"నన్ను పెళ్లి చేసుకుంటావా?".. హ‌రికి అషు మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్‌!

  అషురెడ్డి అంటే హరికి ఎంతో ప్రేమ. అందుకు గుర్తుగా గుండెలపై ఆమె పేరు ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండేలా పచ్చబొట్టు కింద వేయించుకున్నాడు. మరి, అషురెడ్డి మనసులో ఏం ఉంది? హరి గురించి ఏం అనుకుంటుంది? అంటే... ఆమెకూ అతడంటే ఇష్టమే. 'కామెడీ స్టార్స్' సాక్షిగా అతడికి ప్రపోజ్ చేసింది. లవ్ ప్రపోజల్ కాదు... మ్యారేజ్ ప్రపోజల్. మరి, హరి ఏం చేస్తాడో? ఏం చెబుతాడో? సండే టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో చూడాలి.  'హరి గురించి నువ్వు చెప్పాలని అనుకుంటే... క్లియర్‌గా, స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఏం చెప్పాలని అనుకుంటున్నావ్?' అని అషురెడ్డిని యాంకర్ శ్రీముఖి అడిగింది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల ముందు హీరోలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేస్తారు కదా. శ్రీముఖి ప్రశ్న తర్వాత అటువంటి సీన్ చోటు చేసుకుంది. అయితే, రివర్స్‌లో! హరి ముందు మోకాళ్ల మీద కూర్చున్న అషురెడ్డి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగింది. ఆమె ప్రపోజల్ తర్వాత న్యాయనిర్ణేత స్థానంలో ఉన్న శ్రీదేవి విజయ్ కుమార్ 'నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. యాక్చువల్లీ కంట్లో నీళ్లు వచ్చాయి' అని అన్నారు. ఆ తర్వాత సర్‌ప్రైజ్ అంటూ హరికి ఖరీదైన హైఎండ్ బైక్ ఒకటి బహుమతిగా ఇచ్చింది అషురెడ్డి. తన తల్లితండ్రులు వెయ్యి రూపాయల దుస్తులు కొనిపెట్టారు తప్ప ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వలేదని హరి ఎమోషనల్ అయ్యాడు. అషురెడ్డిని హగ్ చేసుకున్నాడు.  హరి, అషురెడ్డి లవ్ ట్రాక్ 'కామెడీ స్టార్స్'కు అట్రాక్షన్ గా నిలుస్తోంది. అయితే, ఇదంతా షో కోసం చేస్తున్నదని... ఈటీవీలో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ తరహాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు జనాలు. స్కిట్ కోసం తప్ప నిజ జీవితంలో హరి, అషురెడ్డి మధ్య ఏమీ ఉండదని అంటున్నారు.  

'ఆలీతో స‌ర‌దాగా 250'లో మోహన్‌బాబు ఏం పేలుస్తారో?!

  ముక్కుసూటిగా మాట్లాడటం మంచు మోహన్‌బాబు నైజం. మనసులో ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతారు. క్యాజువల్‌గా సీరియస్ టాపిక్స్ గురించి ప్రశ్నలు వేయడం అలీకి అలవాటు. ఇప్పుడు మోహన్ బాబును అలీ ఏం అడుగుతారు? మోహన్ బాబు ఏం పేలుస్తారో? అని బుల్లితెర వీక్షకులతో పాటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. హాస్యనటుడిగా, కథానాయకుడిగా వెండితెరపై విజయవంతమైన అలీ... 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడీ టాక్ షో 250వ ఎపిసోడ్‌ మైలురాయికి చేరుకుంది. 250వ‌ ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబును అతిథిగా ఆహ్వానించారు. ఆయనతో చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.  ఇటీవల 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విష్ణు మంచు వచ్చారు. 'మనోజ్‌కు, నీకు గొడవలు అంట' అని, 'మా' ఎన్నికల గురించి అలీ ప్రశ్నించారు. విష్ణు చాలా అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అలాగే, మంచు కుటుంబ విషయాలూ డిస్కస్ చేశారు. 'మా' ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ టాక్ షోలో మోహన్ బాబు ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారా? పరిశ్రమలో సమస్యలను ప్రస్తావిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

అభయ్‌ది నా పోలిక... భార్గవ్‌ది ప్రణతి పోలిక!

