Eto Vellipoyindhi Manasu : రౌడీల నుండి రామలక్ష్మిని కాపాడిన సీతాకాంత్.. ఫణీంద్ర నిజం చెప్పాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో......రామలక్ష్మి సీతాకాంత్ గదిలో తన ఫోటో చూస్తుంది. అక్కడ పేపర్ పై తనపై ఉన్నా ప్రేమని సీతాకాంత్ రాస్తాడు. అది చూసి రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని ఏడుస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎవరికి చెప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మైథిలి మేడమ్ ఉన్నట్టు ఉండి ఎక్కడికి వెళ్ళింది అని సీతాకాంత్, రామ్ లు అనుకుంటారు. రామలక్ష్మి చేతిలో కర్పూరం వెలగించి.. మా ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలని ఉందని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే కొంతమంది రౌడీలు రామలక్ష్మిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేయించింది రియల్ ఎస్టేట్ రాహుల్.... ఆ తర్వాత రాహుల్ ఫణీంద్రకి ఫోన్ చేసి నీ మనవరాలిని కిడ్నాప్ చేసానని చెప్తాడు. నువ్వు స్కూల్ ల్యాండ్ నాకు ఇవ్వు.. లేదంటే నీ మనవరాలిని చంపేస్తానంటూ చెప్తాడు. దాంతో ఫణీంద్రకి ఏం చెయ్యాలో అర్థం కాక సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత మైథిలీతో రాహుల్ మాట్లాడుతుంటే.. ఫణీంద్రని తీసుకొని వస్తాడు సీతాకాంత్. నాకు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఒక సపోర్ట్ ని తెచ్చుకున్నావా అని రాహుల్ అంటాడు. దాంతో సీతకాంత్ అందరిని కొడతాడు  సీతాకాంత్ ని రౌడీ లు కొడుతుంటే రామలక్ష్మి అడ్డుపడుతుంది. ఏంటి నా రామలక్ష్మిలాగా అడ్డు పడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. రౌడీలని సీతాకాంత్ పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత ఫణీంద్రతో రామలక్ష్మి ఇంటికి వచ్చాక మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : యామిని హ్యాపీ.. భర్త బ్రతికే ఉన్నాడని చెప్తూ కావ్య పూజలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -666 లో..... డాక్టర్ వచ్చి రాజ్ గతం మర్చిపోయాడని చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడని యామిని అంటుంది. మరొకవైపు రాజ్ షర్ట్ పట్టుకొని అపర్ణ ఏడుస్తుంటుంది. కావ్య మాటలు విని నాకు నమ్మకం ఉంది రాజ్ బ్రతికే ఉన్నాడని ఇందిరాదేవి అంటుంది. కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఎందుకు డల్ గా ఉన్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అసలేం జరిగింది ఏవైనా చెప్పేది మిగిలి ఉందా అని అపర్ణ అంటుంది. దాంతో చెప్పడానికి కళ్యాణ్ ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందని అప్పుని కనకం అడుగుతుంది. అప్పు బాధపడుతూ.. బావ లేడు అని చెప్పగానే అందరు గుండెపగిలేలా ఏడుస్తారు. లేదు అలా జరగదు అని అపర్ణ అంటుంటే రాజ్ కి సంబంధించిన వస్తువులు అప్పు చూపిస్తుంది. అవి చుసి అందరూ ఏడుస్తారు. మరోవైపు అక్కడ జరుగుతుంది అంతా చూసి యామిని దగ్గరికి రౌడీ వెళ్తాడు. వాళ్ళంతా రాజ్ చనిపోయాడనుకుంటున్నారని తన గురించి సెర్చ్ చెయ్యరని రౌడీ చెప్పగానే.. యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ దగ్గరికి వెళ్లి బావ నీకు ఏం కాలేదు కదా అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇదిగో మా అమ్మనాన్న వీళ్ళు కూడా గుర్తులేరా అని యామిని అంటుంది. ఎవరు మీరంతా నా వాళ్ళు ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. డాక్టర్ వచ్చి వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్తాడు. యామిని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. ఇక నేను చెప్పినట్టు చెయ్యండి లేకపోతే నేను ముందులా మరిపోతానని తన పేరెంట్స్ ని యామిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత యామిని పేరెంట్స్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అక్కడ పక్కనే కనకం కూర్చొని ఉంటుంది. ఏమైందని కనకం అడుగుతుంది నాకు కాబోయ్ అల్లుడికి ఆక్సిడెంట్ అయింది.. గతం మర్చిపోయాడు నా కూతురు అతన్నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. తనకి ఇచ్చి చెయ్యండి అప్పుడే నీ కూతురు హ్యాపీగా ఉంటుందని కనకం కూడా చెప్తుంది. ఇప్పటివరకు డైలామాలో ఉన్నాం.. ఇప్పుడు రిలీఫ్ గా ఉందని యామిని వాళ్ల నాన్న అంటాడు. మా అల్లుడు అక్కడున్నాడని కనకంని వాళ్ళు తీసుకొని వెళ్తుంటే అప్పుడే కనకంని పిలుస్తుంది అప్పు. ఆ తర్వాత అందరు కావ్య దగ్గరికి వెళ్తారు. మా ఆయన బ్రతికే ఉన్నాడని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్య వంట చేసి అందరిని పిలుస్తుంది. మాకూ ఆకలిగా లేదని అపర్ణ వాళ్ళు అంటారు. రాజ్ లేడని ఆకలిగా లేదని చెప్పండి అని రుద్రాణి అనగానే.. మా ఆయన ఉన్నాడని కావ్య అంటుంది. మా ఆయన ఎక్కడున్నా నేను తీసుకొని వస్తానని కావ్య దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రియమైన దీపిక ...అంటూ అద్భుతమైన లేఖ రాసిన యాంకర్

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక ఈ షోలో దీపికా అందించే ఫన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఉంటె ఆ షో మొత్తం కూడా ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటుంది. కానీ ఈ వారం దీపికా తన కంటెస్టెంట్ సహా ఎలిమినేషన్ లోకి వచ్చేసింది. ఇక డాన్స్ ఐకాన్ షోని అంత స్పెషల్ గా మార్చేసిన దీపికకు యాంకర్ ఓంకార్ ఒక లేఖ రాసాడు అదేంటో చూద్దాం...   ప్రియమైన దీపిక ... డాన్స్ ఐకాన్ యొక్క ఉత్తేజకరమైన ప్రయాణంలో నీ ప్రెజన్స్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఒక మెంటార్ గా మీ కంటెస్టెంట్ కి  మార్గనిర్దేశం చేయడమే కాకుండా, స్టేజి మొత్తాన్ని కూడా ఒక ఎనర్జీని అందిస్తారు. మీరొస్తే చాలు ఆ స్టేజి వెలుగులతో ఎక్కడలేని శక్తిని పుంజుకున్నట్టు వెలిగిపోతూ ఉంటుంది. మీ నవ్వు, మీ ఉత్సాహం, స్పోర్టివ్ నెస్ వలన అది కేవలం డాన్స్ షో మాత్రమే కాదు ఒక సంతోషాన్ని పంచే షో అనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. మీ పాజిటివ్ థింకింగ్ తో అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. మీరు అందరికీ అంతులేని శక్తిని అందిస్తారు. డాన్స్ ఐకాన్ లోకి మీ రాక ఎన్నో రంగుల్ని నింపింది. దాంతో ఈ షో మరింత అట్రాక్టివ్ గా , డైనమిక్ గా మారిపోయింది. మీ అన్స్టాపబుల్ ఎనర్జీతో, అందరికీ అంతులేని ఆనందాన్ని పంచుతూ అందరికీ సపోర్ట్ ఇస్తూ డాన్స్ ఐకాన్ షోని మరింత ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు కేవలం మెంటార్  మాత్రమే కాదు, మీరు ట్రూ ఎంటర్టైనర్, మిగతా వారిలో ఇన్స్పిరేషన్ ని కలిగించే ఒక పవర్ హౌస్ కూడా" అంటూ డాన్స్ ఐకాన్ సీజన్ 2 షో యాంకర్ ఓంకార్ మెంటార్ దీపికకు ఒక అందమైన లేఖను అలాగే ఒక గులాబీని బహుకరించారు. ఇక దీపికా ఐతే "నన్ను నమ్మి ఈ షోలోకి వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్స్" అంటూ ఈ లెటర్ ని తన మాటల్ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.

