రాజ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు.. కోర్టు తీర్పు ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -652 లో.... అనామిక ఇచ్చిన కంప్లైంట్ తో రాజ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది అప్పు. దాంతో రాజ్ ఏ తప్పు చెయ్యలేదని ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు అలా బాధపడుతుంటే అనామిక రాక్షసనందం‌ పొందుతుంది. మరొకవైపు రాజ్ అరెస్ట్ గురించి కనకంకి ఫోన్ చేసి చెప్తుంది స్వప్న. రాజ్ ని అరెస్ట్ చెయ్యడం లో అప్పు ఇబ్బందిగా ఫీల్ అయింది కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ల దృష్టిలో చెడ్డది అయిందని స్వప్న చెప్తుంటే.. నేను వస్తానని కనకం అంటుంది. ఇప్పుడే వద్దని స్వప్న చెప్తుంది. కావ్య, సుభాష్ లు రాజ్ ని కలవడానికి స్టేషన్ కి వెళ్తారు. రాజ్ ఇంటరాగేషన్ లో ఉన్నాడని అక్కడి కానిస్టేబుల్ చెప్తాడు. రాజ్ ని అప్పు ఇంటరాగేషన్ చేస్తుంది. ఒకవైపు రాజ్ తో మాట్లాడేటప్పుడు.. బావ ఏ తప్పు చెయ్యలేదని బాధపడుతూనే మరొకపక్క తన డ్యూటీ తను చేస్తుంది. రాజ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అప్పుకి చెప్తాడు. ఆ తర్వాత అప్పు బయటకు వస్తుంది. ఏం జరిగింది అప్పు అంటూ కావ్య అడుగుతుంది. ఇప్పుడేం చెప్పలేను కానీ బావ ఏ తప్పు చెయ్యలేదు.. బావకి ఫేవర్ గా ఒక ఆధారం దొరికిన చాలని అప్పు అంటుంది. కావ్య, సుభాష్ లు రాజ్ దగ్గరికి వెళ్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఆ అనామికపై డౌట్ ఉందని కావ్యతో రాజ్ చెప్తాడు. మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానని కావ్య అంటుంది. కావ్య, సుభాష్ లు బయటకు వస్తుంటే అక్కడ అనామిక ఉంటుంది. నాకు కాబోయే భర్తని చంపేశాడు.. అతన్ని ఎవరు కాపాడలేరని అనామిక అంటుంది. నా భర్త ఎప్పుడు అలా తప్పు చెయ్యడు.. నిజాలు త్వరలోనే బయట పెడుతానని అనామికకి కావ్య సవాలు విసురుతుంది. ఆ తర్వాత అప్పు ఇంటికి వచ్చాక రాజ్ ని ఎందుకు అరెస్ట్ చేసావంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి లు విరుచుకుపడతారు. తరువాయి భాగం లో కోర్ట్ లో రాజ్ కి అప్పొజిట్ గా అనామిక లాయర్ మాట్లాడతాడు. అన్ని సాక్ష్యాలు రాజ్ కి అగేనెస్ట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రామలక్ష్మిని వెతుకుతూ వెళ్ళిన సీతాకాంత్.. సవతి తల్లి చూస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -335 లో..... రామలక్ష్మి బీరువా నుండి తాళిని తీసి చూస్తూ బాధపడుతుంది. నేను లేకపోతే ఏమవుతారో అనుకున్నాను.. నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకున్నారని రామలక్ష్మి బాధపడుతుంది. కానీ ఒకరకంగా సంతోషంగా ఉంది. మీరు హ్యాపీగా ఉండి మీకంటూ ఒక కుటుంబం ఏర్పర్చుకున్నారు.. ఇక మీదట ఎప్పటికి నేను మైథిలీగానే ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది. సీతాకాంత్ రామ్ ని తన గుండెల పై పడుకోబెట్టుకొని రామలక్ష్మి గురించి ఆలోచిస్తాడు. ముందు రామ్ కి రామలక్ష్మి పై ఉన్న ఇంప్రెషన్ పోగొట్టాలి.. అప్పుడే మనం రామలక్ష్మి విషయంలో ముందుకు వెళ్ళగలమని అనుకుంటాడు. రామ్ కి రామలక్ష్మి గురించి సీతాకాంత్ మంచిగా చెప్పే ప్రయత్నం చేయగా.. రామ్ వినిపించుకోడు. దాంతో ఈ ప్రయత్నం కంటే రామలక్ష్మిని తన నోటితో రామలక్ష్మి అని చెప్పేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరుసటి రోజు మైథిలి ఆఫీస్ కి సీతాకాంత్ వెళ్లి తన గురించి తెలుసుకుంటాడు. ఇంకా తన ఇంటిముందుకి వెళ్లి అక్కడ పని చేసే అతన్ని అడుగుతాడు. తను మా మైథిలి మేడం.. ఇన్ని రోజులు లండన్ లో ఉండి, ఇప్పుడే వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటుందని చెప్తారు. అందరు మైథిలీ అంటున్నారు. మరి నాకెందుకు రామలక్ష్మి అనిపిస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. వద్దని రామ్ అంటాడు. దాంతో మేం తీసుకొని వెళ్తామని శ్రీవల్లి, శ్రీలత లు రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్తారు. రామ్ క్లాస్ కి వెళ్ళాక రామలక్ష్మి పై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బల్లితో పాటు ఫ్లోర్ పై ఆయిల్ పోస్తాడు. మరొకవైపు రామ్ క్లాస్ అయిపోయేంత వరకు శ్రీవల్ల,  శ్రీలత లు బయట వెయిట్ చేస్తుంటారు. సీతాకాంత్ రామాలక్ష్మిని చూడడానికి స్కూల్ కి వస్తాడు. అక్కడ సీతాకాంత్ ని శ్రీవల్లి చూసి శ్రీలతకి చెప్తుంది. ఎందుకు వచ్చినట్లు వెనకాలే వెళ్తే తెలుస్తుందని ఇద్దరు అనుకుంటారు. రామలక్ష్మి కోసం సీతాకాంత్ వెతుకుతు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భయపడిపోయిన జ్యోత్స్న.. దశరథ్ ఆ నిజం తెలుసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -288 లో.....అసలు డాడ్ ఇంకా రాలేదేంటి? ఆ దాస్ గాడు నిజం చెప్పి ఉంటాడా.. నా చెవి కమ్మ ఎక్కడ పోయినట్లు.. కార్ లో కూడ లేదని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇప్పుడు నేను ఆ కాశీ ఇంటికి వెళ్ళాలంటూ జ్యోత్స్న కంగారుగా బయలుదేర్తుంటే అప్పుడే దశరథ్ వస్తాడు. ఏంటి కంగారు పడుతున్నావని జ్యోత్స్నని దశరథ్ తో అడుగగా.. ఎక్కడికి వెళ్ళావ్ డాడ్ అని జ్యోత్స్న అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్లానో నీకు తెలియదా అని దశరథ్ అంటాడు. ఈ చెవి కమ్మ నీదేనా అని దశరథ్ చూపించగానే.. నీకు ఎక్కడ దొరికిందని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడ దొరికిందని దశరథ్ చెప్తాడు. డాడ్ కి నిజం చెప్పేసాడా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని దశరథ్ ని అడుగుతుంది. దాస్ దగ్గరికి అని దశరథ్ చెప్పగానే.. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడని పారిజాతం అడుగుతుంది. బాగున్నాడు ఏదో చెప్పాలని ట్రై చేసాడు. కిటికీ దగ్గర ఎవరో శబ్దం చేశారు. మళ్ళీ అంత మర్చిపోయాడని జ్యోత్స్నని ఉద్దేశించి దశరథ్ అంటాడు. అంటే దాస్ నిజం చెప్పలేదన్నమాట అని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. డాడ్ కి నాపై డౌట్ వచ్చింది కానీ దాస్ చెప్పాక కన్ఫమ్ చేసుకోవాలనుకుంటున్నాడని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటోకి దీప మొక్కుకుంటుంది. అది చూసిన అనసూయ.. నా తమ్ముడు నీ తండ్రి కాదు.. ఆ విషయం నాకు, నా తమ్ముడికి ఆ దాస్ కి తెలుసు. నీ కన్నతల్లితండ్రలు ఎవరో దాస్ కనుక్కుంటానన్నాడని అనసూయ తన మనసులో అనుకుటుంది. ఆ తర్వాత కావేరిని శివన్నారాయణ ఇంటికి తీసుకొని వస్తాడు శ్రీధర్. ఎందుకు వచ్చావంటూ శివన్నారాయణ శ్రీధర్ ని అవమానిస్తాడు. నాకు మంచి, మానవత్వం లేదన్నావ్ కదా.. ఇదిగో నేను శౌర్య ఆపరేషన్ కి డబ్బు ఇచ్చానంటూ కార్తీక్ రాసిచ్చిన నోట్ చూపిస్తాడు. మావయ్య ఆ రోజు అడిగితే సాయం చెయ్యలేదన్నావని జ్యోత్స్న అడుగుతుంది. చేసిన సాయం చెప్పుకునే అలవాటు లేదని శ్రీధర్ అంటాడు. అయిన ఈ నోట్ లో నీ రెండవ భార్య అప్పు ఇచ్చినట్లు ఉందని జ్యోత్స్న అంటుంది. ఎవరిస్తే ఏంటి? ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళండి అంటూ శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళిపోయాక కావేరికి సుమిత్ర థాంక్స్ చెప్తుంది. దీపకి నేను చేయాల్సిన సాయం నువ్వు చేసావ్ వదిన అని సుమిత్ర అనగానే.. ప్రేమగా పిల్చావంటూ కావేరి హ్యాపీగా ఫీలవుతుంది. మావయ్య గారు చూస్తే కోప్పడతారు.. తర్వాత మాట్లాడుకుందామని కావేరీతో సుమిత్ర అంటుంది. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కళ్యాణ్ కోసం అర్థరాత్రి ప్రేమ వెతుకులాట.. చెంపచెల్లుమనిపించిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -89 లో..... ప్రేమ కన్పించకపోవడంతో భద్రవతి ఇంటికి వేదవతి వెళ్లి వెతుకుతుంది. నా కోడలిని తీసుకొని వచ్చి ఏం చేశారు.. నా కోడలిని నా ఇంటికి తీసుకొని వచ్చి అప్పగించాలంటూ భద్రవతికి వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ కన్పించకపోవడం ఏంటని భద్రవతి షాక్ అవుతుంది. రెండు కుటుంబాల గొడవలకి కారణం అవుతున్నానంటూ ఎక్కడికో వెళ్ళిపోయినట్లుందని పెద్దావిడ అంటుంది. మీ గొడవలకి నా కూతురిని బలి చేస్తారా అని రేవతి బాధపడుతుంది. అందరు ప్రేమని వెతకడానికి వెళ్తారు. మరొకవైపు కళ్యాణ్ గురించి ప్రేమ వెతుక్కుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్ కోమలి హెల్ప్ తీసుకొని కళ్యాణ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి తన గురించి అడుగుతుంది. కళ్యాణ్ రామచంద్రపురంలో ఉన్నాడంట అని కళ్యాణ్ ఫ్రెండ్ ప్రేమకి చెప్తాడు. అక్కడికి ప్రేమ వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి సాగర్, చందు, సేనాపతి, విశ్వలు ఇంటికి ప్రేమ కన్పించలేదని నిరాశగా వస్తారు. ధీరజ్ వస్తుంటే ప్రేమ కోమలిలు ఆటో ఎక్కుతు కన్పిస్తారు. ధీరజ్ వెళ్లి ప్రేమ చెంప చెల్లుమనిపిస్తాడు.. ఎంత సేపటి నుండి వెతుకుతన్నామంటూ కోప్పడతాడు. ప్రేమ కూడా ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. కళ్యాణ్ గాడు నగలు తీసుకొని వెళ్తుంటే నీకే కదా కన్పించింది. మరి ఎందుకు పట్టుకోలేదని ప్రేమ కోప్పడుతుంది. బండి ఎక్కు వెళదామని ధీరజ్ అంటుంటే.. రానని ప్రేమ మొండిగా ఉంటుంది. దాంతో ధీరజ్ వెళ్ళపోతాడు. ప్రేమ చీకట్లో భయపడుతుంది. మళ్ళీ ధీరజ్ వచ్చి ప్రేమని బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇందాక బయపెట్టింది నేనే అని ధీరజ్ అనగానే సచ్చినోడా అంటూ ప్రేమ ధీరజ్ ని తిడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ, దీరజ్ లు కలిసి కళ్యాణ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలసిపోయి ధీరజ్ భుజాలపై ప్రేమ పడుకొని ఉంటుంది. ధీరజ్ కూడా పడుకుంటాడు. తెల్లవారే సరికి అలాగే పడుకొని ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ తమ చుట్టూ చేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : వారం రోజులు గడువు అడిగిన ప్రేమ.. తప్పిపోయిన ఇంటి కోడలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -88 లో...... ప్రేమని శాశ్వతంగా వాళ్లింటికి తీసుకొని వెళ్ళడానికి భద్రవతి కుట్ర చేస్తుంది. అందులో భాగంగా నగలు దొంగతనం చేసి రామరాజుని అరెస్ట్ చేపిస్తుంది. ప్రేమని పంపించడానికి రామరాజు ఒప్పుకోకపోవడంతో అతడిని పోలీసులు జైలుకి తీసుకొని వెళ్తామని అంటారు. వద్దు తప్పు చేసింది నేనే.. నగలు నావి నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రేమ అడ్డుపడుతుంది. నన్ను కాదని తీసుకొని వెళ్తే మాత్రం నేను కోర్ట్ కి వచ్చి.. ఇదే చెప్తాను లేకపోతే ఇప్పుడే చచ్చిపోతానని ప్రేమ అంటుంది. నాకు వారం టైమ్ ఇవ్వండి అని ప్రేమ అడుగుతుంది. ఎన్ని సార్లు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావంటూ ప్రేమని విశ్వ కోప్పడతాడు. సీఐ వాళ్ళు భద్రవతి వాళ్ళని పక్కకి తీసుకొని వెళ్లి.. ప్రేమ ఇలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్.. ఎలాగు వారం రోజుల్లో తెస్తానంటుంది కదా అని భద్రవతితో సీఐ చెప్తాడు. భద్రవతి కూడా సరే అంటుంది. మీకు వారం టైమ్ ఇస్తున్న