  మెగాస్టార్ చిరంజీవిని ఆయన మనవరాలు కొట్టింది. అది కూడా కాస్త గట్టిగానే! దాంతో నొప్పి తగ్గడానికి మెగాస్టార్ ఐస్ బ్యాగ్ పెట్టుకున్నారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ ఈ సంగతి చెప్పుకొచ్చారు. మనవరాలు కొట్టిన విషయాన్ని చిరంజీవి తనతో చెప్పారన్నారు. అసలు, చిరంజీవి టాపిక్ ఎందుకు వచ్చిందంటే...  ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ముగ్గురి మధ్య కార్టూన్స్ డిస్కషన్ వచ్చింది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే తనకు ఇష్టమని కొరటాల అన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్ కూడా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ఇష్టం అని చెప్పారు. అప్పుడు ఈతరం పిల్లల అభిరుచి మారిందని, వ‌యొలెంట్ కార్టూన్స్ చూస్తున్నారని ఎన్టీఆర్, కొరటాల చెప్పుకొచ్చారు.  "మొన్న చిరంజీవిగారు చెబుతున్నారు. ఆయన సోఫాలో పడుకుంటే మనవరాలు వచ్చి గుద్దేసి వెళ్లిపోయిందట. ఆ పాప చూసే కార్టూన్స్ లో ఏదో క్యారెక్టర్ బాక్సింగ్ పంచ్ టైపులో కొడుతుందట" అని కొరటాల శివ పేర్కొన్నారు. వెంటనే తార‌క్ తనకూ అటువంటి అనుభవం ఎదురైందని అన్నారు. "మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్లిపోతాడు. ఎందుకు మూడ్ మారుతుందో తెలియదు" అని తార‌క్‌ అంటే...  "అభయ్ అయి ఉండడు. భార్గవే" అని కొరటాల అన్నారు. భార్గవ్ కొట్టి ఉంటాడని పరోక్షంగా చెప్పారు. అందుకు జూనియ‌ర్‌ ఎన్టీఆర్ "అభయ్ ఎప్పుడూ నా పోలిక. సౌమ్యుడు, బావుంటాడు. భార్గవ్‌కి ప్రణతి పోలిక కదా! కొంచెం ఇదిగా ఉంటాడు. అంతే కదా! అంతే కదా!!" అని దర్శకులు ఇద్దర్నీ ఒప్పించే ప్రయత్నం చేశారు. 

మ‌హేశ్ త‌ర్వాత.. తార‌క్ కోసం ప్రభాస్ కూడా!

  'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన పరిచయాలు అన్నిటినీ ఉపయోగించి ప్రముఖ హీరోలు, దర్శకులను షోకి రప్పిస్తున్నారు. కోటి రూపాయల కోసం ఆడే ఆటను రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ఆయ‌న‌ను తార‌క్ కార్యక్రమానికి తీసుకొచ్చారు. హీరోలు ఇద్దరూ కలిసి చేసిన హంగామా బుల్లితెర వీక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఆ తర్వాత దర్శకులలో తనకు సన్నిహితులైన రాజమౌళి, కొరటాల శివను కూడా షో కి తీసుకోవచ్చారు తార‌క్‌. ఆ ఎపిసోడ్ సోమ‌వారం టెలికాస్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తార‌క్‌ కోసం షో కి వచ్చారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. మహేష్ ఎపిసోడ్ దసరాకి టెలికాస్ట్ కానుంది. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... బాహుబలి ప్రభాస్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో సందడి చేస్తారట.‌ ఆయన్ను తీసుకురావడం కోసం గేమ్ షో నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తార‌క్‌కు ప్రభాస్ కూడా స‌న్నిహితుడే. మ‌రి ఆయ‌న‌ ఏమంటాడో చూడాలి మరి! 

ర‌వి, ల‌హ‌రి మిడ్‌నైట్ హ‌గ్‌ను హైలైట్ చేసిన ప్రియ‌.. మొద‌లైంది ర‌చ్చ‌!

  ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కౌగిలించుకుంటే తేడాగా మాట్లాడే మనుషులు మనకు సమాజంలో కనిపిస్తారు. ఏవేవో నిందలు వేస్తారు. 'బిగ్ బాస్' హౌస్‌లోనూ అదే జరిగింది. యాంకర్ రవి, నటి లహరి షెహరి మీద ఆర్టిస్ట్ ప్రియ నింద వేసింది. దాంతో హౌస్‌లో ఒక్కసారి మాటల మంటలు చెలరేగాయి. మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో నిందాస్తుతి మొదలైంది. ఆర్టిస్ట్ ప్రియను లహరి నామినేట్ చేసింది. మన మధ్య ఎందుకు డిస్టెన్స్ వచ్చిందో తెలియడం లేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అందుకు ప్రియ "నువ్వు సేఫ్ గేమ్ ఆడకు. నువ్వు వేరే మగాళ్లతో బిజీగా ఉంటున్నావ్" అని ఘాటుగా స్పందించింది. అక్కడ మొదలైన గొడవ, తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది.  తనను నామినేట్ చేసిన లహరిని ప్రియ నామినేట్ చేసింది. అప్పుడు ఎందుకు నామినేట్ చేసిందో చెబుతూ... ఆ తర్వాత "నువ్వు వాష్ రూమ్ దగ్గర మిడ్ నైట్ రవిని హగ్ చేసుకోవడం (కౌగిలించుకోవడం) నేను చూశా. బహుశా... అది ఫ్రెండ్లీ హగ్ కూడా కావచ్చు" అని అన్నది. దాంతో రవి, లహరి, సన్నీ ముగ్గురూ ప్రియపై విరుచుకుపడ్డారు.  "ఇక్కడ హగ్ చేసుకోకూడదనే రూల్ ఏమైనా ఉందా?" అని రవి ప్రశ్నిస్తే... "కౌగిలింతను తప్పుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు" అని సన్నీ అన్నాడు. నిజం చెప్పాలంటే... ప్రియ అలా అనడానికి ముందు రవి, ఆమె కలిసి లహరి గురించి మాట్లాడుకున్నారు. కానీ, మిడ్ నైట్ హగ్ అనేసరికి లేనిపోని రూమర్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో రవి, లహరి ఫైర్ అయ్యారు. ఈ కౌగిలింత రచ్చ ఎంతదూరం వెళుతుందో చూడాలి. ప్రియ మాటలపై సోషల్ మీడియాలోనూ నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.  