Illu illalu pillalu : జాబ్ కోసం ధీరజ్ కసరత్తులు.. ప్రేమని వెయిటర్ గా చూసి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో....ధీరజ్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. వెళ్ళిన చోటల్లా నిరాశ ఎదరవుతుంది. మరొకవైపు మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని రామరాజు భాగ్యం వాళ్ళని అడుగుతాడు. ఎక్కడ జనాలు ఉంటే అక్కడే ఇడ్లీ, దోశ అని భాగ్యం భర్త అంటాడు. మీరేం అంటున్నారో నాకూ అర్థం కావడం లేదని రామరాజు అంటాడు. అదేం లేదండి.. మేం ఫైనాన్స్ ఇస్తాం కదా చిన్న వ్యాపారస్తులకి కూడా ఇస్తుంటామని, వాళ్ల వ్యాపారాల దగ్గరికి వెళ్లి అక్కడే ఫైనాన్స్ ఇస్తామని భాగ్యం చెప్తుంది. ఇంకా రెండు ఇల్లులు ఉన్నాయన్నారు కదా ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఉన్నాయ్ అండి.. వాటి గురించి చెప్పొద్దూ గోడలకి చెవులు ఉంటాయి. విని అధికారులకి చెప్తే చెకింగ్ కి వస్తారని భాగ్యం అంటుంది. లోపల లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వీళ్లకి చూపించండి అని తన భర్తకి భాగ్యం చెప్తుంది. అతను వెళ్ళబోతుంటే ఆపి, ఎందుకవన్నీ అవసరం లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత చందు, శ్రీవల్లిలు ఫోన్ నెంబర్ మార్చుకుంటారు. మరోవైపు ప్రేమ కోసం ధీరజ్ వెయిట్ చేస్తుంటాడు. ప్రేమ రాకపోవడంతో తన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు కాఫీ షాప్ దగ్గర చూసానని తను చెప్తుంది. ధీరజ్ వెయిట్ చేసి రాకపోయే సరికి కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రేమ వెయిటర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అది చూసి దీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ ని చూసిన ప్రేమ వాళ్ల సర్ కి చెప్పి ధీరజ్ వెంట వస్తుంది. నువ్వు జాబ్ చెయ్యకు.. నేను చూసుకుంటానని ధీరజ్ అంటాడు. అవసరం లేదు నీలాగా తేలికగా తీసుకోలేనని ప్రేమ అంటుంది. ధీరజ్ ఎంత చెప్పినా జాబ్ చేస్తానని ప్రేమ అంటుంది. తరువాయి భాగంలో అందరు భోజనం చేస్తుంటే ప్రేమ, ధీరజ్ లు వస్తారు. భోజనం చెయ్యండి అని వేదవతి అంటుంది. ఇద్దరు సైలెంట్ గా వెళ్లి పోతారు. మీరు తినమని చెప్పండి అని రామరాజుతో వేదవతి అంటుంది. అబద్ధాలతో మోసం చేసే వాడు బయట తినకుండా ఉంటాడా అని రామరాజు అంటాడు. ప్రేమ, ధీరజ్ లు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ప్రాఫిట్స్ చూపించినందుకు వాళ్ళిద్దరిని మెచ్చుకున్నాడు.. వీలునామా గురించి అడిగిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -301 లో.... శ్రీధర్, కావేరి లు కాంచన దగ్గరికి వస్తారు. అక్కడ వాళ్ళు శ్రీధర్ ని పట్టించుకోకుండా కావేరికి మర్యాద చేస్తుంటే అతనికి కోపం వస్తుంది. వచ్చిన పని ఏంటో చెప్పండి అని కార్తీక్ అంటాడు. ఆ శివన్నారాయణ వీలునామా రాయించాడంట.. అందులో మీకు రాశాడో లేదో అని కనుక్కోండి అని శ్రీధర్ అంటాడు. మాకు అవసరం లేదని కాంచన చెప్తుంది. దాంతో శ్రీధర్ డిస్సపాయింట్ అవుతాడు. శ్రీధర్ తనకి వాటా వస్తుందని సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు కానీ కాంచన, కార్తీక్ లు వద్దని చెప్పడం తో కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి వచ్చి.. ఆ శివన్నారాయణ ఆస్తులు ఎవరి పేరున రాశాడోనని అనుకుంటూ ఉంటే ఆయన ఎవరి పేరున రాస్తే ఏంటి అక్కకి వస్తే అందులో మీకు వాటా వస్తుంది అనేగా అని కావేరి అంటుంది. గట్టిగా అనకే నాకు వస్తే నీకు వస్తుంది కదా అని శ్రీధర్ అంటాడు. అయిన మీకెందుకు ఇస్తారని కావేరి వెటకారంగా మాట్లాడుతుంది. శత్రువువులు ఎక్కడో లేరు.. ఇంట్లోనే ఉంటారని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు రెస్టారెంట్ కి సత్యరాజ్ వచ్చి కార్తీక్, దీపలతో మాట్లాడతాడు. మీకు మూడు నెలల టైమ్ ఇచ్చాను కానీ ఫస్ట్ వీక్ లోనే రెస్టారెంట్ ప్రాఫిట్స్ చూపించారు.. చాలా గ్రేట్.. మీకు నచ్చింది చేయండి ఒకసారి వంటలు టేస్ట్ చూడడానికి వచ్చాను. చాలా బాగున్నాయంటూ కార్తీక్ , దీపలని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఒకటి అడగాలని కార్తీక్ తో దీప అనగానే ప్రాణాధాత గురించా అంటూ సరదాగా మాట్లాడుతాడు కార్తీక్. నేను అడగాలనుకుంది. మీ తాతయ్య వీలునామా విషయం గురించి అని దీప అనగానే.. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామ్ తల్లి సిరి అని తెలుసుకున్న రామలక్ష్మి.. సీతాకాంత్ ని తప్పుగా అర్థం చేసుకుందా! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో....రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ కలిసి మేడ పైనుండి వస్తుంటే.. వాళ్ళు ఆ బాబుకి పేరెంట్స్ లా ఉన్నారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. హ్యాపీ బర్త్ డే రామ్ అని మమత అంటుంటే.. తల్లివి అయి ఉండి ఇంత లేట్ గా విష్ చేస్తారా అని రామలక్ష్మి అంటుంది. ఈ మేడమ్ ప్రవర్తన ఎందుకో మమత అక్క విషయంలో తేడా గా ఉందని సీతాకాంత్ తో శ్రీవల్లి అంటుంది. దాంతో మొదటి నుండి రామలక్ష్మి మమతతో మాట్లాడింది గుర్తుచేసుకుంటుంది. మమత గారిని రామలక్ష్మి నా భార్య అనుకుంటుంది. అసలు విషయం తెలిసేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు ఫణీంద్ర, సుశీలలు మైథిలి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం మైథిలీని తీసుకొని వెళ్ళేది లండన్.. ఆ విషయం చెప్పి తనని కన్విన్స్ చెయ్యాలని సుశీలతో ఫణీంద్ర చెప్తాడు. ఆ తర్వాత కేక్ కట్ చేస్తుంటే మీరెందుకు ఇక్కడ ఉన్నారు.. బాబు పక్కన ఉండండి అని మమతతో రామలక్ష్మి అంటుంది. ఇక్కడే ఉంటానని మమత అంటుంది. రామ్ పిలవగానే రామలక్ష్మి, మమత ఇద్దరు పక్కకి వెళ్తారు. రామ్ కేక్ కట్ చేసి సీతాకాంత్ కి పెట్టబోతుంటే.. అమ్మకి పెట్టాలి కదా అని చెప్తాడు. దాంతో రామ్ కేక్ పట్టుకొని సిరి ఫోటో దగ్గరికి వెళ్తాడు. ఆ ఫోటో చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. సీతా గారు రామ్ ని నాన్న అన్నపుడే అర్థం చేసుకోవాల్సిందని రామలక్ష్మి బాధపడుతుంది. మా అమ్మ అని అడిగారు కదా తనే మా అమ్మ అని రామ్ చెప్తుంటే.. రామలక్ష్మి ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటుంది. నేను సీతా గారిని తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడుతుంది. మీరు చూస్తుంది అంతా నిజం మైథిలి గారు.. నా చెల్లి కొడుకు రామ్ అని సీతాకాంత్ చెప్తాడు. అదంతా విని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే వెయిటర్ జ్యూస్ తీసుకొని వస్తుంటే.. తనపై పడిపోతుంది. రామలక్ష్మి క్లీన్ చేసుకుంటానంటు ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ తన ఫోటో చూసి షాక్ అవుతుంది. గదిలో రామలక్ష్మిపై ప్రేమని సీతాకాంత్ అక్కడ పేపర్స్ పై రాస్తాడు. అదంతా చూసి రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే మిస్ అంటూ రామ్ పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : గతం మర్చిపోయిన రాజ్.. యామిని అతడిని సొంతం చేసుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -665 లో..... అప్పు బయటున్న పోలీస్ ల దగ్గరికి వెళ్లి రాజ్ గురించి అడుగుతుంది. మా అక్కని ఒక్కదాన్నే అడ్మిట్ చేశారు.. బావ ఎక్కడ అని అడుగుతుంది. మీరెవరు మేడమ్ మేమ్ ఇంట్రగేషన్ చేస్తున్నామని అతను అంటాడు. నేను పోలీస్ అంటూ తన ఐడి చూపిస్తుంది అప్పు. అక్కడ ఒక కావ్య గారు మాత్రమే ఉన్నారని అతను అంటాడు. ఇన్సిడెంట్ జరిగిన చోటుకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని వాళ్ళతో చెప్తుంది అప్పు. మరొక వైపు అపర్ణ వాళ్ళు బాధపడుతుంటే.. కావ్య ఒక్కతే ఉందంటే రాజ్ లేడేమోనని రుద్రాణి అంటుంటే. దాంతో అందరు తనపై విరుచుకుపడతారు. కావ్య అంతా గుర్తుచేసుకొని స్పృహలోకి వస్తుంది. డాక్టర్ అందరిని పిలుస్తాడు. ఆయన ఎక్కడ అంటూ కావ్య అడుగుతుంది. అసలేం జరిగింది నువ్వే చెప్పాలని ఇందిర దేవత అడుగుతుంది. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటు వెళ్తున్నాం.. కార్ పంచర్ అయింది. తర్వాత లోయలో పడిపోయింది. నాకు స్పృహ లేదు.. ఇక ఏం జరిగిందోనని కావ్య చెప్తుంది. అప్పుడే అప్పు వస్తుంది. ఏమైంది రాజ్ ఆచూకి తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. అప్పు బాధగా అక్కడ బావ కన్పించలేదు.. అక్కడ బావ షర్ట్ మాత్రమే దొరికిందని అప్పు షర్ట్ ఇస్తుంది. అది మా ఆయన షర్ట్ అని కావ్య ఏడుస్తుంది. ఏదైనా దాస్తున్నావా అని అపర్ణ అనగానే.. బావ బాడీని అడవి జంతువులు లాక్కొని పోయి ఉంటాయని అంటున్నారని అప్పు అనగానే అందరు షాక్ అవుతారు. మా ఆయనకేం కాదు అంటూ కావ్య తట్టుకోలేకపోతుంది. మళ్ళీ స్పృహ కోల్పోతుంది. మరొకవైపు యామిని తన పేరెంట్స్ రాజ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి టెన్షన్ పడుతుంటారు. అప్పడే రాజ్ స్పృహలోకి వస్తాడు. రాజ్ దగ్గరికి డాక్టర్ వెళ్తాడు. అసలు నాకు ఏమైందంటూ రాజ్ అడుగుతాడు. ఏం గుర్తు లేదా అని డాక్టర్ అడుగగా.. ఏం గుర్తు లేదని రాజ్ అంటాడు. మీ పేరు చెప్పండి అని డాక్టర్ అనగానే.. నాకు గుర్తు లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకి వచ్చి అతను గతం మర్చిపోయాడని యామిని వాళ్ళతో చెప్తాడు. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడంటు యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఒకే హాస్పిటల్ అవడంతో యామిని వాళ్ల అమ్మ, కనకం పక్కపక్కన కూర్చొని ఉంటారు. కాబోయే అల్లుడికి ఆక్సిడెంట్ అయిందని, గతం మర్చిపోయాడని, ఇప్పుడు ఎలా పెళ్లి చేయాలని యామిని తల్లి కనకంతో అంటుంది. తనకే ఇచ్చి చెయ్యండని కనకం అంటుంది. మా అల్లుడు అక్కడ ఉన్నాడు.. చూద్దువు రండి అని కనకాన్ని ఆవిడ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మాయిలతో దోరికిపోయిన హైపర్ ఆది

