ఏంటో పిచ్చి జ‌నం.. జీఎస్టీ త‌గ్గింద‌ని ప‌రుగులు!

యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు పెంచి.. ఆపై దాన్ని డెబ్భై ఐదు రూపాయ‌ల‌కు డిస్కౌంట్ పేరిట‌ అమ్ముతుంటే ఎగ‌బ‌డి కొన‌డం మ‌న‌కు న‌ర‌న‌రాన జీర్ణించుకుపోయిన ఒకానొక దుర‌ల‌వాటు. అదే మ‌నం మ‌న ప‌క్కింటి కిరాణా షాపుల్లోని స‌రుకులు.. మ‌న అమ్మ‌మ్మ బామ్మ వంటి వారు వీధుల్లో కుప్ప‌లు పోసి అమ్మే కూర‌గాయ‌లు.. ఇవ‌న్నీ మ‌న‌కు చాలా  చాలా చౌక ధ‌ర‌లకే ల‌భిస్తుంటాయి.  కానీ మ‌నం ఎగేసుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటాం. అక్క‌డ మ‌నం  పైన చెప్పుకున్న‌ట్టు యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు ఎంఆర్పీ వేసి.. దాన్ని డెబ్భై ఐదుకు భారీ డిస్కౌంట్ పేరిట‌ అమ్మేస్తుంటే ఎగ‌బ‌డి మ‌న ట్రాలీలో వేసేసుకుంటాం. అదేమంటే డెడ్ చీపుగా డిస్కౌంట్లో వ‌చ్చింద‌ని బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభానికి మించిన బిల్డప్ ఇస్తుంటాం. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం నిర్మ‌లా  సీతారామ‌న్ అనే ఒక ద‌క్షిణాదికి చెందిన, తెలుగింటి కోడ‌లిగారి చేత చేయిస్తోన్న జీఎస్టీ గార‌డీ ఇదేనంటారు చాలా మంది ఆర్ధిక నిపుణులు. బేసిగ్గా  గుజ‌రాతీ బ‌నియా బుద్ది  ప్ర‌కారం  చూస్తే.. ప్ర‌జ‌ల చేతిలో విరివిగా ఏదీ ఉండ‌కూడ‌దు. ఉంచ కూడ‌దు. డ‌బ్బంతా ఖ‌జానాలో ఉండాలి. జ‌న‌మంతా డ‌బ్బు కోసం అంగ‌లార్చుతుండాలి. ఇదే వారి మెయిన్ ఫైనాన్షియ‌ల్ పాల‌సీ. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ పాల‌సీని అమ‌ల్లో పెట్ట‌డానికి ట్రంప్ టారీఫ్ ల క‌న్నా మించి.. వాడి  జ‌నం ర‌క్తం పీల్చి పిప్పి చేసేశారు. మ‌న‌మంతా ట్రంప్ మామ ఒక్క‌డే మ‌న‌ల్ని ఇంత‌గా పిండుతున్నాడ‌ని ఓ తెగ ఫీలై పోయాంగానీ.. మ‌న‌ల్నిఇక్క‌డ మోడీ తాత అంత‌క‌న్నా మించి పీల్చేసిన విష‌యం ఇటు జీఎస్టీలోనే కాదు అటు పెట్రోల్, గ్యాసు, మొబైల్ రీచార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటికీ ఈ నాటికీ ఎంతో ధ‌ర‌ల‌ తేడా క‌నిపిస్తుంది రెండు క‌ళ్లు పెట్టి చూస్తే. వీట‌న్నిటికీ ప్ర‌స్తుతం మ‌నం ఒక‌టికి రెండు మూడు రెట్లు ఎక్కువ‌గా చెల్లిస్తున్నాం. ఈ క్ర‌మంలో కాస్త ఊర‌ట‌నిచ్చేలా నాలుగు జీఎస్టీ స్లాబులు తీసేసి రెండు స్లాబులు మాత్ర‌మే ఉంచ‌డం అది కూడా ద‌స‌రా, దీపావ‌ళి ధమాకా పేరిట‌ ఇవ్వ‌డం చూస్తుంటే.. ఇదొక కార్పొరేట్ పాల‌సీగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందులో జ‌నం సొమ్ము జ‌నానికే పంచ‌డం ఏదైతే ఉందో అది న‌భూతో అంటున్నారు చాలా మంది అర్ధ‌శాస్త్ర నిపుణులు.  ఈ విష‌యం అర్ధం కాక టీవీలు, ఫ్రిడ్జిలు, కార్లు.. ఇత‌ర‌త్రా భారీగా త‌గ్గాయ‌ని ఎగేసుకుని వెళ్తున్నాం మ‌న‌మంతా.. దీన్నే అంటారు బ‌నియా టెక్నిక్ అని కామెంట్ చేస్తున్నారు కొంద‌రు సీఏ స్టూడెంట్స్.

తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు కానుంది. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రానికి ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, వీజీవో రాంకుమార్, టీటీడీ బోర్డు  సభ్యుడు నరేష్ పరిశీలించారు.   శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు  ఏఐ  ను వినియోగించాలన్న చైర్మన్ నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐ ల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది.   ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే  ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను ఒకసారి పరిశిలిస్తే ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.  క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రా లతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.

అమరావతిపై ఫేక్ పోస్టు.. ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

ఓ ఫేస్ బుక్ పోస్టు ఆ ప్రభుత్వోద్యోగి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రభుత్వం వేటు వేసింది.  వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి ముంపునకు గురైందంటూ   ఫొటోలతో తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు  అమరావతి మునిగిపోయిందని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్  వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సుభాష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సుభాష్ ను వివరణ కోరింది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు. ఆ సమాధానంతో  సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను  సస్పెండ్ చేసింది.  

ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే... ఎందుకంటే?

  ములుగు జిల్లా మంగపేట మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని వాదనలు వినిపించారు.  అయితే 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా, నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి నిజాం ఆదేశాలను అనుసరించడం సరైంది కాదని గిరిజనేతరులు అభ్యంతరం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న వేళ, తమ హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికలపై స్టే విధించింది.

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్

  కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్ట్ లో తన పేరును తొలగించాలని తెలంగాణ హై కోర్టు లో  ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్మిత సబర్వాల్ చర్యలను.. పీసీ ఘోష్  కమిషన్ రిపోర్టులో పేర్కొ న్నారు. కాళేశ్వ రం నిర్మాణా లపై స్మితా సభర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ తెలపడమే కాకుండా బ్యారేజ్ లను సందర్శించిన  పలు ఫోటోలను, సైతం రిపోర్ట్ లో పొందుపరిచింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్ ను ఎప్పటి కప్పుడు అప్పటి సీఎంకు  స్మిత సభర్వాల్ చేరవేసిందని పీసీ ఘోష్ కమిషన్ తెలిపారు.  చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సభర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించింది. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సభర్వాల్ కీలక పాత్ర పోషించింది. నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సభర్వాల్ పై చర్యలు తీసుకో వాలని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చేందుకు తనకు 8b,  8c నోటీసులు ఇవ్వలేదని పిటిషన్  దాఖలు చేశారు. పీసీ గోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని  స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును కోరారు.  

రాజకీయ నాయకుల విగ్రహాల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు : సుప్రీంకోర్టు

  తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేతల విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని వినియోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. "మీ మాజీ నాయకుల గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు? దీనికి మేం అనుమతి ఇవ్వలేం" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసి, కొన్ని నెలల క్రితమే పనులు కూడా ప్రారంభించింది. అయితే, ప్రభుత్వ స్థలంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు ఈ విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొంటూ, విగ్రహ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు సరైనదేనని సమర్థించింది. ప్రజాధనాన్ని ఇలాంటి పనుల కోసం దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఊరట కావాలనుకుంటే హైకోర్టునే ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది.