ఈ లుక్‌ను బాలీవుడ్ హీరోయిన్లు కాపీ కొడుతున్నారంట‌!

  స్టార్ యాంకర్ అనసూయ త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేయనుందా? ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేచేస్తుందా? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఇటువంటి సందేహాలు కలుగక మానదు.  ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్ నుండి తన లుక్‌ను అనసూయ రివీల్ చేసింది. అయితే, అది సినిమానా? సీరియలా? వెబ్ సిరీసా? అనేది చెప్పలేదు. ప్రాజెక్ట్ టైటిల్, ఇతరత్రా వివరాలు సస్పెన్స్‌లో ఉంచింది. ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పింది... తన లుక్‌ను బాలీవుడ్ జనాలు కాపీ కొడుతున్నారని! "గౌరీ నాయుడు (అనసూయ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్) మరో స్నేహితురాల్ని చూడండి. మిస్ సి! మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక పాత్ర ఆమె. అంతకు మించి ఏమీ చెప్పలేను. ఈ లుక్‌ను కాపీ చేయడానికి చాలామంది తారలు ప్రయత్నిస్తున్నారు. మా సెట్స్ నుండి బాలీవుడ్ కు తీసుకు వెళ్తున్నారు. అవును... నిజమే! గౌరీ, నేను ఎంతో మనసుపెట్టి ఈ లుక్ క్రియేట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మిస్ సి.. త్వరలో" అని అనసూయ పేర్కొంది. 

నా జీవితం చేజారింది, పారేసుకున్నా!.. కార్తీక్ ఆవేదన!!

  మోనిత జైలుకు వెళ్లినా... వెళ్లేముందు 'రీ-ఎంట్రీ ఇస్తా! బిడ్డతో వస్తా' అన్న మాటలే కార్తీక్‌కు గుర్తుకు వస్తాయి. అవి తలుచుకుని, మోనిత ఏం చేస్తుందోనని ఆలోచిస్తుంటాడు. దీనికి తోడు పిల్లలు ఎక్కడికైనా వెళదామని అడగంతో అవునని అంటాడు. మోనితకు భయపడి పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళతాడు? అమెరికానా? విశాఖపట్టణమా? కార్తీక్ అండ్ ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. 'కార్తీక దీపం' సీరియల్ ఇవాళ (సెప్టెంబర్ 21, 2021) 1550 ఎపిసోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... మోనిత మాటలను తలచుకుంటూ కార్తీక్ బాధ పడుతుంటే... అతడి దగ్గరకు భార్య దీప, తల్లితండ్రులు ఆనందరావు, సౌందర్య వెళతారు. 'నా జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. పారేసుకున్నాను' అని కార్తీక్ తన ఆవేదన, బాధను పంచుకుంటాడు. 'ఇప్పటికైనా దాని (మోనితను ఉద్దేశిస్తూ) పీడ విరగడైంది. దాన్ని మనసులోంచి తీసేయండి' అని భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. అయినా కార్తీక్ కుదుటపడడు. మనసులోంచి తీసేయడానికి... మర్చిపోయేంత చిన్న విషయం కాదని కార్తీక్ అంటాడు.  'అది జైలుకు ఒంటరి వెళ్లి ఉంటే... నువ్వు చెప్పినట్టు అన్నీ మర్చిపోయి హుషారుగా అందరితో కబుర్లు చెబుతూ ఆనందంగా గడిపేవాడిని. కడుపులో బిడ్డతో వెళ్ళింది. ఒక అణుబాంబును మోసుకువెళ్ళింది. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో? అదెంత బలమైందో? దానికి మనలో ఎంత మంది బలైపోతారో? ఊహించుకోవడానికి భయంగా ఉంది' అని కార్తీక్ అంటాడు. దాంతో దీపలో ఒక అంతర్మథనం మొదలవుతుంది. కార్తీక్ నుండి పక్కకు జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలు ఆపమని, ప్రశాంతంగా ఉండమని కొడుక్కి సౌందర్య చెబుతుంది. మేడ మీద నుండి కిందకు వెళుతూ వెళుతూ కోడలితో 'ఏడుస్తూ కూర్చోక కిందకి  వాడిని తీసుకునిరా' అంటుంది. మరోవైపు మోనితకు తక్కువ శిక్ష పడిందని కార్తీక్ తమ్ముడు ఆదిత్య, మరదలు శ్రావ్య చర్చించుకుంటారు.  కార్తీక్‌తో పిల్లలు 'కొన్ని రోజులు ఎక్కడికైనా వెళదాం నాన్నా' అంటారు. అందుకు దీప ఒప్పుకోదు. 'నో' అంటుంది. కార్తీక్ మాత్రం సరేనంటాడు. 'ఎక్కడికి వెళదాం?' అని అడుగుతాడు. 'వైజాక్' అంటుంది సౌర్య. అక్కడికి వచ్చిన సౌందర్య ఎక్కడికి వెళ్లవద్దని, తన కళ్ళముందు ఉండమని అంటుంది. 'ఇప్పుడు ఇలా అంటున్నావ్ కానీ, అమెరికాకు వెళ్ళిపోతే ఏం చేస్తావ్?' అని సౌర్య ప్రశ్నిస్తుంది. 'అమెరికాకు వాళ్ళిద్దర్నీ పంపిస్తా కానీ మిమ్మల్ని పంపించను' అని సౌందర్య అనడంతో సౌర్య ఎమోషనల్ అవుతుంది. కొంత డిస్కషన్ జరిగాక 'సరదాగా అన్నాను' అని సౌందర్య సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. 'సరదాగా అన్నా... అదే జరిగితే బావుంటుంది. ఆలోచించండి' అని ఆదిత్య అంటాడు. తమ్ముడి మాటలతో అదే సరైనదేమోనని కార్తీక్ ఆలోచనలో పడతాడు. మరి, ఫ్యామిలీ అంతటినీ ఎక్కడికైనా తీసుకువెళతాడా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. 