  రాబోయే హోలీ రంగుల పండగను పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా బయట హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో వాళ్ళ సందడి వీడియోని టెలికాస్ట్ చేశారు. ఇందులో "ఆది గుల షాప్" అంటూ నటీ నరేష్ ఒక బ్యానర్ ని తీసుకొచ్చాడు. అది చూసి అదేంటిరా "రం" ఏది అని అడిగేసరికి "నాన్నగారు తాగేశారు" అని చెప్పాడు. ఈ ఎపిసోడ్ సౌమ్య వచ్చి డాన్స్ చేసింది. ఐతే సౌమ్య వేసిన డాన్స్ స్టెప్స్ అన్నీ తనవే అని వాటిని కాపీ కొట్టేసింది అంటూ ఆది ఫైర్ అయ్యాడు. దానికి హోస్ట్ రష్మీ ఐతే ఆ స్టెప్స్ వేసి చూపించండి అంటూ ఆదిని అడిగింది. ఆది ఏదో వచ్చి రాని స్టెప్పులేశాడు. ఇక నరేష్ వచ్చి "ఒక్క స్టెప్ కె కేసు ఎలా వేస్తారండి" అంటూ కౌంటర్ వేసాడు. "వేస్తాం రా మేము మేమంతే కూర్చో" అంటూ ఆది రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సౌమ్య ఐతే "పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు  అయ్యింది. కానీ ఎం చేయలేదు ఇంతవరకు " అంటూ  ఆదిని నిలదీసింది. తర్వాత నాటీ నరేష్ వచ్చి ఆది బండారం బట్టబయలు చేసాడు. కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఫోటోని ప్లే చేసాడు. ఆది ఆ ఫోటోని ముందు షాక్ అయ్యాడు. కానీ వేంటనే ఇది తనకు బాగా నచ్చిందని ఇలాంటివే ప్లాన్ చేయాలనీ కూడా ఒక సలహా ఇచ్చాడు. తర్వాత కొంతమంది అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసాడు ఆది. ఇక లాస్ట్ లో సౌమ్య ఒక కాఫీ మగ్ తెచ్చింది దాని మీది తన తల్లితో కలిసి తీయించుకున్న ఫోటోని పెట్టుకుంది. తాను అమ్మ కాదు నా బిడ్డ..అమ్మ బాగున్నప్పుడు మంచి ఫొటోస్ లేవు..ఎందుకంటే మంచి మొబైల్స్ లేవు..అమ్మ బెడ్ రిడెన్ అయ్యాక నా దగ్గర మంచి మొబైల్ ఉంది..కానీ అమ్మతో మంచి ఫొటోస్ లేవు అని చెప్తూ  ఎమోషనల్ అయ్యింది సౌమ్య .    

రంగస్థలం మూవీలో సమంత గెటప్ లో...విష్ణు ప్రియా 

చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కి పృద్వి -  విష్ణుప్రియ ఇద్దరూ కలిసి రంగస్థలం మూవీ గెటప్స్ వేసుకొచ్చారు. విష్ణుప్రియ రామలక్ష్మి గెటప్ లో వచ్చింది. "రామ లక్ష్మినే కానీ రాంగ్ స్థలంలో ఉన్నట్టు ఉంది" అంటూ సుమ సెటైర్ వేసింది. తర్వాత అమర్ దీప్ వచ్చి "బేసిక్ గా అక్కడ నడుము ఉండాలి. కానీ అక్కడ లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఫ్రస్ట్రేట్ ఐపోయిన విష్ణు ప్రియా.."పృద్వి ఏమీ మాట్లాడవేంటి" అని సీరియస్ గా అడిగేసింది. దానికి అంబటి అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. "నీ నడుము గురించి పృద్వి ఎందుకు చెప్తాడు" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఎందుకంటే రంగస్థలం మూవీలో హీరోయిన్ సమంత నడుము చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ విష్ణుప్రియ నడుము అలా సన్నగా లేకపోవడంతో అమర్ డైలాగ్ వేసాడు. ఇక  తర్వాత దీపికా హడావిడి చేసుకుంటూ వచ్చింది...జడ్జ్ కం మాష్టర్ షెఫ్ కె లైన్ వేసేసింది. ఇక సుమ ఐతే "జీవన్ గారు కంగ్రాట్యులేషన్స్..దీపికా మీతో ఏదో చెప్పాలనుకుంటుంది" అంటూ స్టేజి మీదకు పిలిచింది. జీవన్ పేరును చేతి మీద రాసుకొచ్చింది దీపికా.. ఇక అది చూసిన జీవన్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో "పచ్చబొట్టేసినా పిల్లగాడా" అనే సాంగ్ కూడా ప్లే చేశారు. ఇక జీవన్ ఆమె చేతిని బలవంతంగా పట్టుకునేసరికి ఇంకో వైపు నుంచి అంబటి అర్జున్ కత్తి పట్టుకుని ఇంతకు తెగించిందిరా అది..అంటూ దీపికా  మీద దాడి చేయడానికి వెళ్ళబోతే మిగతా వాళ్లంతా ఆపారు.  జీవన్ వీళ్ళందరికీ పూతరేకులు వేసే టాస్క్ ఇచ్చారు. చూడండి పూతరేకులు వేయడానికి కుండల్ని రుద్ది రుద్ది రుద్దుతూనే ఉన్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి రాజీవ్ కనకాల కూడా వచ్చాడు. రాజీవ్, సుమ వాళ్ళ 26 వ వెడ్డింగ్ యానివర్సరీని సెట్ లో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. తర్వాత  అన్ని జోడీస్  వాళ్లకు  విషెస్ చెప్పారు.  

పృద్వి కోసం లవ్ లెటర్ రాసిన విష్ణుప్రియ 

  చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ జోష్ ని పంచింది. ఇందులో మైసూర్ బొండాలు, చట్నీలు తయారు చేసే టాస్క్ ఇచ్చారు. అలాగే టేస్టో మేటర్ లో సమీరా భరద్వాజ్ - దీపికా జోడి విన్నింగ్ జోడిగా నిలబడ్డారు. ఇక ఈ ఎపిసోడ్ లో పృద్వి శెట్టి- విష్ణు ప్రియా జోడి కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. పృద్వి మైసూర్ బొండాలు వేస్తూ ఉన్నాడు. అలాగే విష్ణు కోసం పాటలు పాడుతూ ఉన్నాడు.  ఇక జడ్జ్ మాస్టర్ షెఫ్ జీవన్ యాంకర్ సుమా అందరి దగ్గరకు వచ్చి బోండాలను టేస్ట్ చేసాక పృద్వి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇక అక్కడ విష్ణుప్రియ సెపరేట్ గా ఒక అట్ట తీసి ఏదో రాసుకుంటూ కనిపించింది. సుమ అది చూసి ఏంటి రాస్తున్నావ్ అని అడిగేసరికి రెసిపీ రాసుకుంటున్నా.. ఇంటికి వెళ్లి ఇలాగే మైసూర్ బొండాలు వేయాలని అని చెప్పింది. సరే సుమ ఆ ప్యాడ్ తీసుకుని అందులో రాసిందేమిటా అని చదివింది. "పొయ్యి మీద పెట్టొచ్చా పెనం...ఎప్పుడు ఒకటవుదాం మనం...నిన్ను చూస్తే చాలు నూనెలో పడ్డ పూరీలా నా మనసు పొంగిపోతోంది...నువ్వు గుర్తొస్తే చాలు నా గుండె గుత్తి వంకాయలా ఉడికిపోతుంది... మాసాలకు కావాలి లవంగాలు...మన పెళ్లి కోసం కొన్నా ఎన్నో లెహంగాలు...పిడత కింద పప్పు...నన్ను వదులుకుంటే నీ తప్పు..ఇంతకంటే చదివితే నాకు పెద్ద ముప్పు" అంటూ విష్ణు రాసిన రెసిపీ లవ్ లెటర్ చదివేసరికి అందరూ నవ్వేశారు. ఇది లవర్ లెటరొ, కవిత్వమో, రెసిపీనో, పైత్యమో అర్ధం కావట్లేదు అంటూ సుమా దణ్ణం పెట్టేసింది.  

