బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు

  రంగారెడ్డి జిల్లా మాదన్నపేట్ పరిధిలో నిన్న ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం దాడి చేసిన ఘటన మరువక ముందే మరొ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న తప్పిదంతో పెద్దగా రాద్ధాంతం చేస్తూ కానిస్టేబుల్ కుటుంబం నడిరోడ్డు మీద రచ్చ రచ్చ సృష్టించారు.. దీంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉదృత వాతావరణం నెలకొంది... హైదరాబాద్ నుండి నల్గొండ కి వస్తున్న ఆర్టీసీ బస్ క్లాక్ టవర్ సెంటర్ వద్ద TS05FM0405 గల కారును అను కోకుండా తగిలింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న విజిలెన్స్ కానిస్టే బుల్ భార్య మరియు సుపు త్రుడు ఈ విష యాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తూ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. బస్సు డ్రైవర్ ను చితకబాదుతున్న సమయంలో అక్కడే ఉన్న భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ వృత్తిపరం గా ఆ దృశ్యం మొత్తం వీడియో తీశాడు.. అది గమనించిన కానిస్టేబుల్ భార్య మరియు సుపు త్రుడు ఒక్కసారిగా రెచ్చిపోతూ భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ పై అసభ్యకరంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు.  మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం.... పెద్దపెద్ద పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు.... మమ్ము లను ఏమీ చేయలేరు... నీ దిక్కున్న చోట చెప్పుకో.... అంటూ జర్నలిస్ట్ ని దుర్భా షలాడారు...  అది గమనించిన భవాని భక్తులకు ఆగ్రహం వచ్చింది. వెంటనే భవాని స్వాములు అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కుటుంబం పై ఫిర్యాదు చేశారు.  భవాని మాల వేసుకున్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని అట్టి విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబం పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ భవాని స్వాములు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు దీంతో టూ టౌన్ ఎస్ఐ సైదులు ఇరుపక్షాల నుండి ఫిర్యాదులు స్వీకరించి.... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

అంగరంగ వైభవంగా.. కన్నుల పండువగా రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోరోజైన బుధవారం (అక్టోబర్ 1) ఉదయం శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సాహంగా రథాన్ని లాగారు.  ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.  తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.   ఈ కార్యక్రమంలో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాల్

  పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాలు విసిరింది. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపా యల నష్టాన్ని కలిగించిన ఐబొమ్మ యాజ మాన్యం పోలీసులను బెదిరిస్తూ ప్రకటనలు గుప్పిస్తుంది.. సినిమా ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ కోసం పనిచేస్తున్న నిర్వాహకులను పట్టుకుని ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తా ఉంటూ పోలీసులు ప్రకటించారు.  గత వారంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఐ బొమ్మ చేసిన ప్రకటన చేరింది.. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఐబొమ్మకు సంబంధించిన నలుగురు నిర్వాహకులను పట్టుకున్నారు.. ఇందులో ప్రధాన సూతదారుడు విదేశాల్లో ఉన్నాడు.. సర్వర్స్ కూడా విదేశాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహ కులను ఎలాగైనా పట్టుకొని తీరుతా మంటూ పోలీసులు ప్రకటించారు..  సినిమా, ఓటిటి పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల ధియేటర్ లో రికార్డ్ చేసే వారితో పాటు... సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే పోలీసులుదర్యాప్తు చేస్తున్న క్రమంలో ఐబొమ్మ వెబ్‌ సైట్ పై దృష్టి సారించారు.. ఐ బొమ్మ...ఇప్పుడు తాజాగా ఐపిలు మార్చి పోలీసులను ఏమారుస్తున్నారు. ఐబొమ్మ సర్వర్, నేరగాళ్లను పట్టు కునే సమ యంలో తమను చేతనైతే పట్టుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఐబోమ్మ సవాల్ విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాల్ ను సైబర్ క్రైమ్ పోలీ సులు చాలెంజ్ గా తీసుకుని ఐబొమ్మ సైట్ కోసం పని చేస్తున్న 4గురిని అదుపులోకి తీసు కున్నారు.బీహార్, యూపిలో ప్రధాన ఏజెంట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తిం చారు.ఐ బొమ్మ దేశ వ్యాప్తంగా ఏజెంట్ల ను నియమిం చుకొని పెద్ద ఎత్తున పైరసీలకు పాల్ప డుతున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌,ఓటిటి కంటెంట్ తస్కరిస్తూ నిర్వహకులకు తల నొప్పిగా మారింది... ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ మరోసారి సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనే ప్రయ త్నాలు చేస్తే ఘోర పరిణామాలు తప్ప వని పోలీ సులు, మీడియా, ఓటీటీ సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీని హెచ్చరించింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతూ వైరల్ అవుతుంది.. అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఐ బొమ్మ వెబ్సైట్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. ఐ బొమ్మ విడుదల చేసిన ప్రకటనలో“మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతాం.మా టెలిగ్రామ్‌ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తామంటూ హెచ్చరించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉందని అది కనుక విడుదల చేసై మీడియా, ఓటీటీ , హీరోలకూ షాకింగ్ రివీల్ అవుతుంది.ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము కూడా అక్కడే ఫోకస్ చేస్తాం.ఇండియా మొత్తం మా సపోర్ట్ గా ఉంది.మా సర్వర్లు ఎక్కడు న్నాయో పోలీసు లకు కనబడరు ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్‌లో ఉంది.మా మీద నిఘా పెట్టితే ....ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటపడతాయి.మమ్మల్ని ఆప లేరు… మమ్మల్ని వెతకాలేరు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. పోలీసుల చర్యలతో బిగ్‌ స్టార్‌ల ఇమేజ్‌ ప్రమాదంలో పడుతుంది. మేము ఒక్క దేశానికి పరిమితం కాదు, గ్లోబల్‌ నెట్‌వర్క్‌” అని క్లారిటీ ఇచ్చింది. తద్వారా, ఇండస్ట్రీలో పెద్ద షాక్ రాబోతుం దంటూ ఐబొమ్మ సవాలు విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాళ్లను చాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ సెట్ కోసం పనిచేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అనంతరం  గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సినిమా పైరసీ పై సినీ ప్రముఖులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు... ఈ సమావేశంలో ప్రముఖ హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. థియేటర్లో రహస్య చిత్రీకరణ డిజిటల్ హ్యాకింగ్ నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నారు... సినిమా ఒరిజినల్ కంటెంట్ ను కాపీ చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు... వెబ్సైట్లో రెగ్యులర్ ఆడిట్లు, యాక్సిస్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  దసరా సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం అనంతరం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం ప్రకటన చేసే అవకాశం ఉంది.   మొత్తం డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి చేరుకుంటుంది. ఈ ఏడాది డీఏ పెంపు ఇది రెండోసారి కావడం విశేషం.  ఇప్పటికే మార్చిలో 2 శాతం పెంచిన ప్రభుత్వం, తాజా పెంపును జూలై 1 నుంచి అమలు చేయనుంది. దీంతో మూడు నెలల బకాయిలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. సాధారణంగా వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏను సవరిస్తుంది. ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించేందుకు ఇచ్చే ఈ భత్యం తాజా పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించనుంది. ఉదాహరణకు, రూ.60,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం డీఏగా రూ.33,000 వస్తే, ఇప్పుడు అది రూ.34,800కి పెరుగుతుంది. ఇకపై వేతన సవరణ కోసం ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో జీతాలు, అలవెన్సులపై స్పష్టత రానుంది. 2026 జనవరి 1 నుంచి ఈ సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత, ప్రస్తుత డీఏ బేసిక్ పేలో విలీనం చేయబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మెత్సవాలలో 23.50 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ

తిరుమల  ఆకలి అన్న పదమే వినపడని పుణ్యక్షేత్రం. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన అన్న ప్రసాదాన్ని అందుబాటులో ఉంటుతోంది.  ఇప్పుడు ఆ ఆన్న ప్రసాద కార్యక్రమాన్ని మరింత విస్తరించింది.   తిరుమలలో ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకూ దాదాపు 23 లక్షల50 వేల మందికి ఎటువంటి కొరతా లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసింది.  గత ఏడాది బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసింది. టీటీడీ.  యాత్రికుల రద్దీని అంచనా వేసి, 16 రకాల పదార్థాలతో నాణ్యమైన అన్నప్రసాదాలు పంపిణీ  చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1లోని 20,  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, పీఏసీ - 2, పీఏసీ 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకూ బయటి క్యూలైన్ల వరకు నిత్యం అన్నప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మెవ్సాల్లో కూడా ఈ నెల 24వ తేదీ నుంచి మంగళవారం వరకు 23,48,337 మంది యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసిన తిరమల తిరుపతి దేవస్థానం కొత్త రికార్డు సృష్టించింది. అన్నప్రసాదాల పంపిణీపై 99 శాతం మంది యాత్రికుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. సాధారణంగా కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనంతో పాటు మలయప్ప స్వామి వారి వాహన సేవలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఈ సారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.  గ్యాలరీల్లో యాత్రికులకు సేవలు అందించడానికి టీటీడీ సిబ్బందితో పాటు 3,500 మంది శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు వినియోగించుకుంది.  దాత‌లు అందించిన 23 ర‌కాల కూర‌ గాయ‌ల‌తో ఆహార పదార్థాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. "బ్రహ్మత్సవాల్లో ఈ 24వ తేదీ నుంచి 29వ తేది వ‌ర‌కు 23,48,337 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందించినట్లు టీటీడీ తెలిపింది. 11,32,160 మంది భ‌క్తుల‌కు పాలు, మజ్జిగ, మంచినీటి బాటిళ్లు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రహ్మెత్సవాలలో అత్యంత రద్దీగా ఉండే గరుడ వాహన సేవ రోజున తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అందుకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంది. రెండు లక్షల మందంికి సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసింది.  విశేష‌మైన గ‌రుడ వాహ‌న సేవ  రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాల‌రీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద  9,28,000 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేసింది.  

విహారం.. వినోదం.. విషాదం

విహారయాత్ర మహా విషాదంగా మారింది. వెకేషన్ వచ్చిందంటే చాలు యువత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి విహారయాత్రలకు వెళ్లడం అన్నది సహజం అయితే కొన్ని సార్లు ఆ విహార యాత్రలు విషాదంగా ముగియడం కద్దు. గతంలో కూడా పలుమార్లు విహార యాత్రలు విషాదాంతమైన ఘటనలు ఉన్నాయి. అటువంటిదే తాజాగా నల్లొండ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన చాణక్య అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి సాగర్ ఆంజనేయ స్వామి పుష్కర్ ఘాట్ కు వెళ్లాడు. దైవ దర్శనం తరువాత స్నేహితులంతా కలిసి పుష్కర్ ఘాట్ వద్ద ఫొటోలు తీసుకుంటుండగా చాణక్య ప్రమాద వశాత్తూ నదిలో పడిపోయాడు. అతడి రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాణక్య ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.  దీంతో స్నేహితులు  పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం బృందం ఘటన స్థలానికి చేరుకొని చాణక్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది. బుధవారం (అక్టోబర్ 1) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని మొత్తం 73 వేల275 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 973 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది. 

క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచిన క్రికెటర్   తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (సెప్టెంబర్ 30) భేటీ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించి సత్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ ను సీఎంకు బహూకరించాడు.    ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లు తిలక్ వర్మను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.  మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడనీ, ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమనీ చంద్రబాబు ట్వీట్ చేశారు.  

రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఎర్రచందనం స్మగ్లింగ్ కు పుష్ప సినిమాలో చూపిన టెక్నిక్ లన్నీ దిగదుడుపే అన్న విధంగా గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు.  పోలీసులకు చుక్కలు చూపి స్తున్నారు.   పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం  తగ్గేదే అంటూ..  స్మగ్లర్ల దూకుడికి కళ్లెం వేసి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా   ఓ నిందితుడు 6 కోట్ల పైచిలుకు విలువ గల గంజాయిని స్మగుల్ చేయడానికి ఉపయోగించిన విధానం పోలీసులనే విస్మయపరిచింది.  వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్  జిల్లా  హానియా గ్రామానికి చెందిన విక్రమ్ విష్ణోయ్  అలియాస్ వికాస్ (22) అనే యువ కుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.   ఇతనికి దేవీలాల్ అలియాస్ కటు, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ అనే గంజాయి స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విక్రమ్ గురించి తెలుసుకున్న ఈ ముగ్గురూ గంజాయి స్మగ్లింగ్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేయడానికి ప్రతి సరుకుకు ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని విక్రమ్ కు హామీ ఇచ్చారు. అందుకు  ఒప్పుకొన్న విక్రమ్ వారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ రాజస్థాన్   జైపూర్ నుండి మహారాష్ట్ర   లోని నాందేడ్ కు ఇనుపలోడును రవాణా చేసి అక్కడ దించివేసి...తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్లి సిమెంట్ సంచులను కొనుగోలు చేశాడు. వాటిని లారీలో ఎక్కించుకొని ఒడిస్సాలోని మల్కాన్గిరి కి వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి సుమారు 1210 కిలోల గంజాయిని కొనుగోలు చేసుకుని వాటిని సిమెంట్ సంచుల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో దాచిపెట్టి.. పైనుండి టార్పాలిన్ తో లోడును కప్పాడు. అనంతరం హైదరా బాదు నుండి రాజ స్థాన్ వైపు ప్రయా ణం సాగించాడు. అయితే..  మహే శ్వరం ఎస్ఓటి బృందానికి విశ్వ సనీయమైన సమా చారం రావడంతోమంగళవారం (సెప్టెంబర్ 30) అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిమెంట్ లోడుతో వస్తున్న లారీలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తనిఖీలు చేసినా కూడా సిమెంటు సంచులు తప్ప మరేమీ కనిపించలేదు. అయితే పోలీసులు అనుమానంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో.. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలను గుర్తించారు. వాటిలోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.   ఆరు కోట్ల పాతిక లక్షల రూపాయలు విలువ చేసే  1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. నిందితు డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం.. తొమ్మిది మంది మ‌‌ృతి

తమిళనాడులోఘోర విషాదం సంభవించింది. చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో మంగళవారం (సెప్టెంబర్ 30)పై కప్పు కుప్పకూలి తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తలరించారు.  ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.  మృతులంతా ఉత్తరాదికి చెందిన కార్మికులే.   ప్రస్తుతం క్షతగాత్రులకు చెన్నైలోని రాయపురం స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.   ఎన్నూర్ పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ వ్యయంతో మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. 

సినిమాల‌పైనా ట్రంప‌పు కోత‌!