శ్రీవారి సేవలకు టీటీడీ శుభవార్త

  తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుభవార్త చెప్పారు.  సేవలకు సేవా కాలం అనంతరం వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవకులతో ఆస్థాన మండపంలో బీఆర్‌ నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భాంధవులు అని అన్నారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ప్రతిసారి టీటీడీ సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు.దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని అన్నారు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో టీటీడీ సేవను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలి : సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో  90 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి  పరిస్థితిని ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ, “ఎప్పుడైనా సరే ఆపరేషన్‌ అంటే శరీరాన్ని కోయడమే. సహజసిద్ధమైన ప్రసవాన్ని ప్రోత్సహించాలి.  సిజేరియన్‌లలో అగ్రస్థానంలో ఉండటం సరికాదు. దీన్ని నియంత్రించే మార్గాలపై ఆలోచించాలి” అన్నారు. దేశంలో అత్యధికంగా ఏపీలో  సిజేరియన్‌ డెలివరీలు (56.62%) జరుగుతున్నాయి. ఇది డేంజరస్ ట్రెండ్ అన్నారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని, యోగా వంటి సాధనాలను నేర్పే పరిస్థితి రావాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను పిలిచి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మన అందరి లక్ష్యం. వచ్చే ఏడాదికే రాష్ట్ర జనాభా 5.37 కోట్లకు చేరుకోనుంది. దేశ జనాభా 2047 నాటికి 162 కోట్లకు చేరుతుందని అంచనా. యూపీ, బిహార్ వల్లే భారత్‌లో జనాభా సమతుల్యం అవుతోంది. ఏపీలో పీహెచ్‌సీలు జాతీయ సగటు కంటే ఎక్కువే ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మన రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు” అని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని, దేశ సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందని సీఎం తెలిపారు. “ఇమ్యూనైజేషన్‌లో 97 శాతం విజయాన్ని సాధించాం. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 78 శాతం పురోగతి ఉంది, త్వరలోనే వందశాతం సాధిస్తాం. గర్భిణీల్లో అనీమియా 32 శాతం ఉన్నా, దీన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.

గ్రూపు-1 పరీక్షపై... హైకోర్టులో మరో అప్పీలు

  తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ, ఫలితాలను సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గ్రూప్‌-1 అభ్యర్ధి విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టీజీపీఎస్సీ కూడా అప్పీల్‌ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు అధ్యక్షతన, ఈ నెల 9వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ, కమిషన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్

  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, కర్మాగారం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ ప్రయత్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వాస్తవాలు తెలియకుండా విమర్శించడం ప్రతిపక్షానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలు వచ్చినట్లు గుర్తుచేస్తూ, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ స్థాపనతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. కియా రాకముందు అక్కడ తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండగా, పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లు రావడంతో ఉపాధి అవకాశాలు పెరిగి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు అత్యంత కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు.

అమరావతిలో సీఆర్డీయే నూతన భనవం ప్రారంభం ఎప్పుడో తెలుసా?

అమరావతిలో సీఆర్డీయే కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. విజయదశమి రోజున ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.  4.23 ఎకరాల్లో 2.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో   ఎనిమిది అంతస్తులలో ఈ భవన నిర్మాణం జరిగింది. వాస్తవానికి ఈ భవనాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని భావించినప్పటికీ భారీ వర్షాల కారణంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో  వాయిదా పడింది. ఈ సీఆర్డీయే భవనంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనలో సీసీటీవీలు, డ్రోన్లతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటేరియెట్, రాజ్ బవన్ నమూనాలు ప్రదర్శించే ఎక్స్ పీరియెన్స్ సెంటర్ ఉన్నాయి. అలాగే పైకప్పుపై ఈవెంట్ స్పేస్, జాతీయ జెండా ఉంటాయి.   కాగా భవనం ఇనాగ్యురేషన్ కు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో మంత్రి నారాయణ ఈ భవనాన్ని మంగళవారం (సెప్టెంబర్ 23) పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.  మూమూలుగా అయితే ఈ సీఆర్డీయే భవనం 2019 నాటికే రెడీ అవ్వాలనీ, అయితే గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిలిచిపోయిందని నారాయణ తెలిపారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత టెండర్లు పిలిచి సీఆర్డీయే భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.  

నవంబర్ లోగా బెంగళూరులో గుంతలు లేని రోడ్లు!