కావ్యశ్రీ దగ్గరికి నిఖిల్.. హైప్ ఎక్కిస్తున్న ప్రోమో!

  బిగ్ బాస్ సీజన్‌-8 విజేతగా నిలిచిన నిఖిల్ గురించి అందరికి తెలిసిందే. అతని మాజీ ప్రేయసి కావ్యశ్రీతో బ్రేకప్ అయ్యింది. నిఖిల్ కావ్యలు కలవాలని, వాళ్లిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ని చెరిపేసుకుని కావ్య నిఖిల్‌ గా ఉండాలని చాలామంది సీరియల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ తరువాత ఏం ప్రాజెక్ట్ చేస్తారని అందరిలోనూ ఆసక్తి ఉండేది. అయితే నిఖిల్ రీ ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు. కావ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ‘చిన్ని’ సీరియల్‌ ఆసక్తికరంగా సాగుతుంది. జైలులో ఖైదీగా ఉన్న కావేరి (కావ్య) చనిపోయిందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్‌కి మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే సీరియల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘గేమ్ స్టార్ట్ నౌ’ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. 50 సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో అయితే అదిరిపోయింది. ఇక ప్రోమోకి నిఖిల్, కావ్య ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం ట్విస్ట్‌రా బాబూ.. ఇన్నాళ్లూ మీరిద్దరూ కలవాలని కోరుకున్నాం.. కానీ ఇద్దరూ కలిసి పెద్ద ట్విస్టే ఇచ్చారంటూ అటు నిఖిల్ ఫ్యాన్స్, ఇటు కావ్య ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు‌. తాజా ప్రోమోలో జస్ట్ అతను జీపుపై రావడం.. బాస్కెట్ బాల్ కోర్టులో ఉన్న కావ్యని కలిసి.. ఆమెకి బాల్ ఇచ్చి ఆమెతో చేతులు కలపడం చూపించారు. ఇద్దరూ చేతులు కలిపినప్పుడు ‘గేమ్ స్టార్ట్ నౌ’ అని టైటిల్ వేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఇద్దరి మధ్య రియల్ లైఫ్‌లో ఎలాంటి వైరం ఉందో పక్కన పెడితే.. ‘చిన్ని’ సీరియల్‌లో మాత్రం టఫ్ వార్ ఉండబోతుందని తేలిపోయింది. ఆ ప్రోమోని బట్టి చూస్తే.. నిఖిల్ పోలీస్ ఆఫీస్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తుంది. క్షుణ్ణంగా చూస్తే.. నిఖిల్ పక్కన జబర్దస్త్ పవిత్ర వైట్ అండ్ బ్లూ డ్రెస్‌లో అతనికి అసిస్టెంట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్...జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా

  బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమెకు శునకాలంటే పిచ్చి ప్రేమ. ఏ మూగజీవానికి హాని జరిగినా ఊరుకోదు. అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్ ఉండేది. దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది. ఐతే అది కొంతకాలం క్రితం చనిపోయింది. ఇక రష్మీ తన పెట్ డాగ్ అస్థికలను గోదావరి నదిలో కలిపేసింది. ఆ వీడియోని అలాగే తన చుట్కితో గడిపిన క్షణాల వీడియోస్ ని కూడా పోస్ట్ చేసింది. "ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను. నీ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు..ఇక ప్రశాంతంగా మరో లోకానికి వేళ్ళు..చుట్కి గౌతమ్" అంటూ ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మీ. ఇక నెటిజన్స్ ఐతే "ఇలాంటి మనిషిని నా జీవితంలో చూడలేదు..ఓం శాంతి చుట్కి బేటా. జంతువుల మీద మీరు చూపించే ప్రేమ గొప్పది" అంటూ మెసేజెస్ ఇస్తున్నారు. ఇక రష్మీ ఈటీవీ షోస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇక బుల్లితెర మీద హిట్ పెయిర్ గా నిలిచింది. ఈ జంట పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది కానీ తర్వాతి కాలంలో వీళ్ళు విడిపోయారు.. ఐతే వీళ్ళు మళ్ళీ కలవాలని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు.

