జల సంరక్షణ.. దేశంలోనే తెలంగాణ టాప్
జలసంరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల సంచాయ్ తాజాగా ప్రకటించిన ర్యాంకులలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 5,20,362 వాన నీటి సంరక్షణ పనులు చేపట్టింది. వీటిలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ వంటి పనులు ఉన్నాయి.
కాగా జల సంచాయ్ జన భాగీదారి ర్యాంకుల్లో భాగంగా దేశంలో 67 జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలలకు అవార్డులు లభించాయి. వీటిలో రెండు కోట్ల రూపాయల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాలు టాప్ లో ఉన్నాయి. అలాగే వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలకు కోటి రూపాయల రివార్డులు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు పాతిక లక్షల రూపాయల రివార్డులు దక్కాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు గెలుచుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతోషం హర్షం వ్యక్తం చేశారు. జలసంరక్షణలో ఈ మూడు జిల్లాలూ దక్షిణ భారతదేశంలోనే టాప్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామి పనుల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ నిర్మించినందువల్లే కేంద్రం అవార్డుల వచ్చాయని పంచాయతీరాజ్ సీతక్క చెప్పారు. అవార్డులు, రివార్డులు సాధించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, నల్లోండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ,జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్రబోయి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లను మంత్రి సీతక్క అభినందించారు.