ఇక‌పై మీరు అమెరికాలో కూర్చుని ఓజీ త‌ర‌హా అచ్చ తెలుగు సినిమా చూడాలంటే.. చాలా చాలా క‌ష్టం. ఆ టికెట్ రేట్లు కూడా మీ వాలెట్ కి చిల్లు పెట్ట‌డం ఖాయం. ఎందుకంటే మ‌న ట్రంప్ మామ‌.. ఇక్కడా త‌న ప్రతాపం చూపించేశారు. వంద శాతం సుంకాల‌తో విరుచుకుప‌డ్డారు. బాహుబ‌లి ముంద‌రి వ‌ర‌కూ టాలీవుడ్ సినిమాల ప‌రిస్థితి ఏంటంటే.. హాలీవుడ్ సినిమాల ముందు మ‌న సినిమాలు తేలిపోయేవి. దీంతో బడ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు.. క్వాలిటీ త‌గ్గ‌కుండా పీరియాడిక్స్ ని వ‌ద‌ల‌కుండా వ‌రుస వెంబ‌డి సినిమాలు చేస్తూ వ‌స్తోంది తెలుగు చిత్ర‌సీమ‌.  స‌రిగ్గా ఇదే విష‌యాన్ని చిరంజీవి నాటి సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన‌పుడు అన్నారు కూడా. ఎందుకంటే మ‌న ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ను వెతుక్కుంటూ రావాలంటే ఆ మాత్రం పెట్టుబ‌డి పెట్ట‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. దీంతో మ‌న సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇర‌గ‌దీయ‌డం మొద‌లు పెట్టాయి. మ‌న బాహుబ‌లి, దేవ‌ర వంటి సినిమాలు చైనా, జ‌పాన్ లో కూడా ఆడ్డం మాత్ర‌మే కాదు.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డం మొద‌లు పెట్టాయి. దీంతో లోబడ్జెట్- హై ఎండ్ ఎంట‌ర్ టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి మ‌న చిత్రాలు. ఇక మేన‌రిజమ్స్ సంగ‌తి స‌రే స‌రి. త‌గ్గేదే ల్యే.. అనేది ఇప్పుడు హాలీవుడ్ లెవ‌ల్ ట్రెండింగ్. ఆ మాట‌కొస్తే మ‌న పుష్ప పుష్ప పుష్ప సాంగ్ కి టైం స్క్వైర్ సెంట‌ర్లోనూ విదేశీయులు డ్యాన్సులు  ఆడారంటే ప‌రిస్థితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇప్ప‌టికే మ‌న ఇస్రో హాలీవుడ్ చిత్ర సీమ‌ను వెక్కిరిస్తోంది. కార‌ణం.. హాలీవుడ్ చిత్రాల బ‌డ్జెట్ లోప‌లే మ‌నం రాకెట్లు నింగిలోకి వ‌దిలేస్తున్నాం. దీంతో ఇదొక క‌డుపు మంట‌. ఆపై మ‌న అరిటాకు భోజ‌నాలు, క‌ట్టు బొట్టు తీరు తెన్నుకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. మొన్న‌టి కుంభ‌మేళాకు ఎంద‌రో విదేశీ ప్ర‌ముఖులు రావ‌డం మాత్ర‌మే కాకుండా.. వారంతా ఇక్క‌డి దేవ‌త‌ల నామ‌స్మ‌ర‌ణ చేసి కాషాయం క‌ట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు మ‌న మంత్ర తంత్రాలు, ఆయుర్వేదం, శిల్ప‌క‌ళా చాతుర్యం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఒక మానియా క్రియేట్ చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ మ‌న వాళ్లు విదేశీ అల‌వాట్ల‌తో ఎక్క‌డ చెడిపోతారో అన్న భ‌యం నుంచి ప‌శ్చిమ నాగ‌రిక‌త క్ర‌మంగా అంత‌రించి పోయి.. ప్ర‌పంచ‌మంతా భార‌తీయ‌త ప‌రుచుకుపోతుందా అన్న దృశ్యం క‌నిపిస్తోంది. అంత‌గా మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాలు ప్ర‌పంచ వ్యాప్త‌మై పోతున్నాయి. వీట‌న్నిటీకీ వాహ‌కంగా మారుతోంది మ‌న భార‌తీయ సినిమా. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను మోసుకెళ్ల‌డంలో ఇవి ముందుంటున్నాయి. దానికి తోడు ఏ హాలీవుడ్ సినిమాలో ఉండ‌ని న‌వ‌ర‌సాలు మ‌న సినిమాల్లో క‌నిపిస్తాయ్. దీంతో హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్టైన్మెంట్ ప‌క్కా. అలాంటి సినిమాల‌కు భాషా బేధం లేకుండా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో క‌న్ను కుట్టిన ట్రంపాసురుడు వీటిపై కూడా త‌న టారీఫుల‌తో విరుచుకుప‌డుతున్నాడు. త‌మ హాలీవుడ్ సినిమాల నాణ్య‌తా ప్ర‌మాణాలు కూడా మ‌న భార‌తీయ సినీ నైపుణ్యం ముందు ఎక్క‌డ కొట్టుకుపోతాయో అన్న భ‌యం కొద్దీ ట్రంప్ ఈ దిశ‌గా వంద శాతం సుంకాల మోత మోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ ట్రంప్ ఇంకా ఎన్నేసి చిత్రాలు న‌మోదు చేస్తారో చూడాల్సి ఉంది. గ‌తంలో కొందరు పాల‌కులు జుట్టు ప‌న్ను వంటివి కూడా వేసేవారు. అలా ట్రంప్ త‌మ దేశంలో గాలి పీల్చే వారిపైనా ప‌న్ను విధించినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు. ఇప్ప‌టికే త‌మ త‌మ ఇంటికి డ‌బ్బు పంపే వారిపైనా క‌న్నేసి బిగ్ బిల్  తీసుకొచ్చిన ట్రంప్ ఇంకెన్ని అరాచ‌కాలు సృష్టిస్తాడో అన్న ఆందోళ‌న మొద‌లైంది.. ఎన్నారై వ‌ర్గాల్లో.