యామిని ప్లాన్ సక్సెస్.. వాళ్ళిద్దరిలో కావ్య సేఫ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -664 లో... కావ్యని రాజ్ బూత్ బంగ్లాకి తీసుకొని వెళ్తాడు. కావ్యని కళ్ళుమూసుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. కావ్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ బాగా డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి కావ్య సర్ ప్రైజ్ అవుతుంది. ఇన్ని రోజులు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కష్టంలో నాకు తోడుగా ఉన్నావ్.. ఫ్రెండ్ గా సలహా ఇచ్చావ్.. నీపై నాకు ప్రేమ ఉంది.. అది చెప్తే నువ్వు నాతో గొడవ పడడం ఆపేస్తావేమోనని చెప్పలేదు.. నువ్వు నాతో గొడవ పడితే నాకు నచ్చుతుందని రాజ్ అంటాడు. దాంతో కావ్య మురిసిపోతుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని కావ్యకి రింగ్ పెట్టి రాజ్ ప్రపోజ్ చెయ్యగానే కావ్య ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటుంది. మీరు నన్ను విడిచినా.. నేను నిన్ను విడవనని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయల్దేరి వెళ్ళిపోతారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. మరొక వైపు యామిని రౌడీకి ఫోన్ చేసి ఎక్కడివరకు వచ్చిందని అనగానే పని పూర్తవుతుందని ఆ రౌడీ చెప్తాడు. రాజ్, కావ్య వెళ్తుంటే కొండపై నుండి రౌడి షూట్ చేస్తాడు. అది టైర్ కి తాకి కార్ లోయలో పడిపోతుంది. మరొకవైపు కావ్య రాజ్ ల ఫోటో కిందపడిపోతుంది. అది చూసి అపర్ణ కంగారు పడుతుంది. మొదటిసారి ఇద్దరు బయటకు వెళ్లారు.. ఇలా జరిగింది ఏంటని అపర్ణ టెన్షన్ పడుతుంది. ఫోన్ చేయబోతుంటే వాళ్లని డిస్టబ్ చెయ్యకని సుభాష్ అంటాడు. అప్పుడే సుభాష్ కి ఫోన్ వస్తుంది రాజ్, కావ్యలకి ఆక్సిడెంట్ అయిందని సుభాష్ కి ఫోన్ రావడంతో అది విని అందరు షాక్ అవుతారు. యామినికి రౌడీ ఫోన్ చేసి బుల్లెట్ మిస్ అయి టైర్ కి తగిలిందని చెప్తాడు. అపర్ణ వాళ్ళు హాస్పిటల్ కి వస్తారు. కావ్య ఉన్న సిచువేషన్ చూసి అపర్ణ బాధపడుతుంది. కనకం కూడా వస్తుంది. డాక్టర్ వచ్చి బ్లడ్ ఎక్కించాలని చెప్తాడు. మా అబ్బాయి రాజ్ ఎక్కడ అని సుభాష్ అడుగగా.. ఏం తెలియదు  ఒక్క ఆవిడనే అడ్మిట్ చేశారు.. పోలీసులు బయట ఉన్నారు.. అడగండి అని డాక్టర్ అనగానే అప్పు వెళ్తుంది. రాహుల్, రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో కావ్య స్పృహ లోకి వస్తుంది. రాజ్ గురించి అడుగుతుంది అప్పు వచ్చి పోలీసులకి కూడా బావ గురించి తెలియదట కానీ అక్కడ చెట్టుకి ఈ షర్ట్ దొరికిందట అని అప్పు చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వాళ్ళే బాబు తల్లిదండ్రుల్లా ఉన్నారు.. రామ్ బర్త్ డే రోజున రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -347 లో.....ఇదే రోజు మీ కూతురు చనిపోయిన రోజు.. ఇదే రోజు తన కొడుకు పుట్టినరోజు.. ఒక వైపు సంతోషం, ఒకవైపు బాధ.. ఇలాంటి సిచువేషన్ రాకుడదని పంతులు గారు అంటారు. మీ మనవడిని పిలవండి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిద్దామని పంతులు అనగానే.. వాడికి తల్లి ప్రేమ ఏం తెలుసు నా కూతురికి నేను, నా కొడుకు చేస్తామని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామ్ పుట్టినరోజు కి మమత వస్తుంది. రామ్ ఇంకా రెడీ అవ్వలేదా అని సీతాకాంత్ ని అడుగుతుంది. లేదు తన గురించి తెలుసు కదా.. వాళ్ళ మిస్ టీసీ ఇచ్చింది.. నేను అదే స్కూల్ కి వెళ్తాను.. మేడమ్ కావాలి అంటూ మారాం చేస్తూ కూర్చున్నాడని సీతాకాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. హాయ్ అని మమత చెప్పగానే.. ఇంటికి వచ్చిన వాళ్లకు చెప్పాల్సింది హాయ్ కాదు వెల్ కమ్ అని రామలక్ష్మి అంటుంది. మీరు పిలిచారని రాలేదు.. పసి మనసు బాధపడకూడదని వచ్చానని రామలక్ష్మి అంటుంది. రామ్ ఎక్కడ అని రామలక్ష్మి అడుగుతుంది. మీరు వస్తే గానీ రానని పైన ఉన్నాడని సీతాకాంత్ అంటాడు. నాన్న మీ మిస్ వచ్చిందని చెప్పగానే.. రామ్ వస్తాడు. వెళ్లి రెడీ చేసి తీసుకొని వస్తానని రామ్ ని సీతాకాంత్ తీసుకొని వెళ్తాడు. సీతా గారు ఒక్కరే కష్టపడుతుంటే తల్లి అయి ఉండి పట్టించుకోవడం లేదని మమత గురించి రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ రెడీ చేస్తాడు. రామలక్ష్మి అక్కడున్న శ్రీలత సందీప్, శ్రీవల్లీలతో మాట్లాడుతుంది. మీరేం చేస్తున్నారంటూ సందీప్ తో మాట్లాడుతుంది. పెద్ద వర్క్ చేస్తాడు. మా పెద్ద కొడుకు సంపాదించిన డబ్బులు రెట్టింపు చేస్తాడని శ్రీలత అంటుంది. మమతని అడిగి ఇల్లు చూస్తానంటూ రామలక్ష్మి వెళ్తుంటే.. ఇల్లు మనది కదా మమత అక్కని పర్మిషన్ అడుగుతుంది ఏంటని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి పైకి వెళ్లి ఇల్లు చూస్తుంది. అక్కడే ఉన్న సిరి ఫోటో చూడదు. ఫోటో ఉన్న రూమ్ లోకి తను వెళ్ళబోతుంటే రామ్ వచ్చి మిస్ అని పిలుస్తాడు. ముగ్గురు కలిసి కిందకి వస్తుంటే.. వాళ్ళు  ఆ బాబుకి అమ్మనాన్నలాగా అనిపిస్తున్నారని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మొదటి భార్యకి వాటా కావాలన్న శ్రీధర్.. వీలునామాలో శివన్నారాయణ ఏం రాసాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -300 లో.....