అప్పుడు ఇవ్వకపోతే ఇద్దరిని అరెస్ట్ చేస్తానని సీఐ చెప్పి వాళ్ళని పంపిస్తాడు. రామరాజు బాధపడుతుంటే వేదవతి వస్తుంది. జరిగిన దాని గురించి మర్చిపోండి అని అంటుంది. వాడు నగలు తీసుకొని వెళ్లి అమ్ముకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను.. అయిన వారం రోజుల్లో నగలు తీసుకొని వస్తానంటున్నారు ఎలా తీసుకొని వస్తారని రామరాజు అంటాడు. మరొకవైపు సాగర్ చందులు నీ వల్లే నాన్న పోలీస్ స్టేషన్ కీ వెళ్ళాల్సి వచ్చిందంటూ కోప్పడుతున్నా అసలు విషయం ధీరజ్ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అదంతా ప్రేమ చూస్తుంది. మరుసటి రోజు ఉదయం ప్రేమకి నర్మద కాఫీ తీసుకొని వెళ్తుంది. కానీ తను ఎక్కడ కన్పించదు. దాంతో అందరు కంగారు పడతారు. వేదవతి కోపంగా భద్రవతి దగ్గరికి వెళ్లి.. నా కోడలు ఎక్కడ అని అడుగుతుంది. తరువాయి భాగంలో అందరు ప్రేమ గురించి వెతుకుతుంటారు. ధీరజ్ కి ప్రేమ కన్పిస్తుంది. దాంతో ప్రేమ చెంపచెల్లుమనిపిస్తాడు ధీరజ్. తిరిగి ప్రేమ కూడా ధీరజ్ ని కొడుతుంది. ఆ కళ్యాణ్ గాడు నగలు తీసుకొని వెళ్ళేటప్పుడు నీకు ఎదురుపడ్డాడు కదా పట్టుకోకుండా ఏం చేసావని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దశరథ్ కి దాస్ నిజం చెప్తాడా.. భయంతో వణికిపోయిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -287 లో.....దశరథ్ కి దాస్ కాల్ చేసి.. త్వరగా రా అన్నయ్య నేనొక నిజం చెప్పాలనగానే.. నేను వస్తున్నానంటూ దశరథ్ హడావిడి గా వెళ్తుంటాడు. అదంతా జ్యోత్స్న విని ఇప్పుడు దాస్ నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి? నిజం చెప్పకుండా ఆపాలని జ్యోత్స్న అనుకొని దశరథ్ వెనకాలే వెళ్తుంది. దశరథ్ దాస్ దగ్గరికి వెళ్లి ఏంటి రా ఏదో చెప్పాలి అనుకుంటున్నావని అడుగుతాడు. జ్యోత్స్న నన్ను చంపాలి అనుకుందని దాస్ చెప్తాడు. ఎందుకు చంపాలనుకుంది అని దశరథ్ అడుగగా.. జ్యోత్స్న నీ కూతురని అంటుండగా అక్కడే ఉన్న జ్యోత్స్న కిటికీ దగ్గర నుండి ఏదో పడేస్తుంది. ఆ శబ్దం విని మళ్ళీ దాస్ అంత మర్చిపోతాడు. ఆ శబ్దం చేసింది ఎవరని దశరథ్ కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. జ్యోత్స్న వెళ్తూ కన్పిస్తుంది. దాస్ దగ్గరికి వచ్చి ఏంటి ఆ నిజమని అడుగుతాడు. ఈ నిజం అంటూ దాస్ పడుకుంటాడు. అప్పుడే కార్తీక్, కాశీ లు వచ్చి ఏదో శబ్దం అయిన ప్రతిసారి ఇలాగే అయిపోతున్నాడని కార్తీక్ అంటాడు. అంటే ఇలా అవుతాడని జ్యోత్స్నకి తెలిసే శబ్దం చేసిందా అని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స ఇంటికి టెన్షన్ గా వెళ్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఎక్కడికి వెళ్ళావ్ అంటుంది. ఫ్రెండ్ దగ్గరికి అని జ్యోత్స్న అంటుంది. ఏంటి చెవి కమ్మ ఒక్కటే ఉందని పారిజాతం అంటుంది. దాంతో ఇంకొకటి ఏది అంటూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.ఆ తర్వాత స్వప్న వచ్చి భోజనం చెయ్యండి మావయ్య అని దశరథ్ తో అనగానే.. సరే అని అంటాడు. కార్తీక్, కాశీ, దశరథ్ లు ముగ్గురు కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి..  శౌర్యపై దీప కోప్పడుతుంది. పక్కింట్లో అన్నం తింటుందని శౌర్య గురించి కార్తీక్ కి చెప్తుంది దీప‌. కార్తీక్ బాబు చూసావా ఎంత ఆకలిగా ఉన్నా కూడా ఇంట్లో తప్ప ఎక్కడ తినరని కార్తీక్ గురించి అంటుంటే.. కార్తీక్ కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకు అంటే స్వప్న వాళ్ళింట్లో కార్తీక్ తినేసి వచ్చాడు. దీప భోజనం పెడుతుంటే కార్తీక్ ఆల్రెడీ తినేసా అని చెప్పలేక తన ప్లేట్ లోని భోజనం శౌర్య చూడకముందు తన ప్లేట్ లో వేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని చూసి దయ్యం అని భయపడ్డ సవతి తల్లి.. రామ్ తో కష్టం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -334 లో..... రామలక్ష్మితో సీతాకాంత్ మాట్లాడతాడు. రామలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళిపోతుంది. అప్పుడే రామ్ వచ్చి నిన్ను ఆ మేడం కొట్టింది.. నువ్వు తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని అంటాడు. నాకు ఇష్టమే.. తను నాకు తెలుసు అని సీతాకాంత్ అంటాడు. నిన్ను బాగా చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి కదా.. ఆ మిస్ నీకు అమ్మ అయితే బాగుంటుందని అనుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. నో నాకు ఇష్టం లేదని రామ్ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లిలు షాపింగ్ కీ వెళ్తారు. షాపింగ్ పూర్తి అయ్యాక కార్ కోసం వెయిట్ చేస్తుంటే.. దూరంగా శ్రీవల్లికి రామలక్ష్మి కన్పిస్తుంది. అది చూసి శ్రీవల్లి దెయ్యమంటూ శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తుంది. రామలక్ష్మిని శ్రీలత చూసి దెయ్యం అంటూ భయపడుతుంది. ఇద్దరు భయపడుతుండగా.‌‌. అప్పుడే సందీప్ వస్తాడు. అతనికి కూడా రామలక్ష్మిని చూపిస్తారు. అతను కూడా భయపడతాడు. మరుసటిరోజు ఉదయం సీతాకాంత్ రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయి వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే రామ్ రెడీ అయి వస్తాడు.. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు మెడలో తాయాత్తు కట్టుకొని వస్తారు. ఏంటి ఈ అవతారం అని సీతాకాంత్ అడుగగా.. రామలక్ష్మి విషయం చెప్తే మళ్ళీ గుర్తుచేసినట్లు అవుతుందని ఆ విషయం చెయ్యకుండా ఏదో చెప్పి డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ప్రోగ్రెస్ కార్డు చూసి ఈ బాబు స్పోర్ట్స్ లో ఫస్ట్ ఉన్నాడు.. స్టడీ లో లాస్ట్ ఉన్నాడని రామలక్ష్మి అంటుంది. స్టడీలో కూడా ఫస్ట్ కానీ ఈ మధ్యనే ఇలా అయ్యాడని రామ్ వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తుంది. అయితే సెవెన్ టేబుల్ చెప్పమని రామ్ తో రామలక్ష్మి అనగానే మొదట బానే చెప్తాడు. తర్వాత నేను చెప్పను నువ్వు మా నాన్నని కొట్టావ్.. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి. మా నాన్నకి సారీ చెప్తే నువ్వు చెప్పినట్లు వింటానని రామ్ అంటాడు. ఇలా అయితే కష్టం.. నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చెయ్యాలంటే సమ్మర్ క్లాసెస్ కి పంపాలని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. నువ్వెలా చెప్తే అలా రామలక్ష్మి అని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వే నా రామాలక్ష్మివి అని నువ్వే బయటపడేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి బీరువా లో నుండి తాళి తీసి చూసి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పోలీస్ స్టేషన్ లో రాజ్.. అనామికకి ఛాలెంజ్ విసిరిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -651 లో.... అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే.. రాజ్ కి ఆఫీస్ నుండీ ఫోన్ వస్తుంది. దాంతో రాజ్ అర్జెంట్ గా వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లేసరికి సెక్యూరిటీని కొట్టి ఆఫీస్ గోడలకి పెట్రోల్ పోస్తుంటారు రౌడీ లు. రాజ్ వెళ్లి వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళు పారిపోతారు. మరొకవైపు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండడం రుద్రాణి చూడలేకపోతుంది. దాంతో అనామికకి ఫోన్ చేస్తుంది. రేపు ఉదయం కల్లా ఏం జరుగుతుందో చూడు అంటూ అనామిక చెప్తుంది. ఏం చేయబోతున్నావ్ చెప్పమని రుద్రాణి అనగానే.. రేపు నువ్వే చూస్తావ్ కదా అంటూ ఫోన్ కట్ చేస్తుంది. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య కాఫీ తీసుకొని వచ్చి రాజ్ కి ఇస్తుంటే రాజ్ చిరాకుపడతాడు. ఏంటి అండి నిన్న రాత్రి సడెన్ గా వెళ్ళారని కావ్య అనగానే.. చెప్పాలిసిన అవసరం లేదులని రాజ్ కోపంగా అంటాడు. ఇప్పుడు కావ్య ఏం అందని అలా చిరాకు పడుతున్నావని అపర్ణ అడుగుతుంది. అప్పుడే అప్పు కానిస్టేబుల్స్ తో ఇంటికి వస్తుంది. నిన్నటి నుండి సామంత్ కన్పించడం లేదట.. బావపై అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అప్పు అనగానే.. అందరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక వచ్చి.. నా సామంత్ ని ఏం చేసావంటూ అడుగుతుంది. కాని స్టేబుల్స్ ఇల్లంతా చెక్ చేస్తారు. సామంత్ ఎక్కడ ఉండడు.. ఇంట్లోనే కాదు బయట కూడా సెర్చ్ చేయాలని అనామిక అనగానే.. కానిస్టేబుల్స్ కి చెప్పి బయట కూడా చెక్ చేయిస్తుంది అప్పు. చివరగా రాజ్ కార్ లో సామంత్ బాడీ ఉంటుంది. దాన్ని చూసి అందరు షాక్ అవుతారు. ఎంత పని చేసావ్ రాజ్.. నా సామంత్ ని చంపేశావని అనామిక అంటుంది. దాంతో రాజ్ ని అరెస్ట్ చెయ్యడానికి అప్పు సిద్ధం అవుతుంది. వద్దని అందరు అంటారు. మీడియా వచ్చింది ఇప్పుడు నేను బంధాల గురించి ఆలోచించొద్దని రాజ్ ని అరెస్ట్ చేస్తుంది అప్పు. తరువాయి భాగంలో ఇలా కరెక్ట్ టైమ్ కి అన్ని ఎలా పాజిబుల్ అవుతాయి. బాడీ దొరకడం.. మీడియా వాళ్ళు రావడం.. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని స్టేషన్ లో కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇదంతా ఎవరు చేసారో కనుక్కుంటానని అనామికతో కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మగువ ఓ మగువ చంచల... మామూలు మహిళ కాదు భయ్యో

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం సీరియల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువ సీరియల్స్ నుంచి నటీనటులు వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో  హైలైట్ గా నిలిచింది మగువ ఓ మగువ సీరియల్ లోని మెయిన్ లీడ్ చంచలమ్మ. ఈ చంచలమ్మ రోల్ ఈ సీరియల్ కె హైలైట్ గా ఉంటుంది. బాహుబలి మూవీలో శివగామి రోల్ లో రమ్య కృష్ణ ఎలా అదరగొట్టిందో ఈ సీరియల్ లో చంచలమ్మ కూడా అలాంటి గెటప్ లోనే అదరగొడుతూ ఉంటుంది. ఇక ఈ చంచలమ్మ అసలు పేరు నేత్రా జాదవ్. ఈమె కన్నడ నటి. కానీ ఈ సీరియల్ లో ఆమె నటన చూస్తే అచ్చ తెలుగు ఇంటి అమ్మాయిలా ఉంటుంది. ఇక ఈమె పెరఫార్మెన్స్ ఈ షోలో హైలైట్ గా ఉంటుంది. "సన్నగా ఉంటుంది వైర్..ఈ చంచలమ్మ అంటే వైల్డ్ ఫైర్" అంటూ గట్టి డైలాగ్ చెప్పింది. ఇక ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్సె ఎలా చేసుకోవాలో చేసి చూపించింది. ఐతే కొంతమంది దుండగులు మన మీదకు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించింది. అలాగే హరి చంచల మెడలోని నగ లాగుతూ ఉండగా ఆమె నగను మనవైపుకు లాక్కోకుండా ఎలా ఆ దొంగను కొట్టి మనల్ని మనం, మన నగలను కాపాడుకోవాలో చేసి చూపించింది. ఐతే ఈ సెల్ఫ్ డిఫెన్సె ట్రిక్స్ అన్నీ కూడా స్కూల్ చూపించరు అని చెప్తూ తన స్టైల్ కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ స్టెప్స్ చూపించింది. చైన్ స్నాచింగ్ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో హరి మీద ఆ ట్రిక్ ప్రయోగించి చూపించింది. ఆడదంటే ఆదిపరాశక్తి అని నిరూపించిన మహిళల చరిత్ర గురించి ఎవరూ మర్చిపోకండి అంటూ స్త్రీలను గురించి మంచి మాటలు చెప్పింది చంచల అలియాస్ నేత్రా జాదవ్. ఈమె కన్నడ సీరియల్స్ లో నటించింది. అలాగే రావోయ్ చందమామ సీరియల్ లో కూడా నటించింది.  

