్పీ కోసం ఇంత దిగజారతారా!

  బిగ్ బాస్ సీజన్-8 తో తెలుగు-కన్నడ వివాదం ఊపందుకుంది. దాంతో షోలలో దీన్ని వాడుకొని టీఆర్పీ పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే రీసెంట్ గా ప్రేరణ కంభం దీనిపై ఫుల్ ఫైర్ అవ్వగా అంతకముందు సీనియర్ యాక్టర్ కౌశిక్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు దానిని కొనసాగిస్తూ నూకరాజు, యాంకర్ సౌమ్య మరోసారి హీటెడ్ ఆర్గుమెంట్స్ చేసుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోపై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నడకి చెందిన యాంకర్ సౌమ్యరావుని అవమానిస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపించగా.. ఇది చూసి చాలా మంది కన్నడ ఆడియన్స్ ఈటీవీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు విషయమేంటంటే.. డిసెంబర్ 31న రాత్రి 9.30కి 'దావత్' అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు మేకర్స్‌. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే వచ్చింది. ఇందులో కన్నడ వర్సెస్ తెలుగు అంటూ ఓ వివాదాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ ప్రోమోలో ఏం ఉందంటే.. యాంకర్ సౌమ్య, నూకరాజు ఇద్దరు వాగ్వాదానికి దిగారు. నా మాతృభాష కన్నడ.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇంతలా తెలుగు మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప విషయమంటూ సౌమ్య చెప్పగా.. మీరు పది మాటలు మాట్లాడితే అందులో ఎనిమిది బూతులు ఉంటాయని నూకరాజు అన్నాడు. దీంతో అలా అయితే మీరు కన్నడకి వచ్చి కన్నడ భాష నేర్చుకొని మాట్లాడి చూడండి అంటూ సౌమ్య ఆవేశంగా అంది. నాకు కన్నడ రానప్పుడు నేను అసలు అక్కడికి వెళ్లను మేడమ్ అంటూ నూకరాజు ఫైర్ అయ్యాడు. దీంతో మరి ఇలా ఉన్నప్పుడు నన్ను షోకి పిలవకండి.. మీ తెలుగువాళ్లనే పిలుచుకోండి అంటూ సౌమ్య అంది. ఇది ప్రోమోలో ఉంది. ఇక కొంతమంది కన్నడ అభిమానులు నూకరాజుని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే మల్లెమాల టీమ్ ఇప్పటికే ఇలాంటి టీఆర్పీ స్టంట్స్ చాలానే చేసింది. ఇది కూడా వైరల్ అవ్వడం కోసం.. ప్రోమో ట్రెండ్ అవ్వడం కోసమే ఇలా చేశారని దాదాపు అందరికి తెలుసు. కానీ కొంతమంది దీనిని షార్ట్స్, రీల్స్ లో వారికి అనుగుణంగా కట్ చేసుకొని ప్రాంతీయత్వాన్ని రెచ్చగొడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

టిఆర్పిలు బద్దలవ్వాల్సిందే...ఈ సంక్రాంతికి ఆ క్యూట్ జంట  

  సంక్రాంతి సంబరాలు అంటే ఆ మజానే వేరు మచ్చా. ఎందుకంటే కోడి పందేలు, పేకాట, పట్టు చీరలు, ముగ్గులు, ఎడ్ల పందాలు...ఇవే ఈ పండక్కి బ్రాండ్ థింగ్స్. ఐతే బుల్లితెర మీద సంక్రాంతి అంటే అబ్బో ఆ రేంజ్ వేరు..ఐతే ఈ సంక్రాంతికి మరి ప్రతీ ఇంటికి అల్లుడు రాబోతున్నాడు. అదేనండి సుడిగాలి సుధీర్. "ఈ సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి సందర్భంగా రాబోతోంది. దానికి సుధీర్ హోస్ట్ గా వస్తున్నాడు. "ఎక్కడైనా అల్లుడొచ్చాక పండగ జరుగుద్ది. కానీ ఇక్కడ మాత్రం పండగ చేయడానికి అల్లుడొచ్చాడు" అంటూ స్టైలిష్ సుధీర్ డైలాగ్ చెప్పాడు. ఇక స్మాల్, బిగ్ స్క్రీన్స్ లో కనిపించే వాళ్లంతా ఈ షోకి వచ్చారు. ఇక మళ్ళీ సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మెస్మోరైజింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. ఇక రష్మీ కాలికి పట్టీ తొడిగాడు సుధీర్. ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎస్-ఆర్ జోడి కం బ్యాక్ ఇచ్చారు, సుధీర్ - రష్మీకి పెళ్లి చేసేయండి, ఈ సంక్రాంతికి ఈవెంట్ బ్లాక్ బస్టర్, ఎన్నాళ్లకు కనులకు విందు, వీళ్ళ జోడి ఎవర్ గ్రీన్. టిఆర్పి ఎక్కడికో వెళ్ళిపోద్ది..ఈటీవీకి అందం వచ్చింది. సుధీర్ ఉంటేనే ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మీ, సుధీర్ జోడి ఏపీకీ బుల్లితెర మీద ఎవర్ గ్రీన్ జోడి అని చెప్పొచ్చు. ఇక హైపర్ ఆది ఐతే అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసి బుల్లితెర పుష్ప అనిపించుకున్నాడు. "ఈ సంక్రాంతికి ఎవ్వరైనా గాని అస్సలు తగ్గేదెలా" అంటూ చెప్పుకొచ్చాడు.  