వంటలక్క కంటే నాగ్‌, తారక్‌కు తక్కువే!

  సూపర్‌హిట్ సీరియల్ టీఆర్పీని బీట్ చేసే క్రమంలో... స్టార్ అట్రాక్షన్ లక్ష్యానికి కొంతదూరంలో నిలిచింది. వంటలక్కపై బుల్లితెర వీక్షకులకు ఉన్న అభిమానం ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు', కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 5'కు తక్కువ టీఆర్పీలు రావడం గమనార్హం. జెమినీ టీవీలో వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాని త‌ర్వాత‌ ఈ షో హైయ్యస్ట్ రేటింగ్ 11.37. అయితే, టీవీలో ఎన్టీఆర్ బెస్ట్ ఇదేనా? అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే... ఆయన హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 3'కి 17.9 రేటింగ్ వచ్చింది. దాన్ని 'బిగ్ బాస్ 5'తో నాగార్జున బ్రేక్ చేశారు. 18 టీఆర్పీ రేటింగ్ సాధించారు. అయితే... ఎస్‌డి, హెచ్‌డి మినహాయిస్తే 15.66 మాత్రమే. టీఆర్పీ విషయంలో ఈ రెండు షోస్ కంటే 'కార్తీక దీపం' సీరియల్ ముందంజలో ఉంది.  జూన్ తొలి వారంలో 'కార్తీక దీపం'కు 19.10 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరూ బీట్ చెయ్యలేకపోయారు. దీన్నిబట్టి వంటలక్కకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

సుధీర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న ఫ్యామిలీ.. మ‌రి ర‌ష్మి ప‌రిస్థితి?

  'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ జంట ఈటీవీకి టీఆర్పీ పంట పండిస్తోంది. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మీద ఎన్ని స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్, ఈవెంట్స్ చేసినా వ్యూవర్షిప్ దక్కుతోంది. దాంతో 'మా చెల్లికి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ' అన్నట్టు... 'సుధీర్-రష్మీ పెళ్లి లేదంటే లవ్ స్టోరీ మీద చేయాలి మళ్ళీ మళ్ళీ ఈవెంట్' అన్నట్టు వ్యవహారం తయారవుతోంది. గతంలో సుధీర్-రష్మీకి పెళ్లి చేస్తూ ఒక ఈవెంట్ చేశారు. రీసెంట్‌గా వినాయక చవితికి తొమ్మిదేళ్ల ప్రేమకు గుర్తుగా అంటూ రష్మీ చేత ఒక పెర్ఫార్మన్స్ చేయించారు. సుధీర్‌కి ఆమె చేత ప్రపోజ్ చేయించారు. 'మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు?' అని రోజా, ఇంద్రజ అడిగారు. అయితే, అదంతా టీవీ ప్రోగ్రామ్ కోసం చేసిందని 'గెటప్' శీను స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోంది. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరని అతడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.  "సుధీర్, రష్మీ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ తప్పితే... ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమీ లేవు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు. ఇది నిజం. షూటింగ్ అయిపోయిన వెంటనే రష్మీది వేరే లోకం. ఆ లోకంలో ఉంటుంది. సుధీర్ కూడా అంతే! రియల్ లైఫ్‌లో వాళ్ళ మధ్య ఏమీ లేదు. వీలు కాదు కూడా! ఎందుకంటే... సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు" అని 'గెటప్' శీను చెప్పాడు. దాంతో రష్మీ కాకుండా సుధీర్ ఎవరోనని టీవీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. 

ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ మాత్రమే.. మోనిత కాన్ఫిడెన్స్‌!