సోనియా : సిద్దు నా ఫ్యూచర్ హజ్బెండ్ 

  ఢీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం మాస్ థీమ్ కాన్సెప్ట్ తో ఈ షో అలరించింది. ఇక ఈ షోలో సోనియా-సిద్దు వాళ్ళ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. "ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నేను చేసుకున్న అదృష్టం మాష్టర్. ఒక 25 ఇయర్స్ వరకు 30 ఇయర్స్ వరకు అమ్మ ప్రేమ ఉంటుంది. కానీ ఆ తర్వాత లైఫ్ పార్టనర్ వస్తుంది...ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి వేరైపోతారు అంటారు. కానీ నెక్స్ట్ 40 ఇయర్స్ వరకు నాకు సోనియా రూపంలో అమ్మ ప్రేమ దొరికింది మాస్టారు" అని సిద్దు చెప్పాడు. తర్వాత సోనియా మాట్లాడుతూ "సిద్దు నా లైఫ్ లోకి వచ్చాక నేను మా నాన్నను, నా బ్రదర్ ని మిస్సవలేదు. ఇంకేముందు నా ప్రపంచం మొత్తం సిద్దునే ఐపోయాడు. ఫ్యూచర్ హజ్బెండ్ దొరికేసాడు." అని చెప్పింది సోనియా. యూట్యూబర్, నటి అయిన సోనియా సింగ్, నటుడు సిద్ధూ పవన్ పాపులర్ సెలబ్రిటీ కపుల్. సోనియా సింగ్, సిద్ధూ పవన్ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.  షార్ట్  ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో కలిసి నటించిన ఈ ఆన్ స్క్రీన్ కపుల్ త్వరలోనే ఆఫ్ స్క్రీన్ కపుల్ గా మారబోతున్నారు.  సిద్దు ఏమో అర్దమయ్యిందా అరుణ్ కుమార్ మూవీలో నటించాడు అలాగే సోనియా ఐతే విరూపాక్ష మూవీలో చిన్న రోల్ లో నటించింది. అలాగే వీళ్ళిద్దరూ శశిమధనం మూవీలో కలిసి చేశారు. ఇక వీళ్ళు ఢీ షో ఆది-అశ్వినికి ప్రత్యర్థి జోడీగా చేస్తున్నారు.  

బిగ్ బాస్ 9 కి వెళ్లాలనుకునే వాళ్లకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన...శ్రీముఖి

బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్ గా కంప్లీట్ ఐన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు కానీ ఒక వేళ స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటే మాత్రం మంచి కంటెస్టెంట్స్ అంతా కూడా రెడీ ఉన్నారు. ఐతే ఎక్కడా ? ఏంటి అనుకుంటున్నారా ? రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రసారమయ్యింది. ఐతే ఈ షోలో బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్ నటీనటులంతా వచ్చారు. ఇక శ్రీముఖి కూడా వీళ్లందరినీ టు టీమ్స్ గా విడదీసింది.  మధ్యాహ్నం మెగాస్టార్స్ అంటే మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే సీరియల్ టీమ్ వాళ్ళు అలాగే సాయంత్రం సూపర్ స్టార్స్ అంటే సాయంత్రం ప్రసారమయ్యే సీరియల్ టీమ్ వాళ్లంతా వచ్చారు. వాళ్ళల్లో  మానస్ (బ్రహ్మముడి), సుహాసిని (మామగారు), బాలు (గుండె నిండా గుడి గంటలు) , ప్రిన్సి, నిరుపమ్ (కార్తీక దీపం), కుట్టి (పాపే మా జీవన జ్యోతి) , డెబీజాని మొదక్ (సత్యభామ)నర్మదా  (ఇల్లు ఇల్లాలు పిల్లలు) కృష్ణ (వంటలక్క), ప్రిన్సి (మల్లి) వచ్చారు. తర్వాత వీళ్లందరినీ రెండు టీమ్స్ గా విడదీసి బల్లూన్స్ ని పగలగొట్టించే టాస్క్ ఇచ్చింది. అందులో అందరూ పోటాపోటీగా టాస్క్ కంప్లీట్ చేశారు. ఈ టాస్క్ ఆడిన విధానం చూసిన శ్రీముఖి ఒక మాట అంది..ఈరోజు ఈ టాస్క్ ఆడిన విధానం చూస్తుంటే మీరంతా కూడా బిగ్ బాస్ మెటీరియల్ అని అర్ధమయ్యింది. బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లంతా ఓకే కానీ వెళ్లని వాళ్ళు వెళ్ళాలి అని కోరుకుంటూ బిగ్ బాస్ ప్రాప్తిరస్తూ అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఐతే బిగ్ బాస్ టీమ్ గనక ఈ షో ఎపిసోడ్ చూస్తే గనక కచ్చితంగా బిగ్ బాస్ 9 కి వీళ్లల్లో ఎవరో ఒకరిని పిలిచే అవకాశం ఉంటుంది.  

