అషురెడ్డిని ఆర్జీవీ ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో!

  బిగ్‌ బాస్‌ బ్యూటీస్‌, ముఖ్యంగా హాట్‌ ఇమేజ్‌ ఉన్న యాంకర్స్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ మనసు పారేసుకున్నట్టు ఉన్నారు. మొన్నామధ్య బిగ్‌ బాస్‌కు వెళ్లొచ్చిన అరియానాను వర్మ ఇంటర్వ్యూ చేశారు. అది మరీ బోల్డ్‌గా ఉందని కామెంట్లు వినిపించాయి. అందులో వర్మ హాట్‌ టాపిక్స్‌ డిస్కస్‌ చేశారు. అరియానా అందాలను ఎవరూ చూపించని యాంగిల్స్‌లో చూపించారు. ఇప్పుడు మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ అషురెడ్డిపై వర్మ కాన్సంట్రేట్‌ చేశారు. ఆమెను ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో, ఆమెతో ఏం టాపిక్స్‌ డిస్కస్‌ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. వర్మ తనను ఫొటోలు తీస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌ను అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘నో మీన్స్‌ నో... త్వరలో వస్తుంది. ఇట్స్‌ గోయింగ్‌ టు బి ఎపిక్‌’ అని అషురెడ్డి పేర్కొంది. దీన్నిబట్టి అమ్మాయిలు వద్దంటే వద్దు అనే టాపిక్‌ మీద డిస్కస్‌ చేసినట్టు తెలుస్తోంది. అషురెడ్డిని తనదైన శైలిలో, లో యాంగిల్స్‌లో వర్మ ఫొటోలు తీశారు. దానిపై, వర్మతో అషురెడ్డి తీసుకున్న సెల్ఫీపై ఆల్రెడీ మీమ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వర్మ టేస్ట్‌ సూపరని కొందరు అంటుంటే... వర్మ అలా ఫొటోలు తీయడం చూసి జాలి పడుతున్నానని ఇంకొందరు అన్నారు. ‘సిగ్గు లేదా నీకు ఛీఛీ’ అని ఒకరు అషురెడ్డి వీడియో కింద కామెంట్‌ చేశారు. ‘మరీ పాపులారిటీ కోసం ఇంత దిగజారాలా?’ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

హాస్పిటల్ బెడ్ నుంచి 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' ఆడిషన్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యింది!

  'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' అంటూ ఇంతకు ముందు చేసిన స్కిట్స్ లో బెస్ట్ స్కిట్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ అరగంట ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి కొన్నిరోజులు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ భాను యాంకరింగ్ చేసింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి సిరి హనుమంతు యాంకరింగ్ చేసింది. త్వరలో స్రవంతి చొక్కారపు కనిపించనుంది.  స్రవంతి చొక్కారపు గతంలో మల్లెమాల షోలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రెండు మూడు కార్యక్రమాలు చేసింది. ఇమ్మాన్యుయేల్ నచ్చాడని చేసిన స్కిట్ ఒకటి హిట్ అయ్యింది. అయితే, 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' చేసే అవకాశం అంత సులభంగా రాలేదని ఆమె ఓ పోస్ట్ పోస్ట్ చేసింది. ఆ కార్యక్రమానికి ఆడిషన్స్ ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదట. ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి రాసుకొచ్చింది.  "కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నా ఆరోగ్యం బాలేదు. కనీసం బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. 'బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' కోసం ఆడిషన్ కి రావాలని. వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు. నా ముందు ఆ రోజు ఉన్న ఆప్షన్లు రెండే... రిస్క్ తీసుకోవడం, లేదంటే అవకాశాన్ని వదిలేయడం. మా ఇంట్లో వాళ్లంతా  'ఈ పరిస్థితిలో ఎందుకులే, వద్దు' అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని అవకాశాలు వదిలేసుకున్నా. ఏదైతే అది అయ్యిందని, దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి ఆడిషన్ కి వెళ్లాను.  తీరా అక్కడికి వెళ్ళాక... నాతో పాటూ  ఆరుగురు అమ్మాయిలు వచ్చారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. 'నేను అనవసరంగా వచ్చాను. కనీసం స్ట్రాంగ్ గా  నిలబడలేని పరిస్థితి' అని మనసులో అనుకొని వెళ్లి నిలబడ్డా. ఓ సాంగ్ ప్లే చేశారు. ఏదో రెండు స్టెప్స్ వేశా. మెల్లగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ సక్సెస్ ఫుల్ గా చెప్పేశా. అసలు, ఆ రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలుపెట్టింది. 'మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ?' అని. 'ఏం కాదులే. అంతా మంచే జరుగుతుంది' అన్నాను.  తర్వాత ఇంటికి వెళ్లపోయా. నాకు రాదని రెండు రోజులు బాధపడ్డా. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. 'ఒకసారి ఆఫీసుకు రండి. సార్ మీతో మాట్లాడతారట' అని. వెళ్లాను. మాట్లాడాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. 'మీకు ఈ షో చేయటం ఇష్టమేనా? అని అడిగారు. 'ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ, నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్'. మొత్తానికి రిస్క్ తీసుకోవడాన్ని నేను నమ్మాను" అని స్రవంతి చొక్కారపు తెలిపింది. 

త‌మ్ముడు మ‌నోజ్‌తో గొడ‌వ‌పై విష్ణు ఏమ‌న్నాడు?