  పరిణామాలు అన్నీ తన ఊహలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ... కార్తీక్ మీద మోనితకు ఉన్న మోజు చావలేదు. కార్తీక్ కుటుంబంలో తనకు స్థానం దక్కుతుందనే ఆశ పోలేదు. తన కడుపులో బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఇప్పటికీ బలంగా వాదిస్తోంది. తనకు శిక్ష పడినప్పటికీ.. తనపై ఆత్మ విశ్వాసంతో, చిరునవ్వుతో కటకటాల్లోకి వెళ్లింది. 'కార్తీక దీపం' సీరియల్ ఈ రోజు (సెప్టెంబర్ 20, 2021) 1149 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. నేడు ఏం జరిగిందంటే... మోనితను కోర్టుకు లాకొచ్చి తన భర్త నిర్దోషి అని దీప (వంటలక్క) నిరూపించిన, జైలు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అందరూ ఊహించినట్టుగా టాపిక్ మోనిత కడుపులో బిడ్డ మీదకు వెళ్లింది. కోర్టులో 'మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు?' అని లాయర్ ప్రశ్నించగా 'కార్తీక్' అని మోనిత చెబుతుంది. 'మీకు పెళ్లి కాకుండా ఆ బిడ్డ ఎలా వచ్చాడు?' అని లాయర్ అడగటంతో 'కృతిమ గర్భం దాల్చాను' అని చెబుతుంది. ఆ విషయం కార్తీక్‌కి తెలియదని, పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజున చెప్పాలని ఆగానని అంటుంది. కార్తీక్‌కి దీపతో పెళ్లి కాకముందే అతడిని తాను ప్రేమించానని, ఆమెతో పెళ్లైన తర్వాత కూడా తన ఇంటికి వచ్చి ప్రతిదీ తనతో చెప్పుకోవడం వల్ల ఈ సమాజం తనపై నిందలు వేసిందని, దాంతో తాను ఇల్లు మారాల్సి వచ్చిందని మోనిత చెబుతుంది. కార్తీక్ తనవాడు అనిపించుకోవడం కోసం మోనిత చేసిన కుట్ర తప్ప, అందులో ప్రేమ ఎక్కడుందని దీప అంటుంది. మోనిత తనకు స్నేహితురాలు అని, భార్యతో విడిపోయిన సందర్భంగా మమ్మల్ని కలపడానికి అమ్మ ప్రయత్నాలు చేస్తుంటే... వాటిని ఆపడానికి మోనితను పెళ్లి చేసుకుంటానని అన్నాను తప్ప... మోనితను ఏనాడూ వేరే ఉద్దేశంతో, ఆలోచనతో చూడలేదని కార్తీక్ చెబుతాడు. పెళ్ళికి అంగీకరించకపోతే తన తమ్ముడికి యాక్సిడెంట్ చేయించిందని, కృత్రిమ గర్భం దాల్చిందని మోనిత నేరాలు బయటపెడతాడు. ఆ సమయంలో 'మోనిత కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు' అని కార్తీక్ అరుస్తుంటే... దీపకు గతం గుర్తుకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వస్తుంది. మరోవైపు మోనిత "పదకొండేళ్ల క్రితం కట్టుకున్న భార్య కడుపులో బిడ్డకు తాను తండ్రి కాదని కార్తీక్ అన్నాడు. ఇప్పుడు నా కడుపులో బిడ్డకు తండ్రి కాదంటున్నాడు. అప్పుడు కాదనుకున్న భార్య ఇప్పుడు అతడి పక్కన ఉంది. ఏమో రేపు నన్ను కూడా ఆదరిస్తాడేమో. ఇంకా నాలో ఆశ చావలేదు. నా కడుపులో బిడ్డకు తండ్రి కార్తీక్" అని అంటుంది. ఇదంతా పక్కన పెడితే... కార్తీక్ వాదన కోర్టు నమ్ముతుంది. మోనితకు ఐదు లక్షల జరిమానాతో పాటు ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విదిస్తుంది కోర్టు. హిమ హత్య విషయంలో విచారణ చేయమని ఆదేశిస్తుంది. మోనితను జైలుకు తీసుకువెళుతున్న సమయంలో మీడియా చుట్టుముడుతుంది. 'జైల్లో బిడ్డను కంటారా?' అని ప్రశ్నిస్తుంది. వికట హాసంతో 'సినిమాకు ఉన్నట్టే జీవితానికి మూడు భాగాలు ఉంటాయి. ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు. ఇంటర్వెల్ మాత్రమే' అని మోనిత అంటుంది. 'క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది?' అని విలేకరి అడిగితే... 'ఎవరూ ఊహించి ఉండరు. చూస్తుండండి. అందరికీ తెలుస్తుంది' అని ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత దీపతో మాట్లాడాడతానని ఏసీపీ రోషిణిని అడిగితే ఆమె ఒప్పుకోదు.  "దీపక్కా! దీపక్కా... శ్రావ్య నీకు తోడబుట్టిన చెల్లెలు అయితే, కార్తీక్ మూలంగా నేనూ చెల్లెల్నే అవుతా! గుర్తుపెట్టుకో!!" అని మోనిత గట్టిగా అరుస్తుంది. కోపంగా దీప ముందుకు కదిలితే... సౌందర్య ఆపుతుంది. "దాన్ని నువ్వు కొడితే ఫొటోలు వైరలవుతాయి. అవసరమా? బురదలో రాయి వేయడం!" అని అంటుంది. అత్త మాటలకు దీప శాంతిస్తుంది. కానీ, మోనిత మాత్రం ఆగలేదు.  "ఆంటీ... సౌందర్య ఆంటీ! నా బిడ్డకు నామకరణం, బారసాల, అక్షరాభ్యాసం... అన్నీ మీ చేతుల మీదే జరగాలి. లేకపోతే నేను ఊరుకోను" అని మోనిత మళ్ళీ అరుస్తుంది. ఈసారి సౌందర్య కోపంగా కదిలితే దీప ఆపుతుంది. "నన్ను ఆపి మీరు ఉరుకుతారేంటి?" అని అడుగుతుంది. "దాని నమ్మకం చూశావా?" అంటుంది సౌందర్య.  అక్కడితోనూ మోనిత ఆగలేదు. ఈసారి కార్తీక్ తండ్రి ఆనందరావును పిలుస్తుంది. "ఆనందరావు అంకుల్! మీకు మనవడే పుడతాడు. మీకు అసలైన వారసుడొస్తాడు. వాడికి మీ పేరే పెడతా. 'ఆనందం' అని! మోనిత శకం ముగిసిపోలేదు. రీ-ఎంట్రీ ఇస్తా. గుర్తు పెట్టుకోండి... బిడ్డతో వస్తా! రీ-ఎంట్రీ పక్కా! ఐ లవ్యూ మై డియర్ ఫ్యామిలీ" అని మోనిత అరుస్తుంది. ఇదంతా కోపంగా కార్తీక్ చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమైందనేది మిగతా ఎపిసోడ్స్ లో చూడాలి. 