Illu illalu pillalu : రాజీపడని ఇరుకుటుంబాలు.. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -87 లో......ప్రేమ భద్రవతి దగ్గరికి వెళ్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు ఆలోచించుకొని వచ్చావా.. నిర్ణయం తీసుకొని వచ్చావా అని భద్రవతి అడుగుతుంది. నువ్వు నన్ను మోసం చేసి వెళ్లిపోయావని భద్రవతి ఎమోషనల్ అవుతుంటే.. నిన్ను నా తల్లిలా అనుకున్న చిన్నపటి నుండి నీ గుండెలపై పెరిగానని ఈ పెళ్లి నా తలరాతలో రాసి ఉంది. ఇప్పుడేం చెయ్యలేం మావయ్యపై పెట్టిన కేసు వెనక్కి తీసుకో అత్తయ్య అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఒక కండిషన్ నీ మెడలో తాళి తీసేసి శాశ్వతంగా ఈ ఇంటికి వచ్చేయమని అనగానే.. ప్రేమ షాక్ అవుతుంది.. తాళి తియ్ అంటూ భద్రవతి ప్రేమ తాళి తీస్తుంటే ప్రేమ ఆపుతుంది. ఇన్ని రోజులు దీని విలువ తెలియదు కానీ ఇప్పుడు నువ్వు తీస్తుంటే ఏదో బాధగా ఉంది.. నేను తీయనని ప్రేమ అంటుంది. ప్రేమ నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్తున్నావ్.. మళ్ళీ వస్తావని భద్రవతి అనుకుటుంది. మరుసటి రోజు ఇరు కుటుంబాలని సీఐ రాజీకి పిలుస్తాడు. భద్రవతి గారి మేనకోడలని శాశ్వతంగా వాళ్ళ ఇంటికి పంపండి లేదా నగలు తీసుకొని ఇవ్వండి అని సీఐ అంటాడు. వాళ్ళ మేనకోడలని వాళ్ళ ఇంటికి పంపిస్తునట్లు సంతకం చెయ్యండి అని సీఐ రామరాజుతో అనగానే రామరాజు ఆ పేపర్ చింపేసి జైలుకి అయినా వెళ్తాను కానీ వాళ్ళని విడదియ్యనని రామరాజు అంటాడు. అయితే రామరాజు, ధీరజ్ లని జైలుకి తీసుకొని వెళ్ళాలని సీఐ అనగానే.. నగలు నావి తప్పు చేసింది నేను.. నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రేమ అంటుంది. ప్రేమ తప్పుకోమని భద్రవతి అంటుంది. మీపై ప్రేమ, అభిమానం ఉన్నాయి. మీరు ఇలా కుట్ర చేసి ఇలా చేసి మీ నమ్మకం పోగొట్టుకోకండి అని భద్రవతితో ప్రేమ కఠినంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో నీ వల్లే నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చిందంటూ సాగర్, చందు లు ధీరజ్ ని తిడతారు. అదంతా చుసిన ప్రేమ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ప్రేమ ఎక్కడ కన్పించకపోయేసరికి భద్రవతి తీసుకొని వెళ్లి ఉంటుందని.. వేదవతి కోపంగా తన ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : స్పృహలోకి వచ్చిన దాస్.. దీప అసలైన వారసురాలు అని చెప్పేస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -286 లో..... దీపని కార్తీక్ తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు. మొన్న బర్త్ డే పార్టీకి వచ్చినప్పుడు పారిజాతం గారు ఏదో అన్నారు కదా.. దీపది ఇడ్లీ బండి రేంజ్ అన్నావ్ కదా.. ఆ రేంజ్ కాదని చెప్పడానికి వచ్చాను.. సత్యరాజ్ రెస్టారెంట్ ని మేం తీసుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ పెర్సెంట్ షేర్.. ఇప్పుడు ఒప్పుకుంటారు దీపది రెస్టారెంట్ రేంజ్ అని కార్తీక్ గర్వంగా కార్తీక్ చెప్తుంటాడు. అది ఆల్రెడీ దోమలు, ఈగలు కొట్టుకుంటున్న రెస్టారెంట్.. ఇప్పుడు మీరు దాన్ని తీసుకొని ఏం చేస్తారని శివన్నారాయణ అంటాడు. కాసేపటికి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అని కార్తీక్, దీప లు సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి మరి అవమానిస్తారా మీ సంగతి చెప్తానంటూ జ్యోత్స్న అనుకుంటుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపలు ఇంటికి వెళ్లి గుడ్ న్యూస్ చెప్పగానే.. వాళ్ళు సంతోషపడతారు. ఇక కార్తీక్ జ్యోత్స్న వచ్చిన విషయం.. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లిన విషయం కాంచనకి చెప్తాడు. ఇప్పుడు అదంతా ఎందుకు కానీ నోరు తీపి చెయ్ అని దీప తో కార్తీక్ అంటాడు. దీప కిచెన్ లోకి వెళ్లి స్వీట్ చేస్తుంది. అప్పుడే షుగర్ డబ్బా మూత రావడం లేదని కార్తీక్ ని పిలుస్తూ తనకు ఎదరుపడి డాష్ ఇస్తుంది. దాంతో ఇద్దరు కిందపడిపోతారు. కార్తీక్ షుగర్ డబ్బా మూత తీసి ఇస్తాడు. చాలా థాంక్స్ దీప.. నీ వల్లే ఇదంతా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ తన ప్రాణధాత గురించి మాట్లాడతాడు. ఒకవేళ నీ ప్రాణధాత బ్రతికి లేకుంటే అని దీప అనగానే.. ఇంకెప్పుడు అలా అనకు దీప.. తను ఎదరు పడాలి.. నీ నోటితో నా ప్రాణధాత ఎదురుపడుతుందని అనవా.. నువ్వు ఏది అంటే అది జరుగుతుందని ఒక నమ్మకం అని కార్తీక్ అంటాడు. మీ ప్రాణధాత నా లాగే మీ ముందు నిలబడుతుందని దీప అనగానే.. కార్తీక్ హ్యాపీగా వెళ్ళిపోతాడు. నేనే మీ ప్రాణధాతని కార్తీక్ బాబు. అది మీరు గెలిచిన రోజు మీ ముందుకి వచ్చి.. నేనే మీ ప్రాణధాతని అని చెప్తానని దీప అనుకుటుంది. మరొకవైపు దాస్ స్పృహ లోకి వచ్చి దీప అసలైన వారసురాలని అన్నయ్యకి చెప్పాలని దశరథ్ కి ఫోన్ చేస్తాడు. ఏంటి దాస్ ఫోన్ చేస్తున్నాడు.. స్పృహలోకి వచ్చాడా గతం గుర్తుకి వచ్చిందా అని దశరథ్ అనుకుంటాడు. అదంతా జ్యోత్స్న విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : తాతయ్యతో మైథిలీగానే ఉంటానన్న రామలక్ష్మి.. సీతాకాంత్ గుర్తుపట్టగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -333 లో.....