కార్తీక్ రెస్టారెంట్ దగ్గరికి జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్ వస్తారు. మేం ఇక్కడ పని చెయ్యాలని అనుకుంటున్నామని అంటారు. మిమ్మల్ని తీసుకోవాలని నాకు ఉంది కానీ అలా చెయ్యకూడదు ఇన్ని రోజులు మీకు అన్నం పెట్టిన రెస్టారెంట్ అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న కోపంగా కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఎందుకు మా ఎంప్లాయిస్ ని మోసం చేసి నీ వైపు కీ తిప్పుకుంటున్నావని జ్యోత్స్న అంటుంది. మోసం అంటే తెలుసా అంటూ కోపంగా మాట్లాడతాడు కార్తీక్. ఏం అన్యాయం చేసారని నా కూతురు, భార్య ని చంపాలనుకుంటున్నావు. ఇంకొకసారి వాళ్ల జోలికి రాకు అని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని జ్యోత్స్నకి కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్ తో దీప మాట్లాడుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పెద్దాయనతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని దీప వాళ్లకి నచ్చజెప్పుతుంది. అదంతా జ్యోత్స్నకి కార్తీక్ చూపిస్తాడు. వాళ్ళు నేను చెప్పిన వినడం లేదని దీపతో చెప్పిస్తున్న అని కార్తీక్ అంటాడు.  ఇలా ఆవేశం గా ఉండడం కాదు ఎంప్లాయిస్ కష్టాలు ఏంటో కనుక్కోమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. ఎప్పటికి నాపై గెలువలేవని జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. ఎందుకు ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి.. వర్కర్స్ కీ ఎందుకు నమ్మకం పోతుంది.. నువ్వు ఎప్పుడు ఆ కార్తీక్ రెస్టారెంట్ చుట్టూ తిరుగుతుంటే ఇలానే ఉంటుంది.. ఇలా ఇంకొకసారి జరగకూడదంటూ జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. లాయర్ తో వీలునామా రాయమని చెప్పానని  శివన్నారాయణ అంటాడు. నిజంగానే విడాకులా అని పారిజాతం భయపడుతుంది. ఆస్తుల వీలునామా రాయించానని శివన్నారాయణ అనగానే.. ఏం రాసారని పారిజాతం అడుగుతుంది. లాయర్ వస్తాడు కదా అప్పుడే తెలుస్తుందని శివన్నారాయణ అంటాడు. శ్రీధర్ దగ్గరికి పారిజాతం వెళ్లి విషయం చెప్పి లాయర్ నీ ఫ్రెండ్ కదా ఎవరికి ఎంత రాశాడో కనుక్కోమని చెప్పగానే వాడు మావయ్య ద్వారానే ఫ్రెండ్ అయ్యాడు. మావయ్యకి తెలుస్తుందని అడగనని శ్రీధర్ అంటాడు. దాంతో పారిజాతం డిస్సపాయింట్ గా వెళ్తుంది. నా మొదటి భార్యకి ఆస్తి విషయంలో అన్యాయం జరిగితే ఒప్పుకోనని కావేరితో శ్రీధర్ అంటాడు. మరొకవైపు వీలునామాలో ఏం రాసారోనని శివన్నారాయణ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. కానీ పారిజాతం ప్లాన్ అర్ధమై అతను చెప్పడు. ఆ తర్వాత కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కాఫీ షాప్ లో జాబ్ చేస్తున్న రామరాజు కోడలు.. వాళ్ళని భాగ్యం బురిడీ కొట్టించిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -101 లో..... రామరాజు కుటుంబం భాగ్యం ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. ఒకతను భాగ్యం ఇంటిని చూపిస్తాడు. లోపలికి వెళ్ళబోతుంటే భాగ్యం పిలిచి అక్కడి ఎటు వెళ్తున్నారు.. ఇటు మా ఇల్లు అని భాగ్యం పిలుస్తుంది. అతను ఎవరో మీకు తప్పుడు అడ్రెస్ చెప్పాడని భాగ్యం అందరిని తన వెంట తీసుకొని వెళ్తుంది. భాగ్యం శ్రీవల్లి వాళ్ళకి సైగ చేస్తుంది. అమ్మ ఏదో ప్లాన్ చేసినట్లుంది మనం రెడీ అయి వెళదామని శ్రీవల్లి తన చెల్లి నాన్నతో అంటుంది. ధీరజ్ తన ఫ్రెండ్ తో నాకు జాబ్ చూడమని చెప్తాడు. రామరాజు కుటుంబం భాగ్యంతో వెళ్తారు. అక్కడ ఇంటికి చూసి ఆశ్చర్యపోతారు. నిజం గా ఇది మీ ఇళ్లేనా అని తిరుపతి అడుగుతాడు. లేదండి రెంట్ కి తీసుకున్నామని భాగ్యం అంటుంది. మరేంటి ఇలాంటివి మూడు ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా అని భాగ్యం అంటుంది. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్లి మాట్లాడుకుంటారు..  మీరేం చదువుకున్నారని శ్రీవల్లిని అడుగుతుంది నర్మద. శ్రీవల్లి చెప్పకుండా తన చెల్లి సమాధానం చెప్తుంది. అదేంటి నువ్వు చెప్తున్నావని నర్మద అనగానే పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావ్ కదా అలాంటివేం తెలియదు నీకు అని నర్మదని భాగ్యం అంటుంది. తను అన్నదాంట్లో తప్పేంటి తనని ఇంకొకసారి అలా అనకు అని భాగ్యంతో వేదవతి అంటుంది. నేనేదో సరదాకి అన్నానని భాగ్యం అంటుంది. ఆ తర్వాత చందు, శ్రీవల్లిలు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. శ్రీవల్లి చందుని ఇంప్రెస్ చేస్తుంది. మీరు ఎవరైనైనా ప్రేమించారా ప్రేమించే ఉంటారులే అందంగా ఉన్నారు కదా అని శ్రీవల్లి అంటుంది. అయిన నేనేం పట్టించుకోను మీతో నా భవిష్యత్తు ముఖ్యమని శ్రీవల్లి అంటుంది. మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని భాగ్యం వల్ల భర్తని రామరాజు అడుగుతాడు. ఎక్కడ జనాలు ఉంటే అక్కడ ఇడ్లీ దోశ అని అతను అనగానే.. రామరాజుకి ఏం అర్ధం కాదు. తరువాయి భాగంలో ప్రేమ కాఫీ షాప్ లో జాబ్ చేస్తుంది. ఆ విషయం ధీరజ్ కీ తెలిసి వద్దని అంటాడు. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించినదని చేస్తానని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్  వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.....రామలక్ష్మి రామ్ కి టీసీ ఇస్తానని చెప్పడంతో.. నేను భోజనం చెయ్యనంటు రామ్ మారం చేస్తుంటాడు. నాకు ఆ మిస్ కావాలి. నాతో సరదాగా ఆడుకుంటుందని రామ్ ఏడుస్తుంటే.. నువ్వు ఆ స్కూల్ లోనే ఉంటావ్. నేను మేడమ్ తో మాట్లాడతానని రామ్ ని సీతాకాంత్ బ్రతిమాలతాడు. రామలక్ష్మి తన క్యాబిన్ లోకి వచ్చి తనకి సంబంధించిన వస్తువులు తీసుకుంటుంది. అప్పుడే ఇద్దరు టీచర్స్ వస్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ రామ్ కి ఇవ్వండి అని చెప్పి బయలుదేర్తుంది. రామలక్ష్మి వెళ్ళాక సీతాకాంత్ రామ్ ని తీసుకొని వస్తాడు. మేడమ్ వేరొక దగ్గరికి వెళ్తుంది. ఇక రాదని చెప్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పిందని వాళ్ళు చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఎంతసేపు అవుతుందని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడే అనగానే సీతాకాంత్ పరిగెత్తుకుంటూ వెళ్లి రామలక్ష్మి కార్ ని ఆపాలని చూస్తాడు. మేడమ్ ఆగండి అంటున్నా రామలక్ష్మి వినిపించుకోదు.. అప్పుడే రామ్ పడిపోతాడు. అది చూసి సీతాకాంత్ వెళ్తాడు. రామలక్ష్మి కూడా