  మోహ‌న్‌బాబు కుమారులు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య గొడ‌వ‌లున్నాయ‌ని కొంత కాలంగా ఇండ‌స్ట్రీలో న‌లుగుతున్న ప్రచారం. ఇద్ద‌రూ ఒక తండ్రి సంతాన‌మైనా, త‌ల్లులు వేరు. మోహ‌న్‌బాబు మొద‌టి భార్య కుమారుడు విష్ణు కాగా, చిన్న‌భార్య కుమారుడు మ‌నోజ్‌. మొద‌టి భార్య మృతి చెందిన త‌ర్వాతే ఆమె చెల్లెలు నిర్మ‌లాదేవిని మోహ‌న్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా మ‌నోజ్‌తో గొడ‌వ గురించి విష్ణును నేరుగా అడిగారు క‌మెడియ‌న్ అలీ.  'అలీతో స‌ర‌దాగా' కార్య‌క్ర‌మం నెక్ట్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా విడుద‌లైంది. ఇందులో గెస్ట్‌గా విష్ణు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అలీ, "ఒక సీరియ‌స్ క్వ‌శ్చ‌న్ అడుగుతాను. అది నువ్వే రివీల్ చేయాలి. నీకూ, మ‌నోజ్‌కూ ప‌డ‌టం లేదు, మ‌నోజ్ మీద చాలా కోపంగా ఉంటున్నావ‌ని.. ఇలా కొన్ని వ‌చ్చాయ్" అని అడిగారు.  దానికి సీరియ‌స్‌గా "వాళ్ల‌కు ఎందుకు చెప్పాలి సమాధానం?" అని చెప్పిన విష్ణు, వెంట‌నే లేచి నిల్చొని ఒంటిమీది కోటు విప్ప‌దీశారు. అది చూసి షాకైన‌ట్లు అలీ పోజిచ్చారు. అస‌లు అలీ ప్ర‌శ్న‌కు విష్ణు ఏమ‌ని చెప్పారు కోటు ఎందుకు విప్ప‌దీశారు అనేది తెలియాలంటే ఆగ‌స్ట్ 23న ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇంత‌కీ త‌మ్మునితో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని విష్ణు వెల్ల‌డించారా, లేదా?

మోనిత చావ‌లేదు! దీపపై కోపంతో కార్తీక్‌ను జైలుకు పంపింది!!

  దీప నమ్మకమే నిజమైంది. మోనితను ఆమె భర్త కార్తీక్ హత్య చెయ్యలేదన్నాడనేది నూటికి నూరుపాళ్ళు వాస్తవం. అసలు, హత్య జరగనే లేదు. మోనిత మరణించలేదు. దీపపై కోపంతో హత్యకు గురైనట్టు నాటకం ఆడిన మోనిత, కార్తీక్‌ను కటకటాల వెనక్కి పంపింది. ఇవాళ్టి (ఆగస్టు 17) 'కార్తీక దీపం' ఎపిసోడ్ లో మోనితను దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అసలు, నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే... తన భర్తకు బాలేదని జైలులో కార్తీక్ దగ్గర రత్నసీత మందుల చీటీ రాయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. దానిని తీసుకువెళ్లి ఓ చిన్న ఇంటికి వెళుతుంది. చూస్తే... అందులో మోనిత ఉంటుంది. ఆ ఇంటి గోడలపై 'నా కార్తీక్... నా కార్తీక్' అని రాసి ఉంటుంది. చిన్న మంచం... కుండలో నీళ్లు... ఎర్రంచు నల్లచీరలో మోనిత! మేడమ్ అంటూ రత్నసీత డోర్ తియ్యగానే.... 'వచ్చావా! నా కార్తీక్ ఫోటో తెచ్చావా?' అంటూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఫోనులో కార్తీక్ ఫొటోలను, మందుల చీటిపై కార్తీక్ హ్యాండ్ రైటింగ్ ను ముద్దులు పెట్టుకుంటుంది.  'నిన్ను వదులుకోను కార్తీక్. నీకు శిక్ష పడాలని కాదు, దీపకు బుద్ధి చెప్పాలని నా ప్రయత్నం. ఆ దీపను వదిలిపెట్టను' అని మోనిత అనడంతో కావాలని హత్యనాటకం ఆడిందని స్పష్టమైంది. తర్వాత రత్నసీతకు కొంత డబ్బులు ఇచ్చి 'నువ్వు నా మనిషి అని తెలియకుండా జాగ్రత్తపడు' అని చెబుతుంది.  అంతకు ముందు... దీపను అంజి కలుస్తాడు. హత్యానేరం తనపై వేసుకుంటానని అంటాడు. అందుకు దీప అంగీకరించదు. తర్వాత మోనితకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అని దీపను అంజి అడుగుతాడు. తనను చంపడానికి డ్రైవర్ దుర్గను తన అత్తారింట్లో చేర్పించగా, చివరకు మోనితకు శత్రువుగా మారి తనను కాపాడాడని దీప చెబుతుంది. అతడి గురించి ఆరా తీస్తానని అంజి అంటాడు.     

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందే... ఎన్టీఆర్‌ వర్సెస్‌ చరణ్‌!

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాంబినేషనే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌ రోల్‌ చేస్తున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ షోకు హోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22 నుంచి టెలికాస్ట్‌ కానుంది. తొలి ఎపిసోడ్‌కు తనతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరో హీరోగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇద్దరితో ప్రోమోను రిలీజ్‌ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ టీవీల్లోకి వస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వీళ్లిద్దరూ మీడియా ముందుకు రాలేదు. సినిమా రిలీజ్‌ అక్టోబర్‌ కావడంతో విజయేంద్రప్రసాద్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో సినిమా గురించి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఏమైనా చెబుతారేమో అనే ఆసక్తి ఆడియన్స్‌లో ఉంది. దాన్ని పక్కన పెడితే... హీరోలిద్దరి మధ్య ఫ్రెండ్షిప్‌ షోలో చూడొచ్చు. ఆల్రెడీ రిలీజైన ప్రొమోలో ఫ్రెండ్షిప్‌ను చూపించడంతో పాటు ‘రామ్‌ వర్సెర్‌ రామ్‌’ అంటూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. హోస్ట్‌ సీట్‌లోకి రామ్‌చరణ్‌ వెళ్లబోతుంటే ‘ఇది హోస్ట్‌ సీట్‌... నాది! అది హాట్‌ సీట్‌... నీది’ అని ఎన్టీఆర్‌ చెప్పడం బావుంది. ఇక, గేమ్‌ మొదలైన తర్వాత ‘సీటు హీటెక్కుతోంది. బ్రెయినూ హీటెక్కుతోంది’ అని రామ్‌చరణ్‌ అన్నారు. అతనికి ఎన్టీఆర్‌ ఏం ప్రశ్నలు వేశారో తెలియాలంటే... ఆగస్టు 22న 8.30 గంటలకు జెమిని టీవీ ఆన్‌ చెయ్యాలి.

తమన్నా 'మాస్టర్ చెఫ్'కు టైమ్ ఫిక్స్ చేశారు!

  మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'మాస్టర్ చెఫ్'. బహుశా, టీవీ తెర మీద తొలిసారి కుకింగ్ షో హోస్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా అనుకోవచ్చు. ప్రజెంట్ ఆహా ఓటీటీ కోసం లక్ష్మీ మంచు 'ఆహా భోజనంబు' చేస్తున్నారు. అది పక్కన పెడితే... తమన్నా షోకు టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్ చేసింది జెమిని టీవీ. ఆగస్టు 27 నుండి 'మాస్టర్ చెఫ్' కార్యక్రమం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 8.30 గంటలకు బుల్లితెరపై ప్రసారం కానుంది. 'వంటలతో వండర్ చేద్దాం పదండి' అంటోంది జెమిని టీవీ. 'వంటతో వండర్స్ చెయ్యొచ్చని ప్రపంచానికి పరిచయం చేసే గ్రాండ్ గ్రాండ్ కుకింగ్ రియాలిటీ షో. ఇప్పుడు మన తెలుగులో' అంటూ ప్రచార చిత్రాల్లో తమన్నా సందడి చేశారు.  'మాస్టర్ చెఫ్'కు తొలి అతిథిగా అల్లువారి అబ్బాయి, హీరో శిరీష్ వెళ్లారు. ఆల్రెడీ అతడు పాల్గొనగా ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. మరి, తర్వాత ఏ సెలబ్రిటీ వెళతారో చూడాలి. ఆహా భోజనంబులో రకుల్, తరుణ్ భాస్కర్, అలీ సందడి చేశారు.    

నేరాలు కాదు, పాపాలు... నిస్తేజంలో కార్తీక్!

  'కార్తీక దీపం' సీరియల్‌లో కథ ముందుకు కదలడం లేదు. కానీ, ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను కొంత ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీక్ ఇంకా జైలులో ఉన్నాడు. అతడు మోనితను హత్య చెయ్యలేదని చెప్పడానికి బలమైన ఆధారాలు ఏవీ కనిపించడం లేదు. అలాగని, నేరం చేశాడని రుజువు చేసే సాక్ష్యాలు ఏవీ ఏసీపీ రోషిణి దగ్గర లేవు. దీప పిన్ని భాగ్యం, ప్రియమణి విన్నది చెప్పడం తప్ప కళ్లారా హత్య చెయ్యడం చూసింది లేదు. దాంతో శవం ఆచూకీ కోసం రోషిణి చేసే ప్రయత్నాలు దీపతో మాట్లాడేవరకు వచ్చాయి. అసలు, ఈ రోజు (ఆగస్టు 16, 1119వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది చూస్తే...  జైలులో ఉన్న భర్తను చూడటానికి దీప వెళుతుంది. ఆమెతో కార్తీక్ నిస్తేజంగా మాట్లాడతాడు. మనసు విరిగిపోయిందని అంటాడు. పిల్లల్ని బాగా చూసుకోమని, హంతకుడు పిల్లలని పేరు రాకుండా పిల్లల్ని చూసుకోవాలని, తన తరపున ఒక్క సాక్ష్యం కూడా లేదని కార్తీక్ చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో రోషిణి వచ్చి దీపను పిలుస్తుంది. మోనిత పనిమనిషి ప్రియమణిని ఎంక్వయిరీ చేశానని, ఆమె జరిగిందంతా చెప్పిందనీ, మోనిత శవం ఎక్కడ దాచాడో కార్తీక్ చెబితే శిక్ష తక్కువ పడేలా చేస్తానని దీపతో రోషిణి చెబుతుంది. ప్రియమణిని ఎలా నమ్ముతారని దీప ప్రశ్నిస్తుంది. రోషిణి వినకుండా తనకు బాడీ ఎక్కడ దాచాడో చెప్పమని అడుగుతూ పోతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దీప ఉండదు. వెళ్ళిపోతుంది. మరోవైపు ఆస్పత్రిలో కార్తీక్ తండ్రి ఆనందరావును డాక్టర్ వర్ధన్ అవమానిస్తాడు. గతంలో తాగి, ఇప్పుడు హత్య చేసి మీ కుమారుడు డాక్టర్ వృత్తికి కళంకం తీసుకొచ్చాడని అంటాడు. ఇంటికి వచ్చి బాధ‌ప‌డుతున్న‌ మామగారితో తన భర్తను రక్షించుకుంటానని దీప శపథం చేస్తుంది. సీన్ కట్ చేస్తే... మళ్ళీ పోలీస్ స్టేషన్ లో తన భర్తకు గుండెజబ్బు వచ్చిందని కానిస్టేబుల్ రత్న సీత మందులు రాయించుకుంటుంది. వాళ్లిద్దరి మధ్య సంభాషణలో 'మీరంటే గౌరవం. మంచివారని విన్నాను. మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మీరు ఈ నేరం చేసి ఉండరని నాకు అనిపిస్తుంది' అని రత్న సీత అంటుంది. 'నేను నేరాలు చెయ్యలేదు, పాపాలు చేశా. అందుకే, భగవంతుడు ఈ శిక్ష వేశాడు' అని కార్తీక్ అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.    photo courtesy: Disney+Hotstar

ఆది చొక్కా చిరిగింది... కట్టప్ప కామం పేలింది!

  ప్రతివారం బుల్లితెర వీక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో ‘జబర్దస్త్‌’, ‘ఎక్ర్ట్సా జబర్దస్త్‌’. వచ్చే వారం మరింత వినోదంతో వస్తున్నట్టు తాజా ప్రోమోలు చెబుతున్నాయి. ‘జబర్దస్త్‌’లోని టీమ్‌ లీడర్‌ ‘హైపర్‌’ ఆదిని ‘సుడిగాలి’ సుధీర్‌ టీమ్‌ ‘ఎక్ర్ట్సా జబర్దస్త్‌’కు తీసుకొచ్చింది. సుధీర్‌, అతని టీమ్‌ సభ్యులైన రామ్‌ప్రసాద్‌, గెటప్‌ శీను, ఆది మధ్య ఫ్రెండ్షిప్‌ బాగా కుదిరింది. ‘రైజింగ్‌’ రాజు ఈమధ్య కనిపించడం లేదు. ఈమధ్య ఆది స్కిట్స్‌లో తరచూ రామ్‌ప్రసాద్‌ కనిపిస్తున్నాడు. మరి, రాజుగారు ఏమయ్యారో? అతను లేకపోయినా కామెడీకి ఏమాత్రం లోటు లేకుండా ఆది స్కిట్స్‌ను నడిపిస్తున్నాడు. దాంతో చాలామందికి తెలియడం లేదు... రాజుగారు మిస్సింగ్‌ అని. ఇక, వచ్చే వారం ‘ఎక్ర్ట్సా జబర్దస్త్‌’కు వస్తే... ‘బుల్లెట్‌’ భాస్కర్‌ టీమ్‌ ‘బాహుబలి’ థీమ్‌ తీసుకుని స్కిట్‌ చేసింది. అందులో కట్టప్ప క్యారెక్టర్‌ సుధీర్‌ చేశాడు. సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస అయితే, స్కిట్‌లో కామంతో కటకటలాడే క్యారెక్టర్‌గా చూపించాడు. గతంలో ఇటువంటి క్యారెక్టర్లు సుధీర్‌ చేశాడు. మళ్ళీ సుధీర్‌ కామం పేలింది. సుధీర్‌ టీమ్‌ స్కేటింగ్‌ షూస్‌ వేసుకుని స్కిట్‌ చేసింది. అందులో ఒకరి మీద మరొకరు పడగా, ఆది చొక్కా చిరిగింది. ‘ఇది ఏమిరా ఇది?’ అనుకుంటూ స్టేజి మీద నుంచి ఆది వెళ్లిపోయాడు. ‘ఎక్ర్ట్సా జబర్దస్త్‌’ లేటెస్ట్ ప్రోమోలో కొసమెరుపు ఏంటంటే... జడ్జ్ సీటులో అనసూయ కనిపించడం. మామూలుగా రోజా, మనో ఉంటారు కదా! వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కాకుండా సోలోగా అక్కడక్కడా అనసూయను చూపించారు. 