లండన్ లో గాంధీ విగ్రహానికి అపచారం

భారత జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి లండన్ లో అపచారం జరిగింది. లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియనివ్యక్తులు ధ్వంసం చేసేశారు.   జాతిపిత కాంస్య విగ్రహం పునాదిని పగలగొట్టారు.  అక్కడితో ఆగకుండా విగ్రహం దిమ్మపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. సరిగ్గా మరో రెండు రోజులలో జాతి పిత జయంతి ఉండగా, గాంధీ జయంతిని ప్రపంచమంతా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోనున్న తరుణంగా గాంధీ విగ్రహం ధ్వంసం సంఘటన సంచలనం సృష్టించింది. ఇది కేవలం గాంధీ విగ్రహంపై దాడి మాత్రమే కాదనీ, ఆయన అహింసా సిద్ధాంతంపై దాడనీ అంటున్నారు. కాగా లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై భారత్ హైకమిషన్ స్పందించింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇలా ఉండగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

కుక్కపిల్లకు కోతి తల్లి.. తల్లడిల్లుతున్న తల్లి కుక్క

అప్పుడే పుట్టిన ఓ కుక్కపిల్లకు తానే తల్లి అనుకుంటోంది ఓ వానరం. శునకం పిల్లపై ఆ వానరం కనబరుస్తున్న ప్రేమ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. అదే సమయంలో తన పిల్ల కోసం ఆ కుక్క పిల్ల తల్లి తల్లడిల్లుతున్న తీరు అయ్యో పాపం అనీ అనిపిస్తోంది. ఇంతకూ విషయమేంటంటే  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో  అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఒక వానరం ఎత్తుకెళ్ళింది. ఆ కుక్కపిల్లను హత్తుకుని ముద్దులు పెడుతూ గ్రామం అంతా తిరుగుతోంది.   కుక్కపిల్ల కోసం తల్లికుక్క తల్లడిల్లిపోతోంది. కోతి చెట్లు, ఇళ్ల కప్పులపై కుక్కపిల్లను హత్తుకుని తిరుగుతుంటే.. తల్లి కుక్క ఆ వానరం వెంటే కింద నేలపై అరుస్తూ పరుగులు పెడుతోంది.   స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా   కుక్క పిల్లను మాత్రం ఆ కోతి వదలడంలేదు. మామూలుగా పిల్లి, కుక్క స్నేహం, మేకపిల్లకు పాలిస్తున్న కుక్క లాంటి వాటిని చూసి ఉంటాం. అయితే ఇలా తన జాతి కాని జంతువు పిల్లను తన పిల్లేనన్న భ్రమలో వానరం ఆ కుక్కపిల్లపై చూపుతున్న అనురాగం, ఆప్యాయతా మాత్రం విస్తుగొలుపుతున్నాయి. అదే సమయంలో పిల్లను దూరం చేసుకున్న ఆ తల్లి కుక్క అల్లాడుతున్న తీరు కంటనీరు తెప్పిస్తోందని అంటున్నారు స్థానికులు. 

అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి.. సంకేతమేంటి?

కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా 500 మీటర్ల మేర వెనక్కు తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 29)న ఒక్కసారిగా సముద్రం వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కు తగ్గడం దేనికి సందేశం అన్న చర్చ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.    సముద్రం దాదాపు అరకిలోమిటరు మేర వెనక్కు వెళ్లడం పట్ల   మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తు ముందు సముద్రం ఇలా వెనక్కి వెడుతుందని అంటున్నారు.  సముద్రం గోదావరి కలిసే సంగమ స్థలంగా అంతర్వేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మహిమాన్విత దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. అలాగే అంతర్వేది తీరం, సంగమ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటువంటి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లి మట్టి మేటలు వేసింది. సాధారణంగా సముద్రం వెనక్కు వెళ్లినప్పుడు ఇసుక మేటలు ఏర్పడతాయనీ, అయితే అసాధారణంగా మట్టిమేటలు ఏర్పడటం భయంగొల్పుతోందనీ స్థానికులు చెబుతున్నారు.  ఆటు సమయంలో సముద్రం వెనక్కు వెళ్లడం సర్వసాధారణమే అయినా ఇంతగా అంటే అరకిలోమీటరకు పైగా వెనక్కు వెళ్లడం అన్నది ఇదే తొలిసారని అంటున్నారు.    కాగా అంతర్వేది వద్ద సముద్రం వెనక్కు వెళ్లడంపై స్పందించిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  టెక్నాలజీ అప్లికేషన్ ఫర్ వెదర్ మానిటరింగ్)  జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  బృందాలు ఇక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నాయి.  