దసరాకు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్ లో తారక్, మహేష్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జెమిని టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న తారక్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ షోపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జెమిని.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి రికార్డ్ స్థాయిలో రేటింగ్ తెప్పించాలన్న ఉద్దేశంతో తారక్ సన్నిహితులైన టాలీవుడ్ బడా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతుంది. తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. దీంతో తారక్ షో కోసం చరణ్ ని రంగంలోకి దింపారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దింపింది జెమిని. ఈ ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ షూట్ కూడా చేశారని సమాచారం. తారక్-మహేష్ కలిస్తే ఎపిసోడ్ రేటింగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, బిగ్ బాస్ షో, సీరియల్స్ ని తట్టుకొని మంచి రేటింగ్ సాధించాలంటే ఈ మాత్రం సెలబ్రిటీస్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్‌ బాస్ 5: ఉమాదేవి అవుట్!

  'బిగ్‌ బాస్-5' నుండి మరో మహిళ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారం హౌస్ నుండి సరయును బయటకు పంపిన బిగ్ బాస్... రెండో వారం ఉమాదేవిని పంపించారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళలు షో నుండి బయటకు వచ్చినట్టు అయ్యింది. దాంతో నామినేట్ అయిన మిగతావాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఉమాదేవితో పాటు రెండో వారంలో ఎలిమినేషన్స్ ప్రక్రియలో నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, ప్రియ, యాని మాస్టర్ నామినేట్ అయ్యారు. చివరకి నటరాజ్, ఉమాదేవి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇద్దరిలో ఉమాదేవికి తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.  నిజం చెప్పాలంటే... ఉమాదేవి ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు ఉమాదేవి కోపం షో చూసేవాళ్లల్లో ఆమెపై వ్యతిరేక భావం ఏర్పడేలా చేసింది. తోటి సభ్యులను నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇతరులతో ప్రవర్తించేటప్పుడు విపరీత ధోరణి తమకు నచ్చడం లేదని చాలామంది గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు ఉమాదేవి తన కోపం, ప్రవర్తన కారణంగా ఎలిమినేట్ అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

డాన్స‌ర్ కేవల్ మృతి... విషాదంలో 'ఢీ' ఫ్యామిలీ

  యువ డాన్సర్ కేవల్ తమంగ్ మృతి చెందాడు. తెలుగు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాటు హిందీ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ప్లస్'లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కేవల్  కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడిని కాపాడటం కోసం కొరియోగ్రాఫర్ యశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేయమని ప్రముఖులను, ప్రేక్షకులను కోరాడు. ప్రియమణి, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, మేఘన తదితరులు ముందుకొచ్చారు. విధిరాత ముందు వీరి ప్రయత్నం తల వంచక తప్పలేదు.  కేవల్ తమంగ్ ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణవార్తను ధృవీకరిస్తూ యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నువ్వు లేవనే విషయాన్ని మనసుకు తీసుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. స్వర్గంలో విశ్రాంతి తీసుకో బ్రదర్. నన్నెప్పటికీ, జీవితాంతం ఈ వేదన వెంటాడుతుంది. నేనింకా నువ్వున్నట్టు ఫీలవుతున్నా. చాలా త్వరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయావ్" అని యశ్ పోస్ట్ చేశాడు. కేవల్ మృతిపై పలువురు టీవీ ప్రముఖులు, డాన్సర్లు సంతాపం వ్యక్తం చేశారు. 