‘బిగ్‌ బాస్‌’.. సేఫ్టీ ప్లాన్‌ రెడీ!

  సెప్టెంబర్‌ తొలి వారం నుంచి ‘బిగ్‌ బాస్‌ 5’ స్టార్ట్‌ చేయడానికి స్టార్‌మా ఛానల్‌ సిద్ధంగా ఉంది. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. హౌస్‌లోకి పంపించే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ఎవరెవర్ని పంపాలనే విషయంలో స్టార్‌మా చాలా క్లియర్‌గా ఉంది. ‘బిగ్‌ బాస్‌ 5’ కోసం స్టార్‌ మా కొంతమందిని ఎంపిక చేసింది. వాళ్ళందర్నీ ఆగస్టు 22న క్వారంటైన్‌లోకి పంపిస్తుంది. పంపించే ముందు అందరికీ కరోనా ఆర్‌టి–పిసిఆర్‌ టెస్ట్‌లు చెయ్యనున్నారు. కార్వంటైన్‌ కంప్లీట్‌ అయ్యిన తరవాత మరోసారి టెస్ట్‌లు చేసి హౌస్‌లోకి పంపాలని డెసిషన్‌ తీసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా ఉన్నట్టు తేలితే? అందుకని, రిజర్వ్‌ బెంచ్‌ను కూడా రెడీ చేసింది. కంటెస్టెంట్ల హెల్త్‌ విషయంలో కేర్‌ తీసుకుంటోంది. సెప్టెంబర్‌ 5న ‘బిగ్‌ బాస్‌’ స్టార్ట్‌ కానుంది. అప్పటికి 14 రోజుల క్వారంటైన్‌ కూడా కంప్లీట్‌ అవుతుంది. సో... హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరూ తోటి సభ్యులకు కరోనా ఉందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ‘బిగ్‌ బాస్‌’లోకి యాంకర్‌ రవి వెళ్తున్నట్టు లాస్య కన్ఫర్మ్‌ చేసింది. ఇంకెవరూ బయటపడలేదు. సాధారణంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లేవారెవరూ ముందు చెప్పరు కూడా! కాకపోతే, ఆర్‌జె కాజల్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, శ్వేతా వర్మ, సిరి హనుమంతు, లోబో, వీజే సన్నీ తదితరులు హౌస్‌లోకి వెళ్తారట.

ఆగస్టు 22 నుంచి ప్రతి ఇంటికీ జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌!

  ‘‘వస్తున్నా! ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా... సోమవారం నుంచి గురువారం వరకూ, ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు’’ అంటూ యంగ్‌ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌ వచ్చేశారు.. బుల్లితెర ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి వస్తున్నానని! లేటెస్ట్‌గా ఆయన హోస్ట్‌ చేస్తున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’కి తెలుగు వెర్షన్‌. ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా ఒకప్పటి ‘మా’, ప్రస్తుత ‘స్టార్‌మా’లో టెలికాస్ట్‌ అయిన షో. ఇప్పుడు సన్‌ నెట్‌వర్క్‌కి చెందిన ‘జెమిని టీవీ’ చేతికొచ్చింది. అందుకని, ఎప్పట్నుంచి టెలికాస్ట్‌ అనేది చెప్పడానికి విడుదల చేసిన ప్రోమోలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు... మీ జెమిని టీవీ’లో అని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ నొక్కి మరీ చెప్పాడు. ఆగస్టు 22వ తేదీన, రాత్రి 8.30 గంటలకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కర్టెన్‌ రైజర్‌కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఆ త‌ర్వాత రోజు నుంచి అంటే ఆగ‌స్ట్ 23 నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు షో ప్ర‌సార‌మ‌వుతుంది. సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు వారానికి నాలుగు రోజుల పాటు ఈ షో ఉంటుంది. ప్రజెంట్ తార‌క్‌ ఉక్రెయిన్‌లో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ చేస్తున్నారు. అందుకని, ముందుగానే ఆగస్టు నెలకు, ఆ తర్వాత కొన్ని రోజులకు సరిపడా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్స్‌ షూటింగ్‌ చేశారు. ఈ నెల మూడో వారంలో ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ సెప్టెంబర్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్స్‌ షూటింగ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారట.

"ఇంకా ఎందుకమ్మా జైల్లో ఉంచావ్‌"... నిరుపమ్‌ పరిటాల కామెడీ!