అసలు మీ నాన్నని ఆ మేడం ఎందుకు కొట్టిందని శ్రీలత వాళ్ళు అడుగుతారు. నాన్నని కొట్టింది అంటే తనదే తప్పు అని రామ్ అంటాడు. అసలేం జరిగి ఉంటుందని శ్రీలత వాళ్ళు ఆలోచనలో పడతారు. సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో దగ్గరికి వెళ్లి నా రామలక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉందంటూ ఆ దండని తీసేస్తాడు. మరొకవైపు సీతాకాంత్ ని కొట్టానని చేతిని కాల్చుకోవాలని చూస్తుంది రామలక్ష్మి.. కానీ ఫణీంద్ర వచ్చి ఆపుతాడు. అతన్ని కొట్టినందుకు ఇంత భాదపడుతున్నావంటే అతను కచ్చితంగా నీ భర్త అయి ఉంటాడని ఫణీంద్ర అంటాడు అయితే ఆ విషయం మాకు అక్కడే ఎందుకు చెప్పలేదని సుశీల అంటుంది. తనకి దూరంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఎలా చెప్తుందని ఫణీంద్ర అంటాడు. రామలక్ష్మి కోపంగా నేను ఎప్పుడు మీ మనవరాలు మైథిలిగానే ఉంటాను.. అయన నన్ను మార్చిపోయి పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక నేను అతన్ని కలవాలనుకోవడం లేదని రామలక్ష్మి అంటుంది. దానికి పెద్దవాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత రామాలక్ష్మి, సీతాకాంత్ కలిసి ఉన్న రోజులని గుర్తుచేసుకుంటుంది. తనతో పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలని మాట్లాడుకున్న విషయలు గుర్తు చేసుకుంటుంది. బాబు పుడితే జానకి రామ్ అని పాప పుడితే లక్ష్మీ అని సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది. తరువాయి భాగంలో సీతాకాంత్ రామ్ ని నిద్రలేపి రెడీ చేసి స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. స్కూల్ లేదు కదా అని శ్రీలత వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. రామ్ ని తీసుకొని సీతాకాంత్ స్కూల్ కి వెళ్తాడు. అక్కడా రామలక్ష్మి మేడమ్ వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతుంటే తన వెంట వెళ్లి రామలక్ష్మి అంటాడు. దాంతో తను ఆగుతుంది రామలక్ష్మి కాదు మైథిలీ అని అంటుంది. మరి రామలక్ష్మి అంటే ఎందుకు ఆగావని సీతాకాంత్ అడుగుతాడు. దేవుడు పువ్వు కిందపడిపోయిందని రామలక్ష్మి అంటుంది. అబద్దం చెప్తున్నావని సీతాకాంత్ అనగానే.. అవసరం నాకు లేదంటూ కోపంగా వెళ్లిపోతుంది. రామ్ వచ్చి నువ్వు ఆ మేడం తో ఎందుకు మాట్లాడావ్.. తను నిన్ను కొట్టింది అంటాడు. ఆ మేడం నాకూ బాగా తెలుసని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కారులో సామంత్ శవం.. అక్క భర్తని అప్పు అరెస్ట్ చేయనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -650 లో......కావ్య ఫ్రూట్స్ బాస్కెట్ లో సర్దుతుంటే అప్పుడే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు మీకు మూడ్ రావాలంటే ఏ బూత్ బంగ్లాకో వెళ్ళాలి కదా అందుకే అని కావ్య అంటుంది. ఏయ్ అంటూ కావ్యపై రాజ్ అరుస్తాడు. నాకు నెల తప్పాలని ఉంది.. స్వప్న అక్కలాగా నాకూ ఒక బిడ్డని కనాలని ఉందని కావ్య అనగానే.. నాకు నువ్వు నెల తప్పాలని ఉందంటూ కావ్య దగ్గరగా రాజ్ వస్తాడు. కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మరుసటి రోజు కళ్యాణ్ నిద్ర లేవగానే ఒక ప్రొడ్యూసర్ కాల్ చేసి నీకు ఒక సినిమాలో ఆల్ సాంగ్స్ కి రాసేలా ఛాన్స్ ఇస్తున్నా అంటాడు. అలా కుదరదు అండి మా గురువు గారికి మాటిచ్చానని కళ్యాణ్ అనగానే మీ గురువు గారు చెప్పారు. అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నాను‌.. కావాలంటే మీ గురువు గారికి ఫోన్ చేసి నాకు మళ్ళీ చెయ్ అని ప్రొడ్యూసర్ అంటాడు. దాంతో కళ్యాణ్ లిరిక్ రైటర్ లక్ష్మికాంత్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒళ్ళంతా దెబ్బలతో పక్కనే అప్పు భయపెడుతుంటే లక్ష్మీకాంత్ ఫోన్ మాట్లాడతాడు. మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోమని అతను చెప్పగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం ఇంట్లో అందరికి చెప్పగానే అందరు చాల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. రాత్రి రాజ్, కావ్య లు కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తారు. అప్పు, కళ్యాణ్ లు ఇద్దరు కేక్ కట్ చేస్తారు. అందరు ఇద్దరిని విష్ చేస్తారు. ఆ తర్వాత అందరు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. రాజ్ కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. ఎవరికి చెప్పకుండా రాజ్ వెళ్తుంటే అతడిని కావ్య చూస్తుంది. తరువాయి భాగం లో అప్పు కానిస్టేబుల్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. నిన్నటి నుండి సామంత్ కన్పించడం లేదని బావపై అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అప్పు అంటుంది. కాని స్టేబుల్స్ రాజ్ కార్ లో చెక్ చెయ్యగా అందులో సామంత్ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

డాన్సర్ షోనాలి నడుముతో తనను పోల్చుకున్న...బ్రహ్మముడి కావ్య

డాన్స్ ఐకాన్ 2  నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఒక్కో కంటెస్టెంట్ డాన్స్ ఇరగదీస్తూ కనిపించారు. ఇక ఇందులో షోనాలి  మాంద్యన్ చేసి పెర్ఫార్మెన్స్ స్టేజి మొత్తం వేడి సెగలు పుట్టించింది. సన్నని నడుముతో సెక్సీ ఫిగర్ తో ఉఫ్ అనుకునేలా పెర్ఫార్మ్ చేసింది. "గురు" మూవీలో మల్లికా శెరావత్ చేసిన "మయ్యా,మయ్యా" సాంగ్ కి ఇరగదీసేసింది. దీంతో బ్రహ్మముడి సీరియల్ కావ్య కుళ్లిపోయింది. సోనాలి నడుమును చూసి ఏడుపు మొదలుపెట్టింది కావ్య. దాంతో పక్కనే ఉన్న యష్ చూసి "నువ్వెందుకు ఏడుస్తున్నావ్" అన్నాడు. "నిన్ను, నీ పెర్ఫార్మెన్స్ చూస్తూ అందరూ హ్యాపీ అయ్యారు. కానీ నాకు మాత్రమే బాధొచ్చింది. ఎందుకో తెలుసా. నీలాంటి నడుము నాకు లేదని" అనేసరికి..ఇందిరా ఈ సన్నని నడుము గోల అనుకుంటూ అందరూ నవ్వుకున్నారు. ఇక సోనాలి కూడా నవ్వుకుంది. బుల్లితెర మల్లికా శెరావత్ అని సోనాలిని పిలిచినా తప్పు లేదు. అలా చేసింది డాన్స్. ఇక సోనాలి గురించి ఓంకార్ చెప్తూ "రీసెంట్ గా పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాని రిప్రెజెంట్ చేస్తూ డాన్స్ పెర్ఫార్మ్ చేసింది" అని పరిచయం చేసాడు. ఇక డాన్స్ ఐకాన్ లో డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళను, డాన్స్ ని సింక్ లో చేసేవాళ్లను పెట్టాడు కానీ నాన్ సింక్ తో అసలు డాన్స్ రాని దీపికను పెట్టడం కొంచెం ఆశ్చర్యమే అనిపించినా కూడా డాన్స్ తనకు నచ్చినట్టు చేస్తూ జడ్జ్మెంట్ ఇస్తూ తన కామెడీ మార్క్ టైమింగ్ తో అందరినీ అలరించే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు స్పెషల్ ప్లేస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కావ్య మాత్రం తన కామెడీ మొదలెట్టేసింది. నడుము అంటూ స్టార్ట్ చేసింది ఇక ఈ షో కంప్లీట్ ఎండింగ్ వరకు ఎంత కామెడీని పంచుతుందో చూడాలి.  

మానస్, ప్రాకృతి మధ్య గొడవ...

