‘అనంత’కు స్వచ్ఛ జిల్లా పురస్కారం

ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన పట్టణాలు, జిల్లాలకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను సోమవారం (అక్టోబర్ 2) విజయవాడలో ప్రదానం చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారా ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక స్వచ్ఛ జిల్లా అవార్డును అనంతపురం దక్కించుకుంది.   ఈ అవార్డుల వివరాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్  అనీల్‌కుమార్‌రెడ్డి శనివారం( అక్టోబర్ 4)  ప్రకటించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా ఇచ్చే ఈ అవార్డులలో  మూడు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో  మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తాడిపత్రి, బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,326 మంది ఈ పురస్కారాలకు ఎంపిక చేయగా, వారిలో  రాష్ట్రస్థాయిలో 69 మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది ఉన్నారు. 

నిరాడంబరంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ నిశ్చితార్థం

టాలీవుడ్ లో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంత కాలంగా విజయ్ దేవర కొండ, రష్మిలకు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురి ప్రేమాయణం నిజమేనని తేలిపోయింది. ఇరువురి వివాహ నిశ్చితార్థం శనివారం (అక్టోబర్ 4) ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో జరిగింది. గోప్యంగా జరిగిన ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.  ఇరువురూ కలిసి తొలి సారిగా గీత గోవిందం అనే సినిమాలో నటించారు. ఆ సినీమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినీమా షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్యా ప్రేమ చిగురించిందని చెబుతారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ అనే సినీమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. అప్పటి నుంచీ వీరి బంధం మరింత బలపడిందని సీనీ వర్గాల టాక్. కలిసి విహార యాత్రలకు వెళ్లడం నుంచి పలు సందర్భాలలో వీరిరువురి ప్రేమగురించిన వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు.   ఇప్పుడు వివాహ నిశ్చితార్థంతో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటారని చెప్పాలి. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు.  వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని అంటున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన తిరుమలలో ఇప్పుడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శనివారం (అక్టోబర్ 4) భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తారు. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 73 వేల 581 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 976 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షలు వచ్చింది.  

మాదన్నపేట బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

  నేటి సమాజంలో రోజురోజుకీ  మాన వత్వం ,మంచితనం నశించిపోతున్నాయి... డబ్బుకున్న విలువ బంధాలకు, అనుబంధాలకు లేకుండా పోయింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని సైతం చంపేందుకు సిద్ధపడుతున్నారు. మాదన్నపేటలో బాలిక హత్య కేసు వెనుక కూడా ఆస్తి తగాదాలే కారణ మని పోలీసులు తేల్చారు. కంచన్బాగ్ లో నివాసం ఉంటు న్న మహమ్మద్ అజీమ్, షబానా బేగం కూతురు హుమేయని సుమ్మయ్య (07).... ఈ బాలిక తన తల్లితో కలిసి మాదన్నపేట చావనిలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది... అయితే గత రెండు రోజుల నుండి పాప కనిపిం చకపోవడంతో కంగారు పడిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా తల్లి షబానా బేగానికి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో  బాలిక మృత దేహం కనిపించింది.  దీంతో తల్లి షబానా బేగం వెంటనే పోలీ సులకు సమాచా రాన్ని అందించింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పాప చేతులు కాళ్లు కట్టేసి ఉండడంతో ఇంటి సభ్యులే హత్య చేసి ఉంటా రని అనుమానిం చారు. అదే కోణం లో దర్యాప్తు కొనసా గించగా....నిందితుల రంగు బయట పడింది... తల్లి షబానా బేగం కు మరియు ఆమె సోదరుడికి మధ్య గత కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విష యంలో తగాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో షబానా బేగం తన కూతురు సుమ్మయ్య ను తీసుకొని తల్లిగారిం టికి వచ్చింది. .. ఒక వైపు ఆస్తి పంపకాల తగాదా... మరోవైపు బాలిక ఇంట్లో బాగా అల్లరి చేస్తుంది. దీంతో విసుగు చెందిన మేనమామ, అత్త ఇద్దరు కలిసి పాప కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడ కుండా చేశారు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాలుతున్న పాపను తీసుకువెళ్లి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేశారు. పాపను హత్య చేసి తమ కేమీ తెలియనట్టు నటించారు.. పాప అల్లరి తో పాటు ఆస్తి పంపకాల విష యంలో తేడాలున్న నేపథ్యంలోనే మేనమామ, అత్త కలిసి హత్య చేసిన ట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  

తిరుమలలో కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

  వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.  పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.  తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల  చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.  

కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం డంప్ సీజ్

  అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్, స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గం, మొలకలచెరువులో రూ. కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్ ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మధ్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకుని ఎక్సైజ్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం, తయారీకి వినియోగించే యంత్రాలు, ముడిసరుకు సీజ్ చేశారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా అక్రమ మద్యం  తయారీ రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుంది

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు...ఎన్ని కోట్లంటే?

  దసరా పండుగ అంటేనే మందు , విందు.... మందు లేనిదే ముక్క కూడా దిగదు.... దసరా సీజన్‌లో జరిగే మద్యం అమ్మకాలే ఇందుకు ప్రత్యేక సాక్ష్యంగా చెప్ప వచ్చు...ఎప్పటిలాగే మందుబాబులు ఈ ఏడాది కూడా దుమ్మురేపాయి... కొన్ని కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరట లభించిందని చెప్పవచ్చు... అసలు ఈ సంవత్సరం దసరా పండగ మరియు గాంధీ జయంతి రెండు ఒకే రోజు వచ్చాయి... దీంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగవని అనుకున్నారు. కానీ  మందుబాబులు ఎవ్వరు ఊహించని రీతిలో కొనుగోలు చేశారు. దీంతో మద్యం అమ్మకాలు అసాధారణ స్థాయిలో జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఈరోజు మద్యం దుకాణాలతోపాటు మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మందుబాబులు తెలివిగా ఆలోచించి ఒకటి రెండు రోజుల ముందే ఇంట్లో పెట్టుకోవడానికి వైన్ షాప్ ల వద్ద క్యూలు కట్టారు... ఈ విధంగా మందుబాబులు సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటో తేదీలలో పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపారు. దీంతో ఊహించని స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి... సెప్టెంబర్ 29వ తేదీన 278 కోట్లు అమ్మగా సెప్టెంబర్ 30వ తేదీన 33 కోట్లు విక్రయించారు.  అక్టోబర్ ఒకటో తేదీన 86.23 కోట్లు అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలపై 60 నుండి 80% ఇంకా పెరిగాయి... దసరా వారంలో మద్యం అమ్మకాలు దాదాపు 1000 కోట్లకు చేరినట్లుగా అంచనా... మూడు రోజుల్లోనే6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయినట్లు సమాచారం... 2024 సెప్టెంబర్ లో 28 38 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది 2025 సెప్టెంబర్ నెలలో 3048 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పైగా మద్యం సేల్స్ పెరిగినట్లుగా అధికారులు తెలిపారు..‌ డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ అందుబాటులో ఉంచడం వల్లే విక్రయాలు ఊహించని రీతిలో జరిగాయని స్పష్టం వ్యక్తం చేశారు.

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

  ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024-29  అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని రేపు ముఖ్యమంత్రి  లాంఛనంగా ప్రారంభించనున్నారు.  కారవాన్‌ పర్యాటకానికి, అమృత్‌ పథకం 2.0 పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.  అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది.  విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు,  కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.

పెదనాన్న వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

  ఒకవైపు తండ్రి మరణం....మరోవైపు పెదనాన్న వేధింపులు.... ఇంకోవైపు నానమ్మ తాతయ్య శాపనార్థాలు వీటన్నిటిని భరించలేక ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి పోచమ్మ గడ్డలో నివాసం ఉంటున్న అనురాధ అనే మహిళకు అంజలి, పింకీ (17) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోయాడు. అనురాధ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలని చదివిస్తుంది.  అయితే అనురాధ నివాసం ఉంటున్న ఇంటిని ఎలాగైనా సరే సొంతం చేసుకో వాలని బావ శీను అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అనురాధ మరియు ఆమె ఇద్దరు పిల్లలను బయటకు పంపాలని నిర్ణయించుకున్న బావ శీను ప్రతిరోజూ  వారితో గొడవపడి మానసికంగా వేధింపు లకు గురి చేయడం మొదలుపెట్టాడు. నిన్న రెండో తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో పెదనాన్న శీను వచ్చి నానా గొడవ చేసాడు.  తన తండ్రి చనిపోయిన తర్వాత అతనికి రావలసిన డబ్బుల కోసం మరియు ఇంటి కోసం సొంత పెదనాన్న వచ్చి ఇంటి ముందు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ అవమానపరిచాడు. దీంతో పింకీ(17) తీవ్ర మనస్థా పానికి గురై సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు నాన్న చనిపోవడం తో అమ్మ ఒక్కతే పని చేస్తూ మా ఇద్దరిని చదివి స్తుంది. ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురావడమే కాకుండా నా కాలేజ్ ఫీజు కూడా  కడు తుంది.  ఒక్కతే ఇవన్నీ పనులు చేస్తుంది...మరో వైపు పెదనాన్న ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చేస్తు న్నారని... పెదనాన్న డబ్బుల కోసం... తాము ఉంటున్న ఇంటి కోసం.... ఇలా మమ్మల్ని వేధింపు లకు గురి చేస్తు న్నాడని పెదనాన్న తో పాటు నానమ్మ, తాతయ్య కూడా ప్రతిరోజు మమ్మల్ని తిట్టిపోస్తున్నారని.. ఈ అవమానాన్ని భరించలేకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని తన చావుకు పెదనాన్నే కారణం అంటూ పింకీ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది... తన కూతురు మరణానికి కారణమైన శీలను కఠినంగా శిక్షించాలంటూ తల్లి అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలు పింకీ రాసిన సూసైడ్ నోట్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు...