కర్నాటక రాజధాని బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. నవంబర్ నాటికల్లా బెంగళూరు నగరంలో రోడ్లపై గుంతలనేవే ఉండవని చెప్పారు. ఆ విధంగా కాంట్రాక్టర్లకు స్పష్టమైన గవుడు విధించినట్లు చెప్పారు. అయినా దేశ రాజథాని నగరం ఢిల్లీలో ఏకంగా ప్రధాని నివాసం ముందు రోడ్డుపైనా గుంతలు ఉన్నాయన్నారు. అంతెందుకు.. రోడ్లపై గుంతలు ఉండటం అన్నది దేశ వ్యాప్త సమస్య అన్న డీకే శివకుమార్.. వాటిని వేటినీ పట్టించుకోకుండా మీడియా కేవలం బెంగళూరునే లక్ష్యం చేసుకుందని విమర్శించారు.  గతంలో కర్నాటకలో అధికారంలో ఉన్న  బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే రోడ్లు ఎందుకిలా ఉంటాయని ప్రశ్నించారు.   బెంగళూరు రోడ్లు గుంతలమయంగామారిపోయాయంటూ  కేంద్ర మంత్రి హెచ్ డీ కుమార స్వామి విమర్శించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఒక టెక్ కంపెనీ సీఈవో కూడా బెంగళూరు రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమ వేదికగాచేసిన పోస్టు వైరల్ అవ్వడమే కాకుండా, బెంగళూరు నుంచి సదరు కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లుగా ఆ సీఈవో ఆ పోస్టులో పేర్కొన్నారు. దానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ కంపెనీని విశాఖకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పరార్

  హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పారిపోయాడు.. ఆంధ్ర పోలీసుల కస్టడీ నుంచి బత్తుల  ప్రభాకర్ తప్పించుకొని పోయాడు.. హైదరాబాద్ నుంచి పిటి వారింటిపై తీసుకెళ్లి విజయవాడ కోర్టులో హాజరు పరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళుతుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైన బత్తుల ప్రభాకర్  కోసం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు..  హైదరాబాదు నగ రంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రిజం పబ్ లో బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపి నానా హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  అయితే రాజ మహేంద్రవరం పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి పిటి వారంటి మీద ఈ బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసు కొని రాజమండ్రి కి తీసుకెళ్లారు అనంతరం నిన్న సోమవారం రాత్రి సమయంలో  విజయవాడ కోర్టులో బత్తుల ప్రభాకర్ను హాజరు పరిచి తిరిగి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్తుండగా... తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో ఉన్న  ఒక దాబాలో విందు కోసమని పోలీసులు వాహనాన్ని ఆపారు  అదే అదనుగా  భావిం చిన నిందితుడు  బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్ళు కప్పి అక్కడి నుండి పారిపో యాడని పోలీసులు తెలి పారు. ప్రభాకర్ ఒక చేతిలో సంకెళ్లు వేసి ఉన్నాయి .. తెల్లటి టీ షర్టు మరియు నల్ల ట్రాక్  ధరించి ఉన్నాడని పోలీ సులు తెలి పారు. ఈ కరుడు గట్టిన నేరస్థుడు తప్పించు కొని పారిపోవడం వల్ల ప్రజలు అప్రమ త్తం గా ఉండాలని రాజమహేంద్రవరం పోలీసులు కోరారు.  ఎవరికైనా బత్తుల ప్రభాకర్ కనిపించి నచో 94407 96584 లేదా 9440 796624 కు ఈ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బత్తుల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి.  హైటెక్ దొంగగా పేరుగాంచిన బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండా లంటూ పోలీసులు సూచించారు..  

శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ బీజేపీ ఎంపీ

  తిరుమల శ్రీవారికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువున్న అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అనే స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తాము ఈ విరాళాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ యాగశాలలో అంకురార్పణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడుతుంది. అంకురార్పణలో నవధాన్యాలను మొలకెత్తించి భూమి పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు ఉంటుంది. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించే ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు.నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా మేదినిపూజ నిర్వహించి భూదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తూ ప్రత్యేక వేదకార్యక్రమాలు చేస్తారు.