నాగార్జునకు బిగ్ షాక్.. బిగ్‌బాస్‌ 5 ఫస్ట్ ఎపిసోడ్‌ కు దారుణ రేటింగ్!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున వరుసగా మూడోసారి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఐదో సీజన్‌ తో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తామంటూ నాగార్జున చెప్పారు. దీంతో ఐదో సీజన్‌ అదరగొడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్‌బాస్‌ 5 లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు దారుణమైన రేటింగ్ వచ్చింది. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్‌బాస్‌ షో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆయన హోస్ట్ చేసిన తొలి సీజన్‌ లాంచ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మూడవ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ వచ్చింది. నాలుగో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు అయితే ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో ఐదో సీజన్‌తో నాగార్జున ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కు తక్కువ రేటింగ్‌ నమోదైంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 లాంచ్‌ ఎపిసోడ్‌ కు 15.7 టీఆర్పీ వచ్చింది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అయితే కంటెస్టెంట్ల వివరాలు ముందే లీక్ కావడమే తొలి ఎపిసోడ్‌ కు తక్కువ రేటింగ్‌ రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు, ఈ సీజన్ లో చాలావరకు కొత్త ముఖాలే ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్ వినిపిస్తోంది. మరి ముందు ముందు నాగార్జున ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

"ఐ ల‌వ్ యూ మై ఫ‌రెవ‌ర్‌".. షణ్ముఖ్‌తో బంధంపై ఓపెన్ అయిన దీప్తి!

  బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి ఇష్ట‌మైన సెల‌బ్రిటీల్లో ఆమె ఒక‌రు. త‌న రోజువారీ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఫోటోలను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆమెకు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ అంటే విప‌రీత‌మైన ప్రేమ అని ఆమె అనుచరులలో చాలామందికి ఇప్పటికే తెలుసు.  మూడేళ్ల క్రితం దీప్తికి షణ్ముఖ్ ప్ర‌పోజ్ చేశాడ‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇంత‌దాకా త‌మ మ‌ధ్య అనుబంధం ఉన్న‌ద‌నే విష‌యాన్ని దీప్తి బాహాటంగా ఒప్పుకోలేదు, అలాగ‌ని తిర‌స్క‌రించ‌నూ లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో వారిద్ద‌రూ క‌లిసున్న ఫొటోలు వారి బంధం గురించిన సంకేతాల‌ను అందిస్తుంటాయి. సెప్టెంబర్ 16 ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అత‌డి బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేయ‌డానికి బుధ‌వారం రాత్రి అన్న‌పూర్ణ స్టూడియోస్‌కు వెళ్లింది దీప్తి. అక్క‌డే బిగ్ బాస్ హౌస్ సెట్ ఉంది. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అతిథుల్ని కానీ, కంటెస్టెంట్ల కుటుంబ‌స‌భ్యుల‌ను కానీ అనుమ‌తించ‌రు. అందుక‌ని దీప్తి హౌస్ గేట్ ద‌గ్గ‌ర‌కు ఒక కేక్ తీసుకొని వెళ్లింద‌నీ, దూరం నుంచే అత‌డ్ని పిలిచి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింద‌నీ లేటెస్ట్‌గా లీకైన వీడియోలో క‌నిపించింది. దీప్తిని చూసి అమితాశ్చ‌ర్యానికి గురైన ష‌ణ్ముఖ్ ఆమెకు థాంక్స్ చెప్పాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ష‌ణ్ముఖ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది దీప్తి. అత‌డికి స‌న్నిహితంగా ఉన్న రెండు ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె, "హ్యాపీ బ‌ర్త్‌డే ష‌ణ్ణు. ఎప్ప‌టికీ ఐ ల‌వ్ యూ" అని రాసుకొచ్చింది. దాంతో పాటు హార్ట్ ఎమోటికాల‌ను జోడించింది. ఆ పోస్ట్ ద్వారా ఆమె ష‌ణ్ముఖ్‌ను ఎంత‌గా ప్రేమిస్తుందో అర్థ‌మైపోతోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

మోనిత జైలుకు వెళ్లినా... కార్తీక్ ఫ్యామిలీకి టెన్షన్ ఎందుకంటే?