  నిరుపమ్‌ పరిటాలలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. ‘కార్తీక దీపం’లో క్యారెక్టర్‌కు తగ్గట్టు ఎమోషనల్‌గా యాక్ట్‌ చేస్తున్నాడు. బయట మాత్రం సీరియల్‌లో తన క్యారెక్టర్‌ పరిస్థితిపై పంచ్‌ డైలాగ్స్‌ వేస్తున్నాడు. ‘కార్తీక దీపం’లో కథానాయకుడు కార్తీక్‌ జైలు పాలైన సంగతి తెలిసిందే. కొడుకును బయటకు తీసుకురావడానికి అమెరికా నుంచి సౌందర్య వచ్చింది. సౌందర్య పాత్రధారి అర్చనా అనంత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో నిరుపమ్‌ షేర్‌ చేశాడు. దానికి రాసిన క్యాప్షన్‌ చూస్తే... అతడిలో ఫన్నీ యాంగిల్‌ తెలుస్తుంది. ‘అడగకుండానే డాక్టర్‌ని చేశావ్‌. పిలవకుండానే స్టేషన్‌కి వచ్చావ్‌. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపల ఉంచావ్‌. అయినా నువ్వు నాకు నచ్చావ్‌’ అని నిరుపమ్‌ పరిటాల ఓ పోస్ట్‌ చేశాడు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’లో త్రివిక్రమ్‌ రాసిన కవితను ‘కార్తీక దీపం’లో కార్తీక్‌ సిట్చువేషన్స్‌కు తగ్గట్టు మార్చి రాశాడు. యాక్చువల్లీ, నిరుపమ్‌లో రైటర్‌ ఉన్నాడు. కొన్ని సీన్స్‌కు డైలాగ్స్‌లో సహకారం అందిస్తాడు. ఆ రైటర్‌ను ఇలా బయటకు తీశాడన్నమాట.

రాజీవ్‌ కనకాలను బాబా భాస్క‌ర్‌తో రీప్లేస్‌ చేశారుగా!?

  బుల్లితెరపై సుమ అంటే ఓ బ్రాండ్‌. ఆమె భర్త రాజీవ్‌ కనకాలకు సినిమాల్లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు పడుతున్నాయి. కానీ, టీవీలో అంత పేరు లేదు. అయినా ఆయన్ను తీసుకొచ్చి ‘రెచ్చిపోదాం బ్రదర్‌’లో కూర్చోబెట్టింది మల్లెమాల సంస్థ. ఆ  కామెడీ షోలో ఆయన కూడా పెద్ద తరహాలో, అప్పుడుప్పుడూ తన పరిధి మీరకుండా పంచ్‌లు వేశారు. ఇప్పుడు చూస్తేంటే... షోలో రాజీవ్‌ కనకాల ప్లేస్‌ను డాన్స్‌ మాస్టర్‌ బాబాతో రీప్లేస్‌ చేసినట్టు ఉన్నారు. బాబా మాస్టర్‌ డ్యాన్సే కాదు, మాస్‌ కామెడీ చెయ్యడంలో మంచి ఘనుడు. ‘ఢీ’లో సుధీర్‌, ఆదితో కొన్ని ఎపిసోడ్స్‌లో ఫుల్‌ కామెడీ చేశాడు. తమిళ యాసతో కూడిన తెలుగుతో నవ్విస్తుంటారు. ఇప్పుడు ఆయన్ను తీసుకొచ్చారు. బహుశా... సినిమా షూటింగ్స్‌తో ‘రెచ్చిపోదాం బ్రదర్‌’కు రాజీవ్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యలేకపోవడం అయినా అయ్యుండాలి. లేదంటే షోకు కొత్త కలర్‌ తీసుకురావడానికి బాబాను తీసుకొచ్చి అయినా ఉండాలి. ఆల్రెడీ బాబా మాస్టర్‌తో కొత్త ప్రోమో రిలీజ్‌ చేశారు. ‘రెచ్చిపోదాం బ్రదర్‌. ఇక నుంచి వెరే లెవల్‌’ అని అందులో చెప్పారు. బాబా మాస్టర్‌ ప్రోమో కింద ‘రాజీవ్‌ని తీసేసి మంచిపని చేశారు’ అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘రాజీవ్‌ పోయి బాబా వచ్చే డాండాం’ అని ఇంకొకరు. రాజీవ్‌ వెళ్లిపోవడం, బాబా మాస్టర్‌ రావడం డిస్కషన్‌ పాయింట్‌ అవుతోంది.

మోనితను కార్తీక్‌ చంపాడని అనుకుంటున్న సౌందర్య!

  మోనితను కార్తీక్ హత్య చేయలేదని, తానే హత్య చేశానని ఏసీపీ రోషిణి దగ్గరకు సౌందర్య వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఈ రోజు హైదరాబాద్ వచ్చిన మీరు, నిన్న హత్య ఎలా చేశారు?' అని రోషిణి లాజిక్ తీస్తుంది. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది.  'మీరు చాలా తెలివైనవారు. నేను ఈ హత్య చేయలేదని కనిపెట్టగలిన మీరు, నా కొడుకు కూడా చేయలేద‌ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు?' అని రోషిణిని సౌందర్య ప్రశ్నిస్తుంది. అప్పుడు రోషిణి 'ఎందుకంటే నేను కార్తీక్ కన్నతల్లిని కాదు కాబట్టి. పోలీస్ అధికారిని కాబట్టి' అని సమాధానం ఇస్తుంది. 'ఈ హత్యను ఎవరైనా కళ్లారా చూశారా?' అని మళ్ళీ సౌందర్య ప్రశ్నిస్తుంది. 'మీ వియ్యపురాలు భాగ్యం అక్కడే ఉందట' అని రోషిణి సమాధానం. 'కళ్లారా చూసిందా? చెవులారా విందా?' - మళ్ళీ సౌందర్య ప్రశ్న.    "ఇది కోర్టు కాదు. నేను మీతో వాదిస్తూ కూర్చోలేను. మీరు కోడలి తరపున పోరాడిన ఉత్తమ అత్త అట కదా. మరి, మీ కొడుకు వేరే ఆడదానితో హద్దులు లేని స్నేహం చేస్తుంటే... చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఇప్పుడు ఆ ఆడదాన్నీ మీ కొడుకు తల్లిని చేసి, చంపేసి, చిద్విలాసంగా నవ్వుతూ మెట్టవేదాంతం చెబుతున్నాడు" అని రోషిణి గట్టిగా చెబుతుంది. అప్పుడు మోనిత ఆడిన పన్నాగాన్ని సౌందర్య బయటపెడుతుంది.  మోనితది కృత్రిమ గర్భధారణ అని, కావాలంటే మాతృశ్రీ సంతానసాఫల్య కేంద్రంలో పనిచేసే పల్లవిని అడగమని రోషిణికి సౌందర్య చెబుతుంది. అక్కడ నుండి విచారణ చేయమంటుంది. దాంతో రోషిణి షాక్ అవుతుంది. అయినా... నమ్మదు. సౌందర్య వెళ్లిన తర్వాత మోనితకు కడుపు చేసి, పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో చంపేశాడని అనుకుంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో కార్తీక్ కు రత్నసీత అని లేడీ కానిస్టేబుల్ టీ అందిస్తుంది. ఏమైనా కావాలంటే తనతో చెప్పమని, ఏర్పాటు చేస్తానని అంటుంది.     రోషిణితో మాట్లాడిన తర్వాత దీప దగ్గరకు వెళ్లిన సౌందర్య... కోడలు, పిల్లల్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళుతుంది. భాగ్యం కూడా సౌందర్య ఇంటికి వెళుతుంది. అందరూ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత 'ఇప్పుడు చెప్పు ఏం జరిగింది?' అని సౌందర్య అడగటంతో కార్తీక్ కు చూపించిన వీడియో అందరికీ చూపిస్తుంది దీప. హిమ మరణానికి తానే కారణం అన్నట్టు మోనిత చెబుతున్న మాటలు వినబడుతుంటే 'చంపేసే ఉంటాడు... మోనితను కార్తీక్ చంపేసి ఉంటాడు' అని సౌందర్య షాక్ అవుతుంది. అక్కడితో నేటికి శుభం కార్డు వేశారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.  