బద్రి నారాయణుడి అలంకారంలో మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం (సెప్టెంబర్ 30)  ఉదయం స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా, కన్నులపండువగా సాగింది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.  సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.  అలాగే బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం (అక్టోబర్ 1)న శ్రీవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.  

మహాగౌరి అలంకరణలో శ్రీశైలం భ్రమరాంబికాదేవి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి , బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. పూజల అనంతరం వర్షం కారణంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయ పురవీధుల్లో జరగవలసిన గ్రామోత్సవం నిలుపదల చేశారు. ఆలయ ప్రాకారం లోనే స్వామి అమ్మవార్ల ఉత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం రద్దు కావడంతో ఆలయంలోనే ఉత్సవాల సందర్భంగా కేరళ చండీమేళం, కేరళ సంప్రదాయ డ్రమ్స్,కొమ్ము కోయ నృత్యం,థయ్యం సంప్రదాయ నృత్యం, విళక్కు సంప్రదాయ నృత్యం,స్వాగత నృత్యం, సంప్రదాయ నాట్యల భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూజా కార్యక్రమాలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు,ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కొత్త ఎయిర్ పోర్టులు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన కనెక్టివిటీ విస్తరణ శరవేగంగా సాగుతోంది, రాష్ట్రానికి ఎనిమిది కొత్త విమానాశ్రాయాలు రానున్నాయి.  ఇవి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో గ్రామీణ ప్రాంతాలను అనుసం ధానిస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ, వాణిజ్య సదుపాయం గణనీయంగా మెరుగుపడుతుంది. రాష్ట్రంలో కొత్తగా  శ్రీకాకుళం, తుని, తాడేపల్లిగూడెం, అమరావతి, ఒంగోలు, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్‌లలో  విమానాశ్రయాలు రానున్నాయి.  మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లోకల్   ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపడమెరుగుపరచడం లక్ష్యంగా కొత్త విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమండ్రి, వైజాగ్‌లలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి.  మరో ఎనిమిది విమానాశ్రాయాలు త్వరలో రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల సంఖ్య 14కు పెరుగుతుంది. ఇక వీటికి తోడు.. విమానయాన రంగంలో వివిధ శాఖల నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలోజీఎంఆర్ ఏవియేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇది విమానయానరంగానికి అవసమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ నిర్వహిస్తాయి.  రాష్టరంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టులలో విజయవాడ , విశాఖపట్నం తిరుపతిలు అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా మిగిలినవి లోకల్ ఎయిర్ కనెక్టివిటీకి దోహదం చేస్తున్నాయి.   

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి  చంద్రప్రభ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గత ఆరు రోజుల్లో  గరుడ వాహనంతోపాటు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి ఆరో రోజైన సోమవారం రాత్రి గజవాహనంపై  మాడ వీధుల్లో ఊరేగారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. 

వరద గుప్పిట్లోనే తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలూ వదలడం లేదు. వరదా విడవడం లేదు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని అనుకునే లోగానే.. ఉత్తరాంధ్ర పరిసరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఉండగా, కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  సోమవారం సాయంత్రానికి  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.61,960 క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక గోదావరికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 45,70 అడుగులు ఉండగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 9 లక్షల 71 వేల 784 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇక్కడ కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.బుధవారం నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 12 నుంచి 12,5 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో    సహాయక చర్యల కోసంఎన్డీఆర్ఎఫ్,  ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.