వైభవంగా శ్రీరామమందిరం శంకుస్థాపన

  నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పాతపాళెంలో శ్రీరామమందిరం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు, గ్రామస్తులు, మత్స్యకారులు పెద్దఎత్తున హాజరై శోభాయమానంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతలు, వేద మంత్రాల నడుమ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ మంత్రి  సోమిరెడ్డి  మాట్లాడుతు, “శ్రీ రామచంద్రుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఆలయ నిర్మాణానికి నేను ఎల్లప్పుడూ సహకరిస్తాను” అని అన్నారు. మత్స్యకారులు ఎంతో ఆత్మీయంగా కలసి చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా వీలైనన్ని నిధులు మంజూరు చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఒంటరి ఏనుగు హల్చల్

  చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ముసలిమడుగు గ్రామం పరిసరాల్లో ఒక ఒంటరి ఏనుగు ప్రజలను హడలెత్తిస్తోంది. ఏనుగుల క్యాంపు దగ్గర ప్రహరీ గోడను తోసేసి లోపలికి దూసుకెళ్లిన ఆ ఏనుగు, అక్కడున్న కుంకి ఏనుగుల వాసన పట్టుకుని వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోకి చేరిన వెంటనే ఆ ఏనుగు గింకరించడంతో గ్రామస్థులంతా భయంతో పరుగులు తీశారు.  రైతుల పంట పొలాలే ప్రధాన బలైపోయాయి. వరి, చెరుకు, అరటితోటలు తొక్కి నాశనం చేస్తూ ఏనుగు రాత్రింబవళ్లు సంచరిస్తోంది. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని. కానీ ఒక్క రాత్రిలో ఏనుగు వచ్చి మొత్తం పంటలను నాశనం చేస్తోంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కాపలా కాస్తూ రాత్రంతా నిద్రలేకుండా గడుపుతున్నామని ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, రైతుల కష్టాలు బుగ్గిపాలు అవుతుందని వారు వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

అలయ్ బలయ్ ఐక్యతకు ప్రతీక : వెంకయ్యనాయుడు

  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి  ఆధ్వర్యంలో ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతు వేషభాషలు వేరయిన  వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని  వెంకయ్యనాయుడు అన్నారు.“ అలయ్‌ బలయ్‌ అసలైన ఉద్దేశం ఐక్యత, కలిసి ఉండడమే” అని అన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కృషిని ఆయన ప్రశంసించారు. కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేర్లతో ప్రజలను విభజించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని స్పష్టం చేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా భారతీయులమనే బంధంతో అందరం కలిసే ఉంటామన్నారు. అలయ్‌ బలయ్‌ వంటి వేడుకల ద్వారా ఐక్యతా సందేశం వ్యాప్తి చెందడం ఆనందకరమని పేర్కొంటూ, దత్తాత్రేయ, విజయలక్ష్మిలను వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో స్టేజ్‌తో ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

శంషాబాద్‌లో చిరుత సంచారం కలకలం

  శంషాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్న పెద్ద షాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. పొలం వద్ద పనిచేస్తున్న కొంత మంది రైతులకు చిరుత కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.  అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించిన రైతులు తీవ్ర భయాందో ళనకు గురవుతు న్నారు పొలం వద్ద పనిచేస్తున్న రైతులపై దాడి చేసే అవకాశం ఉందంటూ రైతులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పనిచేస్తున్నారు అటవీశాఖ అధికారులు వచ్చి ఆనవాళ్లు చూసి చిరుతను బంధించే ప్రయత్నం చేయా లని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు... సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు

దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

  జూబ్లీహిల్స్‌లో మాజీ మంత్రి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.  దామోదర్ రెడ్డి ప్రజాసేవలను కొనియాడారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని రేవంత్ తెలిపారు. మరోవైపు దామోదర్ రెడ్డి అంత్యక్రియలు రేపు తుంగతుర్తిలో నిర్వహించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి  తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేసి.. నాలుగుసార్లు గెలిచారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఆయన రాజకీయ పట్టుకు నిదర్శనం. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నుంచి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

తిరుపతిలో బాంబు బెదరింపులు.. అలర్టైన పోలీసులు

నగరంలోని పలు ప్రాంతాలలో బాంబులు పెట్టామంటూ వచ్చిన బెదరింపు ఈ మెయిల్స్ తో తిరపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బెదరింపుల వెనుక ఉగ్ర హస్తం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఐఎస్ఐ, ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి తిరుపతి నగరంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు  పేర్కొంటూ  రెండు ఈ మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.  తిరుపతిలో నాలుగు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకుపాల్పడతామన్నది ఆ బెదరింపు ఈమెయిల్స్ సారాంశం.  దీంతో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు.  తిరుపతిలోని  న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాలలోనూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేవారు.  అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కూడా సోదాలు  నిర్వహించారు.  

చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  గ్రామస్తులు ఆందోళనకు దిగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు వైసీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మద్దతు పలికారు. కాగా అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు, నిందితులను కఠానంగా శిక్షిస్తామన్నరు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.   దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాని కొందరు దుండగులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో విగ్రహం పాక్సికంగా దెబ్బతింది.   విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అండేడ్కర్ విగ్రహానికి అపచారం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ అయ్యారు. దోషులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  

ప్రముఖ రచయిత లల్లాదేవి మృతి

ప్రముఖ రచయత పరుచూరి నారాయణా చార్యులు నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. పరుచేరి నారాయణా చార్యలు లల్లాదేవి అనే కలం పేరుతో పలు రచనలు చేశారు. అలాగే కొన్ని సినిమాలకు కూడా రచయతగా పని చేశారు. 2004లో విడుదలైన శ్వేత నాగు అనే చిత్రానికి లల్లాదేవే కథ రాశారు. పాములపై పరిశోధనలు చేసిన మరీ రచనలు సాగించిన ఏకైక రచయత లల్లాదేవి.  తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు లల్లాదేవి సన్నిహితుడు.  లల్లాదేవి ఎన్టీఆర్  కార్యదర్శిగా కూడా  కొంత కాలం పని చేశారు. లల్లాదేవి ప  దాదాపు 250 పై చిలుకు నవలలు రాశారు.  కొన్ని వందల  కథలు, నాటికలు, నాటకాలు కూడా రాశారు.  

సిలెండర్ పేలి రెండు ఇళ్లు దగ్ధం

జిల్లాలో పండుగపూట గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమైన ఘటన నంద్యాల  జిల్లా శివనగరంలో జరిగింది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన  గోవింద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అయితే అలా వెళ్లే సమయంలో గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆపడం మరచిపోయారు. దీంతో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోవందరెడ్డి ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఇళ్లు దగ్ధమైంది. పేలుడు సంభవించిన సమయంలో రెండు ఇళ్లలోనూ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ పేలుడు కారణంగా రెండు ఇళ్లలోనూ విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.  

రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి

ఏటా విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఏ ఏడాది రక్త సిక్తంగా మారింది. సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఈ బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేవతా మూర్తులను గ్రామానికి తీసుకువెళ్లే విషయంలో కర్రల సమరం నిర్వహించడం దేవరగట్టు ఆచారం అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ కర్రల సమరంలో ఇద్దరు మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.  ఏటా సంప్రదాయం ప్రకారం దేవరగట్టులో  విజయదశమి నాడు దేవతామూర్తులకు గ్రామానికి తీసుకువేళ్లేందుకు మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, ఏడు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు.  చెడుపై మంచి విజయం సాధించడానికి  ప్రతీకగా ఏటా జరుపుకునే ఈ ఉత్సవం రక్తసిక్తం కావడం కద్దు.    ఈ ఏడాది కూడా విజయదశమి రోజున అంటూ  గురువారం (అక్టోబర్ 2) అర్ధరాత్రి స్వామి, అమ్మవారి విగ్రహాల ఊరేగింపు జరిగింది. యథావిథిగా దేవతామూర్తులను తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటాపోటీగా తలపడ్డారు.  ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించగా, మరో వంద మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.