వామ్మో యాడ్స్‌! భ‌య‌పెడుతున్న టీవీ షోస్‌!!

  క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లేని టీవీ ప్రోగ్రాములుంటే! అరే వాహ్‌!! ఈ ఊహే చాలా అందంగా ఉంది క‌దూ! ఎంత అంద‌మైన క‌ల‌! ఇలా ఇల‌లో ఎన్న‌టికైనా జ‌రిగేనా!! టీవీ ఆన్ చేస్తే యాడ్స్ మ‌ధ్య‌లో ప్రోగ్రామ్స్ చూడాల్సిన దౌర్భాగ్యం వ‌చ్చింద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులంతా ల‌బోదిబోమంటుంటూ అస‌లు ఒక్కో యాడ్‌ను రోజుకు ఎన్ని చాన‌ల్స్‌, ఎన్నిమార్లు చూపి చంపుతాయా అని అంద‌రూ జుట్టు పీక్కుంటున్నారు. ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ విరామం, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు.. ఇదంతా ష‌రా మామూలే. పాట‌లు, ఆట‌లు, సినిమాలు, సీరియ‌ళ్లు.. ఏం చూద్దామ‌న్నా పాన‌కంలో పుడ‌క‌ల్లా ఈ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చి చేరుతున్నాయి. అత్య‌ధికంగా వ్యూయ‌ర్‌షిప్ పొందిన‌ టీవీ యాడ్‌గా మింత్రా స్టూడియో యాడ్ చ‌రిత్ర సృష్టించింది. అత్య‌ధిక చాన‌ళ్ల‌లో, అత్య‌ధిక‌సార్లు ప్ర‌సార‌మైన‌ట్టు మింత్రా యాడ్ అన్ని టీవీల్లో మారుమోగిపోయింది. ఈ యాడ్‌లో కియారా అద్వానీ న‌టించింది. కేవ‌లం ఈ ఏడాది మే నెల‌లో 83,946,193 వ్యూస్ ల‌భించాయి ఈ యాడ్‌కు. అన్ని వ్యూస్ వ‌చ్చాయంటే ఎంత‌సేపు ఈ యాడ్ టీవీలో క‌నిపించిందో ఊహించుకోవాల్సిందే. యూట్యూబ్‌లో అత్య‌ధికంగా చూసిన యాడ్ అనే మారో జాబితా కూడా ఉంది. 2021 జ‌న‌వ‌రిలో సైఫ్ అలీఖాన్ న‌టించిన అమెజాన్ ఒరిజిన‌ల్స్ మూవీ 'తాండ‌వ్' యాడ్ టాప్ పొజిష‌న్‌లో నిల‌వ‌గా, శ్యామ్‌సంగ్స్ ఎపిక్ ఇన్ ఎవ‌రి వే యాడ్ సెకండ్ పొజిష‌న‌ల్‌లో నిలిచింది. పుంఖానుపుంఖాలుగా ఉన్న యూట్యూబ్ వీడియోల్లోనూ యాడ్స్‌ను జొప్పించ‌డంతో ఇంట‌ర్నెట్‌లో ప్ర‌క‌ట‌న‌లు జోరందుకున్నాయి. ఏ విష‌యాన్ని స‌ర్ఫ్ చేసినా యాడ్స్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. వామ్మో.. టీవీలో అవార్డు ఫంక్ష‌న్లు చూడాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. లేదంటే ఈ ప్రోగ్రామ్ జోలికి వెళ్ల‌నే కూడ‌దు. ప‌ట్టుమ‌ని 10 నిమిషాలు కూడా అవార్డు వేడుక టీవీలో ప్ర‌సారం కాదు కానీ నిమిషాల త‌ర‌బ‌డి ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ప‌దేప‌దే ప్ర‌సార‌మ‌వుతుంటాయి. అవ‌న్నీ స్పాన్స‌ర్డ్ ప్రోగ్రామ్స్ కాబ‌ట్టి ప‌వ‌ర్డ్ బై, అఫిషియ‌ల్ స్పాన్స‌ర్‌, టైటిల్ స్పాన్స‌ర్‌, ప్ర‌మోటెడ్ బై, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్స‌ర్డ్ బై.. ఇలాంటి మాట‌లు ప‌దేప‌దే వినిపించ‌కుండా ఈ ఫంక్ష‌న్ల‌కు సంబంధించిన ప్రోగ్రామ్ అస్స‌లు క‌నిపించ‌దు. గంట‌సేపు ప్ర‌సారం కావాల్సిన కార్య‌క్ర‌మాన్ని లాగి లాగి క‌నీసం 3 గంట‌ల‌పాటు ప్ర‌సారం చేసేసి ప్రేక్ష‌కుల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తారు. అస‌లు ప్రోగ్రాంలో ఉండే మ‌జానే ఆవిరైపోయి బీపీ తెప్పించేలా ఈ కార్య‌క్ర‌మాలుండ‌టంతో క్ర‌మంగా వీటికి కూడా ఆద‌ర‌ణ త‌గ్గుతూ వ‌స్తోంది. ప్రేక్ష‌కుల విసుగును గ‌మ‌నించిన టీవీ చాన‌ళ్లు వ‌న్ బ్రేక్‌, నో బ్రేక్ పేరుతో వీకెండ్ స్పెష‌ల్ ప్రోగ్రాములు ప్ర‌సారం చేస్తున్నాయి. మూవీ ఫ్లిక్స్‌, రొమెడీ నౌ, హెచ్‌బీవో చాన‌ళ్ల‌లో ఈ విధానం మోస్ట్ ట్రెండింగ్‌గా ఆక‌ట్టుకుంటోంది. వీరి బాట‌లోనే ప‌య‌నిస్తూ మ‌హా మూవీ వంటి పేర్ల‌తో హిందీ టీవీ చాన‌ళ్లు త‌క్కువ యాడ్స్ లేదా యాడ్స్ లేకుండానే కొన్ని గంట‌ల పాటు కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేస్తున్నాయి. హ్యాపీగా టీవీని ఎంజాయ్ చేసే చాన్స్ ల‌భిస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు కూడా ఈ చాన‌ళ్ల‌కు అతుక్కుపోతున్నారు. దీంతో వీటి రేటింగులు అమాంతం ప‌రుగులు పెడుతున్నాయి. ఇలాంటి వ‌న్ బ్రేక్ మూవీల‌కున్న ఆద‌ర‌ణ‌ను గుర్తించిన కంపెనీలు త‌మ ప్ర‌క‌ట‌న‌లు వీటిలో జొప్పించేందుకు ఎన్ని రెట్లు ఎక్కువైనా ఈ స్లాట్‌ల‌లోనే త‌మ ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌సారం చేసేందుకు సై అంటున్నాయి. అంటే అటు కంపెనీల‌కు, ఇటు చాన‌ల్ యాజ‌మాన్యానికి, మ‌ధ్యలో వీక్ష‌కుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంద‌న్న మాట‌.!