ఓంకార్ షో అంటే చాలు మసాలా కన్నా మానవతా విలువలు, జీవన నేపథ్యం, కొంచెం కన్నీళ్లు, కొంచెం ప్రేమ ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వీటితో పాటు సడెన్ గా డెసిషన్స్ తీసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేయడంలో ఓంకార్ తర్వాతే ఎవరైనా..డాన్స్ ఐకాన్ 2 ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అలా నామినేషన్స్ అని అనౌన్స్ చేసేసాడు. ఐతే అప్పుడే నామినేషన్స్ ఏంటన్నా అంటూ అందరూ షాకయ్యారు. అలాగే ఇద్దరు జడ్జెస్ మధ్య గొడవలు కూడా మొదలయైపోయాయి.. మానస్ అండ్ ప్రాకృతి మధ్యన గట్టిగానే వార్ జరిగింది. "డాన్స్ ఐకాన్ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్" అని ఓంకార్ చెప్పగానే " ఐ నామినేట్ ప్రాకృతి" అనేశాడు మానస్. "నేను కంటెస్టెంట్ ని నామినేట్ చెయ్యట్లేదు ప్రాకృతిని నామినేట్ చేస్తున్నా" అన్నాడు సీరియస్ గా. "ఇదేం రీజన్ అండి...టెక్నికాలిటీ తీసుకోవట్లేదు అంటున్నారు" అనేలోపు మానస్ కూడా అరిచేసాడు. దాంతో ప్రాకృతి కూడా ఫుల్ ఫైర్ అయ్యింది. "ఇది ఆ చిన్నారికి సంబందించిన పెర్ఫార్మెన్స్ నా నామినేషన్ కాదు" అని చెప్పింది. "ఇది నా నామినేషన్, ఇది నా విష్" అన్నాడు ముఖం చిట్లిస్తూ మానస్. "చూడండి ఇది డాన్స్" అని ప్రాకృతి చెప్పేటప్పుడు  "నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడనివ్వండి" అన్నాడు సీరియస్ గా. ఇంతకు ఇద్దరి మధ్య ఎందుకు ఏ టెన్నికాలిటీ విషయంలో గొడవయ్యిందో ఎపిసోడ్ లో తెలుస్తుంది. మానస్ అసలు ఎందుకు ఫైర్ అయ్యాడు ? అసలు నిజంగానే నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయా చూడాలి ఎం జరుగుతుందో.  

సీరియల్ లో గెస్ట్ రోల్స్ గా ఆట సందీప్, జ్యోతిరాజ్  

  జీ 5 లో ప్రసారమయ్యే సీరియల్స్ లో "గుండమ్మ కథ" సీరియల్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టమైన సీరియల్. ఐతే ఈ సీరియల్ లో ఇప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్స్ గెస్ట్ రోల్స్ చేయడానికి వెళ్తున్నారు. అంటే అప్పుడప్పుడు సీరియల్స్ లో ఏవో ఒక పాటల పోటీలో, డాన్స్ పోటీలో పెట్టి దాని రిలేటెడ్ ఉన్న కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ ని స్పెషల్ గెస్ట్స్ గా స్పెషల్ ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తూ ఉండడం మనకు తెలుసు. ఎందుకంటే సీరియల్స్ నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉన్నా ఆడియన్స్ కిక్ అనేది రాదు. ఒక్కో టైములో సీరియల్ అంటేనే బోర్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం కొన్ని సీన్స్ ని యాడ్ ఆన్ చేసి ఇలా బుల్లితెర, సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీస్ ని పిలిచే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు కూడా గుండమ్మ సీరియల్ లో కూడా ఇద్దరు సెలబ్రిటీస్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని డైరెక్టర్ ప్లాన్ చేశారు. అదేంటంటే సీరియల్ లో ఒక డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. ఆ పోటీకి ఆట సందీప్ ఆయన భార్య జ్యోతి రాజ్ సందీప్ గెస్టులుగా వచ్చారు. ఈ విషయాన్నీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.  "గుండమ్మ కథలో సెలబ్రిటీ గెస్ట్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ! సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సీరియల్ ని  చూడటం మర్చిపోవద్దు. అలాగే  2,000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్  మొత్తం టీమ్‌కు అభినందనలు...అలాగే సీరియల్ లో నటించిన పూజా, పల్లవి, చరణ్, అశ్విని, మిగతా టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మేము కనిపించి ఈ సీరియల్ స్పెషల్ ఎపిసోడ్ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము ! ఈ డ్యాన్స్ పోటీ ఎపిసోడ్ విన్నర్ ఎవరో కూడా మీరే గెస్ చేయండి" అంటూ పోస్ట్ చేసారు.    

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెరిసిన  సాధ్వి మజుందార్

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ప్రోమో ఫుల్ జోష్ తో కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఇందులో ఎన్నో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందుగా సాధ్వి మజుందార్ తన డాన్స్ ఫార్మ్ తో స్టేజి మీద ఫైర్ పుట్టించేసింది. ఐతే సాధ్వి ఫేమస్ హిట్ మూవీ శ్యామ్ సింగరాయ్ లోని "దీన్ తానా" అనే సాంగ్ కి అద్భుతంగా చేసింది. దాంతో జడ్జెస్, మెంటార్స్ అంతా ఫిదా ఇపోయారు. ఆ తర్వాత యాంకర్ ఓంకార్ సాధ్వి గురించి చెప్పారు. శ్యామ్ సింగరాయ్ మూవీలో సాయి పల్లవితో ఆపోజిట్ సైడ్ లో ఉండి పోటాపోటీగా డాన్స్ చేసిన ఆ సాధ్వినే ఈమె అని పరిచయం చేసారు. ఇక ఫారియా అబ్దుల్లా ఐతే ఆ డాన్స్ కి తనకు గూస్ బంప్స్ వచ్చేశాయని చెప్పింది. ఇక మానస్ ఐతే "అమ్మవారిలో ఎన్ని రూపాలైతే ఉంటాయో అన్ని రూపాలని ఈ డాన్స్ లో చూపించారు. ఇక ఈ సాధ్వి గురించి చెప్పాలంటే  ఈమె త్రిపురలోని అగర్తలాలో ఫిబ్రవరి 18, 1998న పుట్టింది. ఫేమస్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ కూడా, ఆమె "డాన్స్ ఇండియా డ్యాన్స్," "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్," మరియు "ఇండియాస్ డ్యాన్సింగ్ సూపర్ స్టార్" వంటి  రియాలిటీ షోస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో 'డాన్స్ ఇండియా డ్యాన్స్' ఐదవ సీజన్‌ ద్వారా ఆమె బుల్లితెర మీద అరంగేట్రం చేసింది. అలాగే "సాంధ్ కీ ఆంఖ్" మూవీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. ఇక సాధ్వి తన యూట్యూబ్ ఛానల్ లో డ్యాన్స్ ట్యుటోరియల్ వీడియోస్ ని షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె మన తెలుగు డాన్స్ ఐకాన్ లో పార్టిసిపేట్ చేసి చక్కని వన్నె తెచ్చింది.