వెళ్తుంది. మేడమ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టానని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తాడు. రామ్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. లేదని రామలక్ష్మి అంటుంది. రేపు రామ్ పుట్టినరోజు మీరు రండి అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఇక మళ్ళీ వీళ్ళని కలవను కదా రేపు పుట్టిన రోజుకి వెళ్తానని ఫణీంద్ర, సుశీలలకి చెప్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే రాగలవా అని సుశీల అనగానే.. వెళ్లనివ్వు మళ్ళీ రాదు కదా అని ఫణీంద్ర అంటాడు. మరుసటి రోజు రామ్ పుట్టినరోజు బట్టలు వేసుకోమని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. మా మిస్ వస్తేనే వేసుకుంటానని మారం చేస్తాడు. దాంతో శ్రీలతకి కోపం వచ్చి కొట్టబోతుంటే సీతాకాంత్ ఆపుతాడు. ఆ తర్వాత సిరి ఫోటో దగ్గరికి వెళ్ళి శ్రీలత బాధపడుతుంది. ఈ రోజే మీ కూతురు చనిపోయిన రోజు.. ఈ రోజే తన కొడుకు పుట్టినరోజు.. ఒకవైపు ఆనందం.. ఒకవైపు బాధ అని పంతులు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Illu illalu pillalu : డబ్బున్నోళ్ళలాగా నటిస్తున్న భాగ్యం.. రామరాజు కుటుంబం పసిగట్టగలరా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో....రామరాజు వాళ్ళు ఇంటికి వస్తాను అనడంతో భాగ్యం టెన్షన్ పడుతుంది. మనం బాగా డబ్బున్నోళ్ళమని బిల్డప్ ఇచ్చినాం.. ఇప్పుడు వాళ్ళు ఈ కొంపని చుస్తే ఇంకేమైనా ఉందా నేను చదవిందే ఆరో తరగతి.. బిటెక్ అని చెప్పావని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ సమస్య కంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది. రేపు ఇంటికి వస్తే మనం ఉండే ఈ అద్దె కొంపని చూస్తారని భాగ్యం చిన్న కూతురు అంటుంది. అలా జరగకూడదు. ఇలాంటి బకరా సంబంధం మళ్ళీ దొరకదని భాగ్యం అంటుంది. మరొకవైపు రామరాజు కుటుంబం అందరు భాగ్యం ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. ధీరజ్, ప్రేమ ఇద్దరు కాలేజీకీ రెడీ అవుతారు. ప్రేమ అని వేదవతి పలకరిస్తుంటే.. బాయ్ అత్తయ్య అంటూ బయటకు వస్తుంది.‌ ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. బాధపడుతుంది.. అయిన కూడా ధీరజ్ మాట్లాడకుండా సైలెంట్ గా ప్రేమని ఎక్కించుకొని వెళ్తాడు. మధ్యలో తనని దింపేసి కాలేజీకి వెళ్తాడు. ప్రేమ ఆటోలో కాలేజీకి వెళ్తుంది. రామరాజు వాళ్ళందరు భాగ్యం ఇంటికి బయల్దేరతారు. మరొకవైపు అమ్మ ఎక్కడికి వెళ్ళింది. వాళ్ళు వస్తారని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే రామరాజు కుటుంబం ఆ గల్లీలోకీ వస్తారు. వాళ్ల ఫోన్ కలవకపోవడంతో ఒకతనికి శ్రీవల్లి నాన్న ఫోటో చూపించి వీళ్ళ ఇల్లు ఎక్కడ అనగానే.. ఇడ్లీ అమ్మే అతను కదా అనుకొని చూపిస్తానంటూ తన వెంట తీసుకొని వెళ్తాడు. రామరాజు వాళ్ళని చూసి శ్రీవల్లి వాళ్ళు దాక్కుంటారు. రామరాజు లోపలికి వెళ్తుంటే.. అప్పుడే భాగ్యం బాగా రెడీ అయి అన్నయ్య ఇక్కడ అంటూ పిలుస్తుంది. ఇదే మీ ఇల్లని చెప్పారనగానే చెప్పింది ఎవడు అని చెప్పిన అతన్ని భాగ్యం బెదిరిస్తుంది. తరువాయి భాగంలో మంచి ఇంట్లోకి భాగ్యం వాళ్ళని తీసుకొని వెళ్తుంది. చందు, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. నర్మద బాధపడేలా భాగ్యం మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : సెంట్ నచ్చలేదని భార్యకి విడాకులిస్తానన్న భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో.... శ్రీధర్, కావేరి ఇద్దరు కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. శ్రీధర్, కావేరి తిన్న తర్వాత బిల్ కట్టడానికి డబ్బులు మర్చిపోయి వస్తారు. దీపని తిట్టాడని కోపంతో కావేరి కూడ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తుంది. పర్లేదు అని దీప అంటుంటే.. ఎందుకలా అంటావ్ ఇలాగేనా బిజినెస్ చేసేది ఇలా అంటూ ఉంటే మనం అప్పు ఎలా కడతామని కార్తీక్ అంటాడు. నేను అన్న మాటలు నాకే అప్పజెప్పుతున్నావా అని శ్రీధర్ అంటాడు. అన్న మాటలు అప్పుతో సమానమని కార్తీక్ అంటాడు. బిల్ కట్టకపోతే ఏం చేస్తారో తెలుసు కదా ప్లేట్స్ కడగాలని కార్తీక్ అంటాడు. కాసేపటికి శ్రీధర్ ప్లేట్స్ కడుగుతాడు. కూరగాయలు కూడా కట్ చేస్తాడు. ఇక ఈ జన్మ లో నీ రెస్టారెంట్ కి రానని శ్రీధర్ అంటాడు. రా కాకపోతే బిల్ కట్టాలని కార్తీక్ అంటాడు. శ్రీధర్ కోపంగా వెళ్ళిపోతాడు. బాగా అయిందని కార్తీక్, దీపలతో కావేరి అంటుంది. మరొకవైపు శివన్నారాయణ లాయర్ తో ఏదో వీలునామా రాసుకొని తీసుకొనిరా అని చెప్తాడు. అదంతా దూరంగా ఉండి పారిజాతం చూస్తుంది. అసలేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు శివన్నారాయణ వస్తుంటే పారిజాతం డోర్ వెనకాల దాక్కోని ఉంటుంది. శివన్నారాయణ చుడకుండానే అక్కడ ఉన్నావని తెలుసని అంటాడు.‌ అలా ఎలా కనిపెట్టారని పారిజాతం అడుగుతుంది. నువ్వు కొట్టుకున్న సెంట్ వల్ల అని శివన్నారాయణ అంటాడు. లాయర్ ఎందుకు వచ్చాడని పారిజాతం అడుగుతుంది. నీకు విడాకులు ఇస్తున్నానని అనగానే.. ఎందుకని పారిజాతం అడుగుతుంది. నువ్వు కొట్టుకున్న సెంట్ నచ్చలేదని శివన్నారాయణ అంటాడు. ఎవరైనా అలా చేస్తారా అంటూ పారిజాతం భయపడుతుంది. నాకు అన్యాయం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మరొకవైపు కార్తీక్ ఏదో పేపర్ తీస్తుంటే.. దీప చిన్నప్పటి ఫోటో కిందపడిపోతుంది. అది త్వరగా కార్తీక్ తీసుకుంటాడు. ఎవరిది ఆ ఫోటో అని దీప అడుగుతుంది. నా ప్రాణధాతది అని కార్తీక్ అనగానే.. అదేంటీ నేనే కదా ఆ ఫోటో ఎవరిది చూపించండి అని దీప అంటుంది. అయిన కార్తీక్ సరదాగా ఆటపట్టిస్తాడు. నా ప్రాణధాత ని డైరెక్ట్ నీకే చూపిస్తానని కార్తీక్ అంటాడు. నేను భయటపడాలని అంటున్నాడు కావచ్చు.. నేనేందుకు ఒప్పుకోవాలని దీప సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.