మోనిత అరెస్టుతో కార్తీక్, దీప కుటుంబానికి ఇక ఎటువంటి అడ్డు లేదని... కథ సుఖాంతం అవుతుందని భావించిన వీక్షకులకు 'కార్తీక దీపం' సీరియల్ దర్శకుడు ట్విస్ట్ ఇస్తున్నాడు. కథను మరింత కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తాజా ఎపిసోడ్స్ ద్వారా స్పష్టం చేస్తున్నాడు. కార్తీక్ ఫ్యామిలీకి మోనిత అడ్డు ఇంకా తగ్గలేదని టెన్షన్ తప్పదని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశాడు. మోనితను కార్తీక్ హత్య చేశాడని అభియోగం మీద పోలీసులు అతడిని అరెస్టు చేయడం, సరిగ్గా తీర్పు వెలువరించే సమయంలో ఎవరినైతే తన భర్త హత్య చేశాడని అంటున్నారో ఆమెను కోర్టులోకి దీప తీసుకురావడంతో కథ మొత్తం మారిపోయింది.‌ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు కోర్టు సమయాన్ని వృథా చేయడంతోపాటు హత్యకు గురైన నాటకాన్ని ఆడిన మోనితకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కార్తీక్ ఇంటికి... మోనిత జైలుకు వెళ్లడంతో వంటలక్క అలియాస్ దీప జీవితంలో ఎటువంటి టెన్షన్ లేదని అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు.‌ అయితే, కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ ఈ పద్ధతుల ద్వారా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డను అడ్డుపెట్టుకుని ఎలాగైనా కార్తిక్ చేత తాళి కట్టించుకుని ప్రయత్నం చేస్తుందని కార్తీక్ తల్లి సౌందర్య అనుమానపడుతుంది. అదేవిధంగా మోనిత కూడా జైలు నుంచి కార్తీక్ ఇంటికి రత్నసీత చేత ఒక బ్యాక్ పంపిస్తుంది. అందులో చిన్న పిల్లల ఫోటోలు ఉంటాయి. మనకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటాడని, ఈ ఫోటోలో మీ పడక గదిలో అంటిస్తే సంతోషిస్తానని, ప్రతి అడుగులోనూ గుర్తొస్తున్నావని, మన బాబు కి మీ నాన్నగారి పేరు ఆనంద్ పెట్టానని మోనిత ఓ లేఖ రాస్తుంది. చివర్లో ఇట్లు నీ సహధర్మచారిణి 2 అని పేర్కొంటుంది. అలాగే దీప ఫోనులో తాను బెదిరింపులకు పాల్పడిన వీడియోలను రత్న సీత చేత డిలీట్ చేయిస్తుంది. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

నన్నెవరూ ముద్దుపేర్లతో పిలవలేదు!

  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడు అనిపించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నటనలోనూ, ప్రవర్తనలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనది కూడా మహానటుడి పేరే. యంగ్ టైగర్‌ను తారక్ అని కొందరు, రామారావు అని ఇంకొందరు జూనియర్ ఎన్టీఆర్ అని మరికొందరు పిలుస్తుంటారు.  అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు ముద్దుపేర్లు లేవా? అంటే... 'లేవు' అని చెప్పాలి. తారక్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో ఇదే విషయం చెప్పారు. గేమ్ ఆడటానికి వచ్చిన ఒక కంటెస్టెంట్ టెన్షన్ పడుతుంటే అతడి ముద్దుపేరు గురించి తారక్ డిస్కస్ చేశారు. తర్వాత "మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం చాలా మంచిది. సో, అందుకనే నన్ను కూడా చిన్నప్పుడు ముద్దుపేర్లు పెట్టి పిలవలేదు" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.  అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' ఆధారంగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేం షోను రూపకల్పన చేశారు. జెమిని టీవీలో ఈ షో ప్రసారమవుతోంది.

వాళ్ళిద్దరితో మాల్దీవ్స్ వెళ్లిన సుమ

  కొవిడ్ టైమ్‌లో మాల్దీవ్స్ ఫుల్ ఫేమస్ అయ్యింది. లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ నుండి రిలీఫ్ రావడమే ఆలస్యం సెలబ్రిటీలు అందరూ మాల్దీవ్స్ క్యూ కట్టారు. అప్పుడు వాళ్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ పక్క ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే విహారయాత్రలు ఏంటని మాల్దీవ్స్ వెళ్లిన సెలబ్రిటీలపై సహచర నటీనటులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. సాధారణ ప్రజలు కూడా విహారయాత్రలకు వెళుతున్నారు. యాంకర్ సుమ కూడా వెళ్లారు.  ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ సుమ మాల్దీవ్స్ వెళ్లారు. కుమారుడు రోషన్ కనకాల, కుమార్తె స్నేహ మనస్వి కానుకలతో కలిసి ప్రముఖ పర్యాటక సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. సుమ చాలా బిజీ యాంకర్. పలు షోస్ చేస్తున్నారు. అయితే.. కరోనా తర్వాత ఎక్కడికి వెళ్లలేదని, కాస్త రిలీఫ్ కోసం షార్ట్ బ్రేక్ తీసుకున్నారని టీవీ ఇండస్ట్రీ టాక్. సుమ, పిల్లలతో పాటు రాజీవ్ కనకాల వెళ్లారో లేదో మరి! పిల్లలతో కలిసున్న ఫొటోలను మాత్రమే సుమ షేర్ చేశారు. 

శ్రీముఖి ఇంట విషాదం

  ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఆమె అమ్మమ్మ మరణించారు. దాంతో శ్రీముఖి భావోద్వేగానికి లోనయ్యింది. అమ్మమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. "అమ్మమ్మ అంటే ప్రేమ. జీవితంలో చాలా విషయాలను తను నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేది. అమ్మమ్మ ధైర్యవంతురాలు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తనతో పాటలు పాడటం, డాన్స్ చేయడం మిస్ అవుతాను. అమ్మమ్మ... ఐ లవ్యూ. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి థాంక్స్. నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రేమ కథల్లో అమ్మమ్మ, తాతయ్య ప్రేమకథ ఒకటి. పైలోకంలో తాతయ్యను అమ్మమ్మ కలుస్తుందని, వాళ్ళ ప్రేమకథ అక్కడ కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని శ్రీముఖి రాసుకొచ్చింది. శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు సందేశాలు పెట్టారు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణం మరువక ముందే పరిశ్రమకు చెందిన మ‌రో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.