ఘనంగా  నందు-గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక

  టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు సింగర్ గీతామాధురి - యాక్టర్, హోస్ట్  నందు. వీళ్ళు  సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వీళ్ళు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో ఒక పాప పుట్టింది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. 2024  ఫిబ్రవరి 10న   గీతామాధురికి  పండంటి మగబిడ్డ పుట్టాడు.  ఆ బాబుకి  ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బాబుకు ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. అటు నందు, ఇటు గీతామాధురి కుటుంబ సభ్యుల మధ్యలో ఘనంగా శాస్త్రబద్ధంగా ఈ అన్న ప్రాసన నిర్వహించారు.  ఇక ఆ పిల్లాడి ఎదురుగా డబ్బులు, పుస్తకాలు, పూలు, ఆహరం పెట్టారు. ముందుగా డబ్బును ముట్టుకున్నాడు తారక్. తర్వాత పుస్తకాన్ని, తర్వాత బంగారాన్ని తాకాడు. ఈ తంతు తర్వాత పెద్దవాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి చిటికెడు చిటికెడు ఆహారాన్ని తినిపించి ఆశీర్వాదాలు అందించారు. అలా ఫైనల్ హారతిచ్చేసి ఆ అన్నప్రాసన ప్రక్రియను పూర్తి చేశారు. ఇక గీతామాధురి తన సింగింగ్ కన్సర్ట్స్ తో దూసుకుపోతుంటే...నందు మాత్రం అటు ఢీ షోస్ కి హోస్ట్ గా  క్రికెట్ కామెంటరీ చేస్తూ ఇటు కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌లో నందు సైకోగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో నచించాడు, అలాగే వెల్కమ్ టు మోక్ష ఐలాండ్, వధువు వంటి వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు వీళ్ళ బాబు అన్న ప్రాసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2025 కి రీతో ఏదో చూపిస్తానంటోంది..మల్లెమాల హోమ్ టూర్స్ ఇలా ఉంటాయా... 

  సోషల్ మీడియా కాన్సెప్ట్ బాగా పెరిగాక హోమ్ టూర్స్ చేయడం ఒక స్పెషల్ అట్రాక్షన్ ఐపోయింది. ఐతే హోమ్ టూర్స్ సరే కానీ మరి బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ , ఈవెంట్స్ లో చూపించే ఇళ్ళు, సెటప్స్ ఎక్కడ ఉంటాయి..ఎలా ఉంటాయి. షూటింగ్ కి బ్యాక్ స్టేజిలో వీళ్ళు ఎం చేస్తుంటారు  అంటూ తెలుసుకోవాలనే ఆత్రుత చాలామందిలో ఉంటుంది. అందుకే దీన్ని టాపిక్ గా తీసుకున్న మల్లెమాల ఇప్పుడు తమ షోస్ హోమ్ టూర్స్ ని చూపిస్తోంది. న్యూ ఇయర్ దావత్ స్పెషల్ లో భాగంగా. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా అక్కడ షూటింగ్ జరగక ముందు జరిగే సన్నివేశాలను రా-కామెంట్స్ ని కూడా చూపించింది. ముందుగా సుమ అడ్డా షో హోమ్ టూర్ చూపించారు. ఇందులో రీతూ చౌదరి, పంచ్ ప్రసాద్, నూకరాజు కూర్చుని జోక్స్ వేసుకున్నారు. " 2025 కి నేను చూపించబోతున్నా" అని రీతూ అనేసరికి " ఏంటిది" అన్నాడు పంచ్ ప్రసాద్. ఇంతలో బ్రహ్మాజీ పక్కనుంచి "నీ వల్ల కాదు" అన్నాడు. "ఎంత పెద్ద ఇంటర్వ్యూయర్స్ , మీడియా కానీ వచ్చినా, కావ్య అంటే నాకు ఇష్టం అని చెప్పేస్తా." అన్నాడు ఆది. తర్వాత జబర్దస్త్ హోమ్ టూర్ చూపించారు. ఇక ఇక్కడ ఫైమా ఒక నిజం చెప్పింది. డైలాగ్ మర్చిపోతూ ఉండకుండా దాన్ని అరచేతి మీద రాసుకుని దాన్ని చూసి చెప్తూ ఉంటుందట. తర్వాత ఢీ జోడి హోమ్ టూర్ చేసారు. ఇలా మొత్తం మల్లెమాల షోస్ హోమ్ టూర్ ని  చూపించారు.