అందుకే నీకు పెళ్లి కావ‌ట్లేదు!

  బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రదీప్ ఒకడు. గతంలో 'స్వయంవరం' లాంటి ప్రోగామ్ చేశాడు గానీ పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేదానిపై 'జబర్దస్త్', 'ఢీ' షో స్కిట్లలో కొందరు సెటైర్స్ వేశారు కూడా! అయితే, ప్రదీప్‌కు ఎందుకు పెళ్లి కావడం లేదో సింగర్ సునీత చెప్పడం విశేషం. షోలో సడన్‌గా ప్రదీప్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి సునీత పంచ్ వెయ్యడం ఇంట్రెస్టింగ్. సునీత జడ్జ్‌గా చేస్తున్న 'డ్రామా జూనియర్స్' కామెడీ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు కదా! వచ్చే ఆదివారం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారమయ్యే ఎపిసోడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రజ్వల్ చందమామ రోల్ చేస్తూ ఒక స్కిట్ చేశాడు. అందులో 'అమ్మాయిలు చాలా డేంజర్... చాలా చాలా డేంజర్' డైలాగ్ చెప్పాడు.  స్కిట్ కంప్లీట్ అయ్యాక, ప్రజ్వల్ చేత జడ్జిమెంట్ టైమ్‌లో మరోసారి 'అమ్మాయిలు డేంజర్' డైలాగును ప్రదీప్ చెప్పించాడు. దాంతో సునీత 'ఇక్కడ ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారో చూశావా? బయటకు వెళ్లాలని ఉందా?' అని ప్రజ్వల్ తో అన్నారు. అందుకు ప్రదీప్ 'నేను చెప్పింది అమ్మాయిల గురించి అని చెప్పు' అని ప్ర‌జ్వ‌ల్‌కు సూచించాడు. దానికి సునీత షాక్ అయ్యింది. వెంటనే తేరుకుని 'ఇది ఆడవాళ్లపై డ్యామేజింగ్ స్టేట్మెంట్. అందుకే, నీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కావడం లేదు' అని సెటైర్ వేశారు. ప్ర‌దీప్ ఆగుతాడా? "ఇది పెద్ద డైలాగే" అని రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది? షోలో ఉన్నవాళ్లు అందరూ నవ్వుకున్నారు. 

లక్ష్మీదేవి రూపంలో దీప‌!

  'కార్తీక దీపం' అభిమానులు వంటలక్కను ఎప్పుడో తమ కుటుంబంలో మనిషిగా చూడటం మొదలు పెట్టారు. సీరియల్‌లో పేరు దీప కంటే, అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ కంటే వంటలక్కగా ఆవిడ ఫేమస్. వరలక్ష్మీ వ్రతం నాడు వంటలక్కను లక్ష్మీదేవిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది స్టార్ మా ఛానల్.  'తెలుగింటి ఆడపడుచులకు వరలక్ష్మీవ్రత కానుక. లక్ష్మీ అవతారంలో దీప' అంటూ 'మా వరలక్ష్మీ వ్రతం' పేరుతో స్టార్ మా ఛానల్ ఓ కార్యక్రమం చేసింది. తాజాగా ప్రోమో విడుదల చేశారు. అందులో లక్షీదేవిగా ప్రేమి విశ్వనాథ్ కనిపించారు. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీ.  'దీపక్క సాక్షాత్తు అమ్మవారిలా ఉన్నారు' అని చాలామంది సంబరపడ్డారు. 'ఎటువంటి పాత్రలోనైనా దీపక్క అదరగొట్టేస్తుంది' అని కొందరు ప్రశంసించారు. 'వంటలక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ' అని కొందరు అడగటం విశేషం. ఒకరు అయితే 'వంటలక్క కాస్తా వరలక్ష్మీ అక్క అయ్యింది' అన్నారు. 'కార్తీక దీపం'లో దీప పాత్రను కొందరు ఎంత ఓన్ చేసుకున్నారంటే 'దీపగారు మీరు ఈ కార్యక్రమంలోనైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సీరియల్ లో అయితే ఎప్పుడూ ఏడుపే' అని కామెంట్ చేశారు.  శ్రావణ మాసం సందర్భంగా వచ్చే శ్రావణ శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే వారాంతాల్లో ప్రసారం చేస్తారో? చూడాలి. 

అలీ రూటులో త‌మిళ స్టార్ క‌మెడియ‌న్‌!