విజయవాడ ఉత్సవ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

శరన్నవరాత్రులను పురస్కరించుకుని బెజవాడలో దసరా ఉత్సవ్ నిర్వమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మైసూరు ఉత్సవాలను తలదన్నేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలలని తలపెట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసింది. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాలలో ఒకటి దుర్గగుడికి చెందినదని పేర్కొంటూ ఆలయ భూమిలో వ్యాపార  కార్యక్రమాల నిర్వహణ ఏమిటంటూ వైసీపీ సీనియర్వి నేత పేర్నినాని విమర్శలు గుప్పించారు. ఆయన విమర్శలను ఆధారం చేసుకుని కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు  సింగిల్ బెంచ్ ఆలయభూమిలో వ్యాపార కార్యక్రమాలను వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించి విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉత్సవాల నిర్వహణను నిలిపివేయాలంటూ కొన్ని సంఘాల దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో విజయవాడ ఉత్సవ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. 

ఆర్జీవీ ‘మెగా’ భజన.. మేటర్ ఏంటి?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవిలపై పొగడ్తల వర్షం కురిపించేవారు. రాజును సైతం మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా ఆ మెగా బ్రదర్స్ సైతం టూమచ్ అనుకునే లెవెల్లో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు ఉండేవి. అయితే ఎప్పుడైతే ఆయన వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లారో.. అప్పటి నుంచీ ఆయన అదే మెగా బ్రదర్స్ పై అనుచిత రీతిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఆయన ట్వీట్ లు, సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. జగన్ కోసం ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా పాత్రను సృష్టించారు.  అయితే ఆ విమర్శలట్వీట్లు అటు వైసీపీ ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.. స్వయంగా ఆర్జీవీ కూడా భ్రష్టుపట్టిపోయారు. ఆయన క్రెడిబులిటీ పూర్తిగా పోయింది.  సరే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థితికి దిగజారిపోయింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా హద్దుల్లేకుండా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఆర్జీవీని కేసులు చుట్టుముట్టాయి. దీంతో ఆయనకు తత్వం బోధపడి రాజకీయాల జోలికి పోను అంటూ చెంపలేసుకున్నారు. చెంపలైతే వేసుకున్నారు కానీ, అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రజలలో కోల్పోయిన క్రెడిబులిటీని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయారు.  ఇప్పుడు ఇక ఆ క్రెడిబులిటీ కోసం గతంలో విమర్శలు గుప్పించిన వారినే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడానికి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా వర్మ మెగా బ్రదర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.   అదే సమయంలో నెటిజన్లు ఆర్జీవీని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి తావిచ్చింది.  ఇంతకీ  ఆర్జీవీ చేసిన ట్వీట్  ఏమిటంటే..   మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే.. అది ఈ శతాబ్దానికే మెగా పవర్ ఫిల్మ్ అవుతుంది అన్నది.   కొన్నేళ్ల కిందట పవన్ కు వ్యతిరేకంగా అనుచిత ట్వీట్లు చేసిన ఆర్జీవీ ఇప్పుడు పవర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారంటే కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని రంగులు మార్చినా.. ఆర్జీవీని నమ్మేవారెవరూ ఉండరంటూ పోస్టులు పెడుతున్నారు.

మేడారంలో తులభారం సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

    సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.  అనంతరం ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించనున్నారు ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని సీఎం అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఆయన సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోరాటం, పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే అమ్మవార్లను దర్శించుకుంటున్నానని, 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే తన పాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, సంప్రదాయంలో ఏ మార్పు రాకుండా ప్రజల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామన్నారు. భక్తి డబ్బులతో కొలవలేనిదని, నమ్మకమే నిజమైన కొలమానం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా సూచించారు. ప్రకృతి ఒడిలో నిలిచిన ఈ ఆలయం ప్రత్యేకమని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జన్మ చరితార్థమని, ఇది ఒక వరమని అన్నారు. ఆదాయం కోసం కాదు, భక్తితో సేవ చేయాలని అధికారులకు సూచించారు. జంపన్న వాగులో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.