  టీవీల్లో, ఓటీటీల్లో టాక్ షోలు కొన్ని ఉన్నాయి. తెలుగుకు వస్తే హాస్యనటుడు అలీ కూడా ఒక టాక్ షో చేస్తున్నారు. మిగతా టాక్ షోలకు ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎక్కువమందితో అలీకి పరిచయాలు ఉండటం, ప్రముఖులతో ఆయన పని చేసి ఉండటం వల్ల టాక్ షోకు వచ్చే సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడుతూ నవ్విస్తారు. అలీ టాక్ షోలో విషయంతో పాటు వినోదం ఉంటుంది. ఇప్పుడు అలీ రూటులోకి ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు వస్తున్నారని టాక్.  వడివేలు ఓ టాక్ షో చేయడానికి రెడీ అవుతున్నారని కోలీవుడ్‌లో గ‌ట్టిగా వినిపిస్తోంది. తమిళంలో ఆయన స్టార్ కమెడియన్. స్టార్ హీరోలతో సరదాగా మాట్లాడగలరు. అందువల్ల, వడివేలు టాక్ షో చేస్తే బావుంటుంది. అయితే, ఆయన టీవీ కోసం టాక్ షో చేయడం లేదు. ఓటీటీ కోసం చేస్తున్నారట. ప్రజెంట్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని, త్వరలో అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసి టాక్ షో స్టార్ట్ చేస్తారని కోలీవుడ్ ఇన్ఫర్మేషన్.  ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు ఏడాది ప‌ది, ప‌దిహేను సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉండే వ‌డివేలుకు ఆ త‌ర్వాత సినిమాలు త‌గ్గిపోయాయి. కొన్ని సినిమాల్లో హీరోగా చేయ‌డంతో, ఆ టైమ్‌లో ఇత‌ర క‌మెడియ‌న్లు రంగంలోకి వ‌చ్చి బిజీ అయ్యారు. దాంతో వడివేలు ప్రాభ‌వం త‌గ్గింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టాక్ షో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అంటున్నారు.

డాక్టర్ బాబు కోసం నేరం నెత్తిన వేసుకున్న సౌంద‌ర్య‌! అయినా...

  'కార్తీక దీపం'లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నకొడుడు మీద ప్రేమతో హత్యా నేరాన్ని నెత్తిన వేసుకోవడానికి తల్లి సిద్ధపడింది. అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఇవాళ్టి (ఆగస్టు 12, 1115) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... మోనితను హత్య చేసి, శవాన్ని కనిపించకుండా మాయం చేశాడనే ఆరోపణ మీద డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌ను ఏసీపీ రోషిణి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాను డాక్టర్ బాబుకు హిమను హత్య చేయించినట్టు మోనిత మాట్లాడిన వీడియో చూపించకుండా ఉన్నట్టు అయితే ఈ ఘోరం జరిగేది కాదని  వంటలక్క అలియాస్ దీప రోదిస్తుంటుంది. పిల్లలతో పాటు కార్తీక్ కుటుంబమంతా కన్నీరు మున్నీరు అవుతుంది. కార్తీక్ అరెస్ట్ విషయం తెలిసిన తల్లి సౌందర్య అమెరికా నుండి తిరిగొస్తుంది. పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. అక్కడ ఏసీపీ రోషిణితో తానే హత్య చేశానని చెబుతుంది. టేబుల్ మీద గన్ పెడుతుంది. 'సరెండర్ అవ్వడానికి వచ్చాను. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఇదే. నా కొడుక్కి నేనంటే ప్రేమ. అందుకే, నేరాన్ని వాడి మీద వేసుకున్నాడు. నన్ను అరెస్ట్ చేసి, వాడిని రిలీజ్ చేయండి' అని సౌందర్య అంటుంది. ఆమె మాటలకు రోషిణి నవ్వుతుంది.  హత్య చేసింది తానేనని సౌందర్య చెప్పినా... రోషిణి నమ్మదు. పైగా, 'మీ కొడుక్కి మీ మీద ఉన్న ప్రేమ కంటే... మీకే మీ కొడుకు మీద ఎక్కువ ప్రేమ అనుకుంట' అంటుంది. తర్వాత తన లాజిక్ ఏంటో చెబుతుంది. 'ఒకరి మీద ఒకరికి మీకు ఎంత ప్రేమ ఉందో, నాకు నా డ్యూటీ మీద అంత ప్రేమ. రెండు గంటల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన మీరు సరాసరి దీప ఇంటికి వెళ్లారు. అక్కడ కారులో రివాల్వర్ తీసుకున్నారు. దీపను పలకరించకుండా నేరుగా ఇక్కడికి వచ్చారు. హత్య జరిగింది నిన్న. ఈ రోజు సిటీకి వచ్చిన మీరు ఎలా చేశారో మీ తల్లి ప్రేమకు తెలియాలి' అని రోషిణి అంటుంది.  దాంతో సౌందర్యను అరెస్ట్ చేసి, డాక్టర్ బాబును విడుదల చేసే ఉద్దేశం రోషిణికి లేదని అర్థమయింది. తర్వాత ఏం జరుగుతుందో, రేపటి ఎపిసోడ్ లో చూడాలి. 

మెగాస్టార్ అల్లుడికి చెల్లెలుగా అరియనా!

  'బిగ్‌బాస్-4' హౌస్‌లో బ్యూటీస్ అంటే  దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, దివి, అరియనా. హౌస్‌లోకి వెళ్లడానికి ముందు, ఆ తర్వాత హారిక యూట్యూబ్ వీడియోస్‌తో ఆడియన్స్‌కి టచ్‌లో ఉంటోంది. రియాలిటీ షోలు, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో మోనాల్ కూడా వార్తల్లో నిలుస్తోంది. దివికి చెప్పుకోదగ్గ అవకాశాలు ఏవీ ఇప్పటికి అయితే రాలేదు. మెగాస్టార్ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని చెబుతోంది.  అయితే, ఈ ముగ్గురి కంటే అవకాశాల వేటలో అరియనా దూసుకు వెళుతోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ సినిమాలో అరియనా నటిస్తోంది. హీరో స్నేహితుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమెకు కీలక పాత్ర దక్కింది.  అలాగే, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అందులో కళ్యాణ్ దేవ్ చెల్లెలి పాత్రలో అరియనా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేస్తోంది. దర్శకుడు శ్రీధర్ సీపానతో అరియనాకు రెండో సినిమా ఇది. ఇంతకు ముందు అతడి దర్శకత్వంలో 'బృందావనమది అందరిది'లో చేసింది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.